09-06-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మమ్మల్ని దేహధారులెవ్వరూ చదివించడం లేదు, అశరీరి తండ్రి శరీరంలో ప్రవేశించి ప్రత్యేకంగా మనల్ని చదివించేందుకు వచ్చారనే సంతోషంలో సదా ఉండండి"

ప్రశ్న:-

పిల్లలైన మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం ఎందుకు లభించింది?

జవాబు:-

మన శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని చూసేందుకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది. ఈ కళ్ళకు పాత ప్రపంచం, మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఎవరైతే కనిపిస్తున్నారో వారి నుండి బుద్ధిని తొలగించాలి. చెత్త నుండి బయటకు తీసి పుష్పాలుగా (దేవతలుగా) తయారుచేసేందుకు తండ్రి వచ్చారు కనుక ఇటువంటి తండ్రిని గౌరవించాలి కూడా.

ఓంశాంతి. పిల్లల కోసం, శివ భగవానువాచ. శివ భగవానుడిని సత్యమైన తండ్రి అని తప్పకుండా అంటారు ఎందుకంటే రచయిత కదా. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్నే భగవాన్ భగవతీలుగా తయారుచేసేందుకు - భగవంతుడు చదివిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు, తమ టీచర్ గురించి, చదువు గురించి మరియు దాని ఫలితం గురించి తెలియని విద్యార్థులు ఎవ్వరూ ఉండరు. ఎవరినైతే భగవంతుడు చదివిస్తున్నారో వారికి ఎంత సంతోషం ఉండాలి! ఈ సంతోషం స్థిరంగా ఎందుకు ఉండదు? మనల్ని దేహధారి మనుష్యులెవ్వరూ చదివించడం లేదని మీకు తెలుసు. అశరీరి అయిన తండ్రి శరీరంలో ప్రవేశించి ప్రత్యేకంగా పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు వచ్చారు, భగవంతుడు వచ్చి చదివిస్తున్నారని కూడా ఎవ్వరికీ తెలియదు. మేము భగవంతుని పిల్లలము, వారు మమ్మల్ని చదివిస్తున్నారు, వారే జ్ఞానసాగరులు అని మీకు తెలుసు. శివబాబా సమ్ముఖంలో మీరు కూర్చున్నారు. ఆత్మలు మరియు పరమాత్మ ఇప్పుడే కలుసుకుంటారు, ఇది మర్చిపోకండి. కాని మాయ ఎటువంటిదంటే, అది మరిపింపజేస్తుంది. లేకపోతే భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు అన్మ నషా ఉండాలి కదా! వారిని స్మృతి చేస్తూ ఉండాలి. కాని ఇక్కడైతే పూర్తిగా మర్చిపోయేవారు ఉన్నారు. ఏమీ తెలియదు. స్వయంగా భగవంతుడు చెప్తున్నారు, చాలామంది పిల్లలు ఇది మర్చిపోతారు, లేకపోతే ఆ సంతోషం ఉండాలి కదా. మనం భగవంతుని పిల్లలము, వారు మనల్ని చదివిస్తున్నారు. మాయ ఎంతటి శక్తిశాలి అంటే, అది పూర్తిగా మరిపింపజేస్తుంది. ఈ కళ్ళ ద్వారా పాత ప్రపంచాన్ని, మిత్ర-సంబంధీకులు మొదలైనవారిని ఎవరినైతే చూస్తున్నారో వారిపట్ల బుద్ధి వెళ్ళిపోతుంది. తండ్రి ఇప్పుడు పిల్లలైన మీకు మూడవ నేత్రాన్ని ఇస్తున్నారు. మీరు శాంతిధామాన్ని- సుఖధామాన్ని స్మృతి చేయండి. ఇది దుఃఖధామం, ఛీ-ఛీ ప్రపంచం. భారత్ స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా అయ్యిందని మీకు తెలుసు. తండ్రి వచ్చి మళ్ళీ పుష్పాలుగా తయారుచేస్తున్నారు. అక్కడ మీకు 21 జన్మలకు సుఖం లభిస్తుంది. దీనికోసమే మీరు చదువుతున్నారు. కాని పూర్తిగా చదువుకోని కారణంగా ఇక్కడి ధనము, సంపద మొదలైనవాటిలోనే బుద్ధి వేలాడుతూ ఉంటుంది. వాటి నుండి బుద్ధిని తొలగించడం లేదు. శాంతిధామం, సుఖధామం వైపు బుద్ధిని పెట్టమని తండ్రి చెప్తున్నారు. కాని బుద్ధి అశుద్ధమైన ప్రపంచానికి పూర్తిగా అతుక్కుపోయినట్లు ఉంది. బయటకు రావడంలేదు. ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా పాత ప్రపంచం నుండి బుద్ధి తొలగిపోవడం లేదు. పుష్పాల వలె పవిత్రంగా తయారుచేసేందుకు ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. మీరు ముఖ్యంగా పవిత్రత కోసమే - బాబా మమ్మల్ని పవిత్రంగా తయారుచేసి పవిత్ర ప్రపంచానికి తీసుకువెళ్తారని చెప్తారు. కనుక అటువంటి తండ్రిపై ఎంతటి గౌరవం ఉంచాలి. అటువంటి తండ్రిపై బలిహారమవ్వాలి. వారు పరంధామం నుండి వచ్చి పిల్లలైన మనల్ని చదివిస్తున్నారు. పిల్లల కోసం ఎంత శ్రమ చేస్తున్నారు. ఒక్కసారిగా చెత్త నుండి బయటకు తీస్తారు. ఇప్పుడు మీరు పుష్పాలుగా తయారవుతున్నారు. కల్ప-కల్పమూ మనం అటువంటి పుష్పాలు (దేవతలు)గా అవుతామని తెలుసు. భగవంతుడు తప్ప మనుష్యుల నుండి దేవతలుగా ఎవ్వరూ తయారుచేయలేరు. ఇప్పుడు మనల్ని తండ్రి చదివిస్తున్నారు. మనం మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఇక్కడకు వచ్చాము. ఇది మీకు ఇప్పుడే తెలిసింది, ఇంతకుముందు మనం స్వర్గవాసులుగా ఉండేవారిమని తెలియదు. మీరు రాజ్యం చేసేవారని, తర్వాత రావణుడు రాజ్యాన్ని తీసుకున్నాడని ఇప్పుడు తండ్రి తెలియజేశారు. మీరే చాలా సుఖాన్ని చూశారు, తర్వాత 84 జన్మలు తీసుకుంటూ - తీసుకుంటూ మెట్లు దిగి వస్తారు. ఇది ఉన్నదే ఛీ-ఛీ ప్రపంచం. ఎంతమంది మనుష్యులు దుఃఖితులుగా ఉన్నారు. ఎంతోమంది ఆకలితో మరణిస్తూ ఉంటారు, సుఖం ఏమాత్రమూ లేదు. ఎంత ధనవంతులైనా సరే, ఆ అల్పకాలిక సుఖం కాకిరెట్టతో సమానమైనదే. దీనినే విషయ వైతరణీ నది అని అంటారు. స్వర్గంలో అయితే మనం చాలా సుఖంగా ఉంటాము. ఇప్పుడు నల్లగా ఉన్న మీరు సుందరంగా అవుతున్నారు.

మనమే దేవతలుగా ఉండేవారము, మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ వేశ్యాలయంలోకి వచ్చి పడ్డామని మీకిప్పుడు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని శివాలయంలోకి తీసుకువెళ్తారు. శివబాబా స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. మిమ్మల్ని చదువు చదివిస్తున్నారు కనుక బాగా చదువుకోవాలి కదా. చదువుకొని, చక్రాన్ని బుద్ధిలో ఉంచుకొని దైవీ గుణాలు ధారణ చేయాలి. పిల్లలైన మీరు రూప-బసంత్ లు (జ్ఞాన యోగాలు కలిగినవారు), మీ నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వెలువడాలి, చెత్త కాదు. నేను రూప-బసంత్ ను అని తండ్రి కూడా చెప్తున్నారు..... పరమాత్మనైన నేను జ్ఞానసాగరుడను. చదువు సంపాదనకు ఆధారం అవుతుంది. చదువుకున్న తర్వాత ఎప్పుడైతే బ్యారిస్టర్, డాక్టర్ మొదలైనవారిగా అవుతారో, అప్పుడు లక్షలు సంపాదిస్తారు. ఒక్కొక్క డాక్టర్ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తారు. తినేందుకు కూడా సమయముండదు. మీరు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు. మీరు ఏమవుతారు? విశ్వానికి యజమానులు. కావున ఈ చదువు యొక్క నషా ఉండాలి కదా. పిల్లలైన మీ మాట్లాడడంలో ఎంత రాయల్టీ ఉండాలి. మీరు రాయల్ గా అవుతున్నారు కదా. రాజుల నడవడిక ఎలా ఉంటుందో చూడండి. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. రాజులకు కానుకలు ఇచ్చేవారు, వారు దానిని ఎప్పుడూ చేతులతో తీసుకోరు. ఒకవేళ తీసుకోవలసి వస్తే సెక్రటరీకి వెళ్ళి ఇవ్వమని సైగ చేస్తారు. చాలా రాయల్ గా ఉంటారు. వీరి నుండి ఇది తీసుకుంటున్నాము కనుక వీరికి తిరిగి ఇవ్వాలి కూడా అనే ఆలోచన బుద్ధిలో ఉంటుంది లేకపోతే తీసుకోరు. కొందరు రాజులు ప్రజల నుండి అస్సలు తీసుకోరు. కొందరైతే చాలా దోచుకుంటారు. రాజులలో కూడా వ్యత్యాసముంటుంది. ఇప్పుడు మీరు సత్యయుగంలో డబల్ కిరీటధారి రాజులుగా అవుతారు. డబల్ కిరీటం కోసం పవిత్రత తప్పకుండా కావాలి. ఈ వికారీ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి. పిల్లలైన మీరు వికారాలను విడిచిపెట్టేశారు, వికారులెవ్వరూ ఇక్కడకు వచ్చి కూర్చోలేరు. ఒకవేళ చెప్పకుండా వచ్చి కూర్చుంటే తమకు తామే నష్టం కలగచేసుకుంటారు. కొందరు చలాకీతనము చూపిస్తారు, ఎవ్వరికీ తెలియదు కదా అని భావిస్తారు. తండ్రి చూసినా, చూడకపోయినా, వారు స్వయం పాపాత్మలుగా అయిపోతారు. మీరు కూడా పాపాత్మలుగా ఉండేవారు. ఇప్పుడు పురుషార్థం ద్వారా పుణ్యాత్మలుగా అవ్వాలి. పిల్లలైన మీకు ఎంత జ్ఞానం లభించింది. ఈ జ్ఞానం ద్వారా మీరు కృష్ణపురికి యజమానులుగా అవుతారు. తండ్రి ఎంతగా అలంకరిస్తున్నారు. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు చదివిస్తున్నారు కనుక ఎంత సంతోషంగా చదువుకోవాలి. ఇటువంటి చదువునైతే సౌభాగ్యశాలులే చదువుకుంటారు మరియు తర్వాత సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి. మీరెక్కడ చదువుతున్నారు అని బాబా అంటారు. బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. మరి ఏమవుతారు! ఈ పరిస్థితిలోనైతే మీరు పాస్ అవ్వలేరని లౌకిక తండ్రి కూడా చెప్తారు. కొందరైతే చదువుకొని లక్షలు సంపాదిస్తారు. కొందరిని చూస్తే ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. మీరు తల్లిదండ్రులను ఫాలో చేయాలి. కొందరు సోదరులు చాలా బాగా చదువుతూ చదివిస్తారు, ఇదే వ్యాపారం చేస్తారు. ప్రదర్శినిలో చాలామందిని చదివిస్తారు కదా. మున్ముందు దుఃఖం ఎంతగా పెరుగుతూ ఉంటుందో, అంతగా మనుష్యులలో వైరాగ్యం కలుగుతుంది, అప్పుడు చదవడం ప్రారంభిస్తారు. దుఃఖంలో భగవంతుడిని చాలా స్మృతి చేస్తారు. మరణించే సమయంలో, దుఃఖంలో ఓ రామా, అయ్యో భగవంతుడా అని అంటూ ఉంటారు కదా. మీరైతే అలా అనకూడదు. మీరైతే సంతోషంగా ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ పాత శరీరం విడిచిపెట్టినట్లయితే మనం మన ఇంటికి వెళ్తాము. అక్కడ శరీరం కూడా మళ్ళీ సుందరమైనది లభిస్తుంది. పురుషార్థం చేసి చదివించే వారి కంటే కూడా ఉన్నతంగా వెళ్ళాలి. చదివించేవారి కన్నా చదువుకునే వారి స్థితి చాలా బాగుంటుంది, ఇలా కూడా జరుగుతుంది. తండ్రికైతే ప్రతి ఒక్కరి గురించి తెలుసు కదా. పిల్లలైన మీరు కూడా తెలుసుకోగలరు - నాలో ఏ లోపముంది అని స్వయాన్ని చూసుకోవాలి. మాయ కలిగించే విఘ్నాలను దాటుకొని వెళ్ళాలి, వాటిలో చిక్కుకోకూడదు.

మాయ చాలా శక్తిశాలిగా ఉంది, మేము ఎలా నడవగలము అని కొంతమంది అంటారు. ఒకవేళ ఇలా ఆలోచిస్తే మాయ ఒక్కసారిగా కచ్ఛాగా (అపరిపక్వంగా) తినేస్తుంది. గజమును మొసలి తినేసింది అనేది ఇప్పటి విషయమే కదా! మంచి-మంచి పిల్లలను కూడా మాయ రూపీ మొసలి ఒక్కసారిగా మింగేస్తుంది. స్వయాన్ని విడిపించుకోలేరు. మనం మాయ దెబ్బ నుండి విడిపించుకోవాలని స్వయమూ భావిస్తారు. కాని మాయ విముక్తులవ్వనివ్వదు. బాబా, ఇలా పట్టుకోవద్దని మాయకు చెప్పండి అని అంటారు. అరే, ఇది యుద్ధ మైదానం కదా. మైదానంలో ఎక్కడైనా నన్ను ఎదుర్కోవద్దని చెప్పండి అని అంటారా. మాకు బాల్ వేయవద్దని మ్యాచ్ లో చెప్తారా. యుద్ధ మైదానంలోకి వచ్చారు కనుక పోరాడండి అని వెంటనే చెప్తారు, కనుక మాయ బాగా ఓడిస్తుంది. మీరు చాలా ఉన్నత పదవిని పొందగలరు. భగవంతుడు చదివిస్తున్నారు, ఇదేమైనా తక్కువ విషయమా. ఇప్పుడు నంబరువారు పురుషార్థానుసారంగా - మీ ఎక్కే కళ జరుగుతుంది. మేము భవిష్య జీవితాన్ని వజ్రతుల్యంగా తయారుచేసుకోవాలి అని ప్రతి ఒక్క బిడ్డకు అభిరుచి ఉండాలి. విఘ్నాలను తొలగించుకుంటూ వెళ్ళాలి. ఎలాగైనా సరే తండ్రి నుండి వారసత్వం తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే మనం కల్ప-కల్పాంతరాలు ఫెయిల్ అవుతాము. ఎవరైనా, షావుకారు పిల్లలు ఉన్నారనుకోండి, వారి తండ్రి వారికి చదువులో ఆటంకం కలిగిస్తూ ఉంటే - ఈ లక్షలు నేను ఏం చేసుకోను, నేనైతే అనంతమైన తండ్రి నుండి విశ్వరాజ్యాన్ని తీసుకోవాలి, ఈ లక్షలు-కోట్లు అన్నీ భస్మమైపోతాయి అని చెప్తాడు. కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది అగ్ని దహించేస్తుంది, మొత్తం సృష్టి రూపీ అడవికి నిప్పు అంటుకోనున్నది. ఇదంతా రావణుని లంక. మీరంతా సీతలు. రాముడు వచ్చి ఉన్నారు. భూమి అంతా ఒక ద్వీపం, ఈ సమయంలో ఉన్నదే రావణ రాజ్యం. తండ్రి వచ్చి రావణ రాజ్యాన్ని సమాప్తం చేయించి మిమ్మల్ని రామరాజ్యానికి అధికారులుగా తయారుచేస్తారు. మీకైతే లోలోపల అపారమైన సంతోషముండాలి - అతీంద్రియ సుఖం గురించి అడగాలంటే పిల్లలనే అడగండి అని గాయనం చేయబడింది. మీరు ప్రదర్శనీలలో మీ సుఖం గురించి తెలియజేస్తారు కదా. మేము భారత్ ను స్వర్గంగా తయారుచేస్తున్నాము. శ్రీమతానుసారంగా భారత్ కు సేవ చేస్తున్నాము. ఎంతెంతగా శ్రీమతానుసారంగా నడుస్తారో, అంతంతగా మీరు శ్రేష్ఠంగా తయారవుతారు. మీకు మతాన్నిచ్చే వారు అనేకమంది వస్తారు కనుక వారిని కూడా పరిశీలించాలి, సంభాళించుకోవాలి. అక్కడక్కడ మాయ కూడా గుప్తంగా ప్రవేశిస్తుంది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు, లోలోపల చాలా సంతోషముండాలి. బాబా, మేము మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము, సత్యనారాయణ కథ విని మేము నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతామని మీరు చెప్తారు. బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము అని మీరందరూ చేతులెత్తుతారు, లేకపోతే మేము కల్ప-కల్పమూ కోల్పోతాము అని అనుకుంటారు. ఏ విఘ్నమునైనా మేము సమాప్తం చేసేస్తాము అని భావించేటంతటి సాహసం కావాలి. మీరు ఇంతటి సాహసం చూపించారు కదా. ఎవరి నుండైతే వారసత్వం లభిస్తుందో వారిని విడిచిపెట్టము. కొందరైతే బాగా నిలిచి ఉన్నారు, కొందరు మళ్ళీ పారిపోయారు. మంచి-మంచి వారిని మాయ తినేసింది. మొసలి తినేసి పూర్తిగా మింగేసింది.

ఓ ఆత్మలారా అని ఇప్పుడు తండ్రి అంటారు, చాలా ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. నేను వచ్చి పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తయారుచేస్తాను. ఇప్పుడు పతిత ప్రపంచపు మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని రాజులకే రాజుగా తయారుచేస్తాను. పతిత రాజులకు కూడా రాజులుగా చేస్తాను. సింగల్ కిరీట రాజులు డబల్ కిరీట రాజుల ముందు ఎందుకు శిరస్సు వంచుతారు, అర్థకల్పం తర్వాత ఎప్పుడైతే వారి పవిత్రత దూరమవుతుందో, అప్పుడు రావణ రాజ్యంలో అందరూ వికారులుగా మరియు పూజారులుగా అవుతారు. కనుక ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఎటువంటి పొరపాటు చేయకండి. మర్చిపోకండి. బాగా చదువుకోండి. రోజూ క్లాసుకు రాలేకపోయినా కూడా బాబా అన్ని ఏర్పాట్లు చేయగలరు. 7 రోజుల కోర్సు తీసుకోండి, దీని ద్వారా సులభంగా మురళిని అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా, కేవలం రెండు పదాలను గుర్తు పెట్టుకోండి. ఇది మహామంత్రం. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఏ వికర్మలైనా లేదా పాప కర్మలైనా దేహాభిమానంలోకి రావడం వల్లనే జరుగుతాయి. వికర్మల నుండి రక్షించుకునేందుకు బుద్ధి ప్రీతిని ఒక్క తండ్రితోనే జోడించండి. ఏ దేహధారుల పట్ల (ప్రీతి) పెట్టుకోకండి. ఒక్కరితోనే బుద్ధియోగాన్ని జోడించాలి. అంతిమం వరకు స్మృతి చేస్తే ఎటువంటి వికర్మలు జరుగవు. ఇది కుళ్ళిపోయిన దేహం. దీని అభిమానాన్ని విడిచిపెట్టండి. నాటకం పూర్తవుతుంది, ఇప్పుడు మన 84 జన్మలు పూర్తయ్యాయి. ఇది పాత ఆత్మ, పాత శరీరం. ఇప్పుడు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి, తర్వాత శరీరం కూడా సతోప్రధానమైనది లభిస్తుంది. ఆత్మను సతోప్రధానంగా తయారుచేసుకోవాలి అని ఇదే తపన ఉండాలి. కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. కేవలం ఇదే చింత ఉంచుకోండి. బాబా, మేము పాస్ అయ్యే చూపిస్తాము అని మీరు కూడా అంటారు కదా. క్లాసులో అందరికీ స్కాలర్షిప్ లభించదని కూడా తెలుసు. అయినా కూడా పురుషార్థమైతే చాలామంది చేస్తారు కదా. మేము నరుని నుండి నారాయణునిగా అయ్యే పూర్తి పురుషార్థం చేయాలి అని మీరు కూడా అనుకుంటారు. తక్కువ ఎందుకు చేయాలి. ఏ విషయం గురించిన చింత లేదు. సైనికులు ఎప్పుడూ చింత చేయరు. బాబా, చాలా తుఫానులు, స్వప్నాలు మొదలైనవి వస్తున్నాయని కొందరు చెప్తారు. ఇవన్నీ జరుగుతాయి. మీరు ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఈ శత్రువుపై విజయం పొందాలి. కొన్నిసార్లు మనస్సులోను, చిత్తములోను లేనటువంటి స్వప్నాలు వస్తాయి, ఇదంతా మాయ. మనం మాయను జయిస్తాము. అర్థకల్పానికి శత్రువు నుండి రాజ్యాన్ని తీసుకుంటాము, మనకు ఏ చింతా ఉండదు. సాహసవంతులు ఎప్పుడూ వెనుకా-ముందూ చూడరు. యుద్ధానికి సంతోషంగా వెళ్తారు. మీరైతే ఇక్కడ చాలా ప్రశాంతంగా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. ఈ ఛీ-ఛీ శరీరాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడిక మధురమైన సైలెన్స్ హోమ్ కు వెళ్తున్నాము. నేను మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చాను, నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారని తండ్రి చెప్తున్నారు. అపవిత్ర ఆత్మ వెళ్ళలేదు. ఇవన్నీ కొత్త విషయాలు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. వికర్మల నుండి రక్షించుకునేందుకు బుద్ధి ప్రీతిని ఒక్క బాబాతోనే జోడించాలి, ఈ కుళ్ళిపోయిన దేహంపట్ల అభిమానాన్ని విడిచిపెట్టాలి.

2. మేము యోధులము అనే స్మృతి ద్వారా మాయ రూపీ శత్రువుపై విజయాన్ని ప్రాప్తి చేసుకోవాలి, దాన్ని లెక్క చేయకూడదు. మాయ గుప్త రూపంలో చాలా ప్రవేశిస్తుంది కనుక దానిని పరిశీలించాలి మరియు సంభాళించుకోవాలి.

వరదానము:-

జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహంతో ఉన్నవారి దాహాన్ని తీర్చే అమృత కలశధారి భవ

ఇప్పుడు మెజారిటీ ఆత్మలు ప్రకృతి యొక్క అల్పకాలిక సాధనాలతో, ఆత్మిక శాంతిని పొందేందుకు తయారైన అల్పజ్ఞ స్థానాలతో, పరమాత్మతో మిలనం చేయించే కంట్రాక్టర్లతో అలిసిపోయారు, నిరాశ చెంది ఉన్నారు, సత్యము వేరే ఏదో ఉందని అర్థం చేసుకున్నారు, ప్రాప్తి కోసం దాహంతో ఉన్నారు. ఇటువంటి దాహంతో ఉన్న ఆత్మలను ఆత్మిక పరిచయం, పరమాత్మ పరిచయం యొక్క యథార్థమైన బిందువులు కూడా తృప్తాత్మలుగా చేస్తాయి. కావున జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహంతో ఉన్నవారి దాహాన్ని తీర్చండి. అమృత కలశం సదా తోడుగా ఉండాలి. అమరులుగా అవ్వండి మరియు అమరులుగా తయారుచెయ్యండి.

స్లోగన్:-

సర్దుకుపోయే కళను లక్ష్యంగా చేసుకున్నట్లయితే సహజంగా సంపూర్ణమైపోతారు.