27-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ- ఈ వేశ్యాలయాన్ని శివాలయంగా చేసేందుకు తండ్రి వచ్చారు. వేశ్యలకు కూడా ఈశ్వరీయ సందేశాన్నిచ్చి వారి కళ్యాణం కూడా చేయడం మీ కర్తవ్యం”

ప్రశ్న:-

ఏ పిల్లలు స్వయాన్ని చాలా ఎక్కువ నష్టపరుచుకుంటారు?

జవాబు:-

ఎవరైనా ఏ కారణంగానైనా మురళీని (చదువును) మిస్ చేస్తే, వారు స్వయాన్ని చాలా ఎక్కువ నష్టపరుచుకుంటారు. చాలామంది పిల్లలు పరస్పములో అలిగిన కారణంగా క్లాసుకే రారు. ఏదో ఒక సాకు చెప్పి ఇంట్లోనే నిద్రపోతారు, దీని వలన స్వయాన్నే నష్టపరుచుకుంటారు ఎందుకంటే బాబా అయితే ప్రతిరోజు ఏవో ఒక కొత్త యుక్తులు తెలియజేస్తూ ఉంటారు, విననే వినకపోతే అమలులోకి ఎలా తీసుకొస్తారు.

ఓంశాంతి. ఇప్పుడు మనము విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నామని మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు. మాయ మరిపింపజేస్తూ ఉంటుంది. కొంతమందికైతే రోజంతా మరిపింపజేస్తుంది. సంతోషం కలిగేందుకు అసలు ఎప్పుడూ స్మృతినే చేయరు. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని కూడా మర్చిపోతారు. మర్చిపోయిన కారణంగా మరి ఎటువంటి సేవను చేయలేరు. అధముల కంటే అధములైన వేశ్యలకు కూడా సేవ చేయాలి అని రాత్రి బాబా అర్థం చేయించారు. మీరు తండ్రి ఇచ్చిన ఈ జ్ఞానాన్ని ధారణ చేసినట్లయితే స్వర్గం యొక్క విశ్వమహారాణులుగా అవ్వవచ్చు అని వేశ్యలకు మీరు తెలియజేయండి, షావుకార్లు అలా అవ్వలేరు. అన్నీ తెలిసినవారు, చదువుకున్నవారు వారికి జ్ఞానమిచ్చే ఏర్పాట్లు చేస్తారు, అప్పుడు పాపం వారికి చాలా సంతోషము కలుగుతుంది ఎందుకంటే వారు కూడా అబలలు, వారికి మీరు అర్థము చేయించవచ్చు. బాబా చాలా యుక్తులను తెలియజేస్తూనే ఉంటారు. మీరే ఉన్నతాతి ఉన్నతంగా, నీచాతి నీచంగా అయ్యారని వారికి చెప్పండి. మీ పేరుతోనే భారత్ వేశ్యాలయంగా అయ్యింది. మీరు మళ్ళీ ఈ పురుషార్థము చేసినట్లయితే శివాలయములోకి వెళ్ళగలరు. ధనము కోసం మీరిప్పుడు ఎంత అశుద్ధమైన పని చేస్తున్నారు. ఇప్పుడు దీనిని విడిచిపెట్టండి. ఈ విధంగా అర్థం చేయిస్తే వారు చాలా సంతోషిస్తారు. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఇదైతే మంచి విషయమే కదా. భగవంతుడు పేదవారి కోసమే ఉన్నారు. ధనము కోసం చాలా అశుద్ధమైన పని చేస్తున్నారు. వారికిది వ్యాపారములా నడుస్తుంది. సేవను వృద్ధి చేసేందుకు మేము యుక్తులు రచిస్తామని ఇప్పుడు పిల్లలంటారు. కొంతమంది పిల్లలు ఏదో ఒక విషయంలో అలుగుతారు కూడా. చదువును కూడా వదిలేస్తారు. మేము చదువుకోకపోతే స్వయాన్నే నష్టపరుచుకుంటామని వారు అర్థము చేసుకోరు. అలిగి కూర్చుండిపోతారు. ఫలానావారు ఇలా అన్నారు, అలా అన్నారు అని అందుకే రారు. వారానికి ఒకసారి అతికష్టంగా వస్తారు. బాబా అయితే మురళీలలో ఒక్కోసారి ఒక్కో సలహానిస్తూ ఉంటారు. మురళీ అయితే వినాలి కదా. క్లాసుకు వస్తేనే వినగలరు. అటువంటివారు చాలామంది ఉంటారు, ఏదో ఒక కారణంతో సాకులు చెప్పి నిద్రపోతారు. సరే, ఈ రోజు వెళ్ళను అనుకుంటారు. అరే, బాబా ఎంత మంచి-మంచి పాయింట్లు వినిపిస్తారు. సేవ చేస్తే ఉన్నత పదవిని కూడా పొందుతారు. ఇది చదువు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయము మొదలైనవాటిలో చాలా మంది శాస్త్రాలను చదువుతారు. ఇంకే పనీ ఉండదు కనుక కేవలం శాస్త్రాలను కంఠస్థం చేసి సత్సంగాలను ప్రారంభిస్తారు. వారికి ఉద్దేశ్యము మొదలైనవేవీ ఉండవు. ఈ చదువు ద్వారా అందరి నావ తీరం చేరుతుంది. కనుక పిల్లలైన మీరు ఇటువంటి అధముల సేవను చేయాలి. ఇలాంటివారు వస్తున్నారని చూస్తే షావుకార్లు రావడానికి ఇష్టపడరు. దేహాభిమానము ఉంటుంది కదా. వాళ్ళకు సిగ్గనిపిస్తుంది. సరే, వారికోసం వేరుగా ఒక పాఠశాలను తెరవండి. ఆ చదువైతే కొన్ని పైసలు విలువైనది మాత్రమే, శరీర నిర్వహణార్థం ఉపయోగపడుతుంది. ఇదైతే 21 జన్మల కోసం ఉపయోగపడుతుంది. ఎంతమంది కళ్యాణము జరుగుతుంది. బాబా, మా ఇంట్లో గీతా పాఠశాలను తెరవవచ్చా అని మాతలు కూడా తరుచూ అడుగుతూ ఉంటారు. వారిలో ఈశ్వరీయ సేవ చేయాలనే అభిరుచి ఉంటుంది. పురుషులైతే ఇక్కడా-అక్కడా క్లబ్ మొదలైనవాటికి తిరుగుతూ ఉంటారు. షావుకార్లకైతే ఇక్కడే స్వర్గము ఉంది. ఎన్ని ఫ్యాషన్లు మొదలైనవి చేస్తూ ఉంటారు. కానీ దేవతల సహజ సౌందర్యము ఎలా ఉంటుందో చూడండి. ఎంత తేడా ఉంది. ఇక్కడ మీకు నిజము వినిపించడం జరుగుతుంది కనుక ఎంత కొద్దిమంది వస్తారు. అది కూడా పేదవారే వస్తారు. వెంటనే అటువైపుకు వెళ్ళిపోతారు. అక్కడకు కూడా అలంకారం మొదలైనవి చేసుకుని వెళ్తారు. గురువులు నిశ్చితార్థాలు కూడా చేయిస్తారు. ఇక్కడ ఎవరికైనా నిశ్చితార్థము చేయించడం జరిగినా, అది వారిని రక్షించేందుకే. కామచితిపై ఎక్కకుండా రక్షించేందుకు నిశ్చితార్థము చేయిస్తారు. జ్ఞానచితిపై కూర్చుని పదమాల భాగ్యశాలురుగా అవ్వాలని చేస్తారు. నష్టాన్ని తీసుకొచ్చే ఈ వ్యాపారాన్ని వదిలి స్వర్గానికి వెళ్దాము అని తల్లిదండ్రులకు చెప్తారు. దానికి వారు, ఏమి చేయాలి, ఈ ప్రపంచములోనివారు కులం యొక్క పేరు పాడు చేస్తున్నారు అని మాతో గొడవపడతారు అని చెప్తారు. వివాహం చేయకపోవడం నియమానికి విరుద్ధం అని అంటారు. లోకమర్యాదలను, కులమర్యాదలను విడిచిపెట్టరు. భక్తిమార్గములో నాకైతే ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరు అని పాడారు. మీరా పాటలు కూడా ఉన్నాయి. స్త్రీలలో నంబరువన్ భక్తురాలు మీరా, పురుషులలో నారదుడు గాయనం చేయబడ్డారు. నారదుని కథ కూడా ఉంది కదా. మీతో ఎవరైనా కొత్తవారు నేను లక్ష్మిని వరించగలనా అని అంటే వారికి ఇలా చెప్పండి - నేను యోగ్యంగా ఉన్నానా? పవిత్రంగా, సర్వగుణ సంపన్నంగా ఉన్నానా? అని స్వయాన్ని చూసుకోండి. ఇది వికారీ పతిత ప్రపంచము. దీని నుండి బయటకు తీసి పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. పావనంగా అయినప్పుడు లక్ష్మిని వరించే యోగ్యులుగా అవుతారు. ఇక్కడ బాబా వద్దకు వస్తారు, ప్రతిజ్ఞ చేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే వికారాలలో పడిపోతారు. ఇటువంటి సమాచారాలు వస్తూ ఉంటాయి. ఏ బ్రాహ్మణి అయితే ఇటువంటి వారిని తీసుకువస్తుందో, వారిపై కూడా ప్రభావం పడుతుంది అని బాబా చెప్తున్నారు. ఇంద్రసభను గురించిన కథ కూడా ఉంది కదా. కనుక తీసుకువచ్చేవారికి కూడా శిక్ష పడుతుంది. అపరిపక్వంగా ఉన్నవారిని తీసుకురాకండి అని బాబా బ్రాహ్మణీలకు సదా చెప్తుంటారు. నియమ విరుద్ధంగా తీసుకువచ్చినందుకు మీ స్థితి కూడా పడిపోతుంది. వాస్తవానికి బ్రాహ్మణిగా అవ్వడం చాలా సహజం. 10-15 రోజులలోనే అవ్వవచ్చు. ఎవరికైనా అర్థం చేయించేందుకు బాబా చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తారు. భారతీవాసీయులైన మీరు ఆదిసనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు, స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు, మళ్ళీ స్వర్గవాసులుగా అవ్వాలంటే ఈ వికారాలను విడిచిపెట్టండి. కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమౌతాయి. ఇది ఎంత సహజము. కానీ కొందరు ఏమాత్రం అర్థము చేసుకోరు. స్వయమే అర్థము చేసుకోకపోతే ఇతరులకు ఏమి అర్థం చేయిస్తారు. వానప్రస్థ స్థితిలో కూడా మోహం యొక్క బంధనం లాగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో వానప్రస్థ స్థితిలోకి అంతగా వెళ్ళడం లేదు. తమోప్రధానంగా ఉన్నారు కదా. ఇక్కడే చిక్కుకుని ఉంటారు. ఒకప్పుడు వానప్రస్థులకు పెద్ద-పెద్ద ఆశ్రమాలుండేవి. ఈ రోజుల్లో అన్ని లేవు. 80-90 సంవత్సరాలైనా కూడా ఇంటిని విడిచిపెట్టరు. వాణి నుండి దూరంగా వెళ్ళాలి, ఇప్పుడు ఈశ్వరుడిని స్మృతి చేయాలి అని అర్థం చేసుకోరు. భగవంతుడు ఎవరో వారికి తెలియదు. సర్వవ్యాపి అన్నట్లయితే మరి ఎవరిని స్మృతి చేయాలి. మేము పూజారులుగా ఉన్నామని కూడా అర్థము చేసుకోరు. తండ్రి అయితే మిమ్మల్ని పూజారుల నుండి పూజ్యులుగా తయారుచేస్తారు, అది కూడా 21 జన్మల కోసం చేస్తారు. దీని కోసం పురుషార్థమైతే చేయవలసి ఉంటుంది.

ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నదని బాబా అర్థం చేయించారు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి అని కేవలం ఇదే చింత ఉండాలి. అక్కడ వికారీ విషయాలే ఉండవు. తండ్రి వచ్చి ఆ పవిత్ర ప్రపంచము కోసం ఏర్పాట్లు చేయిస్తున్నారు. సర్వీసబుల్, గారాబాల పిల్లలను నయనాలపై కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తారు. కనుక అధములను ఉద్ధరించేందుకు ధైర్యం కావాలి, ఆ గవర్నమెంట్ లోనైతే పెద్ద-పెద్ద గ్రూపులు ఉంటాయి. చదువుకున్నవారు టిప్ టాప్ గా ఉంటారు. ఇక్కడైతే చాలామంది పేదవారు సాధారణంగా ఉంటారు. వారిని తండ్రి కూర్చుని ఎంత ఉన్నతంగా తయారుచేస్తారు. నడవడిక కూడా చాలా రాయల్ గా ఉండాలి. భగవంతుడు చదివిస్తున్నారు. ఆ చదువులో ఏదైనా పెద్ద పరీక్షలో పాస్ అయితే, వారు ఎంత టిప్ టాప్ గా ఉంటారు. ఇక్కడైతే తండ్రి పేదల పెన్నిధి. పేదవారే ఎంతో కొంత పంపిస్తూ ఉంటారు. 1-2 రూపాయల మనీ ఆర్డరైనా పంపిస్తూ ఉంటారు. మీరైతే మహాన్ భాగ్యశాలులు అని తండ్రి చెప్తున్నారు. రిటర్నులో మీకు చాలా లభిస్తుంది. ఇదేమీ కొత్త విషయం కాదు. సాక్షీగా అయి డ్రామాను చూస్తారు. పిల్లలూ, బాగా చదువుకోండి అని తండ్రి చెప్తున్నారు. ఇది ఈశ్వరీయ యజ్ఞము, ఇక్కడ ఏది కావాలనుకుంటే అది తీసుకోండి. కానీ ఇక్కడ తీసుకుంటే అక్కడ తక్కువైపోతుంది. స్వర్గములోనైతే అన్నీ లభిస్తాయి. బాబాకైతే సేవలో చాలా తెలివైన పిల్లలు కావాలి. సుదేశ్ లా, మోహిని లా, సేవ చేయాలనే ఉత్సాహం ఉన్నవారు కావాలి. మీ పేరు చాలా ప్రసిద్ధమైపోతుంది. తర్వాత మీకు చాలా గౌరవం ఇస్తారు. బాబా అన్ని డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. బాబా అయితే ఇక్కడ పిల్లలకు, ఎంత సమయం లభిస్తే అంత సమయం స్మృతిలో ఉండండి అని చెప్తారు. పరీక్షల రోజులు సమీపించినప్పుడు ఏకాంతములోకి వెళ్ళి చదువుకుంటారు. ప్రైవేటు టీచరును కూడా పెట్టుకుంటారు. మన వద్ద టీచర్లు అయితే చాలా మంది ఉన్నారు, కేవలం చదువుకునే అభిరుచి ఉండాలి. తండ్రి అయితే చాలా సహజంగా అర్థము చేయిస్తారు. కేవలం స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకోండి. ఈ శరీరమైతే వినాశీ. ఆత్మలైన మీరు అవినాశీ. ఈ జ్ఞానము ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, మళ్ళీ సత్యయుగము నుండి మొదలుకొని కలియుగము చివరి వరకు ఎవ్వరికీ లభించదు. మీకు మాత్రమే లభిస్తుంది. నేను ఆత్మను అన్నది పక్కాగా నిశ్చయము ఏర్పరుచుకోవాలి. తండ్రి ద్వారా మనకు వారసత్వము లభిస్తుంది. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమౌతాయి. లోపల కేవలం ఇది మననం చేస్తూ ఉన్నా కూడా చాలా కళ్యాణము జరుగుతుంది. కానీ అసలు చార్టే పెట్టరు. వ్రాస్తూ-వ్రాస్తూ అలసిపోతారు. బాబా చాలా సహజము చేసి తెలియజేస్తున్నారు. ఆత్మనైన నేను సతోప్రధానంగా ఉండేవాడిని, ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయాను. ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా అయిపోతారు అని తండ్రి చెప్తున్నారు. ఇది ఎంతో సహజమైనది, అయినా మర్చిపోతారు. ఎంత సమయం కూర్చుంటే అంత సమయం స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఆత్మను, తండ్రి సంతానాన్ని. తండ్రిని స్మృతి చేసినట్లయితే స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే అర్థకల్పం యొక్క పాపాలు భస్మమైపోతాయి. ఎంత సహజమైన యుక్తులు తెలియజేస్తున్నారు. పిల్లలందరూ వింటున్నారు. ఈ బాబా కూడా స్వయంగా అభ్యాసం చేస్తారు కావుననే నేర్పిస్తారు కదా. నేను బాబా రథమును, బాబా నాకు తినిపిస్తారు. పిల్లలైన మీరు కూడా అలాగే భావించండి. శివబాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఎంత లాభము కలుగుతుంది. కానీ మర్చిపోతారు. చాలా సహజము. వ్యాపారములో కస్టమర్లు ఎవ్వరూ లేకపోతే స్మృతిలో కూర్చోండి. నేను ఆత్మను, బాబాను స్మృతి చేయాలి. అనారోగ్యంలో కూడా స్మృతి చేయవచ్చు. బంధనములో ఉన్నవారైతే అక్కడ కూర్చునే మీరు స్మృతి చేస్తూ ఉన్నట్లయితే 10-20 సంవత్సరాల వారికన్నా కూడా ఉన్నతమైన పదవిని పొందగలరు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సేవలో చాలా-చాలా తెలివైనవారిగా ఉండాలి. ఎంత సమయము లభిస్తే అంత సమయము ఏకాంతములో కూర్చుని తండ్రిని స్మృతి చేయాలి. చదువు పట్ల ఆసక్తి ఉండాలి. చదువుపై అలగకూడదు.

2. తమ నడవడికను చాలా-చాలా రాయల్ గా ఉంచుకోవాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, అంతే, పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది కనుక మోహం యొక్క బంధనాలను తెంచి వేయాలి. వానప్రస్థ అవస్థలో (వాణి నుండి అతీతంగా) ఉండే అభ్యాసము చేయాలి. అధములను కూడా ఉద్ధరించే సేవ చేయాలి.

వరదానము:-

బ్రహ్మా తండ్రి సమానంగా మహా త్యాగం ద్వారా మహాన్ భాగ్యాన్ని తయారుచేసుకునే నంబర్ వన్ ఫరిస్తా నుండి విశ్వ మహారాజన్ భవ

ఎవరైతే బ్రహ్మా తండ్రి యొక్క ప్రతి కర్మ రూపీ అడుగు వెనుక అడుగు వేస్తారో, అటువంటి పిల్లలకు నంబర్ వన్ ఫరిస్తా నుండి విశ్వ మహారాజుగా అయ్యే వరదానము ప్రాప్తిస్తుంది. వారి మనసు-బుద్ధి సాకారంలో సదా తండ్రి ఎదురుగా సమర్పితమై ఉంటుంది. ఏ విధంగా బ్రహ్మాబాబా ఈ మహాత్యాగము ద్వారా మహాన్ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారో, అనగా నంబర్ వన్ సంపూర్ణ ఫరిస్తా మరియు నంబర్ వన్ విశ్వ మహారాజుగా అయ్యారో, అదే విధంగా ఫాలో ఫాదర్ చేసే పిల్లలు కూడా మహాన్ త్యాగులు మరియు సర్వస్వ త్యాగులుగా ఉంటారు. సంస్కార రూపంలో కూడా వికారాల వంశాన్ని త్యాగం చేస్తారు.

స్లోగన్:-

ఇప్పుడు ఆధారాలన్నీ తెగిపోతాయి కనుక ఒక్క తండ్రినే మీ ఆధారంగా చేసుకోండి.