26-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - బాబా మిమ్మల్ని కింగ్ ఆఫ్ ఫ్లవర్ (పుష్పాలరాజు)గా తయారుచేసేందుకు వచ్చారు, కనుక వికారాల దుర్గంధమేదీ ఉండకూడదు”

ప్రశ్న:-

వికారాల అంశమును కూడా సమాప్తము చేసేందుకు ఎటువంటి పురుషార్థము చేయాలి?

జవాబు:-

నిరంతరం అంతర్ముఖులుగా ఉండే పురుషార్థము చేయండి. అంతర్ముఖత అంటే క్షణములో శరీరం నుండి అతీతంగా అవ్వడం. ఈ ప్రపంచపు స్మృతులను పూర్తిగా మర్చిపోవాలి. ఒక్క క్షణములో పైకి వెళ్ళి కిందకు రావాలి. ఈ అభ్యాసము ద్వారా వికారాల అంశం సమాప్తమైపోతుంది. కర్మలు చేస్తూ-చేస్తూ మధ్య-మధ్యలో అంతర్ముఖులుగా అవ్వండి, పూర్తిగా నిశ్శబ్దము ఏర్పడినట్లుగా ఉండాలి. ఎటువంటి కదలికలూ ఉండకూడదు. ఈ సృష్టి అసలు లేనే లేదు అన్నట్లుగా ఉండాలి.

ఓంశాంతి. మీరు అశరీరులుగా అయి తండ్రి స్మృతిలో కూర్చోండి మరియు దానితో పాటు సృష్టి చక్రాన్ని కూడా స్మృతి చేయండి అని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టడం జరుగుతుంది. మనుష్యులు 84 జన్మల చక్రాన్ని అర్థము చేసుకోరు. వారికి అర్థమే కాదు. ఎవరైతే 84 జన్మల చక్రములో తిరుగుతారో వారే అర్థము చేసుకునేందుకు వస్తారు. మీరు దీనినే స్మృతి చేయాలి, దీనిని స్వదర్శన చక్రమని అంటారు, దీని ద్వారా ఆసురీ ఆలోచనలు సమాప్తమైపోతాయి. అంతేకానీ ఇక్కడెవరో అసురులు కూర్చున్నారు, దీనితో వారి కంఠం తెగిపోతుంది అని కాదు. మనుష్యులు స్వదర్శన చక్రం యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోరు. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఇక్కడ లభిస్తుంది. కమలపుష్ప సమానంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వండి. భగవానువాచ కదా. మీరు ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వడం వలన భవిష్య 21 జన్మలకు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. సత్యయుగాన్ని శివాలయమని అంటారు. కలియుగాన్ని వేశ్యాలయమని అంటారు. ఈ ప్రపంచము మారుతుంది. ఇది భారత్ కు సంబంధించిన విషయమే. ఇతరుల విషయాలలోకి వెళ్ళవలసిన అవసరమే లేదు. జంతువులకు ఏమౌతుంది? ఇతర ధర్మాలు ఏమౌతాయి? అని కొందరు అడుగుతారు. మొదట స్వయం గురించి తెలుసుకోండి, తర్వాత ఇతరుల విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పండి. భారతవాసీయులే తమ ధర్మాన్ని మర్చిపోయి దుఃఖితులైపోయారు. భారత్ లోనే నీవే తల్లివి-తండ్రివి...... అని పిలుస్తారు. విదేశాలలో తల్లి-తండ్రి అనే పదాలే వాడరు. వారు కేవలం గాడ్ ఫాదర్ అని అంటారు. కేవలం భారత్ లోనే అపారమైన సుఖముండేది, భారత్ స్వర్గంగా ఉండేది అని కూడా మీకు తెలుసు. తండ్రి వచ్చి ముళ్ళను పుష్పాలుగా చేస్తారు. తండ్రిని తోటయజమాని అని అంటారు. మీరు వచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారుచేయండి అని పిలుస్తారు. తండ్రి పుష్పాలతోటను తయారుచేస్తారు. మాయ మళ్ళీ ముళ్ళ అడవిగా చేస్తుంది. ఈశ్వరా, నీ మాయ చాలా శక్తివంతమైనదని మనుష్యులంటారు. ఈశ్వరుడిని గాని, మాయను గాని అర్థము చేసుకోరు. ఎవరో ఏవో పదాలు చెప్తే, వాటిని కేవలం రిపీట్ చేస్తూ ఉంటారు. అర్థమేమీ తెలియదు. ఇది డ్రామాలో రామరాజ్యం మరియు రావణరాజ్యం యొక్క ఆట అని పిల్లలైన మీకు తెలుసు. రామరాజ్యములో సుఖము, రావణరాజ్యములో దుఃఖము ఉంటుంది. ఇది ఇక్కడి విషయమే. ఇదేమీ ప్రభువు యొక్క మాయ కాదు. పంచ వికారాలను మాయ అని అనడం జరుగుతుంది, వాటినే రావణుడని అంటారు. మనుష్యులైతే పునర్జన్మలను తీసుకుంటూ 84 జన్మల చక్రములోకి వస్తారు. సతోగుణము నుండి తమోప్రధానంగా అవ్వాలి. ఈ సమయంలో అందరూ వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు కావున వికారులు అని అంటారు. దీని పేరే వికారి ప్రపంచము, తర్వాత నిర్వికారి ప్రపంచముగా అంటే పాత ప్రపంచము నుండి కొత్తదిగా ఎలా అవుతుంది - ఇది అర్థము చేసుకునే సాధారణమైన విషయము. కొత్త ప్రపంచములో మొదట స్వర్గముండేది. స్వర్గాన్ని స్థాపన చేసేవారు పరమపిత పరమాత్మ అని పిల్లలకు తెలుసు, అందులో అపారమైన సుఖముంటుంది. జ్ఞానము ద్వారా పగలు, భక్తి ద్వారా రాత్రి ఎలా అవుతుంది - ఇది కూడా ఎవరూ అర్థము చేసుకోరు. బ్రహ్మా మరియు బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణుల పగలు అని అంటారు, తర్వాత అదే బ్రాహ్మణుల రాత్రి ఏర్పడుతుంది. రాత్రి మరియు పగలు ఇక్కడే ఉంటాయి, ఇది ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మా యొక్క రాత్రి అంటే తప్పకుండా బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులకు కూడా రాత్రి అవుతుంది. అర్థకల్పము పగలు, అర్థకల్పము రాత్రి.

ఇప్పుడు తండ్రి నిర్వికారి ప్రపంచాన్ని తయారుచేసేందుకు వచ్చారు. పిల్లలూ, కామము మహాశత్రువు, దానిపై విజయం పొందాలి అని తండ్రి చెప్తున్నారు. సంపూర్ణ నిర్వికారులుగా, పవిత్రంగా అవ్వాలి. అపవిత్రంగా అవ్వడం వలన మీరు ఎన్నో పాపాలు చేశారు. ఇది పాపాత్ముల ప్రపంచము. పాపము తప్పకుండా శరీరముతోనే చేస్తారు, అప్పుడే పాపాత్ములుగా అవుతారు. దేవతల పవిత్ర ప్రపంచములో పాపం జరగదు. ఇక్కడ మీరు శ్రీమతము ద్వారా శ్రేష్ఠ పుణ్యాత్ములుగా అవుతున్నారు. శ్రీ శ్రీ 108 మాల ఉంది. పైన పుష్పముంటుంది, దాన్ని శివ అని అంటారు. అది నిరాకారి పుష్పము. తర్వాత సాకారంలో స్త్రీ-పురుషులున్నారు, వారి మాల తయారై ఉంది. శివబాబా ద్వారా వీరు పూజ్యులుగా, స్మరణకు యోగ్యులుగా అవుతారు. బాబా మనల్ని విజయమాలలో మణిగా చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. మనము స్మృతి బలము ద్వారా విశ్వముపై విజయము పొందుతున్నాము, స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమౌతాయి. మళ్ళీ మీరు సతోప్రధానంగా అయిపోతారు. వారైతే అర్థము చేసుకోకుండానే, ప్రభూ నీ మాయ ప్రబలమైనది అని అనేస్తారు. ఎవరి వద్దనైనా ధనముంటే, వీరి వద్ద మాయ చాలా ఉందని అంటారు. వాస్తవానికి పంచ వికారాలను మాయ అంటారు, వీటిని రావణుడని కూడా అంటారు. వారేమో 10 తలల రావణుడి చిత్రాన్ని తయారుచేసారు. ఇప్పుడు చిత్రముంది కనుక అర్థం చేయించడం జరుగుతుంది. అంగదుని గురించి కూడా చూపిస్తారు, రావణుడు అతన్ని కదిలించాలనుకున్నా కదిలించలేకపోయాడు. ఉదాహరణలను తయారుచేశారు. అంతేకానీ అటువంటిదేమీ లేదు. మాయ మిమ్మల్ని ఎంతగా కదిలించినా కానీ మీరు స్థిరంగా ఉండండి అని తండ్రి చెప్తున్నారు. రావణుడు, హనుమంతుడు, అంగదుడు మొదలైన ఉదాహరణలన్నీ తయారుచేశారు, వాటి అర్థము పిల్లలైన మీకు తెలుసు. భ్రమరి ఉదాహరణ కూడా ఉంది. భ్రమరి మరియు బ్రాహ్మణి యొక్క రాశి కలుస్తుంది. మీరు పేడ పురుగులను జ్ఞాన-యోగాల భూ-భూ చేసి పతితం నుండి పావనంగా తయారుచేస్తారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా అయిపోతారు. తాబేలు ఉదాహరణ కూడా ఉంది. ఇంద్రియాలను ఇముడ్చుకొని అంతర్ముఖిగా అయి కూర్చుంటుంది. కర్మలు చేయండి, తర్వాత అంతర్ముఖులుగా అయిపోండి అని మీకు కూడా తండ్రి చెప్తున్నారు. ఈ సృష్టి అసలు లేనట్లుగా అనిపించాలి. కదలికలు ఆగిపోతాయి. భక్తిమార్గంలో బాహ్యముఖులుగా అయిపోతారు. పాటలు పాడటం, అవి-ఇవి చేయడం, ఎన్ని హంగామాలు, ఎంత ఖర్చు అవుతుంది. ఎన్ని మేళాలు జరుగుతాయి. వీటన్నిటినీ వదిలి అంతర్ముఖులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. ఈ సృష్టి అసలు లేనట్లుగా అనిపించాలి. నేను యోగ్యుడిగా అయ్యానా? నన్ను ఏ వికారమూ సతాయించడం లేదు కదా? నేను తండ్రిని స్మృతి చేస్తున్నానా? అని స్వయాన్ని చూసుకోవాలి. ఏ తండ్రైతే విశ్వానికి యజమానులుగా చేస్తున్నారో, అటువంటి తండ్రిని రాత్రి-పగలు స్మృతి చేయాలి. మేము ఆత్మలము, వారు మాకు తండ్రి. మేమిప్పుడు కొత్త ప్రపంచం యొక్క పుష్పాలుగా అవుతున్నామని లోపల భావిస్తూ ఉండాలి. జిల్లేడు పుష్పంగా లేక విషపూరితమైన పుష్పంగా అవ్వకూడదు. మేమైతే కింగ్ ఆఫ్ ఫ్లవర్ (పుష్పాలరాజు)గా, పూర్తిగా సుగంధభరితంగా అవ్వాలి. ఎటువంటి దుర్గంధము ఉండకూడదు. చెడు ఆలోచనలు తొలగిపోవాలి. కిందకు పడేసేందుకు మాయా తుఫాన్లు చాలా వస్తాయి. కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మ చేయకూడదు. ఈ విధంగా స్వయాన్ని పక్కా చేసుకోవాలి. స్వయాన్ని సరిదిద్దుకోవాలి. నేను ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి, శరీర నిర్వహణార్థం కర్మలు కూడా చేయండి అని తండ్రి చెప్తున్నారు. అందులో నుండి కూడా సమయాన్ని తీయవచ్చు. భోజనము తినే సమయంలో కూడా తండ్రిని మహిమ చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేస్తూ తినడంతో భోజనము కూడా పవిత్రంగా అయిపోతుంది. తండ్రిని నిరంతరము స్మృతి చేసినప్పుడు ఆ స్మృతితోనే అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి మరియు మీరు సతోప్రధానంగా అయిపోతారు. నేను ఎంతవరకు సత్యమైన బంగారంగా అయ్యాను? ఈ రోజు ఎన్ని గంటలు స్మృతిలో ఉన్నాను? అని చూసుకోవాలి. నిన్న 3 గంటలు స్మృతిలో ఉన్నాను, ఈ రోజు 2 గంటలు ఉన్నాను - అంటే ఈ రోజు నష్టం ఏర్పడినట్లు అవుతుంది. దిగడము మరియు ఎక్కడము జరుగుతూనే ఉంటుంది. యాత్రలకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు పైకి, కొన్నిసార్లు కిందకు రావడం జరుగుతుంది. మీ స్థితి కూడా హెచ్చు-తగ్గులు అవుతూనే ఉంటుంది. మీ ఖాతాను చూసుకోవాలి. ముఖ్యమైనది స్మృతియాత్ర.

భగవానువాచ అయినప్పుడు వారు తప్పకుండా పిల్లలనే చదివిస్తారు, మొత్తం ప్రపంచాన్ని ఎలా చదివిస్తారు. ఇప్పుడు భగవంతుడు అని ఎవరిని అనాలి? కృష్ణుడైతే శరీరధారి. నిరాకార పరమపిత పరమాత్ముడినే భగవంతుడు అని అంటారు. నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను అని స్వయంగా చెప్తున్నారు. బ్రహ్మాకు కూడా వృద్ధ శరీరము ఉందని గాయనము చేయబడింది. తెల్ల గడ్డం, మీసాలు వృద్ధులకే ఉంటాయి కదా. తప్పకుండా అనుభవీ రథమే కావాలి. చిన్న రథములో అయితే ప్రవేశించరు కదా. నా గురించి ఎవ్వరికీ తెలియదని వారు స్వయంగా చెప్తున్నారు. వారు సుప్రీమ్ గాడ్ ఫాదర్ లేదా పరమ ఆత్మ. మీరు కూడా 100 శాతం పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు 100 శాతం అపవిత్రంగా అయ్యారు. సత్యయుగంలో 100 శాతం పవిత్రత ఉండేది, అప్పుడు సుఖం మరియు సంపద కూడా ఉండేవి. ముఖ్యమైనది పవిత్రత. పవిత్రంగా ఉన్నవారికి అపవిత్రంగా ఉన్నవారు తల వంచి నమస్కరించడము, వారి మహిమను చేయడమును చూస్తారు కదా. సన్యాసుల ఎదుట ఎప్పుడూ, మీరు సర్వగుణ సంపన్నులు.... మేము పాపులము, నీచులము అని అనరు. దేవతల ఎదురుగా ఆ విధంగా అంటారు. కుమారీకి అందరూ నమస్కరిస్తారు, తర్వాత వివాహము అవ్వగానే ఆమె అందరి ఎదుట తల వంచి నమస్కరిస్తుంది ఎందుకంటే వికారిగా అయిపోతుంది కదా అని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు మీరు నిర్వికారులుగా అయినట్లయితే అర్థకల్పము నిర్వికారులుగా ఉంటారు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడిక పంచ వికారాల రాజ్యమే సమాప్తమైపోతుంది. ఇది మృత్యులోకము, అది అమరలోకము. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రము లభిస్తుంది. దానిని తండ్రియే ఇస్తారు. తిలకము కూడా మస్తకంపై దిద్దుతారు. ఇప్పుడు ఆత్మకు జ్ఞానము లభిస్తోంది, దేని కోసం? మీకు మీరే రాజ్య తిలకాన్నిచ్చుకోండి. బ్యారిష్టరీ చదువుకున్నప్పుడు, చదువుకుని స్వయానికి స్వయమే బ్యారిష్టరుగా అయ్యే తిలకాన్నిచ్చుకుంటారు. చదువుకుంటే తిలకం లభిస్తుంది, ఆశీర్వాదముతో లభించదు. ఒకవేళ టీచరు అందరిపై కృప చూపించినట్లయితే అందరూ పాస్ అయిపోతారు. పిల్లలు స్వయానికి స్వయమే రాజ్యతిలకాన్నిచ్చుకోవాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమౌతాయి మరియు చక్రమును స్మృతి చేసినట్లయితే చక్రవర్తీ మహారాజుగా అయిపోతారు. మిమ్మల్ని రాజులకే రాజుగా చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. దేవీ-దేవతలు డబల్ కిరీటధారులుగా అవుతారు. పతిత రాజులు కూడా వారిని పూజిస్తారు. మిమ్మల్ని పూజారి రాజుల కన్నా ఉన్నతంగా తయారుచేస్తారు. ఎవరైతే చాలా దాన-పుణ్యాలు చేస్తారో, వారు రాజుల వద్ద జన్మ తీసుకుంటారు ఎందుకంటే వారు మంచి కర్మలు చేశారు. మీకిప్పుడు ఇక్కడ అవినాశీ జ్ఞాన ధనము లభించింది, దానిని ధారణ చేసి, తర్వాత దానము చేయాలి. ఇది సంపాదనకు ఆధారం. టీచరు కూడా విద్యను దానము చేస్తారు. ఆ చదువు అల్పకాలము కోసం. విదేశాలలో చదువుకుని వస్తారు, రాగానే హార్ట్ ఫెయిల్ అయినట్లయితే చదువు సమాప్తమైపోతుంది. వినాశీగా అయిపోయింది కదా. శ్రమంతా వృధా అయిపోతుంది. మీ శ్రమ ఆ విధంగా వృధా కాదు. మీరు ఎంత బాగా చదువుకుంటారో అంతగా 21 జన్మలకు మీ చదువు స్థిరంగా ఉంటుంది. అక్కడ అకాల మృత్యువులు జరగవు. ఈ చదువును మీతోపాటు తీసుకువెళ్తారు.

ఇప్పుడు తండ్రి ఏ విధంగా కళ్యాణకారియో, పిల్లలైన మీరు కూడా అదే విధంగా కళ్యాణకారులుగా అవ్వాలి. అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. బాబా చాలా మంచి సలహాలనిస్తారు. సర్వ శ్రేష్ఠ శిరోమణి శ్రీమద్భగవద్గీతకు ఇంత మహిమ ఎందుకుంది అన్న ఒకే విషయాన్ని అర్థం చేయించండి. భగవంతునిదే శ్రేష్ఠమైన మతము. ఇప్పుడు భగవంతుడు అని ఎవరిని అనాలి? భగవంతుడైతే ఒక్కరే ఉంటారు. వారు నిరాకారుడు, ఆత్మలందరికీ తండ్రి, అందుకే పరస్పరములో సోదరులు అని అంటారు, తర్వాత బ్రహ్మా ద్వారా కొత్త సృష్టి రచించినప్పుడు సోదరీ-సోదరులుగా అవుతారు. ఈ సమయంలో మీరు సోదరీ-సోదరులు కనుక పవిత్రంగా ఉండాల్సి వస్తుంది. ఇది యుక్తి. వికారీ దృష్టి పూర్తిగా తొలగిపోవాలి. నా కళ్ళు ఎక్కడా మత్తు ఎక్కినట్లుగా అవ్వలేదు కదా అని సంభాళించుకోవాలి. బజారులో శెనగలు చూసి మనసు వెళ్ళలేదు కదా? ఇలా ఎంతో మందికి తినాలని మనసు కలుగుతుంది, తర్వాత తినేస్తారు కూడా. బ్రాహ్మణి ఎవరైనా సోదరునితో పాటు వెళ్ళినప్పుడు శెనగలు తింటారా అని వారు అడగగానే, ఒక్కసారి తింటే పాపమేమీ తగలదు అని అనుకుంటారు. ఎవరైతే అపరిపక్వంగా ఉంటారో, వారు వెంటనే తినేస్తారు. దీనిని గురించి శాస్త్రాలలో కూడా అర్జునుని ఉదాహరణ ఉంది. ఈ కథలను కూర్చుని తయారుచేశారు. మిగిలినవన్నీ ఈ సమయములోని విషయాలే.

మీరందరూ సీతలే. ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయని తండ్రి మీకు చెప్తున్నారు. ఇంకే విషయాలూ లేవు. రావణుడు ఒక మనిషి కాదని మీకిప్పుడు తెలుసు. ఈ వికారాలు ప్రవేశించినప్పుడు రావణ సంప్రదాయానికి చెందినవారని అంటారు. ఎవరైనా అటువంటి పనులు చేస్తే మీరు అసురులని అంటారు. నడవడిక అసురుల వలె ఉంటుంది. వికారీగా ఉన్న పిల్లలను మీరు కుల కళంకితులుగా అవుతారు అని అంటారు. మిమ్మల్ని నేను నలుపు నుండి సుందరంగా చేస్తాను, మీరు మళ్ళీ నల్ల ముఖము చేసుకుంటారు అని అనంతమైన తండ్రి చెప్తున్నారు. ప్రతిజ్ఞ చేసి వికారీగా అయిపోతారు. చాలా నల్లగా అయిపోతారు, అందుకే రాతిబుద్ధి అని అంటారు. ఇప్పుడు మీరు మళ్ళీ పారసబుద్ధి కలవారిగా అవుతారు. ఇప్పుడు మీది ఎక్కే కళ. తండ్రిని గుర్తిస్తారు మరియు విశ్వానికి యజమానిగా అవుతారు. సంశయం యొక్క విషయం ఉండదు. తండ్రి స్వర్గ రచయిత. కనుక తప్పకుండా పిల్లల కోసం స్వర్గాన్ని బహుమతిగా తీసుకొస్తారు కదా. శివజయంతిని కూడా జరుపుకుంటారు - ఏం చేస్తూ ఉండవచ్చు? వ్రతాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. వాస్తవానికి వికారాల వ్రతం పెట్టుకోవాలి. వికారాలలోకి వెళ్ళకూడదు. దీని ద్వారానే మీరు ఆదిమధ్యాంతాలు దుఃఖము పొందారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి. పాత ప్రపంచ వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. మీరే చూస్తారు, భారత్ లో 9 లక్షల మంది మాత్రమే మిగులుతారు, తర్వాత శాంతి ఏర్పడుతుంది. ఘర్షణ జరిగేందుకు ఇతర ధర్మాలేవీ ఉండవు. ఒక్క ధర్మ స్థాపన జరుగుతుంది, మిగిలిన అనేక ధర్మాలు వినాశనమైపోతాయి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అవినాశీ జ్ఞాన ధనాన్ని స్వయంలో ధారణ చేసి, తర్వాత ఇతరులకు దానం చేయాలి. చదువు ద్వారా స్వయానికి స్వయమే రాజ్యతిలకాన్నిచ్చుకోవాలి. తండ్రి ఏ విధంగా కళ్యాణకారియో, అదే విధంగా కళ్యాణకారిగా అవ్వాలి.

2. ఆహార-పానీయాల విషయంలో పూర్తి పథ్యం పాటించాలి. కళ్ళు ఎప్పుడూ మోసగించకుండా సంభాళించుకోవాలి. స్వయాన్ని సరిదిద్దుకోవాలి. కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మ చేయకూడదు.

వరదానము:-

బీజరూప స్థితి ద్వారా మొత్తం విశ్వానికి లైట్ యొక్క నీటినిచ్చే విశ్వకళ్యాణకారీ భవ

బీజరూప స్థితి అన్నిటికన్నా శక్తిశాలి స్థితి, ఈ స్థితి లైట్ హౌస్ లా పని చేస్తుంది, దీని ద్వారా మొత్తం విశ్వంలో లైట్ వ్యాపింపజేసేందుకు నిమిత్తంగా అవుతారు. ఏ విధంగా బీజము ద్వారా స్వతహాగానే మొత్తం వృక్షానికి నీరు లభిస్తుందో, అదే విధంగా బీజరూప స్థితిలో స్థితి అయి ఉన్నప్పుడు విశ్వానికి లైట్ యొక్క నీరు లభిస్తుంది. కానీ, మొత్తం విశ్వం వరకు తమ లైట్ వ్యాపింపజేసేందుకు విశ్వకళ్యాణకారి యొక్క శక్తిశాలీ స్థితి కావాలి. దీనికోసం లైట్ హౌస్ గా అవ్వండి, బల్బుగా అవ్వకండి. ప్రతి సంకల్పంలో మొత్తం విశ్వానికి కళ్యాణము జరగాలి అనే స్మృతి ఉండాలి.

స్లోగన్:-

అడ్జస్ట్ అయ్యే శక్తి నాజూకు సమయంలో పాస్ విత్ హానర్ గా చేస్తుంది.