16-06-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - నేను ఆత్మను, శరీరము కాదు అన్నదే మీ మొట్టమొదటి పాఠము, ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే తండ్రి స్మృతి ఉంటుంది"

ప్రశ్న:-

మనుష్యుల వద్ద లేని ఏ గుప్తమైన ఖజానా పిల్లలైన మీ వద్ద ఉంది?

జవాబు:-

భగవంతుడైన తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు, ఆ చదువు ద్వారా లభించే సంతోషమనే గుప్తమైన ఖజానా మీ వద్ద ఉంది. మనము భవిష్య అమరలోకము కోసం చదువుతున్నాము, ఈ మృత్యులోకము కోసం కాదు అని మీకు తెలుసు. ఉదయముదయమే లేచి విహరించండి, తిరగండి, కేవలం మొట్టమొదటి పాఠాన్ని పక్కా చేసుకున్నట్లయితే సంతోషపు ఖజానా జమ అవుతూ ఉంటుంది అని బాబా చెప్తున్నారు.

ఓంశాంతి. బాబా పిల్లలను అడుగుతున్నారు - పిల్లలూ, ఆత్మాభిమానులై కూర్చున్నారా? స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చున్నారా? ఆత్మలమైన మనల్ని పరమాత్మ అయిన తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. పిల్లలకు, నేను దేహాన్ని కాను, ఆత్మను అన్న స్మృతి కలిగింది. పిల్లలను దేహీ-అభిమానులుగా చేసేందుకే శ్రమించవలసి వస్తుంది. పిల్లలు ఆత్మాభిమానులుగా ఉండలేరు. క్షణ-క్షణము దేహాభిమానములోకి వచ్చేస్తారు. అందుకే ఆత్మాభిమానులుగా ఉంటున్నారా అని బాబా అడుగుతారు. ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే బాబా స్మృతి ఉంటుంది, ఒకవేళ దేహాభిమానులుగా ఉన్నట్లయితే లౌకిక సంబంధీకులు గుర్తుకువస్తారు. మొట్టమొదట నేను ఆత్మను, అన్న ఈ మాట గుర్తుంచుకోవాలి. ఆత్మనైన నాలోనే 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఇది పక్కా చేసుకోవాలి. మనము ఆత్మలము. అర్థకల్పము మీరు దేహాభిమానులుగానే ఉండేవారు. ఇప్పుడు కేవలం సంగమయుగములోనే పిల్లలను ఆత్మాభిమానులుగా చేయడం జరుగుతుంది. స్వయాన్ని దేహముగా భావిస్తే తండ్రి గుర్తుకు రారు, కావున మొట్టమొదట ఆత్మలమైన మనము అనంతమైన తండ్రి పిల్లలము అన్న ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి. దైహిక తండ్రిని స్మృతి చేయడం ఎప్పుడూ నేర్పించబడదు. పారలౌకిక తండ్రినైన నన్ను స్మృతి చేయండి, ఆత్మాభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. దేహా-అభిమానులుగా అవ్వడం వలన దేహపు సంబంధాలు గుర్తుకొస్తాయి, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి, ఇందులోనే శ్రమ ఉంది. ఇది ఎవరు అర్థం చేయిస్తున్నారు? ఆత్మలైన మనందరి తండ్రి చెప్తున్నారు. వారినే అందరూ బాబా, మీరు రండి, మీరు వచ్చి ఈ దుఃఖము నుండి ముక్తులుగా చేయండి అని తలుచుకుంటూ ఉంటారు. ఈ చదువు ద్వారా మేము భవిష్యత్తులో ఉన్నత పదవిని పొందుతామని పిల్లలకు తెలుసు.

ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు. ఈ మృత్యులోకంలో ఇప్పుడు ఇక ఉండేది లేదు. మన చదువు భవిష్య 21 జన్మల కోసం ఉన్నది. మనము సత్యయుగమైన అమరలోకము కోసం చదువుతున్నాము. అమరుడైన తండ్రి మనకు జ్ఞానము వినిపిస్తున్నారు కనుక ఇక్కడ కూర్చున్నప్పుడు మొట్టమొదట, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉండాలి, అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు మనము సంగమయుగములో ఉన్నాము. బాబా మనల్ని పురుషోత్తములుగా తయారుచేస్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పురుషోత్తములుగా అవుతారని చెప్తున్నారు. నేను మనుష్యుల నుండి దేవతలుగా చేసేందుకు వచ్చాను. సత్యయుగములో మీరు దేవతలుగా ఉండేవారు, మరి మెట్లు ఎలా దిగుతూ వచ్చామో మీకు తెలుసు. ఆత్మ అయిన మనలో 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది. ఈ విషయము ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు, ఆ భక్తిమార్గము వేరు, ఈ జ్ఞానమార్గము వేరు. తండ్రి ఏ ఆత్మలనైతే చదివిస్తున్నారో, వారికి తెలుసు, మరెవ్వరికీ తెలియదు. ఇది భవిష్యత్తు కోసం గుప్తమైన ఖజానా. మీరు అమరలోకము కోసం చదువుతున్నారు, ఈ మృత్యులోకము కోసం కాదు. ఉదయమే లేచి విహరించండి, తిరగండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. నేను ఆత్మను, శరీరము కాదు అన్న మొట్టమొదటి పాఠాన్ని స్మృతి చేయండి. మా ఆత్మిక తండ్రి మమ్మల్ని చదివిస్తారు. ఈ దుఃఖపు ప్రపంచం ఇప్పుడు పరివర్తనవుతుంది. సత్యయుగము సుఖ ప్రపంచం, బుద్ధిలో జ్ఞానమంతా ఉంది. ఇది ఆత్మిక ఆధ్యాత్మిక జ్ఞానము. జ్ఞానసాగరులైన బాబా ఆత్మిక తండ్రి. వారు ఆత్మలకు తండ్రి. మిగిలిన వారందరు దేహపు సంబంధీకులు. ఇప్పుడు దేహపు సంబంధాలను విడిచి ఒక్కరితోనే జోడించాలి. నాకైతే ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరని పాడుతారు కూడా. మనము ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తాము. దేహాన్ని కూడా స్మృతి చేయము. ఈ పాత దేహాన్ని అయితే విడిచిపెట్టేయాలి. ఈ శరీరాన్ని ఎలా విడిచిపెట్టాలనే జ్ఞానము కూడా మీకు లభిస్తుంది. స్మృతి చేస్తూ-చేస్తూ శరీరాన్ని వదిలేయాలి, అందుకే ఆత్మాభిమానులుగా అవ్వండి అని బాబా చెప్తున్నారు. బీజమైన తండ్రిని మరియు వృక్షాన్ని స్మృతి చేయాలని మీలో మీరు అభ్యసించుకుంటూ ఉండండి. శాస్త్రాలలో ఈ కల్పవృక్షం యొక్క వృత్తాంతము ఉంది.

జ్ఞానసాగరుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు, మనుష్యులెవ్వరూ కాదని కూడా పిల్లలకు తెలుసు. దీనిని పక్కా చేసుకోవాలి. చదవవలసి ఉంటుంది కదా. సత్యయుగములో కూడా దేహధారులే చదివిస్తారు, వీరు దేహధారి కాదు. నేను పాత దేహాన్ని ఆధారంగా తీసుకుని మిమ్మల్ని చదివిస్తున్నాని చెప్తున్నారు. కల్ప-కల్పము నేను మిమ్మల్ని ఇలాగే చదివిస్తాను. మళ్ళీ కల్పము తర్వాత కూడా ఇలాగే చదివిస్తాను. ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి, నేనే పతితపావనుడను. నన్ను మాత్రమే సర్వశక్తివంతుడని అంటారు. కాని మాయ కూడా తక్కువైనదేమీ కాదు, అది కూడా శక్తిశాలియే, ఎక్కడ నుండి పడేసిందో చూడండి. ఇప్పుడు గుర్తుకు వస్తుంది కదా. 84 జన్మల చక్రానికి గాయనం కూడా ఉంది. ఇది మనుష్యుల విషయమే. జంతువులు ఏమవుతాయి అని చాలా మంది అడుగుతారు. అరే, ఇక్కడ జంతువుల విషయం లేదు. తండ్రి కూడా పిల్లలతోనే మాట్లాడుతున్నారు, బయటివారికైతే తండ్రి గురించి తెలియనే తెలియదు, మరి వారు ఏం మాట్లాడుతారు. మేము బాబాను కలవాలనుకుంటున్నామని కొందరు అంటారు, కాని వారికేమీ తెలియదు, కూర్చుని వ్యతిరేకంగా ప్రశ్నిస్తూ ఉంటారు. 7 రోజుల కోర్సు చేసిన తర్వాత కూడా వీరు మన అనంతమైన తండ్రి అన్నది పూర్తిగా అర్థం చేసుకోరు. పాత భక్తులేవరైతే ఉంటారో, ఎవరైతే చాలా భక్తి చేసి ఉంటారో, వారి బుద్ధిలోనైతే జ్ఞానం యొక్క విషయాలన్నీ కూర్చుంటాయి. తక్కువ భక్తి చేసి ఉంటే బుద్ధిలో తక్కువగానే కూర్చుంటుంది. మీరు అందరికన్నా పాత భక్తులు. భగవంతుడు భక్తికి ఫలాన్ని ఇచ్చేందుకు వస్తారని గాయనం కూడా చేస్తారు. కాని ఇది ఎవ్వరికీ కొద్దిగా కూడా తెలియదు. జ్ఞానమార్గము మరియు భక్తిమార్గము పూర్తిగా వేర్వేరుగా ఉంటాయి. ప్రపంచమంతా భక్తిమార్గములో ఉంది. కోటిలో ఏ ఒక్కరో వచ్చి ఇది చదువుకుంటారు. వివరణ అయితే చాలా మధురంగా ఉంటుంది. 84 జన్మల చక్రాన్ని కూడా మనుష్యులే తెలుసుకుంటారు కదా. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు, శివుని గురించి కూడా తెలియదు. శివుని మందిరాలు ఎన్నో ఉన్నాయి. శివుడిని పూజిస్తారు, జలాభిషేకము చేస్తారు, శివాయ నమః అని అంటారు, ఎందుకు పూజిస్తున్నారన్నది ఏమాత్రమూ తెలియదు. లక్ష్మీ-నారాయణులను ఎందుకు పూజిస్తారు, వారు ఎక్కడకు వెళ్ళారు, ఏమీ తెలియదు. తమ పూజ్యుల గురించి ఏమాత్రమూ తెలియనివారు భారతవాసీయులే. క్రీస్తు ఫలానా సంవత్సరములో వచ్చారు, వచ్చి స్థాపన చేసారని క్రైస్తవులకు తెలుసు. శివబాబా గురించి ఎవ్వరికీ కూడా తెలియదు. పతితపావనుడని కూడా శివుడినే అంటారు. వారే ఉన్నతాతి ఉన్నతమైనవారు కదా. వారి సేవను అందరికన్నా ఎక్కువగా చేస్తారు. వారు సర్వుల సద్గతిదాత. వారు మిమ్మల్ని ఎలా చదివిస్తున్నారో చూడండి. మీరు వచ్చి పావనంగా తయారుచేయండి అని తండ్రిని పిలుస్తారు కూడా. మందిరాలలో ఎంతగా పూజిస్తారు, ఎంత వైభవంగా చేస్తారు, ఎంత ఖర్చు చేస్తారు. శ్రీనాథ మందిరానికి, జగన్నాథ మందిరానికి వెళ్ళి చూడండి. ఇద్దరూ ఒక్కరే. జగన్నాథుని (జగత్ నాథ్) వద్ద కుండలో అన్నాన్ని వండుతారు. శ్రీనాథుని వద్దనైతే ఎన్నో పిండివంటలను తయారుచేస్తారు. తేడా ఎందుకుంది? దానికి కారణముండాలి కదా. శ్రీనాథుడిని కూడా నల్లగా చూపిస్తారు, అలాగే జగన్నాథుడిని కూడా నల్లగా చూపిస్తారు, కానీ కారణాన్ని ఏమీ అర్థం చేసుకోరు. జగత్-నాథ్ అని లక్ష్మీనారాయణులను అంటారా లేక రాధా-కృష్ణులను అంటారా? రాధా-కృష్ణులకు, లక్ష్మీనారాయణులకు గల సంబంధమేమిటో కూడా ఎవ్వరికీ తెలియదు. మేము పూజ్య దేవతలుగా ఉండేవారము, తర్వాత పూజారులుగా అయ్యామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసింది. చక్రములో తిరిగాము. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు మనము చదువుతున్నాము. ఇలా మనుష్యులెవ్వరూ చదివించరు. భగవానువాచ. జ్ఞానసాగరుడని భగవంతుడినే అంటారు. పతిత-పావనుడు, జ్ఞానసాగరుడైన తండ్రిని స్మృతి చేసే భక్తిసాగరులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు పతితులుగా అయ్యారు, మళ్ళీ తప్పకుండా పావనంగా అవ్వాలి. ఈ ప్రపంచమే పతిత ప్రపంచం, ఇది స్వర్గము కాదు. వైకుంఠము ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. వైకుంఠానికి వెళ్ళిపోయారని అంటారు. మరి వారికి మళ్ళీ మీరు నరకం యొక్క భోజనం మొదలైనవి ఎందుకు తినిపిస్తున్నారు. సత్యయుగంలో ఫలాలు-పుష్పాలు మొదలైనవి ఎన్నో ఉంటాయి. ఇక్కడేముంది? ఇది నరకము. బాబా ద్వారా మనము స్వర్గవాసులుగా అయ్యే పురుషార్థము చేస్తున్నామని ఇప్పుడు మీకు తెలుసు. పతితుల నుండి పావనంగా అవ్వాలి. తండ్రి యుక్తిని తెలియజేశారు, కల్ప-కల్పము తెలియజేస్తూనే ఉంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు మనము పురుషోత్తమ సంగమయుగములో ఉన్నామని మీకు తెలుసు. బాబా, మేము 5 వేల సంవత్సరాల క్రితము ఇలా అయ్యాము అని మీరే చెప్తారు. కల్ప-కల్పము ఈ అమరకథను బాబా ద్వారా వింటామని మీకే తెలుసు. శివబాబాయే అమరనాథుడు. అంతేగాని పార్వతికి కూర్చుని కథ వినిపించారని కాదు. అది భక్తి. జ్ఞానము మరియు భక్తి గురించి మీరు అర్థం చేసుకున్నారు. బ్రాహ్మణుల పగలు, మళ్ళీ బ్రాహ్మణుల రాత్రి. మీరు బ్రాహ్మణులు కదా అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆదిదేవ్ కూడా బ్రాహ్మణుడే, దేవత అని అనరు. ఆదిదేవుని వద్దకు కూడా వెళ్తారు, అలాగే దేవీల పేర్లు కూడా ఎన్ని ఉన్నాయి. మీరు సేవ చేశారు, అందుకే మీ గాయనం ఉంది. భారత్ ఏదైతే నిర్వికారిగా ఉండేదో, అది మళ్ళీ వికారిగా అయిపోయింది. ఇప్పుడు రావణ రాజ్యము కదా.

సంగమయుగములో పిల్లలైన మీరిప్పుడు పురుషోత్తములుగా అవుతున్నారు, మీపై బృహస్పతి దశ అవినాశిగా కూర్చున్నప్పుడు మీరు అమరపురికి యజమానులుగా అవుతారు. బాబా మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేందుకు చదివిస్తున్నారు. స్వర్గానికి యజమానులుగా అవ్వడాన్ని బృహస్పతి దశ అని అంటారు. మీరు స్వర్గమైన అమరపురిలోకి తప్పకుండా వెళ్తారు. కాని చదువులో దశలు పైకీ, కిందకూ అవుతూ ఉంటాయి. స్మృతి చేయడమే మర్చిపోతారు. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. భగవానువాచ - కామము మహాశత్రువు అని గీతలో కూడా ఉంది. గీతను చదువుతారు కానీ వికారాలను జయించరు. భగవంతుడు ఎప్పుడు చెప్పారు? 5 వేల సంవత్సరాలయింది. ఇప్పుడు మళ్ళీ భగవంతుడు చెప్తున్నారు - కామము మహాశత్రువు, దీనిపై విజయము పొందాలి. ఇది ఆది-మధ్య-అంతాలు దుఃఖమునిస్తుంది. ముఖ్యమైనది కామానికి సంబంధించినది, దీని గురించే పతితులు అని అనబడ్డారు. ఈ చక్రము తిరుగుతూ ఉంటుందని ఇప్పుడే తెలిసింది. మనము పతితులుగా అవుతాము, డ్రామానుసారంగా మళ్ళీ తండ్రి వచ్చి పావనంగా తయారుచేస్తారు. మొట్టమొదట అల్ఫ్ (భగవంతుడు) చెప్పిన మాటను స్మృతి చేయండి, శ్రీమతమును అనుసరిస్తేనే మీరు శ్రేష్ఠంగా అవుతారు అని బాబా పదే-పదే చెప్తున్నారు. మొదట మనము శ్రేష్ఠంగా ఉండేవారిమి, తర్వాత భ్రష్ఠంగా అయ్యాము అని కూడా మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ శ్రేష్ఠంగా అయ్యే పురుషార్థము చేస్తున్నారు. దైవీగుణాలు ధారణ చేయాలి. ఎవ్వరికీ దుఃఖము ఇవ్వకూడదు. అందరికీ మార్గం తెలియజేస్తూ వెళ్ళండి, నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు సమాప్తమవుతాయని బాబా చెప్తున్నారు. పతిత-పావనుడని మీరు నన్ను మాత్రమే అంటారు కదా. పతిత-పావనుడు వచ్చి పావనంగా ఎలా తయారుచేస్తారో ఎవ్వరికీ తెలియదు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని కల్పక్రితము కూడా తండ్రి చెప్పారు. ఇది యోగాగ్ని, దీని ద్వారా పాపాలు దగ్ధమవుతాయి. మాలిన్యం తొలగిపోతే ఆత్మ పవిత్రంగా అవుతుంది. మలినము(లోహము)ను బంగారంలోనే కలుపుతారు, దానితో నగ కూడా అదేవిధంగా తయారవుతుంది. ఆత్మలో మలినాలు ఎలా కలుస్తాయో ఇప్పుడు బాబా మీకు అర్థం చేయించారు, ఇక వాటిని తొలగించాలి. ఈ డ్రామాలో తండ్రికి కూడా పాత్ర ఉంది, వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. పవిత్రంగా కూడా అవ్వాలి. సత్యయుగంలో మనము వైష్ణవులుగా ఉండేవారమని మీకు తెలుసు. పవిత్రమైన గృహస్థ ఆశ్రమముండేది. ఇప్పుడు మనము పవిత్రంగా అయి విష్ణుపురికి యజమానులుగా అవుతాము. మీరు డబుల్ వైష్ణవులుగా అవుతారు. మీరు సత్యాతి-సత్యమైన వైష్ణవులు. వారు వికారీ వైష్ణవ ధర్మానికి చెందినవారు. మీరు నిర్వికారి వైష్ణవ ధర్మానికి చెందినవారు. ఇప్పుడు ఒకటేమో తండ్రిని స్మృతి చేస్తారు మరియు బాబాలో ఉన్న జ్ఞానాన్ని మీరు ధారణ చేస్తారు. మీరు రాజులకే రాజులుగా అవుతారు. వారు అల్పకాలికముగా, ఒక్క జన్మ కోసం రాజులుగా అవుతారు. మీ రాజ్యము 21 తరాలు అనగా పూర్ణాయుష్షు వరకూ కొనసాగుతుంది. అక్కడ అకాలమృత్యువు అనేది ఎప్పుడూ సంభవించదు. మీరు మృత్యువుపై విజయము పొందుతారు. సమయం వచ్చినప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకోవాలని అనుకుంటారు. మీకు సాక్షాత్కారమవుతుంది. సంతోషపు భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. తమోప్రధాన శరీరాన్ని వదిలి సతోప్రధాన శరీరాన్ని తీసుకోవడమనేది సంతోషించే విషయము కదా. అక్కడ ఆయుష్షు సుమారుగా 150 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడైతే భోగులుగా ఉన్నందుకు అకాలమృత్యువులు సంభవిస్తూ ఉంటాయి. ఏ పిల్లల యోగమైతే యథార్థంగా ఉంటుందో, వారి సర్వ కర్మేంద్రియాలు యోగబలం ద్వారా వశములో ఉంటాయి. పూర్తిగా యోగములో ఉండటం వలన కర్మేంద్రియాలు శీతలమైపోతాయి. సత్యయుగంలో మిమ్మల్ని ఏ కర్మేంద్రియాలు మోసగించవు, కర్మేంద్రియాలు వశములో లేవని అక్కడ ఎప్పుడూ అనరు. మీరు చాలా ఉన్నతాతి ఉన్నతమైన పదవిని పొందుతారు. దీనినే అవినాశి బృహస్పతి దశ అని అంటారు. వృక్షపతి, మనుష్య సృష్టికి బీజరూపుడు తండ్రియే. బీజమైన తండ్రి పైన ఉన్నారు, వారిని పైనే స్మృతి చేస్తారు. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారని, వారు ఒక్కసారి మాత్రమే అమరకథను వినిపించేందుకు వస్తారని పిల్లలైన మీకు తెలుసు. అమరకథ అనండి, సత్యనారాయణ కథ అనండి, ఆ కథ అర్థము గురించి కూడా ఎవ్వరూ అర్థము చేసుకోరు. సత్యనారాయణుని కథ ద్వారా నరుని నుండి నారాయణునిగా అవుతారు. అమరకథ ద్వారా మీరు అమరులుగా అవుతారు. తండ్రి ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టముగా అర్థం చేయిస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. యోగబలము ద్వారా మీ సర్వ కర్మేంద్రియాలను వశపరచుకోవాలి. ఒక్క వృక్షపతి అయిన తండ్రి స్మృతిలోనే ఉండాలి. సత్యమైన వైష్ణవులుగా అనగా పవిత్రులుగా అవ్వాలి.

2. ఉదయమే లేచి నేను ఆత్మను, శరీరాన్ని కాదు అన్న మొదటి పాఠాన్ని పక్కా చేసుకోవాలి. మన ఆత్మిక తండ్రి మనల్ని చదివిస్తున్నారు, ఈ దుఃఖపు ప్రపంచం ఇప్పుడు ఇక మారనున్నది... ఇలా బుద్ధిలో జ్ఞానమంతా స్మరణ జరుగుతూ ఉండాలి.

వరదానము:-

స్వయం పట్ల ఇచ్ఛా మాత్రం అవిద్యగా అయి తండ్రి సమానంగా అఖండ దానీ, పరోపకారి భవ

బ్రహ్మాబాబా స్వయం యొక్క సమయాన్ని కూడా సేవలో ఇచ్చారు, స్వయం నమ్రచిత్తులుగా అయి పిల్లలకు గౌరవమిచ్చారు, పని చేసినందుకు లభించిన పేరు యొక్క ప్రాప్తిని కూడా త్యాగం చేశారు. పేరు, గౌరవము, కీర్తి అన్నింటిలో పరోపకారిగా అయ్యారు, తన పేరును త్యాగం చేసి ఇతరుల పేరును ప్రసిద్ధము చేశారు, స్వయాన్ని సదా సేవాధారిగా ఉంచుకున్నారు, పిల్లలను యజమానిగా చేశారు. పిల్లల సుఖములోనే తమ సుఖము ఉందని భావించారు. ఇలా తండ్రి సమానంగా ఇచ్ఛా మాత్రం అవిద్యా అనగా మస్త్ ఫకీర్గా అయి అఖండ దానీ, పరోపకారిగా అయినట్లయితే విశ్వకళ్యాణ కార్యములో తీవ్ర వేగము వచ్చేస్తుంది. కేసులు మరియు కథలు సమాప్తమైపోతాయి.

స్లోగన్:-

జ్ఞానము, గుణము మరియు ధారణలో సింధువుగా అవ్వండి, స్మృతిలో బిందువుగా అవ్వండి.