ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు మేము ఈశ్వరీయ సంతానమని తప్పకుండా భావిస్తారు. స్వయాన్ని తప్పకుండా ఆత్మగానే భావిస్తారు. శరీరమున్నందుకే ఆత్మ దాని ద్వారా వింటుంది. తండ్రి ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు, కావుననే వినిపిస్తున్నారు. మేమిప్పుడు ఈశ్వరీయ సంతానం లేక ఈశ్వరీయ సాంప్రదాయమువారమని, తర్వాత దైవీ సాంప్రదాయమువారిగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. దేవతలే స్వర్గానికి యజమానులుగా ఉంటారు. మనం మళ్ళీ 5 వేల సంవత్సరాల క్రితం వలె దైవీ స్వరాజ్యం స్థాపన చేస్తున్నాము. మళ్ళీ మనం దేవతలుగా అవుతాము. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో మరియు విశేషంగా భారత్ లో మనుష్య మాత్రులందరూ ఒకరికొకరు దుఃఖాన్నే ఇచ్చుకుంటున్నారు. సుఖధామం కూడా ఉంటుందని వారికి తెలియనే తెలియదు. పరమపిత పరమాత్మయే వచ్చి అందరినీ సుఖవంతులుగా, శాంతిగా తయారుచేస్తారు. ఇక్కడైతే ప్రతి ఇంటిలోనూ ఒకరికొకరు దుఃఖాన్నే ఇచ్చుకుంటున్నారు. విశ్వమంతటా దుఃఖమే దుఃఖముంది. ఇప్పుడు తండ్రి మనల్ని 21 జన్మలకు సదా సుఖవంతులుగా తయారుచేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. దుఃఖం ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది, మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుంది అన్న చింతన ఇంకెవ్వరి బుద్ధిలోనూ జరగదు. మనం ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారిమని, వాస్తవానికి పూర్తి ప్రపంచంలోని మనుష్యమాత్రులందరూ ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారని మీ బుద్ధిలో మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరూ వారిని తండ్రి అని పిలుస్తారు. ఇప్పుడు శివబాబా మనకు శ్రీమతాన్నిస్తున్నారని పిల్లలకు తెలుసు. శ్రీమతం ప్రసిద్ధమైనది. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుని యొక్క ఉన్నతాతి ఉన్నతమైన మతం. వారి గతి, మతి అతీతమైనవి అని గాయనం కూడా ఉంది. శివబాబా శ్రీమతం ఎలా ఉన్న మనల్ని ఎలా తయారుచేస్తుంది! స్వర్గానికి యజమానులుగా చేస్తుంది. ఇతర మనుష్యమాత్రులందరూ నరకానికే యజమానులుగా చేస్తారు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. ఈ నిశ్చయమైతే ఉంది కదా. నిశ్చయబుద్ధి కలవారే ఇక్కడకు వస్తారు మరియు బాబా మనల్ని మళ్ళీ సుఖధామానికి యజమానులుగా తయారుచేస్తున్నారని కూడా అర్థం చేసుకుంటారు. మనమే 100 శాతం పవిత్ర గృహస్థ మార్గానికి చెందినవారిగా ఉండేవారము అనే స్మృతి కలిగింది. 84 జన్మల లెక్క కూడా ఉంది కదా. ఎవరెవరు ఎన్ని జన్మలు తీసుకుంటారు. తర్వాత ఏ ధర్మాలు వస్తాయో, వారి జన్మలు కూడా కొద్దిగానే ఉంటాయి.
ఇప్పుడు మనం ఈశ్వరీయ సంతానమని, పిల్లలైన మీరు నిశ్చయం ఏర్పరచుకోవాలి. అందరినీ శ్రేష్ఠంగా తయారుచేసేందుకు, మనకు శ్రేష్ఠ మతం లభిస్తోంది. మన తండ్రినే మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. వేద-శాస్త్రాలు మొదలైనవన్నీ భగవంతుడిని కలిసే మార్గాలని మనుష్యులు భావిస్తారు కానీ వీటి ద్వారా ఎవరూ నన్ను కలుసుకోలేరు అని భగవంతుడు చెప్తున్నారు. నేనే వస్తాను, అందుకే నా జయంతిని కూడా జరుపుకుంటారు, కాని ఎప్పుడు వస్తానో మరియు ఎవరి శరీరంలోకి వస్తానో, బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు అందరికీ సుఖాన్నివ్వాలి. ప్రపంచంలో అందరూ ఒకరికొకరు దుఃఖమునే ఇచ్చుకుంటూ ఉంటారు. వికారాలలోకి వెళ్ళడమంటే దుఃఖమివ్వడమని వారికి తెలియదు. ఇది మహా దుఃఖమని ఇప్పుడు మీకు తెలుసు. పవిత్రంగా ఉండే కుమారీని అపవిత్రం చేస్తారు. నరకవాసిగా అయ్యేందుకు ఎంత ఉత్సవం చేస్తారు. ఇక్కడైతే అటువంటి హడావిడి విషయమేమీ లేదు. మీరు చాలా శాంతిగా కూర్చుని ఉన్నారు. అందరూ సంతోషిస్తారు, విశ్వమంతటినీ సదా సుఖవంతంగా చేస్తారు. మీకు శివశక్తుల రూపంలో గౌరవముంది. మీ ఎదుట లక్ష్మీ-నారాయణులకు కూడా ఏ మాత్రమూ మహిమ లేదు. శివశక్తుల పేరే ప్రసిద్ధమై ఉంది ఎందుకంటే ఏ విధంగా బాబా సేవ చేశారో, అందరినీ పవిత్రంగా తయారుచేసి సదా సుఖవంతులుగా చేశారో, అలా మీరు కూడా తండ్రికి సహాయకులుగా అయ్యారు, కావుననే భారతమాతలైన శక్తులైన మీకు మహిమ ఉంది. ఈ లక్ష్మీ-నారాయణులు రాజా-రాణులు మరియు ప్రజలంతా స్వర్గవాసులు. అదేమైనా పెద్ద విషయమా! వారు ఎలాగైతే స్వర్గవాసులో అలా ఇక్కడి రాజా-రాణులు అందరూ నరకవాసులు. అటువంటి నరకవాసులను మీరు స్వర్గవాసులుగా తయారుచేస్తారు. మనుష్యులకు ఏమీ తెలియదు. పూర్తిగా తుచ్ఛబుద్ధికలవారిగా ఉన్నారు. ఏమేమో చేస్తూ ఉంటారు. ఎన్ని యుద్ధాలు మొదలైనవి చేస్తారు. ప్రతి విషయంలో దుఃఖమే దుఃఖముంది. సత్యయుగంలో ప్రతి విషయంలో సుఖమే సుఖముంటుంది. ఇప్పుడు అందరికీ సుఖాన్నిచ్చేందుకే బాబా శ్రేష్ఠ మతాన్నిస్తారు. శ్రీమత్ భగవానువాచ అని పాడుతూ ఉంటారు కూడా. శ్రీమత్ మనుష్య ఉవాచ అన్నది లేదు. సత్యయుగంలో దేవతలకు మతాన్నిచ్చే అవసరమే ఉండదు. ఇక్కడ మీకు శ్రీమతం లభిస్తుంది. తండ్రితో పాటు మీరు కూడా శివశక్తులుగా మహిమ చేయబడతారు. ఇప్పుడు మళ్ళీ ఆ పాత్రను ప్రాక్టికల్ గా అభినయిస్తున్నారు. పిల్లలైన మీరు మనసా, వాచా, కర్మణా అందరికీ సుఖాన్ని ఇవ్వాలని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. అందరికీ సుఖధామానికి మార్గాన్ని తెలియజేయాలి. ఇదే మీ కర్తవ్యం. శరీర నిర్వహణ కోసం పురుషులు ఉద్యోగ వ్యాపారాలు కూడా చేయవలసి వస్తుంది. సాయంత్ర వేళలో దేవతలు విహరిస్తారని అంటారు, ఇప్పుడు దేవతలు ఇక్కడకు ఎక్కడి నుండి వస్తారు. కాని ఈ సమయాన్ని శుద్ధమైనదని అంటారు. ఈ సమయంలో అందరికీ తీరిక కూడా లభిస్తుంది. పిల్లలైన మీరు నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ స్మృతి చేయాలి. అంతేకాని ఏ దేహధారికి చాకిరీ మొదలైనవి చేయకూడదు. తండ్రి ద్రౌపది పాదాలు వత్తినట్లుగా గాయనం ఉంది. దీని అర్థాన్ని తెలుసుకోరు. స్థూలంగా పాదాలు వత్తే విషయం కాదు. బాబా వద్దకు వృద్ధులు మొదలైనవారెందరో వస్తారు, భక్తి చేస్తూ-చేస్తూ అలసిపోయారని తెలుసు. అర్థకల్పం చాలా ఎదురుదెబ్బలు తిన్నారు కదా. కావున ఈ పాదాలు ఒత్తారు అన్న పదాన్నే తీసుకున్నారు. ఇప్పుడు కృష్ణుడు పాదాలు ఎలా వత్తగలరు. శోభిస్తుందా? మీరు కృష్ణుడిని పాదాలు వత్తనిస్తారా? కృష్ణుడిని చూడగానే వారిని ఒక్కసారిగా పట్టుకుంటారు. వారిలో చాలా చమత్కారముంటుంది. కృష్ణుడు తప్ప మరే విషయమూ బుద్ధిలో కూర్చోనే కూర్చోదు. వారే అందరి కంటే తేజోమయుడు. చిన్న బాలుడైన కృష్ణుడు మురళి వినిపించడమన్నది సరికాదు. ఇక్కడ మీరు శివబాబాను ఎలా కలుసుకుంటారు? శివబాబాను స్మృతి చేసి, తర్వాత వీరి వద్దకు రండి అని పిల్లలైన మీరు చెప్పవలసి ఉంటుంది. మమ్మల్ని శివబాబా 21 జన్మలకు సుఖవంతంగా తయారుచేస్తున్నారని పిల్లలైన మీకు లోలోపల సంతోషముండాలి. ఇటువంటి తండ్రికి మీరు బలిహారమైపోవాలి. సుపుత్రులుగా ఉండే పిల్లలపై తండ్రి బలిహారమవుతారు. వారు తండ్రి యొక్క ప్రతి కోరికను పూర్తి చేస్తారు. మరి కొంతమంది పిల్లలు తండ్రిని హత్య కూడా చేయిస్తారు. ఇక్కడైతే మీరు అత్యంత ప్రియమైనవారిగా అవ్వాలి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. దయాహృదయులైన పిల్లల హృదయంలో గ్రామ-గ్రామాలకు వెళ్ళి సేవ చెయ్యాలని ఉంటుంది. ఈ రోజుల్లో పాపం చాలా దుఃఖంలో ఉన్నారు. విశ్వంలో పవిత్రత, సుఖశాంతుల దైవీ స్వరాజ్యం స్థాపనవుతంది, ఇది అదే మహాభారత యుద్ధం అనే శుభవార్తను వారికి వెళ్ళి వినిపించండి. ఆ సమయంలో తప్పకుండా తండ్రి కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా తండ్రి వచ్చి ఉన్నారు. బాబా మనల్ని పురుషోత్తములుగా తయారుచేస్తున్నారని మీకు తెలుసు. ఇదే పురుషోత్తమ సంగమయుగం. మనం పురుషోత్తములుగా ఎలా అవుతామనేది పిల్లలైన మీకు తెలుసు. మీ ఉద్దేశ్యమేమిటి అని మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడం అని చెప్పండి. దేవతలు ప్రసిద్ధి చెందినవారు. దేవతల భక్తులుగా ఉన్నవారికి అర్థం చేయించాలని తండ్రి చెప్తున్నారు. మొట్టమొదట శివుని భక్తిని ప్రారంభించింది కూడా మీరే తర్వాత దేవతలను భక్తి చేశారు. కనుక మొట్టమొదట శివుని భక్తులకు అర్థం చేయించండి. నన్ను స్మృతి చేయమని శివబాబా చెప్తున్నారని వారికి చెప్పండి. శివుడిని పూజిస్తారు కాని వారు పతిత-పావనుడైన తండ్రి అని వారి బుద్ధిలోకి రాదు. భక్తిమార్గంలో ఎన్ని ఎదురుదెబ్బలు తింటారో చూడండి. శివలింగాన్ని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, వారిని పూజించవచ్చు, మరి అమరనాథ్, బద్రీనాథ్ మొదలైనవాటికి వెళ్ళే అవసరమేముంది. కాని భక్తిమార్గంలో మనుష్యులు తప్పకుండా ఎదురుదెబ్బలు తినాల్సి ఉంది. మీరు వాటి నుండి విడిపిస్తారు. మీరు శివశక్తులు, శివుని పిల్లలు. మీరు తండ్రి నుండి శక్తిని తీసుకుంటారు. అది కూడా స్మృతి ద్వారానే లభిస్తుంది. వికర్మలు వినాశనమవుతాయి. పతిత-పావనుడైతే తండ్రి కదా. స్మృతి ద్వారానే మీరు వికర్మాజీతులుగా పావనంగా అవుతారు. అందరికీ ఈ మార్గాన్ని తెలియజేయాలి. ఇప్పుడు మీరు రామునికి చెందినవారిగా అయ్యారు. రామరాజ్యంలో సుఖం, రావణరాజ్యంలో దుఃఖముంటుంది. భారత్ లోనే ఇంతగా పూజ జరిగే వారందరి చిత్రాలున్నాయి. అనేక మందిరాలున్నాయి. కొందరు హనుమంతుని పూజారులు, కొందరు ఇంకొకరి పూజారులు. దీనినే అంధవిశ్వాసమని అంటారు. ఇంతకుముందు మనం కూడా అంధులుగా ఉండేవారిమని ఇప్పుడు మీకు తెలుసు. బ్రహ్మా, విష్ణు, శంకరులు ఎవరో, ఏమిటో వీరికి కూడా ఇంతకుముందు తెలియదు. పూజ్యులుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. సత్యయుగంలో పూజ్యులు, ఇక్కడ పూజారులు. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు. పూజ్యులు సత్యయుగంలో ఉంటారని మీకు తెలుసు. ఇక్కడ ఉండేదే పూజారులు కనుక పూజలే చేస్తారు. మీరు శివశక్తులు. ఇప్పుడు మీరు పూజారులూ కాదు, పూజ్యులూ కాదు. తండ్రిని మర్చిపోకండి. ఇది సాధారణ తనువు కదా. ఇందులో ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు వస్తారు. మీరు తండ్రిని మీ వద్దకు రమ్మని ఆహ్వానిస్తారు కదా. బాబా రండి, మేము చాలా పతితంగా అయిపోయాము. పాత పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి. పిల్లలు ఆహ్వానిస్తారు. ఇక్కడైతే పావనంగా ఉన్నవారు ఎవ్వరూ లేరు. పతితులందరినీ తప్పకుండా పావనంగా తయారుచేసి తీసుకువెళ్తారు కదా. కావున అందరూ శరీరాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. మనుష్యులు శరీరాన్ని విడిచిపెడితే ఎంతగానో దుఃఖపడతారు. మీరు సంతోషంగా వెళ్తారు. ఎవరు శివబాబాను ఎక్కువగా స్మృతి చేస్తారో చూద్దామని ఇప్పుడు మీ ఆత్మ రేస్ చేస్తుంది. శివబాబా స్మృతిలో ఉంటూ-ఉంటూ శరీరాన్ని విడిచిపెడితే అహో సౌభాగ్యం. నావ తీరానికి చేరిపోతుంది. ఇటువంటి పురుషార్థం చేయమని బాబా అందరికీ చెప్తున్నారు. సన్యాసులలో కూడా కొందరు అటువంటివారు ఉంటారు. బ్రహ్మతత్వంలో లీనమయ్యేందుకు అభ్యాసం చేస్తారు. అంతిమంలో అలా కూర్చుని-కూర్చునే శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. నిశ్శబ్ధం ఏర్పడుతుంది.
సుఖవంతమైన రోజులు మళ్ళీ వస్తాయి. అందుకోసమే మీరు పురుషార్థం చేస్తారు. బాబా, మేము మీ వద్దకు రావాలి, మిమ్మల్నే స్మృతి చేస్తూ-చేస్తూ మా ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతుందో, అప్పుడు మీరు మమ్మల్ని మీతోపాటు తీసుకెళ్తారు అని అంటారు. ఇంతకుముందు కాశీలోని కత్తులబావిలోకి దూకేటప్పుడు చాలా ప్రేమగా బలి అయ్యేవారు, ఇంక మేము ముక్తులైపోతామని భావించేవారు. ఇప్పుడు మీరు బాబాను స్మృతి చేస్తూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు, ఈ స్మృతి బలం ద్వారా పాపాలు అంతమైపోతాయి. వారు నీటి ద్వారా మా పాపాలు సమాప్తమవుతాయని, ముక్తి లభిస్తుందని భావిస్తారు. అది యోగబలమేమీ కాదు అని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. పాపాల శిక్షలను అనుభవిస్తూ-అనుభవిస్తూ వెళ్ళి జన్మ తీసుకుంటారు, మళ్ళీ కొత్తగా పాపాల ఖాతా ప్రారంభమవుతుంది. కర్మ, అకర్మ, వికర్మల గతిని బాబా కూర్చుని అర్థం చేయిస్తారు. రామరాజ్యంలో కర్మలు అకర్మలుగా అవుతాయి, రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగా అవుతాయి. అక్కడ వికారాలు మొదలైనవేవీ ఉండవు.
బాబా మనకు అన్ని యుక్తులు, అన్ని రహస్యాలు అర్థం చేయిస్తున్నారని మధురాతి మధురమైన పుష్పాల వంటి పిల్లలకు తెలుసు. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. పతిత-పావనుడైన తండ్రి మీ సన్ముఖంలో కూర్చుని ఉన్నారు, ఎంతటి నిర్మానచిత్తులు. ఎటువంటి అహంకారమూ లేదు, చాలా సాధారణంగా నడుచుకుంటూ ఉంటారు. బాప్ దాదా ఇద్దరూ పిల్లల సేవకులే. మీకు ఇద్దరు సేవాధారులున్నారు, ఉన్నతాతి ఉన్నతమైన శివబాబా మరియు ప్రజాపిత బ్రహ్మా. వారైతే త్రిమూర్తి బ్రహ్మా అని అనేస్తారు. అర్థమేమీ తెలియదు. త్రిమూర్తి బ్రహ్మా ఏం చేస్తారో, ఏమీ తెలియదు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మనం ఈశ్వరీయ సంతానం, మనం శ్రేష్ఠ మతానుసారంగా నడుచుకోవాలని సదా నిశ్చయముండాలి. ఎవ్వరికీ దుఃఖము ఇవ్వకూడదు. అందరికీ సుఖాన్నిచ్చే మార్గాన్ని తెలియజేయాలి.
2. సుపుత్రులుగా అయ్యి తండ్రిపై బలిహారం అవ్వాలి, బాబా ప్రతి కోరికను పూర్తిచేయాలి. ఏ విధంగా బాప్ దాదా నిర్మానచిత్తులుగా, నిరహంకారులుగా ఉన్నారో, అలా తండ్రి సమానంగా అవ్వాలి.