21-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేసి పరస్పరము కలిసి క్లాస్ జరుపుకోండి, తమ కళ్యాణము మరియు ఇతరుల కళ్యాణము చేసి సత్యమైన సంపాదన చేసుకుంటూ ఉండండి”

ప్రశ్న:-

పిల్లలైన మీకు ఎటువంటి అహంకారము ఎప్పుడూ రాకూడదు?

జవాబు:-

ఈ చిన్న-చిన్న బాలికలు మాకేమి అర్థం చేయిస్తారు అని చాలా మంది పిల్లలలో అహంకారము వస్తుంది. పెద్ద అక్కయ్య ఎక్కడికైనా వెళ్తే, ఇక అలిగి క్లాసుకు రావడం మానేస్తారు. ఇది మాయా విఘ్నము. బాబా చెప్తున్నారు - పిల్లలూ, మీరు మీకు వినిపించే టీచరు నామ-రూపాలను చూడకుండా, తండ్రి స్మృతిలో ఉంటూ మురళి వినండి. అహంకారంలోకి రాకండి.

ఓంశాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు తండ్రి అని అంటున్నప్పుడు ఇంతమంది పిల్లలకు ఒకే శారీరిక తండ్రి అయితే ఉండరు. వీరు ఆత్మిక తండ్రి. వీరికి అనేకమంది పిల్లలున్నారు, పిల్లల కోసం ఈ టేప్ మురళి మొదలైన సామాగ్రి ఉంది. మనమిప్పుడు పురుషోత్తములుగా అయ్యేందుకు సంగమయుగంలో కూర్చున్నామని పిల్లలకు తెలుసు. ఇది కూడా సంతోషకరమైన విషయము. తండ్రియే పురుషోత్తములుగా తయారుచేస్తారు. ఈ లక్ష్మీ-నారాయణులు పురుషోత్తములు కదా. ఈ సృష్టిలోనే ఉత్తమ పురుషులు, మధ్యములు మరియు కనిష్ఠులు ఉంటారు. ఆదిలో ఉత్తములు, మధ్యలో మధ్యములు, చివరిలో కనిష్ఠులు ఉంటారు. ప్రతి వస్తువు మొదట, కొత్తగా, ఉత్తమంగా ఉంటుంది, తర్వాత మధ్యమంగా, ఆ తర్వాత కనిష్ఠంగా అంటే పాతదిగా అయిపోతుంది. ప్రపంచము విషయములో కూడా అలాగే జరుగుతుంది. కావున ఏయే విషయాలలో మనుష్యులకు సంశయము కలుగుతుందో, వాటి గురించి మీరు అర్థము చేయించాలి. చాలావరకు బ్రహ్మా గురించే, వీరిని ఎందుకు కూర్చోబెట్టారు అని అడుగుతారు. అప్పుడు వారికి కల్పవృక్ష చిత్రం గురించి అర్థం చేయించాలి. చూడండి, కింద కూడా తపస్సు చేస్తున్నారు మరియు పైన పూర్తిగా ఆఖరున, అనేక జన్మల అంతిమ జన్మలో నిలబడి ఉన్నారు. నేను వీరిలో ప్రవేశిస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఈ విషయాలు అర్థం చేయించేవారు చాలా తెలివైనవారిగా ఉండాలి. ఒక్కరు తెలివితక్కువ వారున్నా సరే, మొత్తం బి.కె.ల పేరు పాడవుతుంది. పూర్తిగా అర్థము చేయించడం రాదు. అంతిమంలో మాత్రమే పూర్తిగా పాస్ అవుతారు, ఈ సమయంలో ఎవ్వరూ 16 కళా సంపూర్ణులుగా అవ్వలేరు. కానీ అర్థం చేయించడంలో తప్పకుండా నంబరువారుగా ఉంటారు. పరమపిత పరమాత్మ పట్ల ప్రీతి లేదు అంటే విపరీత బుద్ధి కలవారే కదా. ఎవరైతే ప్రీతి బుద్ధి కలవారిగా ఉంటారో వారు విజయులు మరియు విపరీత బుద్ధి కలవారు వినాశనాన్ని పొందుతారు అని మీరు దీనిపై అర్థం చేయించవచ్చు. దీని గురించి కూడా చాలామంది మనుష్యులు డిస్టర్బ్ అవుతారు, తర్వాత ఏవేవో కళంకములను మోపుతారు. కొట్లాడడానికి ఆలస్యం చేయరు. ఎవరు మాత్రము ఏమి చేయగలరు. అప్పుడప్పుడు చిత్రాలకు నిప్పు పెట్టేందుకు కూడా వెనుకాడరు. చిత్రాలను భీమా చేయించండి అని బాబా సలహా కూడా ఇస్తారు. పిల్లల స్థితి గురించి కూడా తండ్రికి తెలుసు, వికారీ దృష్టి గురించి కూడా బాబా రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా, మీరు ఏదైతే వికారీ దృష్టి గురించి అర్థం చేయించారో, అది చాలా కరెక్టుగా చెప్పారని వ్రాస్తారు. ఈ ప్రపంచము తమోప్రధానంగా ఉంది కదా. రోజు-రోజుకూ తమోప్రధానంగా అవుతూ ఉంటుంది. కలియుగము ఇంకా పాకుతున్న స్థితిలో ఉందని వారు భావిస్తారు. అజ్ఞాన నిద్రలో పూర్తిగా నిద్రించి ఉన్నారు. ఇది మహాభారత యుద్ధ సమయం కనుక భగవంతుడు తప్పకుండా ఏదో ఒక రూపంలో ఉంటారని కూడా అప్పుడప్పుడూ చెప్తారు. కానీ రూపాన్ని గురించి చెప్పరు. వారు తప్పకుండా ఎవరిలోనైనా ప్రవేశించాలి. భాగ్యశాలి రథం గాయనం చేయబడుతుంది. ఆత్మకు తనకంటూ రథముంటుంది కదా, అందులోకి వచ్చి ప్రవేశిస్తుంది. వీరిది భాగ్యశాలి రథమని అంటారు. అయితే బాబా జన్మ తీసుకోరు, వీరి పక్కనే కూర్చుని జ్ఞానమిస్తారు. ఎంత బాగా అర్థం చేయించడం జరుగుతుంది. త్రిమూర్తి చిత్రము కూడా ఉంది. బ్రహ్మా-విష్ణు-శంకరులను త్రిమూర్తులు అని అంటారు. తప్పకుండా వీరు ఏదో చేసి వెళ్ళారు. అందుకే వారు వీధులకు, భవనాలకు కూడా త్రిమూర్తి అనే పేరు పెట్టారు. ఏ విధంగా ఈ రోడ్డుకు సుభాష్ మార్గ్ అని పేరు పెట్టారు. సుభాష్ యొక్క చరిత్ర అయితే అందరికీ తెలుసు. వారి తర్వాత కూర్చుని వారి చరిత్రను వ్రాస్తారు. తర్వాత వారి విగ్రహాలను తయారుచేసి వారిని గొప్పగా చేస్తారు. కూర్చుని వారి గురించి ఎంతో గొప్పగా వ్రాస్తారు. గురునానక్ పుస్తకాన్ని కూడా ఎంత పెద్దదిగా చేశారు. కానీ వారు అంతగా వ్రాయలేదు. జ్ఞానానికి బదులుగా భక్తి విషయాలను కూర్చుని వ్రాశారు. ఈ చిత్రాలు మొదలైనవి అర్థము చేయించేందుకు తయారుచేయిస్తారు. ఈ కళ్ళకు ఏదైతే కనిపిస్తుందో, అదంతా భస్మమైపోతుందని తెలుసు. ఇక ఆత్మ అయితే ఇక్కడ ఉండదు. తప్పకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇటువంటి విషయాలు అందరి బుద్ధిలోనూ కూర్చోవు. ఒకవేళ ధారణ అయితే, మరి క్లాసు ఎందుకు చేయరు. 7-8 సంవత్సరాలలో క్లాస్ నడిపించే విధంగా ఎవ్వరూ తయారవ్వరు. చాలా స్థానాలలో అలాగే నడిపించేస్తారు. ఎంతైనా, మాతల పదవి ఉన్నతమైనదని భావిస్తారు. చిత్రాలైతే చాలా ఉన్నాయి, ఇక తర్వాత మురళీని ధారణ చేసి దానిపై కొద్దిగా అర్థం చేయిస్తారు. ఇదైతే ఎవరైనా చేయవచ్చు. చాలా సహజము. కానీ మళ్ళీ బ్రాహ్మణి కావాలి అని ఎందుకు అడుగుతారో తెలియదు. బ్రాహ్మణి ఎక్కడికైనా వెళ్తే చాలు, ఇక అలిగి కూర్చుండిపోతారు. క్లాసుకు రారు, పరస్పరం గొడవపడతారు. మురళీనైతే ఎవరైనా కూర్చుని వినిపించగలరు కదా. తీరిక లేదని అంటారు. మురళీని వినిపించడం అంటే మీ కళ్యాణమూ చేసుకోవడమ మరియు ఇతరుల కళ్యాణము కూడా చేయడము. ఇది చాలా గొప్ప సంపాదన. మనుష్యుల జీవితము వజ్రం వలె తయారయ్యేలా సత్యమైన సంపాదన చేయించాలి. స్వర్గములోకి అందరూ వెళ్తారు కదా. అక్కడ సదా సుఖంగా ఉంటారు. అక్కడ ప్రజల ఆయుష్షు తక్కువగా ఉంటుందని కాదు. ప్రజల ఆయుష్షు కూడా ఎక్కువగానే ఉంటుంది. అది అమరలోకము. కానీ పదవులు తక్కువ-ఎక్కువగా ఉంటాయి. కావున ఏ టాపిక్ గురించైనా క్లాస్ చేయించాలి. మంచి బ్రాహ్మణి కావాలి అని ఎందుకంటారు. పరస్పరము కలిసి క్లాసు నడిపించగలరు. అలా మొరపెట్టుకుంటూ ఉండకూడదు. ఈ చిన్న-చిన్న బాలికలు ఏమి అర్థం చేయిస్తారు అని కొందరికి అహంకారం వచ్చేస్తుంది. మాయా విఘ్నాలు కూడా చాలా వస్తాయి. బుద్ధిలో కూర్చోదు.

బాబా ప్రతిరోజూ అర్థం చేయిస్తూ ఉంటారు, శివబాబా అయితే ఏదైనా టాపిక్ గురించి అర్థం చేయించరు కదా. వారైతే సాగరుడు. ఉప్పొంగుతూ ఉంటారు. అప్పుడప్పుడు పిల్లలకు అర్థం చేయిస్తారు, అప్పుడప్పుడు బయటవారి కోసం అర్థం చేయిస్తూ ఉంటారు. మురళీ అయితే అందరికీ లభిస్తుంది. పదాలు తెలియకపోతే నేర్చుకోవాలి కదా - తమ ఉన్నతి కోసం పురుషార్థము చేయాలి. తమ కళ్యాణము మరియు ఇతరుల కళ్యాణము కూడా చేయాలి. ఈ బాబా కూడా వినిపించగలరు కదా, కానీ పిల్లల బుద్ధియోగము శివబాబా వైపు ఉండాలి, అందుకే సదా శివబాబా వినిపిస్తున్నారని భావించండి అని చెప్తారు. శివబాబానే స్మృతి చేయండి. శివబాబా పరంధామము నుండి వచ్చారు, మురళీ వినిపిస్తున్నారు. ఈ బ్రహ్మా అయితే పరంధామము నుండి వచ్చి వినిపించరు. శివబాబా ఈ తనువులోకి వచ్చి మాకు మురళీ వినిపిస్తున్నారని భావించండి. ఇది బుద్ధిలో గుర్తుండాలి. యథార్థ రీతిగా ఇది బుద్ధిలో ఉన్నట్లయితే స్మృతి యాత్ర జరుగుతుంది కదా. కానీ ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా అనేకుల బుద్ధియోగము అటూ-ఇటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు యాత్రలో చాలా బాగా ఉండవచ్చు. లేకపోతే మీ ఊరు గుర్తుకొస్తుంది. ఇళ్ళు-వాకిళ్ళు గుర్తుకొస్తాయి. శివబాబా వీరిలో కూర్చుని మమ్మల్ని చదివిస్తున్నారని బుద్ధిలో గుర్తుంటుంది. మేము శివబాబా స్మృతిలో మురళీ వింటున్నాము, మళ్ళీ బుద్ధియోగము ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ విధంగా చాలా మంది బుద్ధియోగము వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు చాలా బాగా యాత్రలో ఉండవచ్చు. శివబాబా పరంధామము నుండి వచ్చారని భావిస్తారు. బయట గ్రామాలు మొదలైనచోట ఉన్నప్పుడు ఈ విధంగా ఆలోచన రాదు. శివబాబా మురళీని ఈ చెవుల ద్వారా వింటున్నామని కొంతమంది భావిస్తారు, అటువంటప్పుడు చదివి వినిపించేవారి నామ-రూపాలు గుర్తు రాకూడదు. ఈ జ్ఞానమంతా అంతరంగానికి సంబంధించినది. మేము శివబాబా మురళీని వింటున్నామని లోపల గుర్తుండాలి. ఫలానా అక్కయ్య వినిపిస్తున్నారని అనుకోకూడదు. శివబాబా మురళీని వింటున్నాము. ఇవి కూడా స్మృతిలో ఉండేందుకు యుక్తులు. అలాగని ఎంత సమయము మురళీ వింటామో, అంత సమయము స్మృతిలో ఉన్నామని కాదు. అనేకుల బుద్ధి ఎక్కడెక్కడో బయటకు వెళ్ళిపోతుంది, పొలాలు, పంటలు మొదలైనవి గుర్తుకొస్తూ ఉంటాయి అని బాబా చెప్తున్నారు. బుద్ధియోగము బయట ఎక్కడా భ్రమించకూడదు. శివబాబాను స్మృతి చేయడంలో కష్టమేమీ ఉండదు. కానీ మాయ స్మృతి చేయనివ్వదు. మొత్తం సమయమంతా శివబాబా స్మృతి ఉండదు, వేర్వేరు ఆలోచనలు వచ్చేస్తాయి. నంబరువారు పురుషార్థానుసారంగా ఉన్నారు కదా. ఎవరైతే చాలా సమీపంగా ఉంటారో, వారి బుద్ధిలో బాగా కూర్చుంటుంది. అందరూ 8 మాలలోకి రాలేరు. జ్ఞానము, యోగము, దైవీ గుణాలు ఇవన్నీ స్వయంలో చూసుకోవాలి. నాలో ఎటువంటి అవగుణము అయితే లేదు కదా? మాయకు వశమై ఎటువంటి వికర్మ జరగడం లేదు కదా? కొందరు చాలా లోభం కలవారిగా అవుతారు. లోభం యొక్క భూతము కూడా ఉంటుంది. కావున మాయ ఎలా ప్రవేశిస్తుందంటే ఇక ఆకలి-ఆకలి అని అంటూనే ఉంటారు - ఆసక్తి ఉన్న వస్తువులపై ఆకర్షణ కలుగుతుంది. కొంతమందికి తినడం పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. భోజనము కూడా నియమానుసారంగా ఉండాలి. చాలామంది పిల్లలున్నారు. ఇప్పుడింకా చాలా మంది పిల్లలు తయారవ్వనున్నారు. ఎంతమంది బ్రాహ్మణ-బ్రాహ్మణీలుగా అవుతారు. మీరు బ్రాహ్మణులుగా అయి కూర్చోండి అని పిల్లలకు కూడా చెప్తాను. మాతలను ముందు పెట్టడం జరుగుతుంది. శివ శక్తి భారత మాతలకు జై.

స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి అని తండ్రి చెప్తున్నారు. బ్రాహ్మణులైన మీరు స్వదర్శన చక్రధారులు. క్రొత్తవారెవరైనా వస్తే వారు ఈ విషయాలు అర్థము చేసుకోలేరు. మీరు సర్వోత్తమ బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణ కుల భూషణులు, స్వదర్శన చక్రధారులు. కొత్తవారెవరైనా వింటే, స్వదర్శన చక్రము విష్ణువుది కదా, కానీ వీరు అందరినీ స్వదర్శన చక్రధారులు అని అంటూ ఉన్నారు అని అంటారు, వారు అంగీకరించరు, అందుకే కొత్త-కొత్తవారిని సభలోకి అనుమతించరు. వారు అర్థము చేసుకోలేరు. కొందరైతే, మేమేమైనా బుద్ధిహీనులమా, మమ్మల్ని లోపలికి రానివ్వడం లేదు అని డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే ఇతర సత్సంగాలలోనైతే ఎవరైనా వెళ్తూ ఉంటారు. అక్కడైతే శాస్త్రాల విషయాలే వినిపిస్తూ ఉంటారు. అవి వినేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది. ఇక్కడ సంభాళించవలసి ఉంటుంది. ఈ ఈశ్వరీయ జ్ఞానము బుద్ధిలో కూర్చోకపోతే డిస్టర్బ్ అవుతారు. చిత్రాలను కూడా సంభాళించవలసి ఉంటుంది. ఈ ఆసురీ ప్రపంచంలో మన దైవీ రాజధానిని స్థాపన చేయాలి. ఎలాగైతే క్రీస్తు వచ్చి తమ ధర్మాన్ని స్థాపించారో, అదేవిధంగా ఈ తండ్రి దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఇందులో హింస యొక్క విషయమేమీ లేదు. మీరు కామ ఖడ్గాన్నీ ఉపయోగించరు మరియు స్థూల హింసనూ చేయరు. మురికిపట్టిన వస్త్రాలను శుభ్రము చేశారని పాడతారు కూడా. మనుష్యులైతే పూర్తిగా ఘోరమైన అంధకారంలో ఉన్నారు. తండ్రి వచ్చి ఘోరాంధకారము నుండి పూర్తిగా ప్రకాశవంతంగా చేస్తారు. అయినా కొందరు, బాబా అని అంటూ, మళ్ళీ ముఖాన్ని తిప్పేసుకుంటారు. చదువును వదిలేస్తారు. భగవంతుడు విశ్వానికి యజమానులుగా తయారుచేసేందుకు చదివిస్తున్నారు, ఇటువంటి చదువును వదిలేస్తే వారిని మహామూర్ఖులని అంటారు. ఎంత గొప్ప ఖజానా లభిస్తుంది. అటువంటి తండ్రిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఒక పాట కూడా ఉంది - మీరు ప్రేమించండి లేక తిరస్కరించండి, మేము మీ గడపను ఎప్పటికీ వదలము. తండ్రి అనంతమైన రాజ్యాధికారాన్నిచ్చేందుకే వచ్చారు. విడిచిపెట్టే మాటే లేదు. అయితే, మంచి లక్షణాలను ధారణ చేయాలి. వీరు మమ్మల్ని చాలా విసిగిస్తున్నారు అని స్త్రీలు కూడా రిపోర్ట్ వ్రాస్తారు. ఈ రోజుల్లో మనుష్యులు చాలా చాలా అశుద్ధంగా ఉన్నారు. చాలా సంభాళించుకోవాలి. సోదరులు, సోదరీలను సంభాళించాలి. ఆత్మలైన మనము ఎటువంటి పరిస్థితిలోనైనా తండ్రి నుండి వారసత్వము తప్పకుండా తీసుకోవాలి. తండ్రిని వదిలేస్తే వారసత్వము సమాప్తమైపోతుంది. నిశ్చయబుద్ధి విజయంతి, సంశయబుద్ధి వినశ్యంతి. తర్వాత, పదవి చాలా తగ్గిపోతుంది. జ్ఞానాన్ని ఒక్క జ్ఞానసాగరుడైన తండ్రి మాత్రమే ఇవ్వగలరు. మిగిలినదంతా భక్తి. ఎవరు ఎంతగా స్వయాన్ని జ్ఞానీగా భావించినా కానీ, అందరి వద్ద శాస్త్రాల జ్ఞానము మరియు భక్తి జ్ఞానముందని తండ్రి చెప్తున్నారు. సత్యమైన జ్ఞానం అని దేనినంటారో, ఇది కూడా మనుష్యులకు తెలియదు. అచ్చా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మురళీ వినే సమయంలో బుద్ధియోగము బయట భ్రమించడం లేదు కదా అని ధ్యానం పెట్టాలి. మేము శివబాబా మహావాక్యాలు వింటున్నామని సదా స్మృతిలో ఉండాలి. ఇది కూడా స్మృతియాత్రయే.

2. మాలో జ్ఞానము-యోగము మరియు దైవీ గుణాలు ఉన్నాయా? లోభం అనే భూతమైతే లేదు కదా? మాయకు వశమై ఎటువంటి వికర్మ జరగడం లేదు కదా? అని స్వయాన్ని పరిశీలించుకోవాలి.

వరదానము:-

దివ్యబుద్ధి యొక్క లిఫ్ట్ ద్వారా మూడు లోకాలలో విహరించే సహజయోగీ భవ

సంగమయుగంలో పిల్లలందరికీ దివ్యబుద్ధి అనే లిఫ్ట్ లభిస్తుంది. ఈ అద్భుతమైన లిఫ్ట్ ద్వారా మూడు లోకాలలో ఎక్కడకు కావాలంటే అక్కడకు చేరుకోగలరు. కేవలం స్మృతి అనే స్విచ్ ఆన్ చేస్తే, ఒక్క సెకండులో చేరుకుంటారు మరియు ఎంత సమయం ఏ లోకాన్ని అనుభవం చేయాలనుకుంటే, అంత సమయం అక్కడ స్థితులవ్వగలరు. ఈ లిఫ్టును ఉపయోగించేందుకు అమృతవేళలో కేర్ ఫుల్ గా అయి స్మృతి అనే స్విచ్ ను యథార్థ రీతిగా సెట్ చేసుకోండి. అథారిటీగా అయి ఈ లిఫ్టును కార్యంలో ఉపయోగించినట్లయితే సహజయోగీగా అయిపోతారు. శ్రమ సమాప్తమైపోతుంది.

స్లోగన్:-

మనసును సదా ఆనందంగా ఉంచుకోవడమే జీవితం జీవించే కళ.