05-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - ఈ పురుషోత్తమ సంగమయుగం కళ్యాణకారీ యుగము, ఇందులోనే మీరు చదువు ద్వారా శ్రీకృష్ణపురికి యజమానులుగా అవ్వాలి”

ప్రశ్న:-

తండ్రి మాతలపై జ్ఞాన కలశాన్ని ఎందుకు పెడతారు? ఏ ఒక్క ఆచారము భారత్ లోనే నడుస్తుంది?

జవాబు:-

పవిత్రతా రాఖీని కట్టి అందరినీ పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి మాతలపైనే జ్ఞాన కలశము పెడతారు. రక్షాబంధనం పద్ధతి కూడా భారత్ లోనే ఉంది. సోదరి, సోదరునికి రాఖీ కడుతుంది. ఇది పవిత్రతకు గుర్తు. పిల్లలూ, మీరు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు.

గీతము:-

భోళానాథుని కన్నా అతీతమైన వారు ఎవరూ లేరు..... ( భోళానాథ్ సే నిరాలా.....)

ఓంశాంతి. ఇది భోళానాథుని మహిమ, వారిని ఇచ్చేవారు అని అంటారు. శ్రీ లక్ష్మీ-నారాయణులకు ఈ రాజ్యభాగ్యాన్ని ఎవరు ఇచ్చారో పిల్లలైన మీకు తెలుసు. తప్పకుండా భగవంతుడే ఇచ్చి ఉంటారు ఎందుకంటే వారే స్వర్గ స్థాపన చేస్తారు. భోళానాథుడు లక్ష్మీ-నారాయణులకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఏ విధంగా ఇచ్చారో, అదే విధంగా కృష్ణుడికి ఇచ్చారు. రాధా-కృష్ణులు అన్నా లేక లక్ష్మీ-నారాయణులు అన్నా విషయము ఒక్కటే. కానీ రాజధాని లేదు. వారికి పరమపిత పరమాత్మ తప్ప ఎవ్వరూ రాజ్యాన్నివ్వలేరు. వారి జన్మ స్వర్గములోనే జరుగుతుంది. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. పిల్లలైన మీరే జన్మాష్టమి సందర్భంలో అర్థం చేయిస్తారు. కృష్ణ జన్మాష్టమి ఉంటే రాధకు కూడా ఉండాలి, ఎందుకంటే ఇరువురూ స్వర్గవాసులే. రాధా-కృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఈ రాజ్యాన్ని వారికి ఎవరిచ్చారు అన్నదే ముఖ్యమైన విషయము. ఈ రాజయోగాన్ని ఎప్పుడు మరియు ఎవరు నేర్పించారు? స్వర్గములోనైతే నేర్పించి ఉండరు. సత్యయుగములోనైతే ఉత్తమమైన పురుషులే ఉంటారు. కలియుగం తర్వాత సత్యయుగము వస్తుంది. కనుక తప్పకుండా కలియుగాంతములో రాజయోగాన్ని నేర్చుకుని ఉంటారు. ఆ తర్వాత కొత్త జన్మలో రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. పాత ప్రపంచము నుండి కొత్త పావన ప్రపంచంగా అవుతుంది. పతితపావనుడే తప్పకుండా వచ్చి ఉంటారు. ఇప్పుడు సంగమయుగములో ఏ ధర్మము ఉంటుందనేది ఎవ్వరికీ తెలియదు. ఇది పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం యొక్క పురుషోత్తమ సంగమయుగము అని గాయనం చేయబడినది. ఈ లక్ష్మీ-నారాయణులు కొత్త ప్రపంచానికి యజమానులు. ఈ ఆత్మలకు గత జన్మలో పరమపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పించారు. ఈ పురుషార్థానికి ప్రారబ్ధము మళ్ళీ కొత్త జన్మలో లభిస్తుంది, దీని పేరు కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగము. తప్పకుండా అనేక జన్మల అంతిమ జన్మలోనే వీరికి ఎవరో రాజయోగము నేర్పించి ఉంటారు. కలియుగంలో అనేక ధర్మాలున్నాయి, సత్యయుగములో ఒకే ఒక దేవీ-దేవతా ధర్మముంటుంది. సంగమయుగములో ఉన్న ఏ ధర్మం ద్వారా ఈ పురుషార్థము చేసి, రాజయోగాన్ని నేర్చుకొని, సత్యయుగంలో ప్రారబ్ధాన్ని పొందుతారు. సంగమయుగములో బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులే జన్మించారని అర్థము చేయించబడుతుంది. బ్రహ్మా ద్వారా కృష్ణపురి స్థాపన అని చిత్రాలలో కూడా ఉంది. విష్ణుపురి అన్నా లేక నారాయణపురి అన్నా, విషయమైతే ఒక్కటే. ఈ చదువు ద్వారా మరియు పావనంగా అవ్వడం ద్వారా మనము కృష్ణపురికి యజమానులుగా అవుతామని మీకిప్పుడు తెలుసు. శివ భగవానువాచ కదా. కృష్ణుడి ఆత్మనే అనేక జన్మల అంతిమ జన్మలో మళ్ళీ ఈ విధంగా అవుతుంది. 84 జన్మలు తీసుకుంటారు కదా. ఇది 84వ జన్మ, వీరికే మళ్ళీ బ్రహ్మా అని పేరు పెడతారు. లేకపోతే మరి బ్రహ్మా ఎక్కడి నుండి వస్తారు. ఈశ్వరుడు రచనను రచిస్తే బ్రహ్మా-విష్ణు-శంకరులు ఎక్కడ నుండి వచ్చారు. ఎలా రచించారు? ఛూ మంత్రము వేయగానే జన్మించారా. తండ్రియే వారి చరిత్రను తెలియజేస్తారు. దత్తత తీసుకోవడం జరిగినప్పుడు పేరు మారుస్తారు. బ్రహ్మా అనే పేరు ఉండేది కాదు కదా. అనేక జన్మల అంతిమంలో..... అని అంటారు, మరి తప్పకుండా పతిత మనిషి అయినట్లు. బ్రహ్మా ఎక్కడ నుండి వచ్చారో ఎవ్వరికీ తెలియదు. అనేక జన్మల అంతిమ జన్మ అంటే ఎవరిది? లక్ష్మీ-నారాయణులే అనేక జన్మలు తీసుకున్నారు. నామ, రూప, దేశ, కాలాలు మారిపోతూ ఉంటాయి. కృష్ణుని చిత్రములో 84 జన్మల కథ స్పష్టంగా వ్రాసి ఉంది. జన్మాష్టమినాడు కృష్ణుని చిత్రాలు కూడా చాలా అమ్ముడుపోతాయి ఎందుకంటే కృష్ణుని మందిరానికి అందరూ వెళ్తారు కదా. రాధా-కృష్ణుల మందిరాలకే వెళ్తారు. కృష్ణుడితో పాటు రాధ తప్పకుండా ఉంటుంది. రాకుమారీ-రాకుమారులైన రాధా-కృష్ణులే మహారాజా-మహారాణులైన లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. వారే 84 జన్మలు తీసుకొని మళ్ళీ అంతిమ జన్మలో బ్రహ్మా-సరస్వతులుగా అయ్యారు. అనేక జన్మల అంతిమంలో తండ్రి ప్రవేశించారు. మీకు మీ జన్మల గురించి తెలియదు అని వీరికే చెప్తారు. మీరు మొదటి జన్మలో లక్ష్మీ-నారాయణులుగా ఉండేవారు. తర్వాత ఈ జన్మ తీసుకున్నారు, వారు అర్జునుడని పేరు పెట్టారు. అర్జునుడికి రాజయోగాన్ని నేర్పించారు. అర్జునుడిని వేరు చేశారు. కానీ వారి పేరు అర్జునుడు కాదు. బ్రహ్మా జీవిత చరిత్ర కావాలి కదా. కానీ బ్రహ్మా మరియు బ్రాహ్మణుల వర్ణన ఎక్కడా లేదు. ఈ విషయాలు తండ్రియే కూర్చుని అర్థము చేయిస్తారు, పిల్లలందరూ వింటారు, ఆ తర్వాత పిల్లలు ఇతరులకు అర్థము చేయిస్తారు. కథను విని తర్వాత ఇతరులకు కూర్చుని వినిపిస్తారు. మీరు కూడా వింటారు, మళ్ళీ వినిపిస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగము, లీపు యుగము. ఎక్సట్రా యుగము. పురుషోత్తమ మాసము వస్తే 13 నెలలు అవుతాయి. ఈ సంగమయుగ పండుగలనే ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. ఈ పురుషోత్తమ సంగమయుగం గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ సంగమయుగములోనే తండ్రి వచ్చి పవిత్రంగా అయ్యే ప్రతిజ్ఞ చేయిస్తారు. పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. రక్షాబంధనం ఆచారం కూడా భారత్ లోనే ఉంది. సోదరి, సోదరునికి రాఖీ కడుతుంది. కానీ ఆ కుమారి కూడా మళ్ళీ అపవిత్రంగా అయిపోతుంది. ఇప్పుడు తండ్రి మాతలైన మీపై జ్ఞాన కలశాన్ని పెట్టారు. బ్రహ్మాకుమార-కుమారీలు కూర్చుని పవిత్రతా ప్రతిజ్ఞను చేయించి రాఖీని కడతారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు అని బాబా చెప్తున్నారు. అంతేకానీ రాఖీ మొదలైనవి కట్టే అవసరము లేదు. ఈ విషయాలు అర్థము చేయించడం జరుగుతుంది. సాధు సన్యాసులు దానాన్ని అడుగుతారు. కొందరు కోపాన్ని దానము చేయమంటారు, కొందరు ఉల్లిపాయలను తినవద్దు అని అంటారు. ఎవరైతే స్వయం తినకుండా ఉంటారో, వారే దానము అడుగుతూ ఉండవచ్చు. కానీ అన్నిటికంటే పెద్ద ప్రతిజ్ఞను అనంతమైన తండ్రి చేయిస్తారు. మీరు పావనంగా అవ్వాలనుకుంటే పతిత-పావనుడైన తండ్రిని స్మృతి చేయండి. ద్వాపరయుగము నుండి మొదలుకొని మీరు పతితంగా అవుతూ వచ్చారు, ఇప్పుడు మొత్తం ప్రపంచం పావనంగా అవ్వాలి, అది తండ్రి మాత్రమే చేయగలరు. మనుష్యులెవ్వరూ సర్వుల గతి-సద్గతిదాతగా కాలేరు. తండ్రియే పావనంగా అయ్యే ప్రతిజ్ఞను తీసుకుంటారు. భారత్ పావనమైన స్వర్గంగా ఉండేది కదా. ఆ పరమపిత పరమాత్మయే పతిత-పావనుడు. కృష్ణుడిని పతిత-పావనుడని అనరు. వారి జన్మ జరుగుతుంది. వారి తల్లి-తండ్రులను కూడా చూపిస్తారు. ఒక్క శివునిది మాత్రమే అలౌకిక జన్మ. నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను అని స్వయంగా వారి పరిచయాన్ని వారే ఇస్తారు. శరీరాన్ని తప్పకుండా ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది. నేను జ్ఞానసాగరుడను, పతిత-పావనుడను, రాజయోగాన్ని నేర్పించేవాడను. తండ్రియే స్వర్గ రచయిత మరియు వారే నరకాన్ని వినాశనము చేయిస్తారు. స్వర్గమున్నప్పుడు నరకం ఉండదు. ఇప్పుడు పూర్తిగా రౌరవ నరకంగా ఉంది, పూర్తిగా తమోప్రధాన నరకంగా అయినప్పుడే తండ్రి వచ్చి సతోప్రధాన స్వర్గాన్ని తయారుచేస్తారు. 100 శాతము పతితము నుండి 100 శాతము పావనంగా తయారుచేస్తారు. మొదటి జన్మ తప్పకుండా సతోప్రధానమైనదే లభిస్తుంది. పిల్లలు విచార సాగర మథనము చేసి భాషణ చేయాలి. మళ్ళీ ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా అర్థం చేయించాలి. తండ్రి కూడా ఈ రోజు ఒక విషయాన్ని, రేపు మళ్ళీ ఇంకొక విషయాన్ని అర్థం చేయిస్తారు. ఒకే విధంగా అయితే అర్థము చేయించరు. టేపు ద్వారా ఎవరైనా ఏక్యురేట్ గా విన్నా కూడా మళ్ళీ ఏక్యురేట్ గా వినిపించలేరు, తప్పకుండా తేడా ఉంటుంది. బాబా ఏదైతే వినిపిస్తారో, అదంతా డ్రామాలో నిర్ణయించబడిందని మీకు తెలుసు. కల్పక్రితము వినిపించిన ప్రతి పదమును మళ్ళీ ఈరోజు వినిపిస్తారు. ఈ రికార్డు నిండి ఉంది. 5 వేల సంవత్సరాల క్రితం నేను ఒక్కొక్క పదం ఏదైతే వినిపించానో, ఆ పదాలను అదే విధంగా వినిపిస్తాను అని భగవంతుడు స్వయంగా చెప్తున్నారు. ఇది షూటింగ్ చేయబడిన డ్రామా. ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. ఇంత చిన్న ఆత్మలో రికార్డు నిండి ఉంది. కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరిగిందో పిల్లలకిప్పుడు తెలుసు. నేటి నుండి 5 వేల సంవత్సరాలకు కొన్ని రోజులు తక్కువ అని అంటారు ఎందుకంటే ఇప్పుడు చదువుకుంటున్నారు. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. పిల్లల మనస్సులో ఎంత సంతోషం ఉంది. కృష్ణుడి ఆత్మ 84 జన్మల చక్రములో తిరిగారని మీకు తెలుసు. ఇప్పుడు ఆ ఆత్మ మళ్ళీ కృష్ణుని నామ-రూపాలలోకి వస్తున్నారు. పాత ప్రపంచాన్ని కాలితో తన్నుతున్నారు, చేతిలో కొత్త ప్రపంచముంది అని చిత్రంలో చూపించారు. ఇప్పుడు చదువుకుంటున్నారు, అందుకే శ్రీకృష్ణుడు వస్తున్నారు అని అంటారు. తప్పకుండా తండ్రి అనేక జన్మల అంతిమంలోనే చదివిస్తారు. ఈ చదువు పూర్తి అవ్వగానే కృష్ణుడు జన్మ తీసుకుంటారు. చదువుకునేందుకు ఇంకా కొద్ది సమయమే ఉంది. తప్పకుండా అనేక ధర్మాల వినాశనము జరిగిన తర్వాత కృష్ణుని జన్మ జరిగి ఉంటుంది. అది కూడా కృష్ణుడు ఒక్కరే కాదు, మొత్తం కృష్ణపురి ఉంటుంది. ఈ బ్రాహ్మణులే తర్వాత ఈ రాజయోగాన్ని నేర్చుకుని దేవతా పదవిని పొందుతారు. జ్ఞానము ద్వారానే దేవతలుగా అవుతారు. తండ్రి వచ్చి చదువు ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. ఇది పాఠశాల, ఇందులో అన్నిటికంటే ఎక్కువ సమయము పడుతుంది. చదువు అయితే సహజమైనది. కానీ యోగములోనే శ్రమ ఉంది. కృష్ణుని ఆత్మ ఇప్పుడు పరమపిత పరమాత్మ ద్వారా రాజయోగము నేర్చుకుంటున్నారని మీరు చెప్పవచ్చు. శివబాబా బ్రహ్మా ద్వారా విష్ణుపురి యొక్క రాజ్యం ఇచ్చేందుకు ఆత్మలమైన మనల్ని చదివిస్తున్నారు. మనము ప్రజాపిత బ్రహ్మా పిల్లలము, బ్రాహ్మణ-బ్రాహ్మణీలము. ఇది సంగమయుగము. ఇది చాలా చిన్న యుగము. పిలక అన్నిటికంటే చిన్నదిగా ఉంటుంది కదా. ఆ తర్వాత దాని కంటే పెద్దదిగా ముఖము, ఆ తర్వాత పెద్దవి భుజాలు, ఆ తర్వాత పెద్దది కడుపు, దాని కన్నా పెద్దవి కాళ్ళు. విరాట రూపాన్ని చూపిస్తారు కానీ దాని అర్థము ఎవ్వరూ చెప్పరు. పిల్లలైన మీరు ఈ 84 జన్మల చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయించాలి, శివజయంతి తర్వాత కృష్ణజయంతి.

పిల్లలైన మీ కోసం ఇది సంగమయుగము. మీ కోసం కలియుగము పూర్తయిపోయింది. మధురమైన పిల్లలూ, నేనిప్పుడు మిమ్మల్ని సుఖధామము, శాంతిధామాలకు తీసుకువెళ్ళేందుకు వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. మీరు సుఖధామ నివాసులుగా ఉండేవారు, ఆ తర్వాత దుఃఖధామములోకి వచ్చారు. తండ్రీ, ఈ పాత ప్రపంచములోకి రండి అని పిలిచారు. ఇది మీ ప్రపంచము అయితే కాదు. ఇప్పుడు మీరు ఏమి చేస్తున్నారు? యోగబలంతో మీ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. అహింసా పరమో దేవీ-దేవతా ధర్మము అని కూడా అంటారు. మీరు అహింసకులుగా అవ్వాలి. కామ ఖడ్గాన్ని నడిపించకూడదు, కొట్లాడకూడదు-గొడవపడకూడదు. నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తాను అని తండ్రి చెప్తున్నారు. లక్షల సంవత్సరాల విషయమేమీ కాదు. యజ్ఞం, తపం, దానం, పుణ్యం మొదలైనవి చేస్తూ మీరు క్రిందకు దిగుతూ వచ్చారు అని తండ్రి చెప్తున్నారు. జ్ఞానము ద్వారానే సద్గతి కలుగుతుంది. మనుష్యులు అయితే కుంభకర్ణుని నిద్రలో నిద్రించి ఉన్నారు, వారు మేలుకోవడమే లేదు, అందుకే తండ్రి చెప్తున్నారు - నేను కల్ప-కల్పమూ వస్తాను, నాకు కూడా డ్రామాలో పాత్ర ఉంది, పాత్ర లేకుండా నేను కూడా ఏమీ చేయలేను, నేను కూడా డ్రామా బంధనములో ఉన్నాను. ఖచ్చితమైన సమయానికే వస్తాను. డ్రామా ప్లాను అనుసారంగా నేను పిల్లలైన మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్తాను. ఇప్పుడు మన్మనాభవ అని చెప్తున్నాను. కానీ దీని అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. దేహం యొక్క సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు అని తండ్రి చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేయడానికి పిల్లలు శ్రమ చేస్తూ ఉంటారు. ఇది ఈశ్వరీయ విశ్వ విద్యాలయము, మొత్తం విశ్వానికే సద్గతినిచ్చే ఈశ్వరీయ విశ్వ విద్యాలయము ఇంకొకటి ఉండదు. తండ్రి అయిన ఈశ్వరుడు స్వయంగా వచ్చి మొత్తం విశ్వాన్ని మారుస్తున్నారు. నరకము నుండి స్వర్గముగా చేస్తారు. దానిపై మళ్ళీ మీరు రాజ్యం చేస్తారు. శివుడిని బబుల్ నాథ్ అని కూడా అంటారు ఎందుకంటే వారు వచ్చి మిమ్మల్ని కామఖడ్గము నుండి విడిపించి పావనముగా చేస్తారు. భక్తిమార్గములోనైతే చాలా షో ఉంది, ఇక్కడైతే శాంతిగా స్మృతి చేయాలి. వారు అనేక రకాల హఠయోగాలు మొదలైనవి చేస్తారు. వారి నివృత్తి మార్గమే వేరు. వారు బ్రహ్మమును నమ్ముతారు. వారు బ్రహ్మయోగులు, తత్వయోగులు. అది ఆత్మలు నివసించే స్థానము, దానినే బ్రహ్మాండము అని అంటారు. వారు మళ్ళీ బ్రహ్మతత్వాన్ని భగవంతుడని భావిస్తారు. అందులో లీనమైపోతామని అనుకుంటారు. అంటే ఆత్మను వినాశీగా చేసేస్తారు. నేనే వచ్చి అందరి సద్గతినీ చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. శివబాబాయే సర్వులకు సద్గతినిస్తారు, కనుక వారు వజ్రం వంటివారు. మళ్ళీ మిమ్మల్ని బంగారుయుగములోకి తీసుకువెళ్తారు. మీ ఈ జన్మ కూడా వజ్రం లాంటి జన్మ, ఆ తర్వాత బంగారు యుగములోకి వస్తారు. ఈ జ్ఞానము మీకు తండ్రియే వచ్చి చదివిస్తారు, దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు. తర్వాత ఈ జ్ఞానము ప్రాయః లోపమైపోతుంది. ఈ లక్ష్మీ-నారాయణులలో కూడా రచయిత మరియు రచనల జ్ఞానము లేదు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పాత ప్రపంచములో ఉంటూ డబల్ అహింసకులుగా అయి యోగబలముతో తమ కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయాలి. తమ జీవితాన్ని వజ్రంలా తయారుచేసుకోవాలి.

2. బాబా ఏదైతే వినిపిస్తారో దాని గురించి విచార సాగర మథనము చేసి ఇతరులకు వినిపించాలి. ఈ చదువు పూర్తయ్యాక మేము కృష్ణపురిలోకి వెళ్తామని సదా నషా ఉండాలి.

వరదానము:-

వ్యర్థాన్ని కూడా శుభ భావము మరియు శ్రేష్ఠ భావన ద్వారా పరివర్తన చేసే సత్యమైన మరజీవా భవ

బాప్ దాదా శ్రీమతము - పిల్లలూ, వ్యర్థమైన మాటలు వినకండి, వినిపించకండి, ఆలోచించకండి. సదా శుభభావనతో ఆలోచించండి, శుభమైన మాటలే మాట్లాడండి. వ్యర్థాన్ని కూడా శుభభావముతో వినండి. శుభ చింతకులుగా అయి మాటల భావాన్ని పరివర్తన చేయండి. సదా భావము మరియు భావనను శ్రేష్ఠంగా ఉంచుకోండి, స్వయాన్ని పరివర్తన చేసుకోండి, అంతేకానీ ఇతరుల పరివర్తన గురించి ఆలోచించకండి. స్వయం యొక్క పరివర్తనే ఇతరుల పరివర్తన, ఇందులో మొదట నేను - ఇలా మరజీవాగా అవ్వడంలోనే ఆనందం ఉంది. దీనినే మహాబలి అని అంటారు. ఇందులో సంతోషంగా మరణించండి - ఇలా మరణించడమే జీవించడం, ఇదే సత్యమైన ప్రాణదానము.

స్లోగన్:-

సంకల్పాల ఏకాగ్రత, శ్రేష్ఠ పరివర్తనలో తీవ్ర వేగాన్ని తీసుకొస్తుంది.