ఓంశాంతి. ఇవి మనుష్యుల ద్వారా తయారుచేయబడిన పాటలు. వీటి అర్థము గురించి ఎవరికీ ఏమీ తెలియదు. భక్తులు పాటలు, భజనలు మొదలైనవి పాడతారు, మహిమ చేస్తారు కానీ ఏమీ తెలియదు. చాలా మహిమ చేస్తారు. పిల్లలైన మీరు ఎటువంటి మహిమ చేయకూడదు. పిల్లలు ఎప్పుడూ తండ్రి మహిమను చేయరు. వీరు నా పిల్లలని తండ్రికి తెలుసు. వీరు మా తండ్రి అని పిల్లలకు తెలుసు. ఇప్పుడు ఇది అనంతమైన విషయము. అయినా అందరూ అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పటివరకు కూడా స్మృతి చేస్తూనే ఉంటారు. ఓ బాబా, అని భగవంతుడిని అంటారు. వీరి పేరు శివబాబా. ఆత్మలమైన మనము ఎలాగైతే ఉన్నామో, శివబాబా కూడా అలాగే ఉన్నారు. వారు పరమ ఆత్మ, వారిని సుప్రీమ్ (ఉన్నతమైనవారు) అని అంటారు, మనము వారి పిల్లలము. వారిని సుప్రీమ్ సోల్ అని అంటారు. వారి నివాస స్థానము ఎక్కడ? పరంధామములో. ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి. ఆత్మలే పాత్రధారులు. నాటకంలో పాత్రధారులు నంబరువారుగా ఉంటారని మీకు తెలుసు. ప్రతి ఒక్కరి పాత్ర అనుసారముగా వారికి జీతము లభిస్తుంది. అక్కడ ఉన్న ఆత్మలన్నీ పాత్రధారులే, కానీ అందరికీ నంబరువారుగా పాత్ర లభించి ఉంది. ఆత్మలలో అవినాశీ పాత్ర ఏ విధంగా నిండి ఉంది అనేది ఆత్మిక తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు. ఆత్మలందరి పాత్ర ఒకే విధంగా ఉండదు. అందరిలో శక్తి ఒకే విధంగా ఉండదు. ఎవరైతే శివుని రుద్ర మాలలోకి ముందు ఉంటారో, వారిదే అందరికన్నా మంచి పాత్ర అని మీకు తెలుసు. నాటకంలోని మంచి-మంచి పాత్రధారులకు ఎంత మహిమ జరుగుతుంది. కేవలం వారిని చూసేందుకు కూడా మనుష్యులు వెళ్తారు. ఇది అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామాలో కూడా ఉన్నతమైనవారు ఒక్క తండ్రియే. ఉన్నతోన్నతుడైన నటుడు, రచయిత, డైరెక్టర్ అని కూడా అనవచ్చు. వారంతా హద్దులోని పాత్రధారులు, డైరెక్టర్లు మొదలైనవారు. వారికి తమ చిన్న పాత్ర లభించి ఉంది. పాత్ర అభినయించేది ఆత్మనే కానీ దేహాభిమానము కారణంగా మనుష్యుల పాత్ర ఇలా ఉందని అనేస్తారు. పాత్ర అంతా ఆత్మదేనని తండ్రి చెప్తారు. ఆత్మాభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. సత్యయుగంలో ఆత్మాభిమానులుగా ఉంటారని తండ్రి అర్థం చేయించారు. వారికి తండ్రి గురించి తెలియదు. ఇక్కడ కలియుగంలో ఆత్మాభిమానులుగా కూడా లేరు మరియు తండ్రి గురించి కూడా తెలియదు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతారు. తండ్రిని కూడా తెలుసుకుంటారు.
బ్రాహ్మణులైన మీకు అతీతమైన జ్ఞానము లభిస్తుంది. ఆత్మలమైన మనమంతా పాత్రధారులమని మీరు ఆత్మను గురించి తెలుసుకున్నారు. అందరికీ పాత్ర లభించి ఉంది, ఒకరి పాత్ర మరొకరితో కలవదు. ఆ పాత్ర అంతా ఆత్మలోనే ఉంది. నాటకాలేవైతే తయారుచేస్తారో, ఆ పాత్రను కూడా ఆత్మనే ధారణ చేస్తుంది. మంచి పాత్రను కూడా ఆత్మనే తీసుకుంటుంది. నేను గవర్నరును, నేను ఫలానాను అని ఆత్మనే అంటుంది. కానీ ఆత్మాభిమానులుగా అవ్వరు. సత్యయుగములో నేను ఆత్మను, ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకోవాలని భావిస్తారు. అక్కడ ఎవరికీ పరమాత్మను గురించి తెలియదు, ఈ సమయములో మీకు అంతా తెలుసు. శూద్రులు మరియు దేవతల కన్నా బ్రాహ్మణులైన మీరు ఉత్తములు. దేవతలుగా అయ్యేందుకు ఇంతమంది బ్రాహ్మణులు ఎక్కడ నుండి వస్తారు. ప్రదర్శనీలకు లక్షలమంది వస్తారు. ఎవరైతే బాగా అర్థము చేసుకుంటారో, జ్ఞానము వింటారో, వారు ప్రజలుగా అవుతారు. ఒక్కొక్క రాజుకు ఎంతోమంది ప్రజలు ఉంటారు. మీరు ఎంతోమంది ప్రజలను తయారు చేస్తున్నారు. ప్రదర్శనీ, ప్రొజెక్టర్ ద్వారా అర్థము చేసుకొని కొందరు బాగా తయారవుతారు. నేర్చుకుంటారు, యోగాన్ని జోడిస్తారు. ఇప్పుడు వారందరూ వెలువడుతూ ఉంటారు. ప్రజలు కూడా వెలువడతారు, తర్వాత షావుకారులు, రాజు-రాణి, పేదలు మొదలైనవారందరూ వెలువడతారు. రాకుమార-రాకుమారీలు ఎంతోమంది ఉంటారు. సత్యయుగము నుండి త్రేతాయుగము వరకు రాకుమార-రాకుమారీలు తయారవ్వాలి. కేవలం 8 లేక 108 మంది మాత్రమే ఉండరు. ఇప్పుడు అందరూ తయారవుతున్నారు. మీరు సేవ చేస్తూ ఉంటారు. ఇది కూడా నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు). మీరు ఏదైనా ఫంక్షన్ చేసినా, అది కూడా కొత్త విషయమేమీ కాదు. అనేకసార్లు చేశారు. మళ్ళీ సంగమయుగంలో ఇదే వ్యాపారం చేస్తారు. ఇంకేమి చేస్తారు! పతితులను పావనంగా చేసేందుకు తండ్రి వస్తారు. దీనిని ప్రపంచము యొక్క చరిత్ర-భూగోళము అని అంటారు. ప్రతి విషయము నంబరువారుగానే ఉంటుంది. మీలో బాగా ఉపన్యసించేవారిని, వీరు చాలా బాగా ఉపన్యసించారు అని అందరూ అంటారు. ఇంకొకరి ఉపన్యాసము విన్నా కానీ, ముందు మాట్లాడినవారే బాగా అర్థం చేయించేవారు అని అంటారు. మూడవవారు వారి కన్నా చురుకుగా ఉన్నట్లయితే, వీరు వారి కన్నా చురుకుగా ఉన్నారు అని అంటారు. ప్రతి విషయములోనూ, మేము ఇతరుల కన్నా ముందుకు వెళ్ళాలని పురుషార్థము చేయాలి. ఉపన్యసించేందుకు తెలివైనవారు వెంటనే చేతులెత్తుతారు. మీరందరూ పురుషార్థులు, మున్ముందు మెయిల్ ట్రైన్ గా అయిపోతారు. ఉదాహరణకు మమ్మా స్పెషల్ మెయిల్ ట్రైన్ గా ఉండేవారు. బాబా గురించైతే తెలియదు ఎందుకంటే ఇరువురూ కలిసి ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు అనేది మీరు అర్థము చేసుకోలేరు. శివబాబానే అర్థం చేయిస్తున్నారని మీరు సదా భావించండి. బాప్ మరియు దాదా, ఇరువురికీ తెలుసు కానీ వారు అంతర్యామి. ఫలానావారు చాలా చురుకైనవారని బయటకు చెప్తారు. తండ్రి కూడా మహిమను విని సంతోషిస్తారు. లౌకిక తండ్రికి కూడా వారి బిడ్డ బాగా చదువుకుని, ఉన్నతమైన పదవిని పొందితే, ఈ బిడ్డ మంచి పేరు తీసుకొస్తాడు అని తండ్రి భావిస్తారు. ఫలానా బిడ్డ ఈ ఆత్మిక సేవలో చురుకుగా ఉన్నారని కూడా భావిస్తారు. ముఖ్యమైనది ఉపన్యసించడము, ఎవరికైనా తండ్రి సందేశమునివ్వడము, వారికి అర్థము చేయించడము. బాబా ఉదాహరణ కూడా చెప్పారు - ఒకరికి 5 మంది పిల్లలు ఉండేవారు, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారని ఎవరో అడిగితే, ఇద్దరు పిల్లలున్నారని చెప్పారు. మీకు 5 మంది పిల్లలు ఉన్నారు కదా అని అంటే, నాకు సుపుత్రులు ఇద్దరే ఉన్నారని అన్నారు. ఇక్కడ కూడా అంతే. పిల్లలు చాలా మంది ఉన్నారు. డాక్టర్ నిర్మల బచ్చీ చాలా మంచివారు అని తండ్రి అంటారు. చాలా ప్రేమగా లౌకిక తండ్రికి అర్థం చేయించి సెంటరు తెరిపించారు. ఇది భారత్ యొక్క సేవ. మీరు భారత్ ను స్వర్గముగా చేస్తారు. రావణుడు ఈ భారత్ ను నరకంగా చేసాడు. జైలులో ఉన్నది ఒక్క సీత మాత్రమే కాదు, సీతలైన మీరంతా రావణుని జైలులోనే ఉండేవారు. ఇకపోతే, శాస్త్రాలలో ఉన్నవన్నీ కట్టుకథలే. ఈ భక్తి మార్గము కూడా డ్రామాలో ఉంది. సత్యయుగము నుండి మొదలుకొని ఏదైతే గడిచిందో, అదంతా మళ్ళీ రిపీట్ అవుతుందని మీకు తెలుసు. మీరే పూజ్యులుగా, మీరే పూజారులుగా అవుతారు. నేను వచ్చి పూజారుల నుండి పూజ్యులుగా చెయ్యాలి అని తండ్రి అంటారు. మొదట బంగారుయుగము వారిగా, ఆ తర్వాత ఇనుపయుగము వారిగా అవ్వాలి. సత్యయుగములో సూర్యవంశ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. రామరాజ్యము చంద్రవంశీయులది.
ఈ సమయములో మీరంతా ఆత్మిక క్షత్రియులు (యోధులు). యుద్ధ మైదానములోకి వచ్చేవారిని క్షత్రియులని అంటారు. మీరు ఆత్మిక క్షత్రియులు. వారు దైహిక క్షత్రియులు. వారిది బాహుబలముతో కొట్లాడడము-గొడవపడడము అని అంటారు. ఇంతకుముందు బాహువులతో మల్ల యుద్ధము జరిగేది. పరస్పరములో కొట్లాడుకునేవారు, విజయాన్ని పొందేవారు. ఇప్పుడు చూడండి, బాంబులు మొదలైనవి తయారై ఉన్నాయి. మీరు కూడా క్షత్రియులే, వారు కూడా క్షత్రియులే. మీరు శ్రీమతమును అనుసరించి మాయపై విజయమును పొందుతారు. మీరు ఆత్మిక క్షత్రియులు. ఆత్మలే ఈ శరీర కర్మేంద్రియాల ద్వారా అన్నీ చేస్తున్నాయి. పిల్లలూ, నన్ను స్మృతి చేస్తే మిమ్మల్ని మాయ తినదు, మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీకు తప్పుడు సంకల్పాలు రావు అని తండ్రి వచ్చి ఆత్మకు నేర్పిస్తారు. తండ్రిని స్మృతి చేస్తే సంతోషం కూడా కలుగుతుంది, కావుననే ఉదయాన్నే మేల్కొని అభ్యాసము చేయండి అని తండ్రి అర్థం చేయిస్తారు. బాబా, మీరు ఎంత మధురమైనవారు. బాబా అని ఆత్మ అంటుంది. నేను మీ తండ్రిని, మీకు సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపించేందుకు వచ్చానని తండ్రి తమ పరిచయమును ఇచ్చారు. ఇది మనుష్య సృష్టి యొక్క తలక్రిందులుగా ఉన్న వృక్షము. ఇది వెరైటీ ధర్మాల మనుష్య సృష్టి, దీనిని విరాట లీల అని అంటారు. నేను ఈ మనుష్య వృక్షానికి బీజరూపుడను అని తండ్రి అర్థం చేయించారు. నన్ను స్మృతి చేస్తారు. ఒకరు ఒక వృక్షానికి చెందినవారు, ఇంకొకరు ఇంకొక వృక్షానికి చెందినవారు. అలా నంబరువారుగా వెలువడతారు. ఈ డ్రామా తయారై ఉంది. ఫలానా ధర్మస్థాపకుడిని, సందేశకుడిని పంపించారని నానుడి ఉంది, కానీ అక్కడ నుండి పంపించరు. ఇది డ్రామానుసారముగా రిపీట్ అవుతుంది. వీరొక్కరే ధర్మమును మరియు రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఇది ప్రపంచములో ఎవరికీ తెలియదు. ఇప్పుడిది సంగమము. వినాశ జ్వాల ప్రజ్వలితమవ్వనున్నది. ఇది శివబాబా యొక్క జ్ఞాన యజ్ఞము. వారు రుద్ర యజ్ఞము అన్న పేరును పెట్టేసారు. ప్రజాపిత బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులైన మీరు జన్మించారు. మీరు ఉన్నతమైనవారు కదా. మీ వెనుక ఇతర వంశాలు వెలువడతాయి. వాస్తవానికి మీరందరూ బ్రహ్మా యొక్క సంతానము. బ్రహ్మాను గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఇది వంశ వృక్షము, మొట్టమొదట ఉన్నతుడైన బ్రహ్మా, ఆ తర్వాత వంశము వెలువడుతుంది. భగవంతుడు సృష్టిని ఎలా రచిస్తారు అని అంటారు. రచన అయితే ఉంది కదా. ఎప్పుడైతే పతితులుగా అవుతారో, అప్పుడు వారిని పిలుస్తారు. వారే వచ్చి దుఃఖమయంగా ఉన్న సృష్టిని సుఖమయంగా తయారుచేస్తారు, కావుననే బాబా, దుఃఖహర్త-సుఖకర్త, రండి అని పిలుస్తారు. హరిద్వార్ అన్న పేరును పెట్టారు. హరిద్వార్ అనగా హరి యొక్క ద్వారము. అక్కడ గంగ ప్రవహిస్తుంది. మేము గంగలో స్నానము చేయడంతో హరి యొక్క ద్వారములోనికి వెళ్ళిపోతామని భావిస్తారు. కానీ హరి యొక్క ద్వారము ఎక్కడ ఉంది? వారేమో కృష్ణుడిని అలా అంటారు. హరి యొక్క ద్వారము శివబాబాయే. వారు దుఃఖహర్త-సుఖకర్త. మీరు మొదట మీ ఇంటికి వెళ్ళాలి. పిల్లలైన మీకు మీ తండ్రి గురించి మరియు ఇంటి గురించి ఇప్పుడే తెలిసింది. తండ్రి యొక్క సింహాసనము కాస్త పైన ఉంటుంది. పైన పుష్పముంటుంది, ఆ తర్వాత జంట పూసలు దాని క్రింద ఉంటాయి. ఆ తర్వాత రుద్రమాల అని అంటారు. రుద్రమాలయే మళ్ళీ విష్ణుమాలగా అవుతుంది. విష్ణు మెడలో హారంగా ఉన్నవారే మళ్ళీ విష్ణుపురిలో రాజ్యము చేస్తారు. బ్రాహ్మణుల మాల తయారవ్వదు ఎందుకంటే పదే-పదే తెగిపోతూ ఉంటారు. నంబరువారుగా ఉంటారు కదా అని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ రోజు బాగుంటారు, రేపు తుఫాను వస్తుంది, గ్రహచారము రావడంతో చల్లబడిపోతారు. నాకు చెందినవారిగా అవుతారు, ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, ధ్యానములోకి వెళ్తారు, మాలలో కూర్చబడతారు..... ఆ తర్వాత ఒక్కసారిగా పారిపోతారు, చండాలురుగా అయిపోతారు అని తండ్రి చెప్తారు. ఇక మాల ఎలా తయారవుతుంది? కావున బ్రాహ్మణుల మాల తయారవ్వదు అని తండ్రి అర్థం చేయిస్తారు. భక్తుల మాల వేరు, రుద్ర మాల వేరు. భక్త మాలలోని ముఖ్యులు, స్త్రీలలో మీరా మరియు పురుషులలో నారదుడు. ఇది రుద్రమాల. సంగమములో తండ్రియే వచ్చి ముక్తి-జీవన్ముక్తులును ఇస్తారు. మేమే స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని, ఇప్పుడు నరకములో ఉన్నామని పిల్లలు భావిస్తారు. నరకమును కాలదన్నండి, మీ నుండి రావణుడు దోచుకున్న స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకోండి అని తండ్రి అంటారు. ఇది తండ్రియే వచ్చి తెలియజేస్తారు. వారికి ఈ శాస్త్రాలు, తీర్థ స్థానాలు మొదలైనవి తెలుసు. వారు బీజరూపుడు కదా. వారు జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు. ఇలా ఆత్మ అంటుంది.
ఈ లక్ష్మీనారాయణులు సత్యయుగ యజమానులుగా ఉండేవారని తండ్రి అర్థము చేయిస్తారు. వారికన్నా ముందు ఏముండేది? తప్పకుండా కలియుగము యొక్క అంతిమము జరిగితేనే సంగమయుగము వచ్చి ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ స్వర్గము తయారవుతుంది. తండ్రిని స్వర్గ రచయిత అని అంటారు, వారు స్వర్గాన్ని స్థాపన చేసేవారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. వీరికి వారసత్వము ఎక్కడ నుండి లభించింది? స్వర్గ రచయిత అయిన తండ్రి నుండి లభించింది. ఈ వారసత్వము తండ్రిదే. ఈ లక్ష్మీనారాయణులకు సత్యయుగ రాజధాని ఉండేది, అది వారికి ఎలా లభించింది, వారు ఎలా తీసుకున్నారు అని మీరు ఎవరినైనా అడగవచ్చు. ఎవరూ చెప్పలేరు. ఇంతకుముందు నాకూ తెలియదు, పూజ చేసేవాడిని కానీ తెలిసేది కాదు అని ఈ దాదా కూడా అంటారు. ఈ సంగమయుగములో రాజయోగము నేర్చుకుంటారని ఇప్పుడు తండ్రి అర్థము చేయించారు. గీతలోనే రాజయోగము యొక్క వర్ణన ఉంది. గీతలో తప్ప ఇంకే శాస్త్రములోనూ రాజయోగము యొక్క విషయము లేదు. నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తానని తండ్రి అంటారు. భగవంతుడే వచ్చి నరుని నుండి నారాయణునిగా తయారయ్యే జ్ఞానాన్ని ఇచ్చారు. భారతదేశం యొక్క ముఖ్యమైన శాస్త్రము గీత. గీత ఎప్పుడు రచింపబడింది అన్నది తెలియదు. కల్ప-కల్పము సంగమములో వస్తానని తండ్రి అంటారు. నేను ఎవరికైతే రాజ్యమునిచ్చానో, వారు రాజ్యాన్ని పోగొట్టుకొని తమోప్రధానంగా, దుఃఖమయంగా అయ్యారు. ఇది రావణుని రాజ్యము. ఇది మొత్తం భారతదేశానికి సంబంధించిన కథ. భారతదేశమే ఆల్ రౌండ్, మిగిలినవన్నీ తర్వాత వస్తాయి. మీకు 84 జన్మల రహస్యాన్ని తెలియజేస్తానని తండ్రి అంటారు. 5 వేల సంవత్సరాల క్రితం మీరు దేవీ-దేవతలుగా ఉండేవారు, మీ జన్మల గురించి మీకు తెలియదు. ఓ భారతవాసులారా, తండ్రి అంతిమములో వస్తారు. ఆదిలో వస్తే వారు ఆది-అంతము యొక్క జ్ఞానమును ఎలా వినిపిస్తారు! సృష్టి యొక్క వృద్ధినే జరగకపోతే ఎలా అర్థము చేయించగలరు? అక్కడ జ్ఞానము యొక్క అవసరమే ఉండదు. తండ్రి ఇప్పుడు సంగమయుగములోనే జ్ఞానాన్ని ఇస్తారు. వారు జ్ఞానసాగరుడు కదా. జ్ఞానము వినిపించేందుకు అంతిమములో తప్పకుండా రావలసి ఉంటుంది. ఆదిలో మీకు ఏమి వినిపిస్తారు! ఇవి అర్థము చేసుకోవలసిన విషయాలు. భగవానువాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఇది పాండవ గవర్నమెంట్ యొక్క యూనివర్సిటీ. ఇప్పుడిది సంగమము. యాదవులు, కౌరవులు మరియు పాండవుల సైన్యాలను చూపించారు. యాదవులు మరియు కౌరవులు వినాశన సమయములో విపరీత బుద్ధి కలిగి ఉంటారని తండ్రి అర్థము చేయిస్తారు. ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. తండ్రిపై ప్రీతి లేదు. కుక్క-పిల్లి అన్నింటిలోనూ పరమాత్మ ఉన్నారని అనేస్తారు. పాండవులకు ప్రీతిబుద్ధి ఉండేది. పాండవులకు స్వయంగా పరమాత్మయే సాథీగా (తోడుగా) ఉండేవారు. పాండవులు అనగా ఆత్మిక పండాలు. వారు దైహిక పండాలు, మీరు ఆత్మిక పండాలు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఆత్మాభిమానులుగా అయి ఈ అనంతమైన నాటకములో హీరో పాత్రను అభినయించాలి. ప్రతి ఒక్క పాత్రధారికి తమ తమ పాత్ర ఉంది కావున ఎవరి పాత్రతోనూ ఈర్ష్య పడకూడదు.
2. ఉదయాన్నే మేలుకొని మీతో మీరు మాట్లాడుకోవాలి. నేను ఈ శరీరములోని కర్మేంద్రియాల నుండి వేరుగా ఉన్నాను, బాబా, మీరు ఎంత మధురమైనవారు, మీరు మాకు సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తున్నారు అని అభ్యాసము చేయాలి.