ఓంశాంతి. భక్తిలో ఒక్కరి మహిమనే చేస్తారు. మహిమను పాడుతారు కదా. కానీ వారి గురించి తెలియదు, వారి యథార్థ పరిచయము కూడా తెలియదు. ఒకవేళ యథార్థ మహిమ తెలిసి ఉంటే తప్పకుండా వర్ణన చేసేవారు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడని పిల్లలైన మీకు తెలుసు. వారి చిత్రమే ముఖ్యమైనది. బ్రహ్మాకు సంతానము కూడా ఉంటారు కదా. మీరందరూ బ్రాహ్మణులు. బ్రహ్మాను కూడా బ్రాహ్మణులే తెలుసుకోగలరు, ఇంకెవ్వరికీ తెలియదు, అందుకే తికమకపడతారు. వీరు బ్రహ్మా ఎలా అవుతారు. బ్రహ్మాను సూక్ష్మవతనవాసిగా చూపించారు. మరి ప్రజాపిత సూక్ష్మవతనములో ఉండరు. అక్కడ రచన ఏమీ ఉండదు. ఈ విషయంలో వారు మీతో చాలా వాద-వివాదాలు కూడా చేస్తారు. బ్రహ్మా మరియు బ్రాహ్మణులు ఉండడమైతే ఉన్నారు కదా అని అర్థం చేయించాలి. ఎలాగైతే క్రీస్తు నుండి క్రైస్తవులు అన్న పదం వెలువడింది, బుద్ధ నుండి బౌద్ధులు, ఇబ్రహీమ్ నుండి ఇస్లామీయులు, అలాగే ప్రజాపిత బ్రహ్మా నుండి వెలువడిన బ్రాహ్మణులు అన్న పదం ప్రసిద్ధమైనది. బ్రహ్మాను ఆదిదేవుడని కూడా అంటారు. వాస్తవానికి బ్రహ్మాను దేవత అని అనలేరు. అది కూడా తప్పే. తమను తాము బ్రాహ్మణులమని చెప్పుకునేవారి వద్దకు వెళ్ళి - బ్రహ్మా ఎక్కడి నుండి వచ్చారు? వారు ఎవరి రచన? బ్రహ్మాను ఎవరు సృష్టించారు? అని అడగండి. ఎప్పటికీ ఎవ్వరూ చెప్పలేరు, ఎవ్వరికీ తెలియనే తెలియదు. శివబాబా వీరి రథములోకి ప్రవేశిస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఈ ఆత్మనే ఒకప్పుడు రాకుమారుడైన శ్రీకృష్ణునిగా అయ్యారు. 84 జన్మల తర్వాత ఈ విధంగా (బ్రహ్మాగా) అయ్యారు. వీరు మనిషి కావున జన్మపత్రిలో వీరి పేరు వేరుగా ఉన్నది. వీరిలోకి ప్రవేశించినప్పుడు, వీరికి బ్రహ్మా అని పేరు పెడతారు. ఆ బ్రహ్మానే విష్ణువు రూపమని కూడా పిల్లలకు తెలుసు. వీరు నారాయణునిగా అవుతారు కదా. 84 జన్మల అంతిమంలో కూడా సాధారణ రథమే కదా. ఆత్మలందరికీ ఇది (శరీరము) రథము. ఇది అకాలమూర్తి యొక్క నడుస్తూ-మాట్లాడుతూ ఉన్న సింహాసనము. సిక్కులు దీనికి గుర్తుగా ఆ సింహాసనాన్ని తయారుచేశారు. కావున ఇవన్నీ ఆత్మల అకాల సింహాసనాలే. ఆత్మలన్నీ అకాలమూర్తులు. ఉన్నతోన్నతుడైన భగవంతునికి ఈ రథము కావాలి కదా. రథములో ప్రవేశించి జ్ఞానమునిస్తారు. వారినే జ్ఞానసాగరులని అంటారు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. జ్ఞానసాగరులంటే అంతర్యామి లేక సర్వమూ తెలిసినవారని కాదు. సర్వవ్యాపి అంటే అర్థము వేరు, సర్వస్వము తెలిసిన వారంటే అర్థము వేరు. మనుష్యులు అన్నిటినీ కలిపేసి వారి మనసుకు ఏమనిపిస్తే అది అంటూ ఉంటారు. బ్రాహ్మణులైన మనమంతా బ్రహ్మా సంతానమని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మన కులము అన్నిటికన్నా ఉన్నతమైనది. వారు దేవతలను ఉన్నతంగా చూపిస్తారు, ఎందుకంటే సత్యయుగము ఆదిలో దేవతలు ఉండేవారు. బ్రాహ్మణులు ప్రజాపిత బ్రహ్మా సంతానమని పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. వారికెలా తెలుస్తుంది. బ్రహ్మా సూక్ష్మవతనములో ఉన్నారని వారు భావిస్తారు. పూజలు చేసే, ఆహ్వానంపై ఇళ్ళకు వెళ్ళి భోజనాలు చేసే శారీరిక బ్రాహ్మణులు వేరు. మీరు ఇటువంటి భోజనాలు మొదలైనవాటికి వెళ్ళరు. బ్రహ్మా యొక్క రహస్యాన్ని ఇప్పుడు బాగా అర్థం చేయించాలి. మిగతా విషయాలన్నిటినీ వదిలి, ఏ తండ్రి ద్వారా అయితే పతితుల నుండి పావనులుగా అవ్వాలో, మొదట వారిని స్మృతి చేయమని చెప్పండి. ఆ తర్వాత, ఈ విషయాలను కూడా అర్థం చేసుకుంటారు. కొద్దిగా ఏ విషయములోనైనా సంశయము వచ్చినట్లైతే తండ్రినే వదిలేస్తారు. మొట్టమొదట ముఖ్యమైన విషయము - అల్ఫ్ (శివబాబా) మరియు బే (వారసత్వము). నిరంతరం నన్నొక్కడినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. నేను తప్పకుండా ఎవరో ఒకరిలోకైతే వస్తాను కదా. వారికి పేరు కూడా ఉండాలి. నేను వచ్చి వారిని రచిస్తాను. బ్రహ్మా గురించి అర్థం చేయించేందుకు మీకు ఎంతో తెలివి ఉండాలి. పాదచారులు, గుర్రపు స్వారీ చేసేవారు తికమకపడతారు. తమ స్థితి అనుసారంగా అర్థం చేయిస్తారు కదా. ప్రజాపిత బ్రహ్మా ఇక్కడే ఉన్నారు. బ్రాహ్మణుల ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు కావున తప్పకుండా బ్రాహ్మణులే కావాలి కదా. ఎవరి ద్వారానైతే బ్రాహ్మణులు జన్మిస్తారో, ఆ ప్రజాపిత బ్రహ్మా కూడా ఇక్కడ కావాలి. మేము బ్రహ్మా సంతానమని కూడా బ్రాహ్మణులు చెప్తారు. తరతరాలుగా మా కులము కొనసాగుతూ వచ్చిందని భావిస్తారు. కానీ బ్రహ్మా ఎప్పుడు ఉండేవారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. బ్రాహ్మణులంటే బ్రహ్మా సంతానము. ఆ బ్రాహ్మణులకు తండ్రి కర్తవ్యమే తెలియదు. భారతదేశములో మొదట బ్రాహ్మణులే ఉంటారు. బ్రాహ్మణులది ఉన్నతోన్నతమైన కులము. మా కులము తప్పకుండా బ్రహ్మా నుండే వెలువడి ఉంటుందని ఆ బ్రాహ్మణులు కూడా భావిస్తారు. కానీ ఎప్పుడు, ఎలా వెలువడుతుందో మాత్రం వర్ణించలేరు. ప్రజాపిత బ్రహ్మానే బ్రాహ్మణులను రచిస్తారని మీకు తెలుసు. ఆ బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులను తండ్రి వచ్చి చదివిస్తారు. బ్రాహ్మణులకు కూడా వంశము లేదు. బ్రాహ్మణులది కులము, రాజులు-రాణులుగా అయినప్పుడు సూర్యవంశము వలె వంశము అని చెప్పడం జరుగుతుంది. బ్రాహ్మణులైన మీరు రాజులుగా అవ్వరు. కౌరవులకూ మరియు పాండవులకూ రాజ్యముండేదని వారేదైతే చెప్తారో, రెండూ తప్పే. ఇద్దరికీ రాజ్యము లేదు. ప్రజలపై ప్రజా రాజ్యముంది, దీనిని రాజధాని అని అనరు. కిరీటము లేదు. భారతదేశంలో మొదట డబల్ కిరీటధారులుండేవారు, ఆ తర్వాత సింగిల్ కిరీటము కలవారు ఉన్నారని బాబా అర్థం చేయించారు. ఈ సమయంలో అసలు కిరీటమే లేదు. ఇది కూడా బాగా ఋజువు చేసి చెప్పాలి, ఎవరైతే బాగా ధారణ చేస్తారో వారే బాగా అర్థం చేయించగలరు. బ్రహ్మా గురించి విస్తారంగా అర్థం చేయించవలసి ఉంటుంది. విష్ణువు గురించి కూడా తెలియదు. ఇది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. వైకుంఠాన్ని విష్ణుపురి అంటారు, అంటే అది లక్ష్మీనారాయణుల రాజ్యము. శ్రీ కృష్ణుడు రాకుమారుడైనప్పుడు నా తండ్రి రాజు అని చెప్తారు కదా. కృష్ణుని తండ్రి రాజు కాకుండా ఉండరు. కృష్ణుడిని రాకుమారుడు అని అంటున్నారంటే తప్పకుండా రాజు వద్దనే జన్మించి ఉంటారు. షావుకారు వద్ద జన్మిస్తే రాకుమారుడని అనరు. రాజా పదవికి, షావుకారు పదవికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. కృష్ణుని తండ్రి అయిన ఆ రాజు పేరు కూడా లేదు. కృష్ణునికి ఎంత గొప్ప పేరుంది. కృష్ణుని తండ్రి పదవి అంత గొప్పది కాదు. వారిది రెండవ తరగతికి చెందిన పదవి ఎందుకంటే వారు కేవలం కృష్ణునికి జన్మనిచ్చేందుకు నిమిత్తమవుతారు. అంతేకానీ, కృష్ణుని ఆత్మ కంటే ఎక్కువగా చదువుకున్నారని కాదు. కృష్ణుడే మళ్ళీ నారాయణునిగా అవుతారు. తండ్రి పేరు అదృశ్యమైపోతుంది. వారు తప్పకుండా బ్రాహ్మణుడే, కానీ చదువులో కృష్ణుని కంటే తక్కువ. కృష్ణుని ఆత్మ చదువులో తమ తండ్రి కన్నా ఉన్నతంగా ఉన్నందుకు కృష్ణునికి ఎంతో మహిమ ఉంది. కృష్ణుని తండ్రి ఎవరో ఎవ్వరికీ తెలియదు. మున్ముందు తెలుస్తుంది. ఇక్కడ నుండే తయారవ్వాలి. రాధకు కూడా తల్లిదండ్రులుంటారు కదా. కానీ, వారికంటే రాధ పేరు ప్రసిద్ధమైంది, ఎందుకంటే తల్లిదండ్రులు తక్కువగా చదువుకున్నారు. రాధ పేరు వారి పేరు కంటే ఉన్నతమవుతుంది. పిల్లలకు అర్థం చేయించేందుకు ఇవన్నీ విస్తారమైన విషయాలు. ఆధారమంతా చదువుపైనే ఉంది. బ్రహ్మా గురించి కూడా అర్థం చేయించేందుకు తెలివి ఉండాలి. ఆ కృష్ణుని ఆత్మనే పూర్తిగా 84 జన్మలు అనుభవిస్తుంది. మీరు కూడా 84 జన్మలు తీసుకుంటారు. అందరూ కలిసి ఒక్కసారిగా రారు. చదువులో ఎవరైతే ముందుంటారో, వారే అక్కడ కూడా ప్రారంభములో వస్తారు. నంబరువారుగా వస్తారు కదా. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. మందబుద్ధి కలవారు ధారణ చెయ్యలేరు. నంబరువారుగా వెళ్తారు. మీరు నంబరువారుగా బదిలీ అవుతారు. చివర్లో వెళ్ళే క్యూ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. నంబరువారుగా తమ-తమ స్థానాలకు వెళ్ళి నివసిస్తారు. అందరి స్థానాలు తయారుచేయబడి ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైన ఆట. కానీ ఎవ్వరూ అర్థము చేసుకోరు. దీనిని ముళ్ళ అడవి అని అంటారు. ఇక్కడ అందరూ ఒకరికొకరు దుఃఖమునిచ్చుకుంటూ ఉంటారు. అక్కడ సహజంగానే సుఖముంటుంది. ఇక్కడ కృత్రిమమైన సుఖముంది. సత్యమైన సుఖమునిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇక్కడి సుఖము కాకిరెట్టతో సమానమైనది. రోజురోజుకూ తమోప్రధానంగా అవుతూ ఉంటారు. ఎంతో దుఃఖముంది. బాబా! మాయా తుఫానులు చాలా వస్తున్నాయని అంటారు. మాయ చిక్కుకునేటట్లు చేస్తుంది, దుఃఖపు అనుభూతి ఎక్కువగా కలుగుతుంది. సుఖదాత తండ్రికి పిల్లలుగా అయిన తర్వాత కూడా దుఃఖము అనుభవమౌతే - పిల్లలూ, ఇది చాలా పెద్ద కర్మభోగమని తండ్రి చెప్తారు. తండ్రి లభించారంటే దుఃఖపు అనుభూతి కలగకూడదు. పాత కర్మభోగాన్ని యోగబలముతో తొలగించండి. ఒకవేళ యోగబలము లేకపోతే శిక్షలు అనుభవించి తీర్చుకోవలసి వస్తుంది. శిక్షలు అనుభవించి పదవి పొందడం బాగుండదు. పురుషార్థము చేయాలి లేకపోతే ట్రిబ్యునల్ (ధర్మాసనం) ముందు కూర్చోవలసి వస్తుంది. ప్రజలు అనేకమంది ఉన్నారు. ఇక్కడ డ్రామానుసారంగా గర్భ జైలులో అందరూ చాలా శిక్షలు అనుభవిస్తారు. ఆత్మలు చాలా భ్రమిస్తూ కూడా ఉంటాయి. కొన్ని ఆత్మలు చాలా నష్టము కలిగిస్తాయి, ఎప్పుడైనా ఎవరిలోనైనా అశుద్ధ ఆత్మ ప్రవేశించినప్పుడు, వారు ఎంతగానో విసుగు చెందుతారు. కొత్త ప్రపంచంలో ఈ విషయాలేవీ ఉండవు. కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు ఇప్పుడు మీరు పురుషార్థము చేస్తున్నారు. అక్కడకు వెళ్ళి కొత్త-కొత్త మహళ్ళు తయారుచేయవలసి ఉంటుంది. కృష్ణుడు జన్మ తీసుకున్నట్లే మీరు కూడా రాజుల వద్ద జన్మిస్తారు. కానీ ఇన్ని మహళ్ళు మొదలైనవి మొదటి నుండే ఉండవు. వాటిని తర్వాత తయారుచేయవలసి ఉంటుంది. వాటిని ఎవరు రచిస్తారు, ఎవరి వద్ద జన్మిస్తారో వారు రచిస్తారు. రాజుల వద్ద జన్మ జరుగుతుందని గాయనం కూడా ఉంది. ఏం జరుగుతుందో మున్ముందు గమనించవలసి ఉంటుంది. ఇప్పుడే బాబా అన్ని విషయాలు చెప్పరు. అలా చేస్తే అది కూడా కృత్రిమమైన నాటకమైపోతుంది, కావున అసలేమీ చెప్పరు. అలా చెప్పే నియమము డ్రామాలో లేదు. నేను కూడా పాత్రధారినే అని తండ్రి చెప్తున్నారు. డ్రామాలో ఏం జరుగుతుందో ముందే తెలిసుంటే చాలా చెప్పేవాడిని. బాబా అంతర్యామి అయ్యి ఉంటే అన్నీ ముందే తెలియజేసేవారు. డ్రామాలో ఏం జరుగుతుందో దానిని సాక్షిగా అయి చూస్తూ ఉండడంతో పాటు స్మృతియాత్రలో ఆనందంగా ఉండండి అని తండ్రి చెప్తున్నారు. ఇందులోనే ఫెయిల్ అవుతారు. జ్ఞానములో ఎప్పుడూ హెచ్చు-తగ్గులుండవు. స్మృతియాత్రలోనే హెచ్చు-తగ్గులవుతూ ఉంటాయి. లభించిన జ్ఞానము ఉండనే ఉంటుంది. స్మృతియాత్రలో కాసేపు ఉత్సాహం ఉంటుంది, కాసేపు తేలికగా అయిపోతారు. యాత్రలలో హెచ్చు-తగ్గులు అవుతూ ఉంటాయి. జ్ఞానముతో మీరు మెట్లు ఎక్కరు. జ్ఞానాన్ని యాత్ర అని అనడం జరగదు. యాత్ర అనగా స్మృతి చేయడం. స్మృతిలో ఉండడం వలన మీరు సురక్షితంగా ఉంటారు అని తండ్రి చెప్తున్నారు. దేహాభిమానములోకి వస్తే మీరు చాలా మోసపోతారు. వికర్మలు చేస్తారు. కామము మహాశత్రువు, అందులోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. క్రోధము మొదలైనవాటి గురించి బాబా అంతగా మాట్లాడరు.
జ్ఞానము ద్వారా క్షణములో జీవన్ముక్తి అంటారు లేకపోతే సాగరాన్ని సిరాగా చేసుకున్నా వారి మహిమ పూర్తవ్వదని చెప్తారు. లేక కేవలం అల్ఫ్ ను స్మృతి చేయమని అంటారు. స్మృతి చేయడం అని దేనిని అంటారో, వారికేమీ తెలియదు. కలియుగము నుండి సత్యయుగానికి మమ్మల్ని తీసుకువెళ్ళండి అని అంటారు. పాత ప్రపంచములో దుఃఖముంది. వర్షాలకు ఎన్ని ఇళ్ళు పడిపోతూ ఉంటాయో మీరు చూస్తారు, ఎంతోమంది మునిగిపోతారు. వర్షాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి. కుంభకర్ణుని నిద్రలో నిద్రించి ఉన్నారు. వినాశన సమయములో మేల్కొంటే, అప్పుడిక ఏం చేయగలరు! మరణిస్తారు. భూమి కూడా చాలా తీవ్రంగా కంపిస్తుంది. తుఫానులు, వర్షాలు మొదలైనవన్నీ సంభవిస్తాయి. బాంబులను కూడా వేస్తారు. కానీ ఇక్కడ గృహ యుద్ధాలు కూడా జరుగుతాయి. రక్తపు నదులు ప్రవహిస్తాయని గాయనం చేయబడింది. ఇక్కడ మారణ హోమము జరుగుతుంది. ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ ఉంటారు, కావున తప్పకుండా కొట్లాడుకుంటూ కూడా ఉంటారు. అందరూ అనాథలే, మీరు ఆ యజమానికి చెందినవారు. మీరు యుద్ధాలు మొదలైనవేవీ చేయకూడదు. బ్రాహ్మణులుగా అయినందుకు మీరు యజమానికి చెందినవారిగా అయ్యారు. ఇక్కడ యజమాని అనగా తండ్రి లేక పతి. శివబాబా పతులకే పతి. నిశ్చితార్థము జరిగిన తర్వాత నుండి నేను ఇటువంటి పతిని ఎప్పుడు కలుసుకుంటాను అని అంటారు. శివబాబా, మాకు మీతో నిశ్చితార్థము జరిగిపోయింది. ఇప్పుడు మేము మిమ్మల్ని ఎలా కలవాలని ఆత్మలు అంటాయి. కొందరు సత్యము వ్రాస్తారు, కొందరు చాలా దాచిపెడతారు. బాబా, మా ద్వారా ఈ పొరపాటు జరిగిపోయిందని సత్యంగా వ్రాయరు. క్షమించమని కూడా అడగరు. ఎవరైనా వికారాలకు వశమైతే బుద్ధిలో ధారణ జరగదు. మీరు అటువంటి తప్పులు చేస్తే ముక్కలు ముక్కలుగా అయిపోతారు అని బాబా చెప్తున్నారు. నేను మిమ్మల్ని సుందరంగా చేసేందుకు వచ్చాను, మీరు మళ్ళీ ఎందుకు ముఖాన్ని నల్లగా చేసుకుంటారు. స్వర్గములోకైతే వస్తారు, కానీ పైసా విలువంత పదవిని పొందుతారు. రాజధాని స్థాపనవుతూ ఉంది కదా. కొందరు ఓడిపోయి జన్మ-జన్మాంతరాలకూ పద భ్రష్టులైపోతారు. మీరు తండ్రి ద్వారా ఈ పదవిని పొందేందుకు వచ్చారు, తండ్రి ఇంత ఉన్నతంగా అవుతున్నప్పుడు, వారి పిల్లలైన మనము ప్రజలుగా అవ్వకూడదు. తండ్రి సింహాసనంపై ఉంటూ, వారి పిల్లలు దాస-దాసీలుగా అయితే, ఇది ఎంత సిగ్గుపడవలసిన విషయము. చివర్లో మీకంతా సాక్షాత్కారమౌతుంది. అప్పుడు ఎందుకలా చేశామని చాలా పశ్చాత్తాపపడతారు. సన్యాసులు కూడా బ్రహ్మాచారులుగా ఉంటారు, అందుకే వికారులంతా వారికి తల వంచి నమస్కరిస్తారు. పవిత్రతకు గౌరవముంది. భాగ్యములో లేకపోతే తండ్రి వచ్చి చదివిస్తున్నా తప్పులు చేస్తూనే ఉంటారు. స్మృతి అస్సలు చెయ్యరు. అనేక వికర్మలు జరిగిపోతాయి. పిల్లలైన మీ పై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది. ఇంతకంటే ఉన్నతమైన దశ ఇంకేదీ ఉండదు. పిల్లలైన మీ పై ఈ దశలు తిరుగుతూనే ఉంటాయి. అచ్ఛా.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ డ్రామాలో ప్రతి దృశ్యాన్ని సాక్షీగా అయి చూడాలి, ఒక్క తండ్రి స్మృతిలోనే ఆనందంగా ఉండాలి. స్మృతియాత్రలో ఎప్పుడూ ఉత్సాహము తగ్గిపోకూడదు.
2. చదువులో ఎప్పుడూ పొరపాట్లు చేయకూడదు, తమ శ్రేష్ఠ అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఓడిపోయి జన్మ-జన్మలకు పదవిని పొగొట్టుకోకూడదు.