ఓంశాంతి. పిల్లలైన మీరు కూర్చోవడం చాలా సాధారణమైనదే. ఎక్కడైనా కూర్చోవచ్చు. అడవిలోనైనా కూర్చోండి, పర్వతము మీదైనా కూర్చోండి, ఇంట్లో అయినా కూర్చోండి లేక కుటీరములోనైనా కూర్చోండి, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇలా కూర్చున్నట్లయితే పిల్లలైన మీరు బదిలీ అవుతారు. ఇప్పుడు మనము మనుష్యులము. భవిష్యత్తులో దేవతలుగా అవుతున్నామని, ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. బాబా తోటయజమానే కాక తోటమాలి కూడా. మనము తండ్రిని స్మృతి చేయడం ద్వారా, 84 జన్మల చక్రాన్ని తిప్పడం ద్వారా బదిలీ అవుతున్నాము. ఇక్కడ కూర్చోండి లేదా మరెక్కడైనా కూర్చోండి. మీరు బదిలీ అవుతూ అవుతూ మనుష్యుల నుండి దేవతలుగా అవుతూ ఉంటారు. మేమిలా అవుతున్నామని బుద్ధిలో లక్ష్యముంది. ఏ పని చేస్తున్నా, రొట్టెలు కాలుస్తున్నా, బుద్ధిలో కేవలం తండ్రిని స్మృతి చేయండి. పిల్లలకు ఈ శ్రీమతము లభిస్తూ ఉంది - "నడుస్తూ, తిరుగుతూ అన్ని పనులు చేస్తూ కేవలం స్మృతిలో ఉండండి." తండ్రి స్మృతి ద్వారా వారసత్వము కూడా స్మృతి కలుగుతుంది, 84 జన్మల చక్రము కూడా స్మృతి కలుగుతుంది. ఇందులో ఇంకే ఇతర కష్టమూ లేదు. మనము దేవతలుగా అవుతున్నాము కావున ఎటువంటి ఆసురీ స్వభావము ఉండకూడదు. ఎవరి పైనా కోపగించుకోకూడదు, ఎవరికీ దుఃఖమునివ్వకూడదు, ఎటువంటి వ్యర్థ విషయాలను చెవులతో వినకూడదు. కేవలం తండ్రిని స్మృతి చేయండి. ప్రపంచములోని వ్యర్థ విషయాలనైతే చాలా వింటూ వచ్చారు, అర్ధకల్పము నుండి వ్యర్థ మాటలు వింటూ వింటూ మీరు క్రిందకు దిగజారిపోయారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పకూడదు. ఫలానావారు ఈ విధంగా ఉన్నారు, వీరిలో ఇది ఉంది అంటూ ఎటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ఇది తమ సమయాన్ని వ్యర్థము చేసుకోవడమే. మీ సమయం చాలా విలువైనది. చదువులోనే మీ కళ్యాణముంది, దీని ద్వారానే పదవిని పొందుతారు. ఆ చదువులో చాలా కష్టపడవలసి వస్తుంది. పరీక్ష పాసయ్యేందుకు విదేశాలకు వెళ్తారు. మీకైతే ఏ కష్టమూ ఇవ్వడం లేదు. తండ్రినైన నన్ను స్మృతి చేయండి, ఒకరి ఎదురుగా మరొకరిని కూర్చోబెట్టినా తండ్రి స్మృతిలోనే ఉండండి అని తండ్రి ఆత్మలకు చెప్తారు. స్మృతిలో కూర్చుంటూ-కూర్చుంటూ మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. ఇది ఎంత మంచి యుక్తి! మరి తండ్రి శ్రీమతమును అనుసరించాలి కదా! ప్రతి ఒక్కరికి వేరు-వేరు వ్యాధులుంటాయి. ప్రతి ఒక్క వ్యాధికీ సర్జన్ ఉంటారు. పెద్ద పెద్ద మనుష్యుల దగ్గర ప్రత్యేకంగా సర్జన్ ఉంటారు కదా! మీకు సర్జన్గా ఎవరున్నారు? భగవంతుడు. వారు అవినాశి సర్జన్. నేను మిమ్మల్ని అర్ధకల్పము కొరకు నిరోగులుగా చేస్తానని అంటారు. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే, వికర్మలు వినాశనమౌతాయి. మీరు 21 జన్మల కొరకు నిరోగులుగా అవుతారు. ఇప్పుడు ఈ ముడిని వేసుకోవాలి. స్మృతి ద్వారానే మీరు నిరోగులుగా అవుతారు. తర్వాత 21 జన్మల కొరకు ఎటువంటి రోగమూ ఉండదు. ఆత్మ అయితే అవినాశి. శరీరమే రోగగ్రస్థంగా అవుతుంది. కాని అనుభవించేది ఆత్మయే కదా! అక్కడ అర్ధకల్పము మీరెప్పుడూ రోగగ్రస్థులుగా అవ్వరు. కేవలం స్మృతిలో తత్పరులై ఉండండి. పిల్లలే సేవ చేయాలి. ప్రదర్శినీలో సేవ చేస్తూ-చేస్తూ పిల్లల గొంతు ఎండిపోతుంది. మేము సేవ చేస్తూ చేస్తూ బాబా దగ్గరకు వెళ్ళిపోతామని కొంతమంది పిల్లలు భావిస్తారు. ఈ సేవా విధానం కూడా చాలా బాగుంది. ప్రదర్శినిలో కూడా పిల్లలు అర్థము చేయించాలి. ప్రదర్శినిలో మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణుల చిత్రము చూపించాలి. ఇది ఎ-వన్ చిత్రము. భారతదేశములో నేటికి 5 వేల సంవత్సరాల క్రితము వీరి రాజ్యముండేది. లెక్కలేనంత ధనముండేది. పవిత్రత, సుఖ-శాంతులన్నీ ఉండేవి. కాని భక్తిమార్గములో సత్యయుగానికి లక్షల సంవత్సరాలని చూపించారు. మరి ఏ విషయమైనా ఎలా గుర్తొస్తుంది? ఈ లక్ష్మీనారాయణులది ఫస్ట్ క్లాస్ చిత్రము. సత్యయుగములో వీరి వంశమువారు 1250 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. ఇంతకుముందు మీకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు, మీరే మొత్తం విశ్వంపై రాజ్యము చేసేవారు, ఈ విషయం మీరు మర్చిపోయారా అంటూ స్మృతిని కలిగించారు. 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు. మీరే సూర్య వంశీయులుగా ఉండేవారు. పునర్జన్మలనైతే తీసుకుంటారు. 84 జన్మలు మీరెలా తీసుకున్నారో అర్థము చేసుకోవడం చాలా సహజమైన విషయము. క్రిందకు దిగజారుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి ఎక్కే కళలోకి తీసుకువెళ్తారు. మీ ఎక్కే కళ ద్వారా అందరికీ మేలు జరుగుతుందని గాయనముంది (చఢ్తీ కళా తేరే భానే సర్వ్ కా భలా). తర్వాత శంఖం మొదలైనవి పూరిస్తారు. ఇప్పుడు హాహాకారాలవుతాయని పిల్లలైన మీకు తెలుసు, పాకిస్తాన్లో ఏమేం జరిగాయో చూశారు కదా! అందరి నోటి ద్వారా - "ఓ భగవంతుడా! ఓ రామా! ఇప్పుడేమవుతుంది" అన్న ఈ శబ్దాలే వెలువడేవి. కాని ఇప్పుడు జరగబోయే వినాశనము చాలా పెద్దది. దీని తర్వాత జయజయకారాలు వినిపిస్తాయి. ఈ అనంతమైన ప్రపంచము ఇప్పుడు వినాశనమవుతుందని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన జ్ఞానాన్ని మీకు వినిపిస్తారు. హద్దు విషయాలను, చరిత్ర-భూగోళాలను వింటూ వచ్చారు. లక్ష్మీనారాయణులు రాజ్యపాలన ఎలా చేశారో ఎవ్వరికీ తెలియదు. వీరి చరిత్ర-భూగోళాలు ఎవ్వరికీ తెలియదు. ఇన్ని జన్మలు రాజ్యపాలన చేశారని, తర్వాత ఫలానా ధర్మముంటుందని మీరు బాగా అర్థం చేసుకున్నారు, దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు, ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు ఇస్తారు. అక్కడ మనుష్యులు మనుష్యులను చదివిస్తారు. ఇక్కడ ఆత్మలమైన మనల్ని పరమాత్మ తమ సమానంగా చేస్తున్నారు. టీచర్ తప్పకుండా తన సమానంగా చేస్తారు కదా!
నేను మిమ్మల్ని నా కంటే ఉన్నతంగా డబల్ కిరీటధారులుగా చేస్తానని తండ్రి అంటున్నారు. స్మృతి ద్వారా ప్రకాశ కిరీటము లభిస్తుంది, 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు, ఇప్పుడు పిల్లలైన మీకు కర్మ-అకర్మ-వికర్మల గతిని కూడా అర్థము చేయించాను. సత్యయుగములో కర్మ అకర్మగా ఉంటుంది. రావణ రాజ్యములో కర్మ వికర్మగా ఉంటుంది. మెట్లు దిగుతూ వస్తారు, కళలు తక్కువ అవుతూ-అవుతూ క్రిందికి దిగవలసిందే. ఎంతో అశుద్ధంగా అయిపోతారు. తరువాత తండ్రి వచ్చి భక్తులకు ఫలమిస్తారు. ప్రపంచములో అందరూ భక్తులే. సత్యయుగంలో భక్తులెవ్వరూ ఉండరు. భక్తి సాంప్రదాయం ఇక్కడే ఉంది. అక్కడ జ్ఞాన ప్రారబ్ధముంటుంది. మేము తండ్రి ద్వారా అనంతమైన పారబ్ధాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఎవరికైనా మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణుల చిత్రము చూపించి వివరించండి. నేటికి 5 వేల సంవత్సరాల క్రితము వీరి రాజ్యము ఉండేది. విశ్వములో సుఖము-శాంతి-పవిత్రత అన్నీ ఉండేవి. ఇంకే ధర్మమూ ఉండేది కాదు. ఈ సమయంలో అనేక ధర్మాలున్నాయి, ఆ మొదటి ధర్మము లేదు. మళ్ళీ ఈ ధర్మము తప్పకుండా రావలసిందే. ఇప్పుడు తండ్రి ఎంత ప్రేమగా చదివిస్తున్నారు! యుద్ధము మాటే లేదు. ఇది పేద జీవితము, పరాయి రాజ్యము, మనదంతా గుప్తము. తండ్రి కూడా గుప్తంగా వచ్చి ఉన్నారు. ఆత్మలకు కూర్చొని అర్థము చేయిస్తున్నారు. ఆత్మయే అన్నీ చేస్తుంది. శరీరము ద్వారా పాత్రను అభినయిస్తుంది. అది ఇప్పుడు దేహాభిమానములోకి వచ్చింది. ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రి ఇక ఏ ఇతర కష్టమునివ్వరు. తండ్రి గుప్త రూపములో వచ్చారు, కావున పిల్లలైన మీకు గుప్త దానంగా విశ్వరాజ్య చక్రవర్తి పదవినిస్తారు. మీదంతా గుప్తము. అందుకే ఆచారము ప్రకారం కన్యకు వరకట్నము ఇచ్చినప్పుడు గుప్తంగానే ఇస్తారు. నిజానికి గుప్త దానము మహాపుణ్యమని మహిమ చేయబడుతుంది. ఇద్దరు ముగ్గురికి తెలిసినట్లయితే ఆ శక్తి తక్కువైపోతుంది.
పిల్లలూ! మీరు ప్రదర్శినిలో మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణుల చిత్రముపై అందరికీ అర్థం చేయించండని తండ్రి చెప్తున్నారు. విశ్వములో శాంతి కావాలని మీరు కోరుకుంటారు కదా! కాని అది ఎప్పుడు ఉండేదో ఎవరి బుద్ధిలోనూ లేదు. సత్యయుగంలో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉండేవని మీకిప్పుడు తెలుసు, ఫలానావారు స్వర్గస్థులయ్యారని గుర్తు చేసుకుంటారే కాని ఏమీ అర్థము చేసుకోరు. ఎవరికేమి తోస్తే అది చెప్పేస్తారు, అర్థమే ఉండదు. ఇది డ్రామా. మధురాతి మధురమైన పిల్లలకు, మేము 84 జన్మల చక్రాన్ని తిరిగామనే జ్ఞానము బుద్ధిలో ఉంది. పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళేందుకు తండ్రి ఇప్పుడు వచ్చారు. తండ్రి స్మృతిలో ఉంటూ బదిలీ అవుతూ ఉంటారు. ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. మళ్ళీ మనము చక్రవర్తి రాజులుగా అవుతాము. అలా తయారుచేసేవారు తండ్రి. ఆ పరమాత్మ సదా పవిత్రమైనవారు. పవిత్రంగా చేసేందుకు వారే వస్తారు. సత్యయుగములో మీరు సుందరంగా అవుతారు. అక్కడ సహజ సౌందర్యముంటుంది. ఈ రోజుల్లో కృత్రిమ అలంకరణ చేసుకుంటారు కదా. ఎటువంటి ఫ్యాషన్లు వెలువడ్డాయి. ఎటువంటి వస్త్రాలను ధరిస్తారో చూడండి. ఇంతకుముందు స్త్రీలు ఎవరి దృష్టి తమపై పడకూడదని పరదాలలో ఉండేవారు. ఇప్పుడైతే ఆ పరదా తెరుచుకోవడంతో ఎక్కడ చూస్తే అక్కడ అశుద్ధత పెరిగిపోయింది. చెడు వినకండి అని తండ్రి అంటున్నారు.
రాజులో శక్తి ఉంటుంది. ఈశ్వరార్థంగా దానము చేసినప్పుడు అందులో శక్తి ఉంటుంది. ఇక్కడ ఎవ్వరిలోనూ శక్తి లేదు. ఎవరికి ఏది తోస్తే వారది చేస్తూ ఉంటారు. మనుష్యులు చాలా అశుద్ధంగా ఉన్నారు, మీరు చాలా సౌభాగ్యశాలురు ఎందుకంటే నావికుడు మీ చేతిని పట్టుకున్నారు. కల్ప-కల్పము మీరే నిమిత్తులుగా అవుతారు. మొదట ముఖ్యమైనది దేహాభిమానమని మీకు తెలుసు, దాని తర్వాతనే అన్ని భూతాలు వస్తాయి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసే శ్రమ చేయాలి, ఇదేమీ చేదు మందు కాదు. కేవలం మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. బాబా స్మృతిలో ఉంటూ ఎంత దూరము నడుచుకుంటూ వెళ్ళినా కాళ్ళు అలసిపోవు. తేలికగా అయిపోతారు. చాలా సహయోగము లభిస్తుంది. మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతారు. మనము విశ్వానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. తండ్రి దగ్గరకు వచ్చారు కావున ఇంకే కష్టమూ ఇవ్వరు. కేవలం చెడు వినకండి అని పిల్లలకు చెప్తారు. సేవకు యోగ్యులైన పిల్లల నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలే వెలువడతాయి. జ్ఞాన విషయాలు తప్ప ఇతర ఏ మాటలూ వెలువడకూడదు. మీరు ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ ఎప్పుడూ చెప్పకూడదు, వినకూడదు. సేవ చేసే పిల్లల నోటి నుండి సదా రత్నాలే వెలువడతాయి. జ్ఞాన మాటలు వినిపించడం తప్ప మిగిలినదంతా రాళ్ళు విసరడము వంటిదే. రాళ్ళు విసరడం లేదంటే తప్పకుండా జ్ఞాన రత్నాలనే ఇస్తారు. అయితే రాళ్ళు విసురుతారు లేదంటే జ్ఞాన రత్నాలను ఇస్తారు, వీటి విలువను మాటలలో వర్ణించలేరు. తండ్రి వచ్చి మీకు జ్ఞాన రత్నాలను ఇస్తారు. అది భక్తి. రాళ్ళనే విసురుతూ ఉంటారు.
తండ్రి చాలా చాలా మధురమైనవారని పిల్లలకు తెలుసు, మీరే తల్లి-తండ్రి అని అర్ధకల్పము నుండి మహిమ చేస్తూ వచ్చారు, కాని అర్థమును ఏ మాత్రమూ తెలుసుకునేవారు కాదు. చిలుక వలె కేవలం పాడుతూ ఉండేవారు. పిల్లలైన మీకు ఎంతో సంతోషముండాలి. బాబా మనకు అనంతమైన వారసత్వాన్ని, విశ్వ రాజ్యభాగ్యాన్ని ఇస్తున్నారు. 5 వేల సంవత్సరాల క్రితము మనము విశ్వానికి యజమానులుగా ఉండేవారము. ఇప్పుడు అలా లేము, మళ్ళీ అవుతాము. శివబాబా బ్రహ్మా ద్వారా వారసత్వమునిస్తారు. బ్రాహ్మణ కులము కావాలి కదా. భగీరథుడని చెప్పడం ద్వారా కూడా అర్థము చేసుకోలేరు. కావున బ్రహ్మా మరియు వారి బ్రాహ్మణ కులము ఉంది. బ్రహ్మా తనువులో ప్రవేశిస్తారు. కావున వారిని భగీరథుడు అని అంటారు. బ్రహ్మా పిల్లలే బ్రాహ్మణులు. బ్రాహ్మణులది పిలక స్థానము. విరాట రూపము కూడా ఎలా ఉంటుందంటే పైన బాబా, తర్వాత ఎవరైతే ఈశ్వరీయ సంతానంగా అవుతారో ఆ సంగమయుగ బ్రాహ్మణులు ఉంటారు. మేము ఇప్పుడు ఈశ్వరీయ సంతానంగా అయ్యామని, తర్వాత దైవీ సంతానంగా అవుతామని మీకు తెలుసు. కావున డిగ్రీ తగ్గిపోతుంది. దానితో పోలిస్తే ఈ లక్ష్మీనారాయణుల డిగ్రీ కూడా తక్కువే ఎందుకంటే వీరిలో జ్ఞానము లేదు. జ్ఞానము బ్రాహ్మణులైన మీలో ఉంది. కాని లక్ష్మీనారాయణులను అజ్ఞానులని అనరు. వీరు జ్ఞానము ద్వారా ఈ పదవిని పొందారు. బ్రాహ్మణులైన మీరు ఎంతో ఉన్నతమైనవారు, తర్వాత దేవతలుగా అయినప్పుడు జ్ఞానము ఏ మాత్రమూ ఉండదు, వారిలో జ్ఞానమున్నట్లయితే అది దైవీ వంశములో పరంపరగా కొనసాగుతూ వచ్చేది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు అన్ని రహస్యాలు, అన్ని యుక్తులు అర్థం చేయిస్తున్నారు. రైలులో కూర్చొని కూడా మీరు సర్వీసు చేయవచ్చు. ఒక చిత్రము గురించి పరస్పరము చర్చించుకుంటూ ఉంటే అనేకమంది వచ్చి గుమిగూడతారు. ఈ కులానికి చెందినవారు మంచిరీతిగా ధారణ చేసి ప్రజలుగా అవుతారు. సర్వీసు కొరకు చాలా మంచి-మంచి చిత్రాలున్నాయి. భారతవాసులైన మనము మొదట దేవీదేవతలుగా ఉండేవారము, ఇప్పుడైతే ఏమీ లేదు. చరిత్ర, భూగోళాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. మధ్యలో ఇది సంగమయుగము, ఇందులో మీరు పురుషోత్తములుగా అవుతారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. జ్ఞాన విషయాలు తప్ప ఇంకే ఇతర విషయాలు నోటి ద్వారా వెలువడకూడదు. వ్యర్థ విషయాలనెప్పుడూ వినకూడదు. నోటి ద్వారా సదా రత్నాలే వెలువడుతూ ఉండాలి, రాళ్ళు వెలువడకూడదు.
2. సర్వీసుతో పాటు స్మృతియాత్రలో ఉండి స్వయాన్ని నిరోగిగా చేసుకోవాలి. అవినాశి సర్జన్ అయిన భగవంతుడే 21 జన్మలకు నిరోగిగా చేసేందుకు మాకు లభించారు... ఈ నషాలో మరియు సంతోషంలో ఉండాలి.