14-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
"మధురమైన పిల్లలూ - మిమ్మల్ని జ్ఞాన రత్నాలతో అలంకరించి తిరిగి ఇంటికి తీసుకువెళ్ళేందుకు, మళ్ళీ రాజ్యములోకి పంపించేందుకు తండ్రి వచ్చారు కనుక అపారమైన సంతోషంలో ఉండాలి, ఒక్క తండ్రినే ప్రేమించండి" ప్రశ్న:- మీ ధారణలను దృఢంగా (పక్కా) చేసుకునేందుకు ఆధారమేమిటి? జవాబు:- తమ ధారణలను దృఢంగా చేసుకునేందుకు సదా ఇది పక్కా చేసుకోండి - ఈ రోజు గడిచినదంతా మంచే జరిగింది, మళ్ళీ కల్పము తర్వాత జరుగుతుంది. ఏదైతే జరిగిందో, అది కల్పక్రితము కూడా ఇలాగే జరిగింది, ఇందులో కొత్తేమీ లేదు (నథింగ్ న్యూ). ఈ యుద్ధము కూడా 5 వేల సంవత్సరాల క్రితము జరిగింది, మళ్ళీ తప్పకుండా జరుగుతుంది. ఈ ప్రపంచం యొక్క వినాశనము జరగాల్సిందే..... ఈ విధంగా ప్రతి క్షణము డ్రామా యొక్క స్మృతిలో ఉన్నట్లయితే ధారణ దృఢంగా అవుతూ ఉంటుంది. గీతము:- దూరదేశములో ఉండేవారు పరాయి దేశములోకి వచ్చారు..... (దూరదేశ్ కే రహ్ నే వాలా.....) ఓంశాంతి. పిల్లలు ఇంతకుముందు కూడా దూరదేశము నుండి పరాయి దేశములోకి వచ్చారు. ఇప్పుడు ఈ పరాయి దేశములో దుఃఖితులుగా ఉన్నారు, అందుకే మా దేశానికి, మా ఇంటికి తీసుకువెళ్ళమని తండ్రిని పిలుస్తారు. ఇది మీ పిలుపే కదా. చాలా కాలం బట్టి గుర్తు చేస్తూ వచ్చారు కనుక తండ్రి కూడా సంతోషంగా వస్తారు. నేను పిల్లల వద్దకు వెళ్తున్నానని వారికి తెలుసు. ఏ పిల్లలైతే కామచితిపై కూర్చుని కాలిపోయారో, వారిని కూడా ఇంటికి తీసుకొచ్చి, ఆ తర్వాత రాజ్యంలోకి పంపిస్తాను. దాని కోసం జ్ఞానముతో అలంకారము కూడా చేస్తాను. పిల్లలు కూడా తండ్రి కంటే ఎక్కువగా సంతోషించాలి. తండ్రి వచ్చినప్పుడు, మరి వారికి చెందినవారిగా అవ్వాలి. వారిని చాలా ప్రేమించాలి. బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారు, ఆత్మ మాట్లాడుతుంది కదా. బాబా, 5 వేల సంవత్సరాల తర్వాత డ్రామానుసారంగా మీరు వచ్చారు, మాకు సంతోషపు ఖజానా చాలా లభిస్తోంది. బాబా, మీరు మా జోలెను నింపుతున్నారు, మమ్మల్ని మా ఇల్లైన శాంతిధామానికి తీసుకువెళ్తారు, ఆ తర్వాత రాజధానిలోకి పంపిస్తారు. ఎంత అపారమైన సంతోషముండాలి. నేను ఈ పరాయి రాజధానిలోకే రావాలి అని తండ్రి చెప్తున్నారు. విశేషంగా ఈ పరాయి దేశములోకి వచ్చినప్పుడు తండ్రిది చాలా మధురమైన మరియు అద్భుతమైన పాత్ర. ఈ విషయాలను మీరిప్పుడే అర్థం చేసుకుంటారు, తర్వాత ఈ జ్ఞానం ప్రాయః లోపమైపోతుంది. అక్కడ ఈ జ్ఞానం అవసరమే ఉండదు. మీరెంత అవివేకులుగా అయ్యారు, డ్రామాలోని పాత్రధారులై ఉండి కూడా తండ్రిని తెలుసుకోలేదు అని బాబా అంటారు! తండ్రియే చేసేవారు-చేయించేవారు, వారు ఏం చేస్తారు-చేయిస్తారు అన్నది మీరు మర్చిపోయారు. మొత్తం పాత ప్రపంచాన్నంతా స్వర్గంగా తయారుచేసేందుకు వస్తారు మరియు జ్ఞానమునిస్తారు. వారు జ్ఞానసాగరుడు కనుక తప్పకుండా జ్ఞానాన్నిచ్చే కర్తవ్యాన్ని చేస్తారు కదా. తర్వాత మీచేత చేయిస్తారు కూడా, ఇప్పుడు దేహభానాన్ని వదిలి నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని బాబా అందరికీ చెప్తున్నారు అన్న సందేశాన్ని ఇతరులకు కూడా చెప్పండి. నేను శ్రీమతాన్నిస్తాను. అందరూ పాపాత్ములుగా ఉన్నారు. ఈ సమయంలో మొత్తం వృక్షం తమోప్రధానంగా, శిథిలావస్థకు చేరుకుంది. వెదురు అడవికి నిప్పు అంటుకున్నప్పుడు ఒక్కసారిగా మొత్తం కాలిపోయి సమాప్తమైపోతుంది. అగ్నిని ఆర్పేందుకు అడవిలో నీరు ఎక్కడి నుండి వస్తుంది. ఈ పాత ప్రపంచానికి కూడా నిప్పు అంటుకుంటుంది. కొత్తేమీ కాదు అని తండ్రి చెప్తున్నారు. తండ్రి ఇచ్చే మంచి-మంచి పాయింట్లు నోట్ చేసుకోవాలి. ఇతర ధర్మస్థాపకులు కేవలం తమ ధర్మ స్థాపన చేసేందుకు మాత్రమే వస్తారు, వారిని పైగంబర్ లేదా మెసెంజర్ (సందేశకులు) అని సంబోధించలేము అని బాబా అర్థం చేయించారు. ఇది కూడా చాలా యుక్తిగా వ్రాయాలి. పిల్లలందరూ పరస్పరంలో సోదరులే అని శివబాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కనుక ప్రతి ఒక్క చిత్రములో, ప్రతి ఒక్క ముద్రణలో శివబాబా ఈ విధంగా అర్థం చేయిస్తున్నారు అని తప్పకుండా రాయాలి. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, నేను వచ్చి సత్యయుగీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను, అందులో 100 శాతము సుఖము-శాంతి-పవిత్రత అన్నీ ఉంటాయి, అందుకే దానిని స్వర్గమని అంటారు. అక్కడ దుఃఖమన్న పేరే ఉండదు. తర్వాత, మిగిలిన ధర్మాలన్నిటినీ వినాశనము చేయించేందుకు నిమిత్తంగా అవుతాను. సత్యయుగంలో ఒకే ధర్మముంటుంది. అది కొత్త ప్రపంచము. పాత ప్రపంచాన్ని సమాప్తము చేయిస్తాను. ఇటువంటి కార్యాన్ని ఇంకెవ్వరూ చేయరు. శంకరుని ద్వారా వినాశనం అని అంటారు. విష్ణువు కూడా లక్ష్మీ-నారాయణులే. ప్రజాపిత బ్రహ్మా కూడా ఇక్కడే ఉన్నారు. వీరే పతితము నుండి పావనమైన ఫరిస్తాగా అవుతారు కనుక బ్రహ్మాను దేవత అని అంటారు. వారి ద్వారా దేవీ-దేవతా ధర్మము స్థాపనవుతుంది. ఈ బాబా కూడా దేవీ-దేవతా ధర్మములో మొదటి రాకుమారునిగా అవుతారు. కనుక బ్రహ్మా ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనం. చిత్రాలు ఇవ్వవలసి ఉంటుంది కదా. అర్థము చేయించేందుకు ఈ చిత్రాలను తయారుచేశారు. వీటి అర్థము ఎవ్వరికీ తెలియదు. స్వదర్శన చక్రధారి అంటే ఏమిటో అర్థం చేయించారు - పరమపిత పరమాత్మ సృష్టి ఆదిమధ్యాంతాలు తెలిసినవారు, వారిలో మొత్తం జ్ఞానం ఉంది కనుక వారు స్వదర్శన చక్రధారియే కదా. నేనే ఈ జ్ఞానాన్ని వినిపిస్తానని వారికి తెలుసు. నేను కమల పుష్ప సమానంగా అవ్వాలి అని బాబా ఈ విధంగా అనరు. సత్యయుగంలో మీరు కమలపుష్ప సమానంగానే ఉంటారు. సన్యాసుల కోసం ఈ విధంగా చెప్పరు. వారైతే అడవులకు వెళ్ళిపోతారు. మొదట్లో సన్యాసులు పవిత్రంగా, సతోప్రధానంగా ఉంటారు, భారత్ ను పవిత్రతా బలంతో కాపాడుతారు అని తండ్రి కూడా చెప్తున్నారు. భారత్ వంటి పవిత్రమైన దేశము ఇంకేదీ ఉండదు. తండ్రికి ఏ విధంగా మహిమ ఉందో, అదే విధంగా భారత్ కు కూడా మహిమ ఉంది. భారత్ స్వర్గంగా ఉండేది, ఈ లక్ష్మీ-నారాయణులు రాజ్యము చేసేవారు, తర్వాత ఏమయ్యారు. ఈ విషయము మీకిప్పుడు తెలుసు, ఈ దేవతలే 84 జన్మలు తీసుకొని మళ్ళీ పూజారులుగా అవుతారని ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు. మనమిప్పుడు పూజ్య దేవీ-దేవతలుగా అవుతామని, మళ్ళీ పూజారి మనుష్యులుగా అవుతామని, మీకిప్పుడు మొత్తం జ్ఞానముంది. మనుష్యులు మనుష్యులుగానే ఉంటారు. ఈ చిత్రాలను రకరకాలుగా తయారుచేస్తారు, కానీ అటువంటి మనుష్యులెవ్వరూ ఉండరు. ఇవన్నీ భక్తిమార్గపు అనేక చిత్రాలు. మీ జ్ఞానమైతే గుప్తమైనది. ఈ జ్ఞానాన్ని అందరూ తీసుకోరు. ఈ దేవీ-దేవతా ధర్మానికి చెందిన ఆకులు ఎవరైతే ఉంటారో, వారే తీసుకుంటారు. ఇంకెవరినైనా నమ్మేవారు దీనిని వినరు. శివుడిని మరియు దేవతలను భక్తి చేసేవారే వస్తారు. మొట్టమొదట నన్నే పూజిస్తారు, తర్వాత పూజారులుగా అయి తమను తామే పూజించుకుంటారు. పూజ్యుల నుండి పూజారులుగా అయిన మనము ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతామని ఇప్పుడు సంతోషం కలుగుతుంది. ఎంత సంతోషాన్ని అనుభవిస్తారు. ఇక్కడైతే అల్పకాలానికి సంతోషం అనుభవిస్తారు. అక్కడైతే మీకు సదా సంతోషముంటుంది. దీపావళి మొదలైనవి లక్ష్మిని ఆహ్వానించేందుకు కాదు. పట్టాభిషేక మహోత్సవంలో దీపావళి ఉంటుంది. ఈ సమయంలో జరుపుకునే ఉత్సవాలు అక్కడ ఉండవు. అక్కడైతే సుఖమే సుఖముంటుంది. మీరు ఆదిమధ్యాంతాలను ఈ ఒక్క సమయములో మాత్రమే తెలుసుకుంటారు. ఈ పాయింట్లన్నీ వ్రాయండి. సన్యాసులది హఠయోగము. ఇది రాజయోగము. ప్రతి పేజిలో ఎక్కడంటే అక్కడ శివబాబా పేరు తప్పకుండా ఉండాలి అని తండ్రి చెప్తున్నారు. శివబాబా పిల్లలైన మనకు అర్థం చేయిస్తున్నారు. నిరాకార ఆత్మలు ఇప్పుడు సాకారములో కూర్చున్నారు. కనుక తండ్రి కూడా సాకారములోనే అర్థం చేయిస్తారు కదా. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి అని వారు చెప్తున్నారు. శివ భగవానువాచ పిల్లల కోసం. వారు స్వయంగా ఇక్కడ హాజరై ఉన్నారు కదా. అతి ముఖ్యమైన పాయింట్లు పుస్తకంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉండాలి, అవి ఎవరైనా చదివితే స్వతహాగా జ్ఞానము అర్థం చేసుకోగలగాలి. శివ భగవానువాచ అని ఉండడం వలన చదవడంలో ఆనందము కలుగుతుంది. ఇది బుద్ధి చేసే పని కదా. బాబా కూడా శరీరాన్ని అప్పుగా తీసుకొని వినిపిస్తారు కదా, వీరి ఆత్మ కూడా వింటుంది. పిల్లలలో చాలా నషా ఉండాలి. తండ్రిపై చాలా ప్రేమ ఉండాలి. ఇది వారి రథము, ఇది అనేక జన్మల అంతిమ జన్మ. వీరిలో ప్రవేశించారు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులుగా అవుతారు, తర్వాత మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. చిత్రాలు ఎంత స్పష్టంగా ఉన్నాయి. మీ చిత్రాన్ని చూపించండి, దాని పైన లేక పక్కన మీ డబల్ కిరీటధారి చిత్రము కూడా పెట్టండి. యోగబలము ద్వారా మేము ఈ విధంగా అవుతాము. పైన శివబాబా ఉండాలి. వారిని స్మృతి చేస్తూ-చేస్తూ మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. చాలా స్పష్టంగా ఉంది. మనుష్యులు చూసి సంతోషించే విధంగా రంగుల చిత్రాలు గల పుస్తకము ఉండాలి. పేదవారి కోసం వాటిలో కొంచెము తక్కువ ధరవి కూడా ముద్రించవచ్చు. పెద్దదాని నుండి చిన్నవిగా, చిన్నదాని నుండి ఇంకా చిన్నవిగా చేయవచ్చు, రహస్యం అందులో రావాలి. గీతా భగవంతుని చిత్రము ముఖ్యమైనది. వారి గీతపై కృష్ణుని చిత్రము, మీ గీతపై త్రిమూర్తి చిత్రము ఉంటే మనుష్యులకు అర్థం చేయించడం సహజమవుతుంది. ప్రజాపిత బ్రహ్మా సంతానమైన బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మా సూక్ష్మవతనములో అయితే ఉండరు. బ్రహ్మా దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు, ఇప్పుడు దేవత ఎవరు! దేవతలైతే ఇక్కడ రాజ్యము చేసేవారు. దేవతా ధర్మము అయితే ఉంది కదా. కనుక ఇవన్నీ బాగా అర్థం చేయించాల్సి ఉంటుంది. బ్రహ్మా నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మా, ఇద్దరూ ఇక్కడే ఉన్నారు. చిత్రాలుంటే అర్థం చేయించవచ్చు. మొట్టమొదట అల్ఫ్ (బాబా)ను నిరూపించినట్లయితే అన్ని విషయాలు నిరూపించబడతాయి. పాయింట్లయితే చాలా ఉన్నాయి, మిగిలినవారందరూ ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. తండ్రి అయితే స్థాపన మరియు వినాశనము, రెండూ చేయిస్తారు. అంతా డ్రామానుసారంగానే జరుగుతుంది. బ్రహ్మా మాట్లాడగలరు, విష్ణువు మాట్లాడగలరా? సూక్ష్మవతనంలో ఏమి మాట్లాడుతారు. ఇవన్నీ అర్థము చేసుకోవాల్సిన విషయాలు. ఇక్కడ మీరు అర్థము చేసుకొని మళ్ళీ పై తరగతికి ట్రాన్సఫర్ అవుతారు. వేరే గది లభిస్తుంది. మూలవతనంలో ఎవ్వరూ కూర్చొని ఉండిపోయేది లేదు. మళ్ళీ అక్కడి నుండి నంబరువారుగా రావడం జరుగుతుంది. మొట్టమొదట ముఖ్యమైన విషయము ఒక్కటే, దానికి ప్రాధాన్యతనివ్వాలి. కల్పక్రితము కూడా ఈ విధంగానే జరిగింది. ఈ సెమినార్ మొదలైనవి కూడా కల్పము క్రితము ఇదే విధంగా జరిగాయి, ఇటువంటి పాయింట్లే వెలువడ్డాయి. ఈ రోజు ఏదైతే జరిగిందో, అది మంచే జరిగింది, మళ్ళీ కల్పము తర్వాత ఇలాగే జరుగుతుంది. ఈ విధంగా ధారణ చేస్తూ పక్కా అవుతూ ఉండండి. ఈ యుద్ధము జరిగింది, ఇది కొత్తేమీ కాదు, 5 వేల సంవత్సరాల క్రితము కూడా ఇలాగే జరిగిందని మ్యాగజిన్ లో కూడా వేయించమని బాబా చెప్పారు. ఈ విషయాలను మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు. బయటివారు అర్థము చేసుకోలేరు. ఈ విషయాలు అద్భుతంగా ఉన్నాయని మాత్రము అంటారు. అచ్ఛా, ఎప్పుడైనా వచ్చి తెలుసుకుంటామని చెప్తారు. పిల్లల కోసం శివ భగవానువాచ. ఇటువంటి పదాలున్నట్లయితే వచ్చి తెలుసుకుంటారు కూడా. ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలు అని పేరు కూడా వ్రాయబడి ఉంది. ప్రజాపిత బ్రహ్మా ద్వారానే బ్రాహ్మణులను రచిస్తారు. బ్రాహ్మణ దేవీ-దేవతాయ నమః అని అంటారు కదా. ఎటువంటి బ్రాహ్మణులు? బ్రహ్మా సంతానం ఎవరు అన్నది మీరు బ్రాహ్మణులకు కూడా అర్థం చేయించవచ్చు. ప్రజాపిత బ్రహ్మాకు ఇంతమంది పిల్లలున్నారు, కనుక తప్పకుండా ఇక్కడ దత్తత తీసుకోబడి ఉంటారు. తమ కులానికి చెందినవారు చాలా బాగా అర్థము చేసుకుంటారు. మీరు తండ్రికి సంతానంగా అయ్యారు. తండ్రి బ్రహ్మాను కూడా దత్తత తీసుకుంటారు. లేకపోతే శరీరమున్నవారు ఎక్కడ నుండి వస్తారు. బ్రాహ్మణులు ఈ విషయాలను అర్థము చేసుకుంటారు, సన్యాసులు అర్థము చేసుకోలేరు. అజ్మేరులో బ్రాహ్మణులుంటారు మరియు హరిద్వార్ లో సన్యాసులే సన్యాసులుంటారు. బ్రాహ్మణులే పండాలుగా ఉంటారు. కానీ వారు ఆకలితో ఉంటారు. మీరిప్పుడు దైహిక పండాలుగా ఉన్నారు, ఇప్పుడు ఆత్మిక పండాలుగా అవ్వండి అని వారికి చెప్పండి. మిమ్మల్ని కూడా పండాలు అనే అంటారు. పాండవ సైన్యం గురించి కూడా తెలియదు. బాబా పాండవులకు అధిపతి. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు మీ ఇంటికి వెళ్ళిపోతారు అని తండ్రి చెప్తున్నారు. తర్వాత అమరపురికి పెద్ద యాత్ర ఉంటుంది. మూలవతనానికి ఎంత పెద్ద యాత్ర ఉంటుంది. మిడతల గుంపు వలె ఆత్మలందరూ వెళ్తారు కదా. ఈగలలో కూడా రాణి ఈగ వెళ్ళినట్లయితే, దాని వెనుక అన్నీ వెళ్తాయి. విచిత్రము కదా. ఆత్మలన్నీ దోమల వలె వెళ్తాయి. శివుని ఊరేగింపు ఉంటుంది కదా. మీరందరూ వధువులు. వరుడినైన నేను అందరినీ తీసుకువెళ్ళేందుకు వచ్చాను. మీరు ఛీ-ఛీగా అయిపోయారు కనుక అలంకరించి తోడుగా తీసుకువెళ్తాను. ఎవరైతే అలంకరించుకోరో, వారు శిక్షలు అనుభవిస్తారు. వెళ్ళవలసిందే. కాశీలో కత్తుల భావిలో దూకి మనుష్యులు మరణించినప్పుడు కూడా, ఒక్క క్షణంలో ఎన్ని శిక్షలు అనుభవిస్తారు. మనుష్యులు ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, మేము జన్మ-జన్మాంతరాల దుఃఖమును, శిక్షలను అనుభవిస్తున్నామని భావిస్తారు. ఆ దుఃఖపు ఫీలింగ్ ఆ విధంగా ఉంటుంది. జన్మ-జన్మంతరాల పాపాలకు శిక్ష లభిస్తుంది. ఎంతగా శిక్షలు అనుభవిస్తారో, అంతగా పదవి తగ్గిపోతుంది, అందుకే యోగబలముతో లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోండి అని తండ్రి చెప్తున్నారు. స్మృతి ద్వారా జమ చేసుకుంటూ వెళ్ళండి. జ్ఞానము అయితే చాలా సహజము. ఇప్పుడు ప్రతి కర్మ జ్ఞానయుక్తంగా చేయాలి. పాత్రులకే దానమివ్వాలి. పాపాత్ములకు ఇవ్వడం వలన ఇచ్చేవారిపై కూడా దాని ప్రభావము పడుతుంది. వారు కూడా పాపాత్ములుగా అయిపోతారు. ఆ ధనాన్ని తీసుకువెళ్ళి ఏదైనా పాపాము మొదలైనవి చేసేవారికి ఎప్పుడూ ఇవ్వకూడదు. పాపాత్ములకిచ్చేవారైతే ప్రపంచంలో చాలామంది కూర్చుని ఉన్నారు. ఇప్పుడు మీరైతే ఇలా చేయకూడదు. అచ్ఛా. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. ఇప్పుడు ప్రతి కర్మను జ్ఞానయుక్తంగా చేయాలి, పాత్రులకే దానమివ్వాలి. పాపాత్ములతో ఇప్పుడు ధనము మొదలైనవి ఇచ్చి పుచ్చుకోకూడదు. యోగబలముతో పాత లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకోవాలి. 2. అపారమైన సంతోషంలో ఉండేందుకు - బాబా, మీరు మాకు అపారమైన సంతోషపు ఖజానానివ్వడానికి వచ్చారు, మీరు మా జోలెను నింపుతున్నారు, మొదట మీతోపాటు శాంతిధామానికి వస్తాము, తర్వాత మా రాజధానిలోకి వస్తాము...... అని మీతో మీరు మాట్లాడుకోవాలి. వరదానము:- కల్ప-కల్పపు విజయము యొక్క స్మృతి ఆధారంతో మాయా శత్రువును ఆహ్వానించే మహావీర్ విజయీ భవ మహావీరులైన విజయీ పిల్లలు పేపరును చూసి భయపడరు ఎందుకంటే త్రికాలదర్శులుగా అయిన కారణంగా మేము కల్ప-కల్పపు విజయులము అని వారికి తెలుసు. బాబా, మా వద్దకు మాయను పంపకండి, కృప చూపించండి, ఆశీర్వదించండి, శక్తినివ్వండి, ఏమి చేయాలి ఏదైనా మార్గం చూపించండి..... అని మహావీరులు ఎప్పుడూ ఈ విధంగా అనరు, ఇది కూడా బలహీనత. మహావీరులు అయితే, మీరు రండి, మేము విజయులుగా అవుతాము అని శత్రువును ఆహ్వానిస్తారు. స్లోగన్:- సమానంగా అవ్వండి, సంపన్నంగా అవ్వండి - ఇది సమయం యొక్క సూచన.
|
|