06-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఉదయము ఉదయమే లేచి - నేను ఇంత చిన్న ఆత్మను, ఎంత పెద్ద శరీరాన్ని నడిపిస్తున్నాను, ఆత్మనైన నాలో అవినాశీ పాత్ర రచింపబడి ఉంది అని చింతన చేయండి”

ప్రశ్న:-

శివబాబాకు ఏ అభ్యాసముంది, ఏ అభ్యాసము లేదు?

జవాబు:-

శివబాబాకు ఆత్మను జ్ఞాన రత్నాలతో అలంకరించే అభ్యాసముంది కానీ శరీరాన్ని అలంకరించే అభ్యాసము వారికి లేదు, ఎందుకంటే నాకు నా శరీరము లేదని బాబా చెప్తారు. నేను ఇతని శరీరాన్ని అద్దెకు తీసుకుంటాను కానీ ఆ ఆత్మయే స్వయంగా ఈ శరీరాన్ని అలంకరించుకుంటుంది, నేను అలంకరించను. నేను సదా అశరీరిని.

గీతము:-

ఈ ప్రపంచము మారినా మేము మారము..... (బదల్ జాయే దునియా నా బదలేంగే హమ్.....)

ఓంశాంతి. పిల్లలు ఈ పాటను విన్నారు. ఎవరు విన్నారు? ఆత్మ ఈ శరీరము యొక్క చెవుల ద్వారా విన్నది. ఆత్మ ఎంత చిన్నదో పిల్లలకు తెలిసింది. ఆత్మ ఈ శరీరములో లేకపోతే, ఈ శరీరము దేనికీ పనికిరాదు. ఇంత చిన్న ఆత్మ ఆధారముపై ఇంత పెద్ద శరీరము నడుస్తుంది. ఈ శరీరమనే రథముపై విరాజమానమై ఉండే ఆత్మ అంటే ఏమిటో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. అకాలమూర్తి అయిన ఆత్మకు సింహాసనము ఈ శరీరము. పిల్లలకు కూడా ఈ జ్ఞానము లభిస్తుంది. ఇది ఎంత రమణీకమైన, రహస్యయుక్తమైన జ్ఞానము. ఎప్పుడైనా ఇటువంటి రహస్యయుక్తమైన విషయాలు విన్నప్పుడు చింతన నడుస్తుంది. ఇంత పెద్ద శరీరములో ఎంత చిన్న ఆత్మ ఉంది అనే చింతన పిల్లలలో కూడా నడుస్తుంది. ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. శరీరమైతే వినాశనమైపోతుంది. కేవలం ఆత్మ మాత్రమే మిగులుతుంది. ఇవి చాలా ఆలోచించవలసిన విషయాలు. ఉదయమే లేచి ఈ విధంగా ఆలోచించాలి. ఆత్మ ఎంత చిన్నదో పిల్లలకు స్మృతి కలిగింది, దానికి అవినాశీ పాత్ర లభించి ఉంది. ఆత్మనైన నేను ఎంత అద్భుతమైన వస్తువును. ఇది కొత్త జ్ఞానము. ఈ జ్ఞానము ప్రపంచములో ఇంకెవ్వరి వద్దా లేదు. తండ్రే వచ్చి తెలియజేస్తారు, దీనిని స్మరించవలసి ఉంటుంది. ఇంత చిన్న ఆత్మనైన నేను, పాత్రను ఎలా అభినయిస్తున్నాను. శరీరము పంచ తత్వాలతో తయారవుతుంది. శివబాబా ఆత్మ ఎలా వచ్చి-వెళ్తుందో, బాబాకు ఏ మాత్రమూ తెలియదు. సదా వీరిలోనే ఉంటారని కాదు. కావున ఇదే చింతన చేయాలి. ఎవ్వరికీ, ఎప్పటికీ లభించని జ్ఞానాన్ని బాబా మీకు ఇస్తున్నారు. ఈ జ్ఞానము ఇతని ఆత్మలో లేదని మీకు తెలుసు. ఇతర సత్సంగాలలో ఇటువంటి విషయాల గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఆత్మ-పరమాత్మల జ్ఞానము కొద్దిగా కూడా లేదు. నేను ఆత్మను, శరీరము ద్వారా మంత్రాన్ని ఇస్తున్నానని ఏ సాధు-సన్యాసులకు కూడా తెలియదు. ఆత్మ శరీరము ద్వారా శాస్త్రాలను చదువుతుంది. ఆత్మాభిమానిగా ఉండే మనుష్యమాత్రులు ఒక్కరు కూడా లేరు. ఆత్మ జ్ఞానమే ఎవ్వరికీ లేనప్పుడు, మరి తండ్రి జ్ఞానము ఎలా ఉంటుంది.

ఆత్మలైన మనల్ని తండ్రి మధురాతి-మధురమైన పిల్లలూ! అని సంబోధిస్తారని తెలుసు. మీరు ఎంత తెలివైనవారిగా అవుతున్నారు. ఈ శరీరములో ఉన్న ఆత్మను పరమపిత పరమాత్మ కూర్చుని చదివిస్తున్నారని మనుష్యులెవ్వరికీ తెలియదు. ఇవి ఎంత అర్థము చేసుకోవలసిన విషయాలు. కానీ పిల్లలు వ్యాపారాలు మొదలైనవాటిలోకి వెళ్ళడంతో మర్చిపోతారు. మొట్టమొదట తండ్రి, మనుష్యమాత్రులు ఎవ్వరిలోనూ లేనటువంటి ఆత్మ జ్ఞానాన్ని ఇస్తారు. ఆత్మ-పరమాత్మ చాలాకాలము వేరుగా ఉన్నారని గాయనము కూడా ఉంది కదా..... లెక్క ఉంది కదా. ఆత్మనే శరీరము ద్వారా మాట్లాడుతుందని పిల్లలకు తెలుసు. ఆత్మనే శరీరము ద్వారా మంచి లేక చెడు కర్మలను చేస్తుంది. తండ్రి వచ్చి ఆత్మలను ఎంతో సుందరంగా చేస్తారు. మొట్టమొదట ఉదయమే లేచి ఆత్మ అంటే ఏమిటి, అది ఈ శరీరము ద్వారా ఎలా వింటుంది అని ఆలోచించండి. ఇదే అభ్యాసం చేయాలని తండ్రి చెప్తారు. ఆత్మల తండ్రి పరమపిత పరమాత్మ, వారినే పతితపావనుడు, జ్ఞానసాగరుడని అంటారు. మరి ఇతర మనుష్యులను సుఖసాగరుడు, శాంతిసాగరుడని ఎలా అనగలరు. లక్ష్మీనారాయణులను సదా పవిత్రతా సాగరులని అంటారా? లేదు. ఒక్క తండ్రి మాత్రమే సదా పవిత్రతాసాగరుడు. మనుష్యులు కేవలం భక్తిమార్గములోని శాస్త్రాలను కూర్చొని వర్ణన చేస్తారు. ప్రాక్టికల్ అనుభవము లేదు. ఆత్మలమైన మేము ఈ శరీరము ద్వారా తండ్రి మహిమను చేస్తున్నామని అనుకోరు. వారు మనకు అతిమధురమైన తండ్రి. వారే సుఖాన్నిచ్చేవారు. ఓ ఆత్మలూ! ఇప్పుడు నా మతముపై నడవండి అని తండ్రి చెప్తున్నారు. ఈ అవినాశీ ఆత్మకు, అవినాశీ తండ్రి ద్వారా అవినాశీ మతము లభిస్తుంది. ఆ వినాశీ శరీరధారులకు, వినాశీ శరీరధారుల మతమే లభిస్తుంది. సత్యయుగంలో మీరు ఇక్కడి ప్రారబ్ధాన్ని పొందుతారు. అక్కడ ఎప్పుడూ తప్పుడు మతమేదీ లభించదు. ఇప్పటి శ్రీమతమే అవినాశీగా అయి అర్థకల్పము నడుస్తుంది. ఇది కొత్త జ్ఞానము, దీనిని గ్రహించాలంటే ఎంత బుద్ధి కావాలి మరియు ఇది కర్మలోకి కూడా తీసుకురావాలి. ఎవరైతే ప్రారంభము నుండి చాలా భక్తి చేసి ఉంటారో వారే మంచి రీతిలో ధారణ చేయగలరు. మన బుద్ధిలో సరియైన పద్ధతిలో ధారణ జరగడం లేదంటే, తప్పకుండా ప్రారంభం నుండి మేము భక్తి చేయలేదు అని అర్థము చేసుకోవాలి. ఏదైనా అర్థమవ్వకపోతే బాబాను అడగండి, ఎందుకంటే వారు అవినాశీ సర్జన్. వారిని సుప్రీం సోల్ (పరమాత్మ) అని కూడా అంటారు. ఆత్మ పవిత్రంగా అయితే అప్పుడు దానికి మహిమ జరుగుతుంది. ఆత్మకు మహిమ ఉంటే శరీరానికి కూడా మహిమ జరుగుతుంది. ఆత్మ తమోప్రధానంగా ఉంటే శరీరానికి కూడా మహిమ ఉండదు. ఈ సమయంలో పిల్లలైన మీకు అత్యంత గుహ్యమైన బుద్ధి లభిస్తుంది. ఆత్మకే లభిస్తుంది. మరి ఆత్మ ఎంత మధురంగా అవ్వాలి. అందరికీ సుఖాన్నే ఇవ్వాలి. బాబా ఎంత మధురమైనవారు. ఆత్మలను కూడా చాలా మధురంగా చేస్తారు. ఆత్మ ఏ విధమైన అకర్తవ్య కార్యాలను చేయకుండా చూసుకోవాలి, ఈ అభ్యాసం చేయాలి. నా ద్వారా ఏ అకర్తవ్యమూ జరగడం లేదు కదా అని పరిశీలించుకోవాలి. శివబాబా ఎప్పుడైనా అకర్తవ్య కార్యము చేస్తారా? లేదు. వారు ఉన్నతోన్నతమైన కళ్యాణకారి కార్యమును చేసేందుకు వస్తారు. అందరికీ సద్గతినిస్తారు. మరి తండ్రి ఎటువంటి కర్తవ్యము చేస్తున్నారో, పిల్లలు కూడా అటువంటి కర్తవ్యమే చేయాలి. ఎవరైతే ప్రారంభము నుండి చాలా భక్తి చేసి ఉంటారో, వారి బుద్ధిలోనే ఈ జ్ఞానము నిలుస్తుంది అని కూడా అర్థం చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా దేవతలకు అనేకమంది భక్తులున్నారు. తమ శిరస్సును ఇచ్చేందుకు కూడా తయారై ఉంటారు. ఎక్కువ భక్తి చేసేవారి వెనుక తక్కువ భక్తి చేసేవారు వ్రేలాడుతూ ఉంటారు. వారి మహిమను పాడుతూ ఉంటారు. వారిదంతా స్థూలంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు గుప్తంగా ఉన్నారు. మీ బుద్ధిలో సృష్టి ఆదిమధ్యాంతాల పూర్తి జ్ఞానముంది. మమ్మల్ని చదివించేందుకు బాబా వచ్చారని కూడా పిల్లలకు తెలుసు. ఇప్పుడు మేము తిరిగి ఇంటికి వెళ్తాము. ఎక్కడికైతే ఆత్మలన్నీ వస్తాయో, అదే మన ఇల్లు. అక్కడ శరీరమే లేకపోతే శబ్దమెలా వస్తుంది. ఆత్మ లేకుండా శరీరము జడమైపోతుంది. మనుష్యులకు శరీరంపై ఎంత మోహముంటుంది! ఆత్మ శరీరము నుండి వెళ్ళిపోయిందంటే మిగిలేది పంచ తత్వాలు మాత్రమే, వాటిపై కూడా ఎంత మోహముంటుంది. స్త్రీ తన పతి యొక్క చితిపై కూర్చోవడానికి కూడా తయారైపోతుంది. శరీరముపై ఎంత మోహముంటుంది. ఇప్పుడు మీరు మొత్తం ప్రపంచము నుండి నిర్మోహులుగా అవ్వాలని అర్థం చేసుకున్నారు. ఈ శరీరమైతే సమాప్తమవ్వనున్నది. మరి దాని పట్ల మోహం తెగిపోవాలి కదా. అయినా చాలా మోహం ఉంటుంది. బ్రాహ్మణులకు తినిపిస్తారు. ఫలానా వారి శ్రాద్ధము అని గుర్తు తెచ్చుకుంటారు కదా. ఇప్పుడైతే వారు తినలేరు. పిల్లలైన మీరిప్పుడు ఈ విషయాల నుండి దూరమైపోవాలి. డ్రామాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయిస్తారు. ఈ సమయంలో మీకు జ్ఞానముంది, మనము నిర్మోహులుగా అవ్వాలి. మోహాన్ని జయించిన రాజు కథ కూడా ఉంది కదా, నిజానికి అటువంటి రాజులు ఇంకెవ్వరూ ఉండరు. ఇలా అనేక కథలను తయారుచేశారు. అక్కడ అకాల మృత్యువులు ఉండవు. కావున అడగవలసిన అవసరం కూడా లేదు. ఈ సమయంలో మిమ్మల్ని మోహజీతులుగా చేస్తారు. మోహాన్ని జయించిన రాజులు ఉండేవారు, యథా రాజా-రాణి తథా ప్రజా అందరూ అలా ఉండేవారు. అది నిర్మోహుల రాజధాని. రావణరాజ్యంలో మోహముంటుంది. అక్కడైతే వికారాలే ఉండవు, రావణ రాజ్యమే ఉండదు. రావణుని రాజ్యము వెళ్ళిపోతుంది. రామరాజ్యంలో ఏమవుతుందో, ఏ మాత్రమూ తెలియదు. తండ్రి తప్ప మరెవ్వరూ ఈ విషయాలను తెలుపలేరు. తండ్రి ఈ శరీరములో ఉంటూ కూడా ఆత్మాభిమానులుగా ఉన్నారు. అప్పుగా లేక అద్దెకు ఇల్లు తీసుకున్నా, దానిపై కూడా మోహముంటుంది. ఇంటిని బాగా అలంకరించుకుంటారు, కానీ ఇక్కడ తండ్రి అశరీరి అయినందుకు అలంకరించవలసిన అవసరం లేదు. వీరికి ఎటువంటి అలంకరణ చేసే అభ్యాసమే లేదు. అవినాశీ జ్ఞానరత్నాలతో పిల్లలను అలంకరించే అభ్యాసమే వీరికి ఉంది. సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తెలియజేస్తారు. శరీరము అపవిత్రమైనదే, వీరికి మరొక కొత్త శరీరము లభించినప్పుడే పవిత్రంగా ఉంటుంది. ఈ సమయంలో ఇది పాత ప్రపంచము, ఇది సమాప్తమైపోతుంది. ఇది కూడా ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. నెమ్మది-నెమ్మదిగా అర్థమవుతుంది. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము - ఈ కర్తవ్యము తండ్రిదే. తండ్రే స్వయంగా వచ్చి బ్రహ్మా ద్వారా ప్రజలను రచించి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. మీరు కొత్త ప్రపంచంలో ఉన్నారా? లేదు, కొత్త ప్రపంచము స్థాపనవుతుంది. బ్రాహ్మణుల పిలకను కూడా ఉన్నతంగా చూపిస్తారు. బాబా సన్ముఖములోకి వచ్చినప్పుడు మేము ఈశ్వరుడైన తండ్రి సన్ముఖములోకి వెళ్తున్నామని భావించండి అని బాబా అర్థం చేయించారు. శివబాబా నిరాకారుడు. వారి సన్ముఖములోకి మనమెలా వెళ్ళగలము. కావున ఆ తండ్రిని స్మృతి చేసి తర్వాత ఈ తండ్రి సన్ముఖములోకి రావాలి. వారు వీరిలో కూర్చున్నారని మీకు తెలుసు. ఈ శరీరము పతితమైనది. శివబాబా స్మృతిలో లేకుండా ఏ పనైనా చేసినట్లయితే అది పాపము అవుతుంది. మనము శివబాబా వద్దకు వెళ్తాము. మరుసటి జన్మలో ఇతర సంబంధీకులుంటారు. అక్కడ దేవతల ఒడిలోకి వెళ్తారు. ఈ ఈశ్వరీయ ఒడి ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. బాబా, మేము మీకు చెందినవారిగా అయిపోయామని నోటి ద్వారా చెప్తారు. అనేకమంది బాబాను చూడలేదు కూడా. బయట ఉంటారు, శివబాబా, మేము మీ ఒడిలోని పిల్లలమైపోయాము అని వ్రాస్తారు. బుద్ధిలో జ్ఞానముంది. మేము శివబాబాకు చెందినవారిగా అయ్యామని ఆత్మ చెప్తుంది. దీనికి ముందు మేము పతితుల ఒడిలో ఉండేవారము. భవిష్యత్తులో పవిత్ర దేవతల ఒడిలోకి వెళ్తాము. ఈ జన్మ దుర్లభమైనది. ఈ సంగమయుగంలో మీరు వజ్రసమానంగా అవుతారు. ఆ నీటి సాగరము మరియు నదుల సంగమాన్ని సంగమయుగమని అనడం జరగదు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. బ్రహ్మపుత్ర అన్నిటికంటే పెద్ద నది, అది సాగరంలో కలుస్తుంది. నదులు వెళ్ళి సాగరంలో కలుస్తాయి. మీరు కూడా సాగరము నుండి వెలువడిన జ్ఞాన నదులు. జ్ఞానసాగరుడు శివబాబా. అన్నిటికంటే పెద్ద నది బ్రహ్మపుత్ర. వీరి పేరు బ్రహ్మా. సాగరముతో వీరు ఎంత బాగా కలుస్తారు. నదులు ఎక్కడ నుండి వెలువడుతాయో మీకు తెలుసు. సాగరము నుండే వెలువడి, మళ్ళీ సాగరములోనే కలుస్తాయి. సాగరము నుండి తీయని నీటిని తీస్తారు. సాగరుని పిల్లలు తిరిగి సాగరములోకే వెళ్ళి కలుస్తారు. మీరు కూడా జ్ఞానసాగరము నుండే వెలువడ్డారు, తిరిగి అందరూ అక్కడికే వెళ్ళిపోతారు. వారు ఎక్కడ ఉంటారో, ఆత్మలైన మీరు కూడా అక్కడే ఉంటారు. జ్ఞానసాగరుడు వచ్చి మిమ్మల్ని పవిత్రంగా, మధురంగా తయారుచేస్తారు. ఉప్పగా అయిపోయిన ఆత్మను తీయగా తయారుచేస్తారు. పంచ వికారాలనే ఛీ-ఛీ ఉప్పు మీ నుండి తొలగిపోతుంది, అప్పుడు మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు. తండ్రి చాలా పురుషార్థము చేయిస్తారు. మీరు చాలా సతోప్రధానంగా ఉండేవారు, స్వర్గములో ఉండేవారు. మీరు పూర్తిగా ఛీ-ఛీగా అయిపోయారు. రావణుడు మిమ్మల్ని ఎలా తయారుచేశాడు! భారతదేశములోనే వజ్ర సమాన అమూల్యమైన జన్మ అని మహిమ చేస్తారు.

మీరు గవ్వల వెనుక ఎందుకు పరుగెడతారు అని బాబా అంటూ ఉంటారు. ఈ గవ్వలు కూడా అంత ఎక్కువగా అవసరం లేదు. పేదవారు వెంటనే అర్థము చేసుకుంటారు. మాకు ఇక్కడే స్వర్గముందని ధనవంతులు అంటారు. ఈ సమయంలో ఉన్న మనుష్యమాత్రులందరిదీ గవ్వ సమానమైన జన్మ అని పిల్లలైన మీకు తెలుసు. మేము కూడా అలాగే ఉండేవారము. ఇప్పుడు బాబా మనల్ని ఎలా తయారుచేస్తున్నారు. లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది కదా. మనము నరుని నుండి నారాయణునిగా అవుతాము. భారతదేశము ఇప్పుడు గవ్వ సమానంగా నిరుపేదగా ఉంది కదా. భారతవాసులకు ఈ విషయాలేవీ తెలియవు. ఇక్కడ మీరు ఎంత సాధారణమైన అబలలుగా ఉన్నారు. ఎవరైనా గొప్ప వ్యక్తులు ఉంటే వారు ఇక్కడ కూర్చునేందుకు ఇష్టపడరు. ఎక్కడైతే పెద్ద-పెద్ద వ్యక్తులు, సన్యాసులు, గురువులు మొదలైనవారు ఉంటారో, అటువంటి పెద్ద సభలకు వెళ్తారు. నేను పేదల పెన్నిధిని అని తండ్రి కూడా చెప్తారు. భగవంతుడు పేదలను రక్షిస్తారని చెప్తారు. మనము ఎంత ధనవంతులుగా ఉండేవారమో ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ అలా అవుతాము. మీరు పదమాపదమ పతులుగా అవుతారని బాబా వ్రాస్తారు కూడా. అక్కడ యుద్ధాలు జరగవు. ఇక్కడ ధనము కొరకు ఎంత గొడవ జరుగుతుందో చూడండి. ఎంత లంచం లభిస్తూ ఉంటుంది. మనుష్యులకు ధనము కావాలి కదా. బాబా మన ఖజానా నింపుతారని పిల్లలైన మీకు తెలుసు. అర్థకల్పము కొరకు ఎంత కావాలో అంత తీసుకోండి, కానీ పూర్తి పురుషార్థము చేయండి. పొరపాట్లు చేయకండి. తండ్రిని అనుసరించండి అని చెప్పడం జరుగుతుంది. తండ్రిని అనుసరిస్తే మళ్ళీ ఈ విధంగా అవుతారు. నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవ్వడం చాలా పెద్ద పరీక్ష. ఇందులో కొద్దిగా కూడా పొరపాటు చేయకూడదు. తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు కావున దానిపై నడుచుకోవాలి. నియమాలను, చట్టాలను ఉల్లంఘించకూడదు. శ్రీమతము ద్వారానే మీరు శ్రీ (శ్రేష్ఠము)గా అవుతారు. లక్ష్యము చాలా గొప్పది. ప్రతి రోజూ మీ ఖాతాను వ్రాసుకోండి. సంపాదన చేస్తున్నానా లేక నష్టపోతున్నానా? తండ్రిని ఎంత స్మృతి చేశాను? ఎంతమందికి మార్గాన్ని తెలియజేశాను? మీరు అంధులకు చేతికర్ర వంటివారు కదా. మీకు జ్ఞానపు మూడవ నేత్రము లభిస్తుంది. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎలాగైతే తండ్రి మధురమైనవారో, అలా మీరు కూడా మధురంగా అయి అందరికీ సుఖాన్నివ్వాలి. ఎటువంటి అకర్తవ్య కార్యము చేయకూడదు. ఉన్నతోన్నతమైన కళ్యాణకారి కార్యమునే చేయాలి.

2. గవ్వల వెనుక పడకూడదు. పురుషార్థము చేసి తమ జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకోవాలి. ఏ పొరపాటు చేయకూడదు.

వరదానము:-

ఛాలెంజ్ మరియు ప్రాక్టికల్ లో సమానత ద్వారా స్వయాన్ని పాపాల నుండి సురక్షితంగా ఉంచుకునే విశ్వసేవాధారీ భవ

పిల్లలైన మీరు ఏదైతే ఛాలెంజ్ చేస్తారో, ఆ ఛాలెంజ్ మరియు ప్రాక్టికల్ జీవితంలో సమానత ఉండాలి, లేకపోతే పుణ్యాత్మకు బదులుగా భారము ఉండే ఆత్మగా అవుతారు. ఈ పాప పుణ్యాల గతిని తెలుసుకొని స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోండి, ఎందుకంటే సంకల్పంలో అయినా సరే, ఎదో ఒక వికారము యొక్క బలహీనత, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన భావనలు, ద్వేషము లేక ఈర్ష్య యొక్క భావనలు, ఇవి పాప ఖాతాను పెంచుతాయి, అందువలన 'పుణ్యాత్మ భవ' అనే వరదానము ద్వారా స్వయాన్ని సురక్షితంగా ఉంచుకొని విశ్వ సేవాధారులుగా అవ్వండి. సంగఠిత రూపంలో ఏకమతాన్ని, ఏకరస స్థితిని అనుభవం చేయించండి.

స్లోగన్:-

పవిత్రతా దీపాన్ని నలువైపులా వెలిగిస్తే, తండ్రిని సహజంగా చూడగలరు.