25-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరు స్మృతిలో ఉండే పురుషార్థాన్ని తప్పకుండా చేయాలి, ఎందుకంటే స్మృతి బలముతోనే మీరు వికర్మాజీతులుగా అవుతారు”

ప్రశ్న:-

ఏ ఆలోచన వస్తే పురుషార్థములో పడిపోతారు? ఈశ్వరీయ సేవాధారులైన పిల్లలు ఏ సేవను చేస్తూ ఉంటారు?

జవాబు:-

చాలామంది పిల్లలు, ఇప్పుడింకా సమయముంది, తర్వాత పురుషార్థము చేస్తాము అని అనుకుంటారు, కానీ మృత్యువుకు నియమము ఉండదు. రేపు రేపు అని అంటూ మరణిస్తారు. అందుకే, చాలా సంవత్సరాలున్నాయి, చివర్లో గ్యాలప్ చేస్తామని అనుకోకండి. ఈ ఆలోచన ఇంకా క్రింద పడేస్తుంది. ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండే పురుషార్థము చేస్తూ, శ్రీమతముపై తమ కళ్యాణాన్ని చేసుకుంటూ ఉండండి. ఆత్మిక, ఈశ్వరీయ సేవాధారులైన పిల్లలు ఆత్మలకు ముక్తినిచ్చే మరియు పతితులను పావనముగా చేసే సేవను చేస్తూ ఉంటారు.

గీతము:-

ఓం నమః శివాయ.....

ఓంశాంతి. నిరాకార తండ్రి సాకారుడు లేకుండా ఏ కర్మను చేయలేరని, పాత్రను అభినయించలేరని పిల్లలకు అర్థము చేయించడం జరిగింది. ఆత్మిక తండ్రి వచ్చి బ్రహ్మా ద్వారా ఆత్మిక పిల్లలకు అర్థము చేయిస్తారు. యోగబలము ద్వారానే పిల్లలు సతోప్రధానముగా అవ్వాలి, తర్వాత సతోప్రధాన విశ్వానికి యజమానులుగా అవ్వాలి, ఈ విషయము పిల్లల బుద్ధిలో ఉంది. కల్ప-కల్పము తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. వారు వచ్చి బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు, అంటే వారు మనుష్యులను దేవతలుగా చేస్తారు. దేవీ దేవతలుగా ఉన్న మనుష్యులే ఇప్పుడు మారిపోయి శూద్రులుగా, పతితులుగా అయిపోయారు. భారతదేశము పారసపురిగా ఉన్నప్పుడు పవిత్రత-సుఖ-శాంతులు అన్నీ ఉండేవి, ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము. తండ్రి కూర్చొని యథార్థమైన లెక్కను అర్థం చేయిస్తారు. వారి కన్నా ఉన్నతమైన వారైతే ఎవరూ లేరు. ఈ సృష్టిని లేక వృక్షమునే కల్పవృక్షము అని అంటారు, దీని ఆదిమధ్యాంతాల రహస్యమును తండ్రి మాత్రమే తెలియజేయగలరు. భారతదేశములో ఉండే దేవీదేవతా ధర్మము ఇప్పుడు ప్రాయః లోపమైపోయింది, దేవీదేవతా ధర్మము ఇప్పుడిక లేదు. దేవతల చిత్రాలు తప్పకుండా ఉన్నాయి. ఇది భారతవాసులకు తెలుసు. సత్యయుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. శాస్త్రాల్లో కృష్ణుడిని ద్వాపరయుగములోకి తీసుకువెళ్ళి తప్పు చేసారు. తండ్రే వచ్చి మర్చిపోయిన వారికి పూర్తి మార్గాన్ని తెలియజేస్తారు. మార్గాన్ని తెలియజేసేవారు వచ్చినప్పుడు ఆత్మలన్నీ ముక్తిధామానికి వెళ్ళిపోతాయి, అందుకే వారిని సర్వుల సద్గతిదాత అని అంటారు. రచయిత ఒక్కరే ఉంటారు, సృష్టి కూడా ఒక్కటే ఉంటుంది. ప్రపంచ చరిత్ర-భూగోళము ఒక్కటే ఉంటుంది, అది రిపీట్ అవుతూ ఉంటుంది. సత్యయుగ, త్రేతా, ద్వాపర, కలియుగాలు, తర్వాత సంగమయుగము ఉంటుంది. కలియుగములో పతితులుంటారు, సత్యయుగములో పావనమైనవారుంటారు. సత్యయుగము ఏర్పడుతుంది అంటే తప్పకుండా కలియుగ వినాశనము జరుగుతుంది. వినాశనానికి ముందే స్థాపన జరుగుతుంది, సత్యయుగములో స్థాపన జరగదు. పతిత ప్రపంచము ఉన్నప్పుడే భగవంతుడు వస్తారు. సత్యయుగము అయితే పావన ప్రపంచము. పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచముగా చేసేందుకు భగవంతుడు రావలసి ఉంటుంది. ఇప్పుడు తండ్రి అతి సహజమైన యుక్తిని తెలియజేస్తారు - దేహ సంబంధాలన్నింటినీ వదిలి దేహీ అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయండి. ఎవరో ఒకరైతే పతిత పావనులుగా ఉన్నారు కదా. భక్తులకు ఫలమునిచ్చేవారు భగవంతుడు ఒక్కరే. భక్తులకు జ్ఞానాన్నిస్తారు. మనల్ని పావనముగా చేసేందుకు జ్ఞానసాగరుడే పతిత ప్రపంచములోకి వస్తారు. యోగముతో పావనముగా అవుతారు, తండ్రి తప్ప ఎవ్వరూ పావనముగా చేయలేరు. ఈ విషయాలన్నీ ఇతరులకు అర్థము చేయించేందుకు బుద్ధిలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇంటింటికీ సందేశాన్నివ్వాలి. భగవంతుడు వచ్చేసారని నేరుగా చెప్పకూడదు. చాలా యుక్తిగా అర్థం చేయించవలసి ఉంటుంది. వారు తండ్రి కదా అని చెప్పండి. ఒకరు లౌకిక తండ్రి, రెండవవారు పారలౌకిక తండ్రి. దుఃఖము సమయంలో పారలౌకిక తండ్రినే స్మృతి చేస్తారు, సుఖధామములో ఎవ్వరూ స్మృతి చేయరు. సత్యయుగములో లక్ష్మీనారాయణుల రాజ్యములో సుఖమే సుఖముండేది, అక్కడ పవిత్రత, శాంతి, సంపదలుండేవి. తండ్రి నుండి వారసత్వము లభించిన తర్వాత ఎందుకు పిలుస్తారు, మాకు సుఖముంది అని అక్కడ ఆత్మకు తెలుసు. అక్కడ సుఖమే సుఖముందని ఎవరైనా చెప్తారు. తండ్రి దుఃఖము కోసమైతే సృష్టిని రచించలేదు, ఇది తయారై-తయారవుతున్న ఆట. ఎవరికైతే చివర్లో పాత్ర ఉంటుందో, వారు 2-4 జన్మలను తీసుకుంటారు, మిగిలిన సమయములో వారు తప్పకుండా శాంతిలో ఉంటారు. అంతేకానీ, డ్రామా యొక్క ఆట నుండే బయటకు వెళ్ళిపోవడమనేది జరగదు. ఆటలోకి అందరూ రావలసి ఉంటుంది. ఎవరికైనా 1-2 జన్మలే లభిస్తే, వారు మిగిలిన సమయమంతా మోక్షములో ఉన్నట్లే. ఆత్మ పాత్రధారి కదా. కొంతమంది ఆత్మలకు ఉన్నతమైన పాత్ర లభించి ఉంది, కొంతమందికి తక్కువది లభించి ఉంది. ఈ విషయము కూడా మీకిప్పుడు తెలుసు. ఈశ్వరుని అంతాన్ని ఎవ్వరూ పొందలేరని గాయనము చేయడం జరుగుతుంది. తండ్రియే వచ్చి రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల అంతాన్ని తెలియజేస్తారు. స్వయంగా రచయిత రానంత వరకు రచయిత మరియు రచనల గురించి తెలుసుకోలేరు. నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను అని తండ్రియే వచ్చి తెలియజేస్తారు. నేను ఎవరిలోనైతే ప్రవేశిస్తానో, వారికి తమ జన్మల గురించి తెలియదు, నేను కూర్చొని వారికి 84 జన్మల కథను వినిపిస్తాను. ఎవరి పాత్రలోనూ మార్పు ఉండదు. ఇది తయారై-తయారవుతున్న ఆట, ఈ విషయము కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. పవిత్రముగా ఉంటూ అర్థము చేసుకున్నప్పుడే బుద్ధిలో కూర్చుంటుంది. మంచి రీతిగా అర్థము చేసుకునేందుకే 7 రోజుల భట్టీ ఉంది. భాగవతము మొదలైనవి కూడా 7 రోజులు చదువుకుంటారు. ఇక్కడ కూడా, తక్కువలో తక్కువ 7 రోజులైనా రాకుండా ఎవ్వరూ అర్థము చేసుకోలేరని మీకు అర్థమవుతుంది. కొంతమందైతే బాగా అర్థము చేసుకుంటారు, కొంతమందైతే 7 రోజులు విన్నా కూడా ఏమీ అర్థము చేసుకోరు, బుద్ధిలో కూర్చోదు. మేమైతే 7 రోజులు వచ్చాము కానీ మా బుద్ధిలో ఏమీ కూర్చోవటం లేదు అని అంటారు. ఉన్నత పదవి పొందేది లేనప్పుడు బుద్ధిలో కూర్చోదు. అచ్ఛా, ఎంతైనా వారి కళ్యాణమైతే జరిగింది కదా, ప్రజలైతే ఇలాగే తయారవుతారు. ఇకపోతే, రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలంటే, అందులో గుప్తమైన శ్రమ ఉంటుంది. తండ్రిని స్మృతి చేయడముతోనే వికర్మలు వినాశనమవుతాయి. ఇక చేయండి, చేయకపోండి కానీ తండ్రి డైరెక్షన్ అయితే ఇదే. ప్రియమైన వస్తువును గుర్తు చేసుకోవడం జరుగుతుంది కదా. భక్తి మార్గములో కూడా, ఓ పతితపావనా రండి అని పాడుతారు, ఇప్పుడు వారు లభించారు. నన్ను స్మృతి చేసినట్లయితే తుప్పు తొలగిపోతుందని వారంటారు. రాజ్యాధికారము సహజముగా లభించదు, ఎంతోకొంత శ్రమ అయితే ఉంటుంది కదా. స్మృతిలోనే శ్రమ ఉంది. స్మృతి యాత్రయే ముఖ్యమైనది. చాలా స్మృతి చేసేవారు కర్మాతీత అవస్థను పొందుతారు. పూర్తిగా స్మృతి చేయకపోతే వికర్మలు వినాశనమవ్వవు. యోగబలము ద్వారానే వికర్మాజీతులుగా అవ్వాలి, ఇంతకుముందు కూడా యోగబలము ద్వారానే వికర్మలను జయించారు. కలియుగ అంతిమములో పవిత్రమైనవారు ఎవరూ లేనప్పుడు లక్ష్మీనారాయణులు ఇంత పవిత్రంగా ఎలా అయ్యారు. ఇందులోనైతే స్పష్టంగా ఉంది, ఇప్పుడు గీతా జ్ఞాన యొక్క అధ్యాయము రిపీట్ అవుతుంది. శివభగవానువాచ - పొరపాట్లు అయితే జరుగుతూనే ఉంటాయి కదా. తండ్రియే వచ్చి పొరపాట్లు చేయనివారిగా తయారుచేస్తారు. భారతదేశములో ఉన్న శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. నేను ఏదైతే వినిపించానో, అది ఎవ్వరికీ తెలియదు అని బాబా అంటారు. నేను ఎవరికైతే వినిపించానో, వారు పదవిని పొందారు, 21 జన్మల ప్రారబ్ధాన్ని పొందారు, తర్వాత జ్ఞానము ప్రాయః లోపమైపోతుంది. మీరే చక్రము తిరిగి వచ్చారు. కల్పక్రితం ఎవరైతే విన్నారో, వారే వస్తారు. మనము మనుష్యులను దేవతలుగా తయారుచేసే అంటు కడుతున్నామని మీకిప్పుడు తెలుసు, ఇది దైవీ వృక్షము యొక్క అంటు. మనుష్యులు ఆ వృక్షాలకు చాలా అంట్లు కడుతూ ఉంటారు. తండ్రి వచ్చి వ్యత్యాసాన్ని తెలియజేస్తారు. తండ్రి దైవీ పుష్పాల అంటు కడతారు. వారు అడవుల కొరకు అంట్లు కడుతూ ఉంటారు. కౌరవులేమి చేసి వెళ్ళారు, పాండవులేమి చేసి వెళ్ళారు, వారి ప్లాన్లు ఏమిటి మరియు మీ ప్లాన్లు ఏమిటి అన్నది మీరు చూపిస్తారు కూడా. జనాభా పెరగకూడదని వారు తమ ప్లాన్లు తయారుచేస్తారు. జనాభా ఎక్కువగా పెరగకూడదని ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలనుకుంటారు, దాని కోసం శ్రమ చేస్తూ ఉంటారు. తండ్రి అయితే చాలా మంచి విషయాన్ని తెలియజేస్తారు, అనేక ధర్మాలు వినాశనమవుతాయి మరియు ఒకే ఒక దేవీదేవతా ధర్మము యొక్క ఫ్యామిలీని స్థాపన చేస్తారు. సత్యయుగములో ఒకే ఒక ఆదిసనాతన దేవీదేవతా ధర్మము యొక్క ఫ్యామిలీ ఉండేది, ఇన్ని ఫ్యామిలీలు ఉండేవి కావు. భారతదేశంలో ఎన్ని ఫ్యామిలీలున్నాయి - గుజరాతీ ఫ్యామిలీ, మహారాష్ట్ర ఫ్యామిలీ..... వాస్తవానికి భారతవాసులకు ఒకే ఫ్యామిలీ ఉండాలి. చాలా ఫ్యామిలీలు ఉన్నట్లయితే తప్పకుండా పరస్పరములో గొడవలుంటాయి, తర్వాత సివిల్ వార్ జరుగుతుంది. ఫ్యామిలీలో కూడా సివిల్ వార్ జరుగుతుంది. క్రిస్టియన్లకు తమ ఫ్యామిలీ ఉంటుంది. వారికి కూడా పరస్పరములో సివిల్ వార్ లు జరుగుతాయి, పరస్పరములో ఇద్దరు సోదరులు కలవరు, నీరు కూడా వేరు చేసి పంచుకోవడం జరుగుతుంది. సిక్కు ధర్మమువారు, మేము మా సిక్కు ధర్మము వారికి ఎక్కువ సుఖమివ్వాలని భావిస్తారు, వారి పట్ల మోహముంటుంది కనుక కష్టపడుతూ ఉంటారు. అంతిమ సమయము వచ్చినప్పుడు మళ్ళీ సివిల్ వార్ లు మొదలైనవన్నీ జరుగుతాయి, పరస్పరములో కొట్లాడుకోవడం ప్రారంభిస్తారు. వినాశనము అయితే జరగాల్సిందే. ఎన్నో బాంబులను తయారుచేస్తూ ఉంటారు. పెద్ద యుద్ధము జరిగినప్పుడు, అందులో రెండు బాంబులు మాత్రమే వేశారు, ఇప్పుడైతే ఎన్నో బాంబులను తయారుచేశారు. ఇది అర్థము చేసుకోవలసిన విషయము కదా. ఇది అదే మహాభారత యుద్ధమని మీరు అర్థం చేయించాలి. ఒకవేళ ఈ యుద్ధాన్ని ఆపకపోతే, మొత్తం ప్రపంచమంతటికీ నిప్పు అంటుకుంటుంది అని పెద్ద పెద్ద వారందరూ అంటారు. నిప్పు అయితే అంటుకోవాల్సిందేనని మీకు తెలుసు. తండ్రి ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. రాజయోగమనేది సత్యయుగము కోసమే ఉంది. ఇప్పుడు ఆ దేవీదేవతా ధర్మము ప్రాయః లోపమైపోయింది. చిత్రాలను కూడా తయారుచేశారు. ఏ విఘ్నాలైతే కల్పక్రితము కలిగాయో, అవి మళ్ళీ కలుగుతాయని తండ్రి అంటారు. వాటి గురించి ముందే తెలియదు. కల్పక్రితము కూడా ఇలాగే జరిగి ఉంటుందని తర్వాత అర్థము చేసుకుంటారు. ఇది తయారై-తయారవుతున్న డ్రామా, డ్రామాలో మనము బంధింపబడి ఉన్నాము. స్మృతి యాత్రను మర్చిపోకూడదు, దీనిని పరీక్ష అని అంటారు. స్మృతియాత్రలో నిలవలేరు, అలసిపోతారు. రాత్రి ప్రయాణికుడా..... అని పాట ఉంది కదా, దీని అర్థమును ఎవరూ తెలుసుకోలేరు. ఇది స్మృతి యాత్ర, ఈ యాత్ర ద్వారా రాత్రి పూర్తయ్యి పగలు వచ్చేస్తుంది. అర్ధకల్పము పూర్తవ్వగానే మళ్ళీ సుఖము ప్రారంభమవుతుంది. తండ్రియే మన్మనాభవ అర్థమును కూడా తెలియజేశారు, కేవలం గీతలో కృష్ణుని పేరు వేసినందుకు ఇక ఆ శక్తి లేదు. ఇప్పుడు అందరి కళ్యాణము జరగనున్నది, అంటే మనము మనుష్యమాత్రులందరి కళ్యాణాన్ని చేస్తున్నాము. ప్రత్యేకముగా భారతదేశానికి మరియు మిగతా ప్రపంచానికి కళ్యాణాన్ని చేస్తున్నాము. మనము శ్రీమతముపై అందరి కళ్యాణమును చేస్తున్నాము. ఎవరైతే కళ్యాణకారులుగా అవుతారో, వారసత్వము కూడా వారికే లభిస్తుంది. స్మృతి యాత్ర లేకుండా కళ్యాణము జరగదు.

వారు అనంతమైన తండ్రి అని ఇప్పుడు మీకు అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి నుండి వారసత్వము లభించింది. భారతవాసులే 84 జన్మలు తీసుకున్నారు. పునర్జన్మల లెక్క కూడా ఉంది. 84 జన్మలు ఎవరు తీసుకుంటారు అనేది ఎవ్వరూ అర్థం చేసుకోరు. వారు తమ శ్లోకాలు మొదలైనవి తయారుచేసి వినిపిస్తూ ఉంటారు. గీత అయితే అదే కానీ దానికి ఎన్నో వ్యాఖ్యానాలు రాసేస్తారు. గీత కన్నా భాగవతానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. గీతలో జ్ఞానముంది, భాగవతములో జీవిత కథ ఉంది. వాస్తవానికి గీతకే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. తండ్రి జ్ఞానసాగరుడు, వారి జ్ఞానమైతే కొనసాగుతూనే ఉంటుంది. ఆ గీతనైతే అరగంటలో చదివేస్తారు. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అయితే మీరు వింటూనే ఉంటారు. రోజు రోజుకు మీ వద్దకు అనేకమంది వస్తూ ఉంటారు, నెమ్మది నెమ్మదిగా వస్తారు. ఒకవేళ ఇప్పుడే పెద్ద పెద్ద రాజులు వచ్చినట్లయితే ఇక సమయము పట్టదు, వెంటనే శబ్దము వ్యాపిస్తుంది. కనుక యుక్తిగా, నెమ్మది నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. ఇది గుప్త జ్ఞానము. మనము ఏమి చేస్తున్నాము అన్నది ఎవ్వరికీ తెలియదు. రావణునితో మీ యుద్ధము ఎలా ఉంటుంది అనేది కూడా మీకు మాత్రమే తెలుసు, ఇతరులెవ్వరూ తెలుసుకోలేరు. భగవానువాచ - మీరు సతోప్రధానముగా అయ్యేందుకు నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు నశిస్తాయి. పవిత్రముగా అయినప్పుడే నాతో పాటు తీసుకువెళ్తాను. జీవన్ముక్తి అందరికీ లభించనున్నది. రావణ రాజ్యము నుండి ముక్తిని పొందుతారు. శివశక్తి బ్రహ్మాకుమార-కుమారీలైన మేము 5 వేల సంవత్సరాల క్రితము వలె పరమపిత పరమాత్ముని శ్రీమతముపై శ్రేష్ఠాచారీ ప్రపంచాన్ని స్థాపన చేస్తామని మీరు రాస్తారు కూడా. 5 వేల సంవత్సరాల క్రితము శ్రేష్ఠాచారీ ప్రపంచముండేది, ఇది బుద్ధిలో కూర్చోబెట్టాలి. చాలా ముఖ్యమైన పాయింట్లు బుద్ధిలో ధారణ అయినప్పుడే స్మృతి యాత్రలో ఉంటారు. రాతిబుద్ధి గలవారిగా ఉన్నారు కదా. ఇప్పుడు ఇంకా సమయముందని, తర్వాత పురుషార్థము చేస్తామని కొంతమంది అనుకుంటారు. కానీ మృత్యువుకు నియమేమీ ఉండదు, రేపు-రేపు అంటూ రేపే మరణించవచ్చు. పురుషార్థము చేయలేదు కనుక ఇంకా చాలా సంవత్సరాలున్నాయని, చివర్లో గ్యాలప్ చేసేస్తామని భావించకండి. ఈ ఆలోచన ఇంకా కింద పడేస్తుంది. ఎంత వీలైతే అంత పురుషార్థము చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరు శ్రీమతముపై తమ కళ్యాణమును చేసుకోవాలి. నేను తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాను మరియు ఎంతగా తండ్రి సేవను చేస్తున్నాను అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. మీరే ఆత్మిక ఈశ్వరీయ సేవాధారులు కదా. మీరు ఆత్మలకు ముక్తినిస్తారు, ఆత్మ పతితము నుండి పావనముగా ఎలా అవుతుంది అనేదానికి యుక్తులను తెలియజేస్తారు. ప్రపంచంలో మంచి మనుష్యులు మరియు చెడ్డ మనుష్యులు ఉంటారు, ప్రతి ఒక్కరిదీ ఎవరి పాత్ర వారిది. ఇది అనంతమైన విషయము. ముఖ్యమైన కొమ్మలు-రెమ్మలనే లెక్కిస్తారు, ఇకపోతే ఆకులైతే అనేకమున్నాయి. తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు - పిల్లలూ, శ్రమ చేయండి, అందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చినట్లయితే బుద్ధియోగము తండ్రితో జోడింపబడుతుంది. పవిత్రముగా అయినట్లయితే ముక్తిధామానికి వెళ్ళిపోతారని తండ్రి పిల్లలందరికీ చెప్తారు. మహాభారత యుద్ధము ద్వారా ఏమి జరుగుతుంది అనేది ప్రపంచానికి తెలియదు. ఈ జ్ఞాన యజ్ఞము రచింపబడింది ఎందుకంటే కొత్త ప్రపంచము కావాలి. మన యజ్ఞము పూర్తైనట్లయితే ఈ యజ్ఞములో అంతా స్వాహా అయిపోతుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇది తయారై-తయారవుతున్న డ్రామా కనుక విఘ్నాలకు భయపడకూడదు. విఘ్నాలలో స్మృతియాత్రను మర్చిపోకూడదు. స్మృతియాత్ర ఎప్పుడూ ఆగిపోకుండా ధ్యానముంచాలి.

2. అందరికీ పారలౌకిక తండ్రి పరిచయాన్నిస్తూ, పావనంగా అయ్యే యుక్తిని తెలియజేయాలి. దైవీ వృక్షము యొక్క అంటు కట్టాలి.

వరదానము:-

సర్వ బాధ్యతల భారాన్ని తండ్రికిచ్చి సదా తమ ఉన్నతిని చేసుకునే సహజయోగీ భవ

ఏ పిల్లలైతే తండ్రి కార్యాన్ని సంపన్నము చేసే బాధ్యత యొక్క సంకల్పాన్ని తీసుకుంటారో, వారికి తండ్రి కూడా అంతే సహయోగాన్నిస్తారు. కేవలం మీ వద్ద ఉన్న వ్యర్థమనే భారాన్ని తండ్రిపై వదిలేయండి. తండ్రికి చెందినవారిగా అయి, తండ్రిపై బాధ్యతల భారాన్ని వదిలేసినట్లయితే సఫలత కూడా ఎక్కువగా లభిస్తుంది మరియు ఉన్నతి కూడా సహజముగా జరుగుతుంది. ఎందుకు మరియు ఏమిటి అనే ప్రశ్నల నుండి ముక్తలుగా ఉండండి. విశేషముగా ఫుల్స్టాప్ స్థితి ఉన్నట్లయితే సహజయోగులుగా అయి అతీంద్రియ సుఖాన్ని అనుభవము చేస్తూ ఉంటారు.

స్లోగన్:-

మనసు మరియు బుద్ధిలో నిజాయితీగా ఉన్నట్లయితే తండ్రి మరియు పరివారానికి విశ్వాసపాత్రులుగా అయిపోతారు.