ఓంశాంతి. త్రిమూర్తి శివ భగవానువాచ. ఇప్పుడు వారు త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు. త్రిమూర్తి శివ భగవానువాచ అని తండ్రి చెప్తున్నారు. త్రిమూర్తి బ్రహ్మా భగవానువాచ అని అనరు. మీరు త్రిమూర్తి శివ భగవానువాచ అని చెప్పగలరు. వారు శివ-శంకరులను కలిపేస్తారు. ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. త్రిమూర్తి బ్రహ్మాకు బదులుగా త్రిమూర్తి శివ భగవానువాచ. శంకరుడు కళ్ళు తెరిస్తే వినాశనమైపోతుంది అని మనుష్యులు అంటారు. ఇవన్నీ బుద్ధితో అర్థము చేసుకోవలసినవి. ముగ్గురిదే ముఖ్యమైన పాత్ర. బ్రహ్మా మరియు విష్ణువులదైతే 84 జన్మల పెద్ద పాత్ర. విష్ణువు మరియు ప్రజాపిత బ్రహ్మాల అర్థమును కూడా తెలుసుకున్నారు, ఈ ముగ్గురిదే పాత్ర ఉంటుంది. బ్రహ్మాకు ఆదిదేవ్, ఏడమ్ అన్న పేర్లు గాయనం చేయబడతాయి. ప్రజాపిత మందిరము కూడా ఉంది. ఇది విష్ణువు లేక కృష్ణుని అంతిమ 84 వ జన్మ, వీరి పేరు ఇప్పుడు బ్రహ్మా అని పెట్టడం జరిగింది. బ్రహ్మా మరియు విష్ణువులను నిరూపించవలసిందే. ఇప్పుడు బ్రహ్మాను, దత్తత తీసుకోబడినవారు అని అంటారు. వీరిద్దరూ శివుని పిల్లలే. వాస్తవానికి ఒక్కరే సంతానం. లెక్కప్రకారం బ్రహ్మా శివుని బిడ్డ. బాబా మరియు దాదా. విష్ణువు పేరే రాదు. ప్రజాపిత బ్రహ్మా ద్వారా శివబాబా స్థాపన చేస్తున్నారు. విష్ణువు ద్వారా స్థాపన చేయించరు. శివునికి కూడా పిల్లలున్నారు, బ్రహ్మాకు కూడా పిల్లలున్నారు. విష్ణువు పిల్లలని అనలేము. లక్ష్మీ-నారాయణులకు కూడా చాలా మంది పిల్లలుండరు. ఇది బుద్ధికి భోజనము. మీకు మీరే భోజనము తయారుచేసుకోవాలి. అందరికంటే ఎక్కువ పాత్ర విష్ణువుకు ఉంటుంది. 84 జన్మల విరాట రూపము కూడా విష్ణువుకే చూపిస్తారు, బ్రహ్మాకు చూపించరు. విరాట రూపము కూడా విష్ణువుదే తయారుచేస్తారు, ఎందుకంటే మొట్టమొదట ప్రజాపిత బ్రహ్మా పేరును ధరించినా, బ్రహ్మాది చాలా తక్కువ పాత్ర ఉంటుంది కావున విష్ణువుకు విరాట రూపము చూపిస్తారు. చతుర్భుజాలు కూడా విష్ణువుకే చూపిస్తారు. వాస్తవానికి ఈ అలంకారాలు మీవి. ఇవి కూడా చాలా అర్థము చేసుకునే విషయాలు. మనుష్యులెవ్వరూ అర్థము చేయించలేరు. తండ్రి కొత్త-కొత్త పద్ధతులతో అర్థము చేయిస్తూ ఉంటారు. త్రిమూర్తి శివ భగవానువాచ సరైనదే కదా అని తండ్రి చెప్తారు. విష్ణువు, బ్రహ్మా మరియు శివ. ఇందులో కూడా ప్రజాపిత బ్రహ్మయే సంతానం. విష్ణువును సంతానం అని అనరు. సృష్టి అని అంటారు కానీ రచన అయితే బ్రహ్మదే కదా. తర్వాత రకరకాల నామ రూపాలు తీసుకుంటారు. వారిది ముఖ్యమైన పాత్ర. ఈ సమయంలో బ్రహ్మా పాత్ర కూడా చాలా కొద్దిగా ఉంటుంది. విష్ణువు రాజ్యం ఎంత సమయం ఉంటుంది! వృక్షమంతటికీ బీజ రూపుడు శివబాబా. వారి రచనను సాలిగ్రామాలని అంటారు. బ్రహ్మా రచనను బ్రాహ్మణ-బ్రాహ్మణీలు అని అంటారు. శివబాబా రచన ఎంతగా ఉందో, అంతగా ఇప్పుడు బ్రహ్మాకు ఉండదు. శివుని రచన అయితే చాలా ఉంది. ఆత్మలందరూ వారి సంతానం. కేవలం బ్రహ్మణులైన మీరు మాత్రమే బ్రహ్మా రచన. హద్దులోకి వచ్చేసారు కదా. ఆత్మలందరూ శివబాబా యొక్క అనంతమైన రచన. వారు అనంతమైన ఆత్మల కళ్యాణము చేస్తారు. బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపన చేస్తారు. బ్రాహ్మణులైన మీరు మాత్రమే స్వర్గవాసులుగా అవుతారు. ఇతరులెవ్వరినీ స్వర్గవాసులని అనరు, అందరూ నిర్వాణ వాసులుగా లేక శాంతిధామ వాసులుగా అవుతారు. అందరి కన్నా ఉన్నతమైన సేవ శివబాబాయే చేస్తారు. ఆత్మలందరినీ తీసుకువెళ్తారు. అందరి పాత్ర వేర్వేరుగా ఉంటుంది. నా పాత్ర వేరుగా ఉంటుందని శివబాబా కూడా చెప్తారు. అందరి లెక్కాచారము సమాప్తం చేయించి మిమ్మల్ని పతితం నుండి పావనంగా తయారుచేసి తీసుకువెళ్తాను. పావనంగా అయ్యేందుకు మీరిక్కడ శ్రమ చేస్తున్నారు. మిగిలినవారంతా వినాశన సమయంలో లెక్కాచారము పూర్తి చేసుకుని వెళ్తారు. మళ్ళీ ముక్తిధామంలో కూర్చుని ఉంటారు. సృష్టి చక్రమైతే తిరగవల్సిందే.
పిల్లలైన మీరు బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులుగా అయి మళ్ళీ దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులైన మీరు శ్రీమతం ఆధారంగా సేవ చేస్తారు. ముక్తి మరియు జీవన్ముక్తులను పొందాలంటే ఈ విధంగా పొందవచ్చు అని మనుష్యులకు కేవలం మార్గం తెలియజేస్తారు. రెండు తాళంచెవులు చేతిలో ఉన్నాయి. ఎవరెవరు ముక్తిలోకి వెళ్తారో, ఎవరెవరు జీవన్ముక్తిలోకి వెళ్తారో కూడా మీకు తెలుసు. రోజంతా మీకు ఇదే వ్యాపారము. ఎవరైనా ధాన్యము మొదలైనవాటి వ్యాపారం చేస్తే రోజంతా బుద్ధిలో అదే ఉంటుంది. రచన యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడం మరియు ఇతరులకు ముక్తి-జీవన్ముక్తుల మార్గం తెలియజేయడమే మీ వ్యాపారం. ఈ ధర్మానికి చెందిన వారెవరైతే ఉంటారో వారు వచ్చేస్తారు. అలా మారలేనివారు ఎంతో మంది అనేక ధర్మాలలో ఉన్నారు. అలా ఎన్నో ధర్మాలకు చెందినవారు ఇతర ధర్మాలలోకి మారలేరు. కొందరు ఊరికనే మారుతారు. వారి రూపురేఖలు మారవు, కానీ ధర్మాన్ని స్వీకరిస్తారు. కొంతమంది బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తారు ఎందుకంటే దేవీ-దేవతా ధర్మము మాయమైపోయింది కదా. మేము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని చెప్పేవారు ఒక్కరు కూడా లేరు. దేవతల చిత్రాలు ఉపయోగపడతాయి, ఆత్మ అయితే అవినాశీ, అది ఎప్పుడూ మరణించదు. ఒక శరీరము వదిలి మరొకటి తీసుకొని మళ్ళీ పాత్రను అభినయిస్తుంది. దానిని మృత్యులోకమని అనరు. అది అమరలోకము. కేవలం శరీరము మారుతుంది. ఇవి అర్థము చేసుకోవలసిన చాలా సూక్ష్మమైన విషయాలు. ఇవి స్థూల విషయాలు కావు. వివాహం జరిగినప్పుడు కొంతమంది తక్కువగా, కొంతమంది ఎక్కువగా ఇస్తారు. కొంతమంది అన్నీ చూపించి ఇస్తారు, కొంతమంది పెట్టెలో పెట్టి దాన్ని మూసి ఇస్తారు. రకరకాలుగా ఉంటారు. మీకైతే హోల్ సేల్ గా వారసత్వము లభిస్తుంది, ఎందుకనగా మీరందరూ వధువులు. తండ్రి వరుడు. పిల్లలైన మిమ్మల్ని అలంకరించి విశ్వరాజ్యాన్ని హోల్ సేల్ గా ఇస్తారు. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు.
ముఖ్యమైన విషయం స్మృతి. జ్ఞానమైతే చాలా సహజము. ఇక్కడ కేవలం పరమాత్మ(అల్ఫ్)ను స్మృతి చేయాలి. కానీ స్మృతి వెంటనే జారిపోతూ ఉంటుందని భావిస్తారు. బాబా స్మృతిని మర్చిపోతున్నామని చాలామంది అంటారు. మీరు ఎవరికి అర్థము చేయించినా కూడా ఎల్లప్పుడూ స్మృతి అనే పదాన్ని వాడండి. యోగం అన్న పదం తప్పు. టీచరుకు విద్యార్థి స్మృతి ఉంటుంది. తండ్రి సుప్రీమ్ సోల్ (పరమ ఆత్మ). ఆత్మలైన మీరు సుప్రీం కాదు. మీరు పతితులు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి. టీచరును, తండ్రిని, గురువును స్మృతి చేయడం జరుగుతుంది. గురువులు కూర్చుని శాస్త్రాలను వినిపిస్తారు, మంత్రాలనిస్తారు. బాబా ఇచ్చే మంత్రము ఒక్కటే - మన్మనాభవ. తర్వాత ఏమౌతుంది? మధ్యాజీభవ. మీరు విష్ణుపురిలోకి వెళ్ళిపోతారు. మీరందరూ రాజా-రాణులుగా కాలేరు. రాజా-రాణులు మరియు ప్రజలు ఉంటారు. కావున త్రిమూర్తి అన్నది ముఖ్యమైనది. శివబాబా, ఆ తర్వాత బ్రహ్మా, వారు మనుష్య సృష్టిని అనగా బ్రాహ్మణులను రచిస్తారు. ఆ తర్వాత బ్రాహ్మణులను కూర్చుని చదివిస్తారు. ఇది కొత్త విషయం కదా. బ్రాహ్మణ-బ్రాహ్మణీలైన మీరు సోదరీ-సోదరులు. వృద్ధులు కూడా మేము సోదరి-సోదరులమని అంటారు. ఇది లోలోపల అర్థం చేసుకోవాలి. వ్యర్థంగా ఎవ్వరితోనూ అనకూడదు. భగవంతుడు ప్రజాపిత బ్రహ్మా ద్వారా సృష్టిని రచించారు, ఒక్క ప్రజాపిత బ్రహ్మా పిల్లలుగా అయ్యారు కనుక సోదరీ-సోదరులుగా అయ్యారు కదా, ఇవి అర్థము చేసుకోవాల్సిన విషయాలు. మాకు చదివించేవారెవరు అని పిల్లలైన మీకు చాలా సంతోషము ఉండాలి. శివబాబా చదివిస్తున్నారు. త్రిమూర్తి శివ. బ్రహ్మాకు కూడా చాలా కొద్ది సమయపు పాత్ర ఉంటుంది. విష్ణువుకు సత్యయుగీ రాజధానిలో 8 జన్మల పాత్ర నడుస్తుంది. బ్రహ్మాకు ఒక్క జన్మ పాత్ర మాత్రమే ఉంటుంది. విష్ణువు పాత్ర పెద్దది. ముఖ్యమైనవారు త్రిమూర్తి శివ. ఆ తర్వాత బ్రహ్మా పాత్ర ఉంటుంది, అది పిల్లలైన మిమ్మల్ని విష్ణుపురికి యజమానులుగా చేస్తుంది. బ్రహ్మా నుండి బ్రాహ్మణులుగా, మళ్ళీ దేవతలుగా అవుతారు. కనుక వీరు అలౌకిక తండ్రి అయ్యారు. మీరు తండ్రిగా భావించేవారు ఇప్పుడు కొంత సమయం కోసమే ఉంటారు. వీరిని ఆదిదేవ్, ఆదమ్ మరియు బీబి అని అంటారు. వీరు లేకుండా సృష్టిని ఎలా రచిస్తారు. ఆది దేవ్ మరియు ఆది దేవి కదా. కేవలం సంగమ సమయంలోనే బ్రహ్మా పాత్ర ఉంటుంది. దేవతల పాత్ర మళ్ళీ చాలా కాలము నడుస్తుంది. దేవతలు అని కేవలం సత్యయుగములోనే అంటారు. త్రేతాలో క్షత్రియులు అని అంటారు. ఇటువంటి చాలా గుహ్యాతి-గుహ్యమైన పాయింట్లు లభిస్తాయి. అన్నీ ఒక్క సమయంలోనే వర్ణించలేరు. వారిని త్రిమూర్తి బ్రహ్మా అంటారు. శివుడిని తీసేసారు. మనము మళ్ళీ త్రిమూర్తి శివ అని అంటాము. ఈ చిత్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గానికి చెందినవి. బ్రహ్మా ద్వారా ప్రజలను రచిస్తారు, ఆ తర్వాత మీరు దేవతలుగా అవుతారు. వినాశన సమయంలో ప్రాకృతిక ఆపదలు కూడా సంభవిస్తాయి. వినాశనం జరగాల్సిందే, కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. ఇన్ని శరీరాల వినాశనము జరగాల్సిందే. అంతా ప్రాక్టికల్ గా జరగాలి కదా. కేవలం కళ్ళు తెరవడంతోనే ఏమీ జరగదు. స్వర్గము మాయమైనప్పుడు కూడా ఆ సమయంలో భూకంపాలు మొదలైనవి జరుగుతాయి. మరి ఆ సమయంలో కూడా శంకరుడు కళ్ళు తెరుస్తారా. ద్వారక లేక లంక నీటిలోకి వెళ్ళిపోయిందని పాడతారు కదా.
నేను రాతి బుద్ధికలవారిని పారస బుద్ధికలవారిగా చేసేందుకు వచ్చాను అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఓ పతిత-పావనా రండి, వచ్చి పావన ప్రపంచాన్ని తయారుచేయండి అని మనుష్యులు పిలుస్తారు. కానీ ఇది ఇప్పుడు కలియుగమని, దీని తర్వాత సత్యయుగము వస్తుందని వారికి తెలియదు. పిల్లలైన మీరు సంతోషంగా నాట్యము చేయాలి. బ్యారిస్టర్ మొదలైన పరీక్షలు పాస్ అయినప్పుడు మేము ధనము సంపాదిస్తాము, ఆ తర్వాత ఇల్లు కడతాము, ఇది చేస్తాము అని లోలోపల ఆలోచిస్తారు కదా. మరి మీరిప్పుడు సత్యమైన సంపాదన చేసుకుంటున్నారు. స్వర్గంలోనైతే మీకన్నీ కొత్త వస్తువులే లభిస్తాయి. సోమనాథ మందిరము ఎలా ఉండేదో ఆలోచించండి! ఒక్క మందిరము మాత్రమే ఉండదు. ఆ మందిరము 2500 సంవత్సరాల నుండి ఉంది. తయారుచేసేందుకు సమయం పట్టి ఉంటుంది కదా. పూజలు చేసి ఉంటారు, దాని తర్వాత దాన్ని దోచుకొని తీసుకువెళ్ళారు. వెంటనే వచ్చి ఉండరు. చాలా మందిరాలు ఉంటాయి. పూజ కోసం మందిరాలను తయారుచేశారు. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ ఇప్పుడు మనము స్వర్ణిమ యుగములోకి వెళ్ళిపోతామని మీకు తెలుసు. ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. శ్రమ చేయవలసి ఉంటుంది. శ్రమ లేకుండా పని జరగదు. క్షణంలో జీవన్ముక్తి అని గాయనం కూడా జరుగుతుంది. కానీ అలా క్షణంలో లభించదు, పిల్లలుగా అయితే అప్పుడు తప్పకుండా లభిస్తుందని అర్థము చేయించబడుతుంది. మీరిప్పుడు ముక్తిధామములోకి వెళ్ళేందుకు శ్రమ చేస్తున్నారు. తండ్రి స్మృతిలో ఉండవలసి వస్తుంది. రోజు-రోజుకూ తండ్రి పిల్లలైన మిమ్మల్ని రిఫైన్ బుద్ధికలవారిగా తయారుచేస్తారు. తండ్రి చెప్తున్నారు - మీకు చాలా-చాలా గుహ్యమైన విషయాలు వినిపిస్తాను, ఆత్మ కూడా బిందువు, పరమాత్మ కూడా బిందువు అని ఇంతకముందు వినిపించలేదు. ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు. డ్రామాలో లేదు. ముందే ఇది మీకు వినిపిస్తే మీరు అర్థం చేసుకోలేరు. నెమ్మది-నెమ్మదిగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇది రావణ రాజ్యము. రావణ రాజ్యంలో అందరూ దేహాభిమానులుగా అయిపోతారు. సత్యయుగంలో ఆత్మాభిమానులుగా ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మా శరీరము పెద్దదైపోయింది, ఇప్పుడు దీనిని వదిలి మళ్ళీ చిన్నది తీసుకోవాలి అని తెలుస్తుంది. ఆత్మ ఉన్న శరీరము మొదట చిన్నదిగా, ఆ తర్వాత పెద్దదిగా అవుతుంది. ఇక్కడ ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఆయుష్షు ఉంటుంది. కొందరికి అకాల మృత్యువు వస్తుంది. కొందరికి 125 సంవత్సరాల ఆయుష్షు కూడా ఉంటుంది. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు మీకు చాలా సంతోషం ఉండాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. గాంధర్వ వివాహము చేసుకోవడం సంతోషకరమైన విషయమేమి కాదు, అది బలహీనత. ఒకవేళ కుమారి నేను పవిత్రంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్తే ఆమెను ఎవ్వరూ కొట్టలేరు. జ్ఞానము తక్కువగా ఉంటే భయపడతారు. ఒకవేళ చిన్న కుమారీని ఎవరైనా కొడితే, రక్తము మొదలైనవి వస్తే, పోలీసులకు రిపోర్టు చేసినట్లయితే వారికి కూడా శిక్ష లభిస్తుంది. ఒకవేళ ఎవరైనా జంతువులను హింసించినా సరే వారిపై కేసు వేస్తారు, వారిని శిక్షిస్తారు. పిల్లలైన మిమ్మల్ని కూడా ఎవరూ కొట్టలేరు. కుమారులను కూడా కొట్టలేరు. వారు తమ సంపాదన చేసుకోవచ్చు. శరీర నిర్వహణ చేసుకోవచ్చు. కడుపు ఎక్కువేమీ తినదు, ఒక మనిషి కడుపు 4-5 రూపాయలు, ఒక మనిషి కడుపు 400-500 రూపాయలు తింటుంది. డబ్బు ఎక్కువగా ఉంటే లోభము ఏర్పడుతుంది. పేదవారి వద్ద ధనమే ఉండదు కనుక లోభమే ఉండదు. వారు ఎండిపోయిన రొట్టెతోనే సంతోషపడతారు. పిల్లలు ఆహార-పానీయాల విషయంలో ఎక్కువ హంగామాలోకి వెళ్ళకూడదు. తినాలనే ఆసక్తి ఉండకూడదు.
అక్కడ మనకు లభించనిదేదీ ఉండదని మీకు తెలుసు! అనంతమైన రాజ్యాధికారం, అనంతమైన సుఖము లభిస్తుంది. అక్కడ వ్యాధులు మొదలైనవేవీ ఉండవు. ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము అన్నీ ఉంటాయి. అక్కడ వృద్ధాప్యము కూడా చాలా బాగుంటుంది, సంతోషముంటుంది. ఏ రకమైన కష్టమూ ఉండదు. ప్రజలు కూడా అలాగే ఉంటారు. కానీ ప్రజలుగా అయినా మంచిదేనని అనుకోకూడదు. అటువంటివారు ఇక్కడి అడవి మనుష్యుల వలె ఉంటారు. సూర్యవంశీ లక్ష్మీ-నారాయణులుగా అవ్వాలంటే మరి అంత పురుషార్థము చేయాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మనము బ్రహ్మా యొక్క కొత్త రచన, పరస్పరములో సోదరీ-సోదరులము అని లోలోపల భావించాలి, ఇది ఎవ్వరికీ చెప్పవలసిన అవసరము లేదు. మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు అన్న సంతోషంలో సదా ఉండాలి.
2. ఆహార-పానీయాల విషయంలో ఎక్కువ హంగామాలోకి వెళ్ళకూడదు. తినాలనే అత్యాశను వదిలి అనంతమైన రాజ్యాధికారం యొక్క సుఖాలను గుర్తు చేసుకోవాలి.