26-06-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరిప్పుడు శ్రీమతానుసారముగా అతి సైలెన్స్ లోకి వెళ్తున్నారు, మీకు తండ్రి ద్వారా శాంతి యొక్క వారసత్వము లభిస్తుంది, శాంతిలో అన్నీ వచ్చేస్తాయి"

ప్రశ్న:-

కొత్త ప్రపంచ స్థాపనకు ముఖ్యమైన ఆధారము ఏమిటి?

జవాబు:-

పవిత్రత. తండ్రి బ్రహ్మా తనువులోకి వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసినప్పుడు మీరు పరస్పరములో సోదరీ-సోదరులుగా అవుతారు. స్త్రీ - పురుషుల భావం తొలగిపోతుంది. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మేము పరస్పరములో సోదరీ-సోదరులుగా ఉంటామని, వికారీ దృష్టిని ఉంచుకోమని, ఒకరినొకరు అప్రమత్తం చేసుకుంటూ ఉన్నతిని పొందుతాము అని మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకుంటారు.

గీతము:-

మేలుకోండి ప్రేయసులారా! మేలుకోండి... (జాగ్ సజనియా జాగ్....)

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు మరియు బుద్ధిలో స్వదర్శన చక్రము తిరిగింది. తండ్రి కూడా స్వదర్శన చక్రధారిగా పిలువబడతారు, ఎందుకంటే స్వదర్శన చక్రధారిగా అవ్వడం అనగా సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడము. ఈ విషయాలు తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. బ్రాహ్మణులైన మీ ఆధారమంతా సైలెన్స్ పైనే ఉంది. శాంతిదేవ, ఓ శాంతినిచ్చేవారా... అని మనుష్యులందరూ పిలుస్తూ ఉంటారు... కాని శాంతిని ఎవరిస్తారు లేక శాంతిధామానికి ఎవరు తీసుకువెళ్తారు అన్నది ఎవ్వరికీ తెలియదు. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, బ్రాహ్మణులే స్వదర్శన చక్రధారులుగా అవుతారు. దేవతలను స్వదర్శన చక్రధారులని అనరు. ఎంతగా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. మీరు ప్రతి ఒక్కరూ నంబరువారు పురుషార్థానుసారముగా స్వదర్శన చక్రధారులే అని తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. తండ్రిని స్మృతి చేయడమంటే శాంతి వారసత్వమును తీసుకోవడం. శాంతిలో అన్నీ వచ్చేస్తాయి. మీ ఆయుష్షు కూడా పెరుగుతుంది, నిరోగి శరీరము కూడా తయారవుతూ ఉంటుంది. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ స్వదర్శన చక్రధారులుగా చేయలేరు. ఆత్మనే అలా అవుతుంది. తండ్రి కూడా స్వదర్శన చక్రధారినే, ఎందుకంటే వారిలో సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. ఇప్పుడు కొత్త ప్రపంచము స్థాపనవుతుందని పాటలో కూడా విన్నారు. పాటనైతే మనుష్యులే తయారుచేశారు. తండ్రి కూర్చుని సారాన్ని అర్థం చేయిస్తున్నారు. వారు ఆత్మలందరికీ తండ్రి, కావున పిల్లలందరూ పరస్పరములో సోదరులవుతారు. తండ్రి ప్రజాపిత బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచాన్ని రచించినప్పుడు మీరు సోదరీ సోదరులుగా అవుతారు, ప్రతిఒక్కరూ బ్రహ్మాకుమార్ కుమారీలమని బుద్ధిలో ఉన్నట్లయితే స్త్రీ పురుషులమనే భావము తొలగిపోతుంది. వాస్తవానికి తాము కూడా సోదరులేనని మనుష్యులకు తెలియదు. తర్వాత, తండ్రి రచనను రచించినప్పుడు సోదరీ సోదరులుగా అవుతారు. అశుద్ధమైన దృష్టి తొలగిపోతుంది. ఓ పతిత-పావనా అని పిలుస్తూ వచ్చారు అని తండ్రి స్మృతిని కూడా ఇప్పిస్తున్నారు, ఇప్పుడు నేను వచ్చాను, ఈ అంతిమ జన్మ పవిత్రంగా ఉండమని మీకు చెప్తున్నాను. అప్పుడు మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఈ ప్రదర్శని అనేది ప్రతి ఇంట్లో ఉండాలి ఎందుకంటే పిల్లలైన మీరు బ్రాహ్మణులు. మీ ఇళ్ళలో ఈ చిత్రాలు తప్పకుండా ఉండాలి. వీటిపై అర్థం చేయించడం చాలా సహజము. 84 జన్మల చక్రమైతే బుద్ధిలో ఉంది. అచ్ఛా - మీకొక బ్రాహ్మణిని (టీచరును) ఇచ్చేస్తాము. వారు వచ్చి సేవ చేసి వెళ్తారు. మీరు ప్రదర్శనీలను ఏర్పాటు చేయండి. భక్తిమార్గములో కూడా ఎవరికైనా కృష్ణుని పూజ లేక మంత్రాలు మొదలైనవి తెలియకపోతే బ్రాహ్మణుడిని పిలుస్తారు. వారు రోజూ వచ్చి పూజ చేస్తారు. అలాగే మీరు కూడా (టీచరును) అడగచ్చు. ఇది చాలా సహజము. తండ్రి ప్రజాపిత బ్రహ్మా ద్వారా సృష్టిని రచించినప్పుడు బ్రహ్మాకుమార కుమారీలు తప్పకుండా సోదరీ సోదరులై ఉంటారు. మేము ఇరువురమూ సోదరీ సోదరులుగా ఉంటాము, వికారీ దృష్టిని ఉంచుకోము, ఒకరినొకరు అప్రమత్తం చేసుకుని ఉన్నతిని పొందుతాము అని ప్రతిజ్ఞ చేస్తారు. ముఖ్యమైనది స్మృతియాత్రయే. వారు సైన్సు బలముతో ఎంతో పైకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు, కాని పైన ప్రపంచమేమి ఉండదు. ఇది సైన్సు అతిలోకి వెళ్ళడము. మీరిప్పుడు శ్రీమతానుసారముగా అతి సైలెన్స్ లోకి వెళ్తున్నారు. వారిది సైన్సు అయితే ఇక్కడ మీది సైలెన్సు. ఆత్మ అయితే స్వయం శాంత స్వరూపమని పిల్లలకు తెలుసు. ఈ శరీరము ద్వారా కేవలం పాత్రను అభినయించవలసి ఉంటుంది. కర్మ లేకుండా ఎవ్వరూ ఉండలేరు. స్వయాన్ని శరీరము నుండి వేరుగా ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమౌతాయని తండ్రి చెప్తున్నారు. ఇది చాలా సహజము, అందరికంటే ఎక్కువగా నా భక్తులకు అంటే శివుని పూజారులకు అర్థం చేయించండి. ఉన్నతాతి ఉన్నతమైన పూజ శివునికి జరుగుతుంది ఎందుకంటే వారే సర్వుల సద్గతిదాత.

అందరినీ తనతోపాటు తీసుకువెళ్ళడానికి తండ్రి వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. డ్రామానుసారముగా సమయము వచ్చినప్పుడు మనము కూడా కర్మాతీత అవస్థను పొందుతాము, తర్వాత వినాశనమైపోతుంది. ఆత్మలైన మనము సతోప్రధానంగా అయ్యేందుకు చాలా పురుషార్థము చేయాలి. తండ్రి శ్రీమతంపై నడవాలి, శ్రీమద్భగవద్గీత అని అంటారు కదా, అందులో ఎంత గొప్ప మహిమ ఉంది. సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు అని దేవతలకు మహిమ కూడా పాడుతారు.... తండ్రే వచ్చి సంపూర్ణ పావనంగా తయారుచేస్తారు. ఎప్పుడైతే సంపూర్ణ పతిత ప్రపంచంగా అవుతుందో అప్పుడు తండ్రి వచ్చి సంపూర్ణ పావన ప్రపంచంగా తయారుచేస్తారు. మేము భగవంతుని పిల్లలమని అందరూ అంటారు, మరి తప్పకుండా స్వర్గ వారసత్వము ఉండాలి. ప్రజాపిత బ్రహ్మా ద్వారా మనమిప్పుడు సోదరీ-సోదరులుగా అయ్యాము. కల్పక్రితము కూడా తండ్రి వచ్చారు, శివజయంతిని జరుపుకుంటారు. తప్పకుండా ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలుగా అయి ఉంటారు. బాబా, మేము పరస్పరములో సహచరులు (కంపానియన్లు) గా ఉంటూ పవిత్రంగా ఉంటాము, మీ డైరక్షన్ అనుసారముగా నడుచుకుంటాము అని తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు. ఇదేమంత పెద్ద విషయం కాదు. ఇప్పుడిది అంతిమ జన్మ, ఈ మృత్యులోకము సమాప్తమవ్వనున్నది. మీరిప్పుడు వివేకవంతులుగా అయ్యారు. కొందరు స్వయాన్ని భగవంతుడని భావిస్తారు, భగవంతుడిని సర్వుల సద్గతిదాత అని అంటారు. మరి వీరు స్వయాన్ని అలా ఎలా పిలుచుకోగలరు? కాని దీనిని డ్రామా ఆటగా భావిస్తారు.

తండ్రి పిల్లలైన మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారుచేస్తున్నారు. ఇప్పుడు సేవలో తత్పరులై ఉండండి, ప్రతి ఇంటిలోనూ ప్రదర్శనీను తెరవండి అని తండ్రి చెప్తున్నారు. ఇంతకన్నా మహాపుణ్యము మరేదీ ఉండదు. ఎవరికైనా తండ్రి గురించి మర్గాన్ని తెలియజేయడం వంటి దానమేదీ లేదు. నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయని తండ్రి చెప్తున్నారు. దీని కోసమే తండ్రిని ఓ పతిత-పావనా, ముక్తిదాతా, మార్గదర్శకుడా రండి అని పిలుస్తారు. మీకు కూడా పాండవులు అన్న పేరే ఉంది. తండ్రి కూడా మార్గదర్శకుడే. ఆత్మలందరినీ తీసుకువెళ్తారు. వారు దైహిక మార్గదర్శుకులు. వీరు ఆత్మికమైనవారు. అది దైహిక యాత్ర, ఇది ఆత్మిక యాత్ర. సత్యయుగములో భక్తిమార్గపు దైహికయాత్రలు ఉండవు. అక్కడ మీరు పూజ్యులుగా ఉంటారు, ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా చేస్తున్నారు. మరి తండ్రి మతంపై నడుచుకోవాలి కదా. ఏదైనా సంశయం మొదలైనవి ఉంటే అడగాలి. మధురాతి మధురమైన పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. మీరు నా గారాబాల పిల్లలు కదా. మీరు అర్థకల్పపు ప్రేయసులు. ఒక్కరికే అనేక పేర్లను పెట్టేశారు, ఎన్ని పేర్లు పెట్టారు, ఎన్ని మందిరాలు నిర్మించారు. నేనైతే ఒక్కడినే. నా పేరు శివ. నేను 5 వేల సంవత్సరాల క్రితము భారత్ లోనే వచ్చాను. పిల్లలను దత్తత తీసుకున్నాను. ఇప్పుడు కూడా దత్తత తీసుకుంటున్నాను. బ్రహ్మా పిల్లలుగా అయిన కారణంగా మీరు మనమలు, మనవరాళ్ళుగా అయ్యారు. ఇక్కడ ఆత్మకే వారసత్వము లభిస్తుంది. ఇందులో సోదరీ సోదరులు అనే ప్రశ్నే ఉండదు. ఆత్మయే చదువుకుంటుంది, వారసత్వము తీసుకుంటుంది. అందరికీ హక్కు ఉంది. పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచములో చూస్తున్నదంతా వినాశనమవ్వాలి. మహాభారత యుద్ధము కూడా తప్పకుండా జరుగుతుంది. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు. అనంతమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. మరి త్యాగము కూడా అనంతంగా ఉండాలి. కల్పక్రితము కూడా తండ్రి రాజయోగాన్ని నేర్పించారని, రాజస్వ అశ్వమేధ యజ్ఞాన్ని రచించారని మీకు తెలుసు, మళ్ళీ రాజ్యము కోసం సత్యయుగ కొత్త ప్రపంచము తప్పకుండా కావాలి. పాత ప్రపంచము వినాశనం కూడా జరిగింది. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయం కదా. ఇదే యుద్ధం జరిగింది, దీని ద్వారా ద్వారాలు తెరుచుకున్నాయి. స్వర్గ ద్వారాలు ఎలా తెరుచుకుంటున్నాయో వచ్చి అర్థం చేసుకోండి అని బోర్డుపై కూడా వ్రాయండి. మీరు అర్థం చేయించలేకపోతే ఇంకెవరినైనా పిలవచ్చు. తర్వాత నెమ్మది-నెమ్మదిగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మా పిల్లలైన బ్రాహ్మణ బ్రాహ్మణీలు, మీరు ఎంతమంది ఉన్నారు. వారసత్వము శివబాబా నుండే లభిస్తుంది. వారే అందరికీ తండ్రి. మనము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతామని బుద్ధిలో బాగా గుర్తుంచుకోవాలి. మనమే దేవతలుగా ఉండేవారము, తర్వాత చక్రములో తిరిగాము. మనమిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము తర్వాత విష్ణుపురిలోకి వెళ్తాము. జ్ఞానము చాలా సహజమైనది. కాని కోటిలో కొంతమందే వెలువడుతారు. ప్రదర్శినీలోకి ఎంతోమంది వస్తారు, చాలా కష్టంగా వెలువడుతారు, కొందరైతే చాలా బాగుంది, మేము వస్తాము అని కేవలం మహిమ చేస్తారు. ఎవరో అరుదుగా 7 రోజుల కోర్సు తీసుకుంటారు, 7 రోజుల విషయం కూడా ఇప్పుడు ఎక్కడుంది. గీతా పఠనము కూడా 7 రోజులు చేస్తారు. మీరు కూడా 7 రోజుల భట్టీలో ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం ద్వారా మొత్తం చెత్తంతా తొలగిపోతుంది. అర్థకల్పపు అశుద్ధమైన రోగము దేహాభిమానము, దానిని తొలగించుకోవాలి. దేహీ-అభిమానులుగా అవ్వాలి. 7 రోజుల కోర్సు పెద్దదేమి కాదు. ఎవరికైనా క్షణములో బాణము తగలవచ్చు. ఆలస్యంగా వచ్చినవారు ముందుకు వెళ్ళవచ్చు. మేము రేస్ చేసి తండ్రి నుండి వారసత్వం తీసుకునే తీరుతామని అంటారు. కొందరైతే పాతవారికంటే వేగంగా వెళ్తారు ఎందుకంటే మంచి-మంచి పాయింట్లు, తయారైన సరుకు లభిస్తుంది. ప్రదర్శినీ, మొదలైనవి అర్థం చేయించడం ఎంత సహజము. స్వయం అర్థం చేయించలేకపోతే బ్రాహ్మణిని పిలవండి. రోజూ వచ్చి కథ వినిపించి వెళ్ళమని చెప్పండి. 5 వేల సంవత్సరాల క్రితము లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, అది 1250 సంవత్సరాలు నడిచింది. ఇది ఎంత చిన్న కథ. మనమే దేవతలుగా ఉండేవారము, మళ్ళీ మనమే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యాము. ఆత్మలైన మనం బ్రాహ్మణులుగా అయ్యాము, హమ్ సో అర్థమును ఎంత యుక్తి యుక్తంగా అర్థం చేయిస్తారు. విరాట రూపము కూడా ఉంది, కాని అందులో బ్రాహ్మణులను మరియు శివబాబాను తీసేశారు. ఏమాత్రం అర్థం తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు స్మృతి చేయడంలో శ్రమించాలి. ఇంకే సంశయములోకి రాకూడదు. వికర్మాజీతులుగా అయి ఉన్నతమైన పదవిని పొందాలంటే - ఇలా ఎందుకు జరుగుతుంది, వీరెందుకిలా చేస్తున్నారు అనే ఈ చింతన సమాప్తము చేయాలి. ఈ విషయాలన్నీ విడిచి నేను తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలి అన్న చింతన ఒకటే ఉండాలి. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా వికర్మాజీతులుగా అయి ఉన్నత పదవిని పొందుతారు. అంతేకాని వ్యర్థమైన విషయాలు వింటూ తమ తలను పాడుచేసుకోకూడదు. అన్ని విషయాలలోనూ ముఖ్యమైన విషయము ఒకటే - వారిని మర్చిపోకండి. ఎవరితోనూ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. మీ సమయము చాలా విలువైనది. తుఫానులకు భయపడకూడదు. చాలా కష్టాలు వస్తాయి, నష్టము సంభవిస్తుంది. కాని తండ్రి స్మృతిని ఎప్పుడూ మర్చిపోకూడదు. స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి, పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందాలి. వృద్ధులైన ఈ బాబా ఇంతటి ఉన్నత పదవిని పొందుతున్నప్పుడు, మనమెందుకు పొందకూడదు. ఇది కూడా చదువే కదా. ఇందులో మీకు పుస్తకాలు మొదలైనవాటి అవసరము లేదు. బుద్ధిలో కథంతా ఉంది. ఎంత చిన్న కథ. ఇది ఒక క్షణకాలపు విషయం, క్షణములో జీవన్ముక్తి లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. ఏ తండ్రి అయితే మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తున్నారో వారినే మీరు మర్చిపోతారు! అందరూ రాజులుగా అవ్వరు అని అంటారు. అరే, మీరు అందరి గురించి ఎందుకు ఆలోచిస్తారు! స్కూల్లో అందరూ స్కాలర్షిప్ తీసుకోరు కదా అని ఎవరైనా ఆలోచిస్తారా? చదవడంలో నిమగ్నమైపోతారు కదా. ప్రతి ఒక్కరి పురుషార్థము ద్వారా వారు ఏ పదవిని పొందుతారో అర్థమైపోతుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ సమయం చాలా విలువైనది, దీనిని వ్యర్థమైన విషయాలలో పోగొట్టుకోకూడదు. ఎన్ని తుఫానులు వచ్చినా, నష్టము కలిగినా తండ్రి స్మృతిలో ఉండాలి.

2. తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలన్న చింతననే చేయాలి, ఇంకెటువంటి చింతన నడవకూడదు. హమ్ సో, సో హమ్ అన్న చిన్న కథను చాలా యుక్తిగా అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించాలి.

వరదానము:-

దాతా స్వరూపం యొక్క భావన ద్వారా కోరిక అంటే ఏమిటో తెలియని స్థితిని అనుభవం చేసే తృప్త ఆత్మాభవ

మేము దాతా పిల్లలుగా అయ్యి సర్వాత్మలకు ఇవ్వాలి అనే ఒక్క లక్ష్యము సదా ఉండాలి, దాతా స్వరూపం యొక్క భావన ఉండడం ద్వారా సంపన్న ఆత్మలుగా అయిపోతారు మరియు ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారు సదా సంతృప్తిగా ఉంటారు. నేను ఇచ్చేటటువంటి దాత సంతానాన్ని - ఇవ్వడమే తీసుకోవడం, ఈ భావన సదా నిర్విఘ్నంగా, కోరిక అంటే ఏమిటో తెలియని స్థితిని అనుభవం చేయిస్తుంది. సదా ఒక్క లక్ష్యం వైపే దృష్టి ఉండాలి, ఆ లక్ష్యము - బిందువు, ఇంకే విషయాల విస్తారమునైనా చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి.

స్లోగన్:-

బుద్ధి లేక స్థితి బలహీనంగా ఉందంటే దానికి కారణం - వ్యర్థ సంకల్పాలు.