02-06-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మొత్తం విశ్వంపై శాంతి రాజ్యాన్ని నెలకొల్పే తండ్రికి మీరు సహాయకులు, ఇప్పుడు మీ ముందు సుఖ-శాంతుల ప్రపంచముంది"

ప్రశ్న:-

తండ్రి పిల్లలను ఎందుకు చదివిస్తారు. ఈ చదువులోని సారమేమిటి?

జవాబు:-

తండ్రి తన పిల్లలను స్వర్గానికి రాకుమారులుగా, విశ్వానికి యజమానులుగా చేసేందుకు చదివిస్తారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, ప్రపంచపు విషయాలన్నీ వదిలేయండి, ఇదే చదువు సారము, మా వద్ద కోట్లున్నాయి, లక్షలున్నాయి.... అని ఎప్పుడూ భావించకండి. ఏవీ చేతిలోకి రావు, కావున బాగా పురుషార్థం చేయండి, చదువుపై ధ్యానమును ఉంచండి.

గీతము:-

చివరకు ఆ రోజు రానే వచ్చింది..... (ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్.....)

ఓంశాంతి. విశ్వంలో చివరికి శాంతి సమయం వచ్చిందని పిల్లలు పాటలో విన్నారు. విశ్వంలో శాంతి ఎలా ఏర్పడగలదని అందరూ అంటారు, దీనికోసం ఎవరైతే మంచి సలహానిస్తారో వారికి బహుమతి ఇస్తారు. నెహ్రూ కూడా సలహా ఇచ్చేవారు, కాని శాంతి అయితే ఏర్పడలేదు కదా. కేవలం సలహా ఇచ్చి వెళ్ళారు. విశ్వమంతటిలో ఒకానొక సమయంలో సుఖ-శాంతులు, సంపద మొదలైనవన్నీ ఉండేవి, ఇప్పుడవి లేవని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు అది మళ్ళీ రానున్నది. చక్రమైతే తిరుగుతుంది కదా. ఇది సంగమయుగీ బ్రాహ్మణులైన మీ బుద్ధిలో ఉంది. భారతదేశం మళ్ళీ బంగారంగా అవుతుందని మీకు తెలుసు. భారతదేశమునే బంగారు పిచ్చుకని అంటారు. మహిమ చేస్తారు కానీ కేవలం నామమాత్రముగా చేస్తారు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా అందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని మీకు తెలుసు. కనుక ఈ నరకంలోని దుఃఖపు విషయాలన్నింటినీ మర్చిపోతారు. ఇప్పుడు మీ బుద్ధిలో సుఖమయమైన ప్రపంచం ఎదురుగా నిలిచి ఉంది. ఎలా అయితే ఇంతకుముందు విదేశాల నుండి తిరిగి వచ్చేటప్పుడు ఇక చేరుకోవడానికి ఇంకా కొద్ది సమయమే ఉందని భావించేవారు. ఎందుకంటే, ఇంతకుముందు విదేశాల నుండి రావడానికి చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడైతే విమానాల ద్వారా చాలా త్వరగా చేరుకుంటారు. ఇప్పుడు మేము సుఖపడే రోజులు రానున్నాయని, దాని కోసం పురుషార్థం చేస్తున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. బాబా పురుషార్థం కూడా చాలా సహజమైనది తెలియజేశారు. డ్రామానుసారంగా కల్పక్రితం వలె ఇది నిశ్చితము. మీరు దేవతలుగా ఉండేవారు, దేవతలకు లెక్కలేనన్ని ఎన్ని మందిరాలు తయారవుతున్నాయి. పిల్లలకు తెలుసు ఈ మందిరాలు మొదలైనవి కట్టి ఏం చేస్తారు! ఇక ఎన్ని రోజులున్నాయి! పిల్లలైన మీరు జ్ఞానానికి అథారిటీ(అధికారులు). పరమపిత పరమాత్మ సర్వశక్తివంతమైన అథారిటీ అని అంటారు. మీరు జ్ఞానానికి అథారిటీ, వారు భక్తికి అథారిటీ. తండ్రిని సర్వశక్తివంతులని అంటారు. పిల్లలైన మీరు నంబరువారు పురుషార్థానుసారంగా తయారవుతున్నారు. మీకు సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. బాబా నుండి వారసత్వాన్ని పొందే పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. భక్తిలో అథారిటీగా ఉన్నవారు భక్తినే వినిపిస్తారు. మీరు జ్ఞానం యొక్క అథారిటీ కనుక జ్ఞానాన్నే వినిపిస్తారు. సత్యయుగంలో భక్తి ఉండదు. పూజారి ఒక్కరు కూడా ఉండరు, పూజ్యులే పూజ్యులుంటారు. అర్ధకల్పము పూజ్యులు, అర్ధకల్పము పూజారులు. పూజ్యులుగా ఉన్నప్పుడు స్వర్గముండేదన్నది భారతవాసుల కొరకే. ఇప్పుడు భారతదేశము పూజారిగా, నరకంగా ఉంది. పిల్లలైన మీరిప్పుడు ప్రాక్టికల్ గా జీవితాన్ని తయారుచేసుకుంటున్నారు. నంబరువారు పురుషార్థానుసారంగా అందరికీ అర్థం చేయిస్తూ ఉంటారు, వృద్ధి పొందుతూ ఉంటారు. డ్రామాలో మొదటి నుండే నిశ్చితమై ఉంది. డ్రామా మీ ద్వారా పురుషార్థం చేయిస్తూ ఉంటుంది, మీరు చేస్తూ ఉంటారు. డ్రామాలో మనకు అవినాశి పాత్ర ఉందని మీకు తెలుసు, ప్రపంచానికి ఈ విషయాల కోసం ఏమి తెలుసు. డ్రామాలో మన పాత్రనే ఉన్నది. ఈ డ్రామాలో మా పాత్ర ఎలా ఉంది అనే విషయం, చెప్పేవారికే అర్థమవుతుంది. ఈ సృష్టిచక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ ప్రపంచ చరిత్ర-భూగోళాల గురించి మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఉన్నతోన్నతమైనవారు ఎవరో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఋషులు, మునులు మొదలైనవారు కూడా మాకు తెలియదని చెప్పేవారు. నేతి-నేతి అని అనేవారు కదా. వారు రచయిత అయిన తండ్రి అని, వారు మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఇక్కడ కూర్చున్నప్పుడు దేహీ అభిమానులుగా కూర్చోవాలి అని బాబా పదే, పదే అర్థం చేయించారు. ఒక్క తండ్రి మాత్రమే రాజయోగాన్ని నేర్పిస్తారు, ప్రపంచ చరిత్ర-భూగోళాలను కూడా తెలియజేస్తారు. నేను సంకల్పాలను చదివేవాడను (థాట్ రీడర్ ను) కాదు, ఇంత పెద్ద ప్రపంచముంది, దీనిని ఏం కూర్చుని చదువుతాను అని తండ్రి అంటారు! నేను డ్రామా అనుసారంగా మిమ్మల్ని పావనంగా చేసేందుకు వస్తాను అని స్వయంగా తండ్రి చెప్తున్నారు. డ్రామాలో నా పాత్ర ఏదైతే ఉన్నదో, అది అభినయించేందుకు వస్తాను. అంతేకానీ నేను సంకల్పాలను చదవను. నా పాత్ర ఏమిటో, మీరు ఏ పాత్రను అభినయిస్తున్నారో తెలుపుతాను. మీరు ఈ జ్ఞానాన్ని నేర్చుకుని ఇతరులకు నేర్పిస్తారు. పతితులను పావనంగా చేయడమే నా పాత్ర. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు, మీకు తిథి-తారీఖులు మొదలైనవన్నీ తెలుసు. ప్రపంచంలో ఎవరికైనా ఏమైనా తెలుసా. మీకు తండ్రి నేర్పిస్తున్నారు. ఈ చక్రం పూర్తయిన తర్వాత బాబా మళ్ళీ వస్తారు. ఆ సమయంలో ఏ పాత్ర అయితే జరిగిందో, అది మళ్ళీ కల్పం తర్వాత జరుగుతుంది. ఒక్క క్షణం మరో క్షణంతో కలవదు. ఈ నాటకం తిరుగుతూనే ఉంటుంది. పిల్లలైన మీకు ఈ అనంతమైన నాటకం గురించి తెలుసు. అయినా మీరు క్షణ క్షణము మర్చిపోతారు. మీరు కేవలం స్మృతి చేయండని బాబా అంటారు. మన బాబా బాబాయే కాక టీచర్, గురువు కూడా. మీ బుద్ధి అటువైపుకు వెళ్ళిపోవాలి. తండ్రి మహిమను విని ఆత్మ సంతోషిస్తుంది. అందరూ మా బాబా, బాబాయే కాక టీచరు కూడా, వారు సత్యాతి సత్యమైనవారని అంటారు. చదువు కూడా సత్యమైనది, సంపూర్ణమైనది. ఆ మనుష్యులు చదివే చదువు అసంపూర్ణమైనది. కావున పిల్లల బుద్ధిలో ఎంత సంతోషముండాలి! పెద్ద పరీక్షలు పాస్ అయిన వారి బుద్ధిలో సంతోషం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంతో ఉన్నతమైన చదువును చదువుకుంటున్నారని అపారమైన సంతోషముండాలి. భగవంతుడైన తండ్రి, అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. కనుక మీ రోమరోమాలు పులకరించిపోవాలి. అదే అధ్యాయము పునరావృతమవుతూ ఉంది, ఇది మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. కల్పం ఆయువునే పెంచేశారు. మీ బుద్ధిలో ఇప్పుడు పూర్తి 5 వేల సంవత్సరాల కథ అంతా చక్రం వలె తిరుగుతూ ఉంటుంది, దీనినే స్వదర్శన చక్రమని అంటారు.

బాబా, చాలా తుఫాన్లు వస్తున్నాయి, మేము మర్చిపోతున్నామని పిల్లలు అంటారు. మీరు ఎవరిని మర్చిపోతున్నారు అని బాబా అడుగుతున్నారు? ఏ బాబా అయితే మిమ్మల్ని ద్వికిరీటధారులుగా, విశ్వానికి యజమానులుగా తయారుచేస్తున్నారో, వారిని మీరు ఎలా మర్చిపోతారు? వేరే వారెవ్వరినీ మర్చిపోరు. భార్య, పిల్లలు, పినతండ్రులు, మామయ్యలు, బంధువులు, మిత్రులు మొదలైనవారంతా బాగా గుర్తుంటారు. ఇతరులెవ్వరినీ మర్చిపోరు. కాని ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఎందుకు మర్చిపోతారు? ఈ స్మృతియాత్రలోనే మీ యుద్ధం నడుస్తుంది, ఎంత సాధ్యమైతే అంత స్మృతి చేయండి. పిల్లలు తమ ఉన్నతి కొరకు ఉదయము ఉదయమే లేచి తండ్రి స్మృతిలో షికారు చేయాలి. మీరు మేడపైకి లేక బయట చల్లగాలిలోకి వెళ్ళిపోండి. ఇక్కడికే వచ్చి కూర్చోవాలని లేదు. బయటకు కూడా వెళ్ళవచ్చు, ఉదయం వేళలో ఏ భయమూ ఉండదు. బయటకు వెళ్ళి వాకింగ్ చేయండి. పరస్పరం ఇవే మాటలు మాట్లాడుకోండి, ఎవరు ఎక్కువ సమయం బాబాను స్మృతి చేస్తారో చూద్దాము, తర్వాత మేము ఎంత సమయం స్మృతి చేసాము అన్నది మళ్ళీ చెప్పాలి. మిగిలిన సమయంలో మన బుద్ధి ఎక్కడెక్కడకు వెళ్ళింది అని చూసుకోండి. దీనినే పరస్పరంలో ఉన్నతి పొందడమని అంటారు. ఎంత సమయం తండ్రిని స్మృతి చేశారో నోట్ చేయండి. ఈ బాబా తమ అభ్యాసమును తెలియజేస్తారు. స్మృతిలో మీరు ఒక్క గంట నడిచి వెళ్ళినా కాళ్ళు అలసిపోవు. స్మృతిలో మీ పాపాలు ఎన్నో నశిస్తాయి. చక్రం గురించి కూడా మీకు తెలుసు, రాత్రింబవళ్ళు ఇప్పుడు మనం ఇంటికి వెళ్తామని బుద్ధిలో ఉండాలి. పురుషార్థం చేస్తున్నారు, కాని కలియుగంలోని మనుష్యులకు ఇది కొద్దిగా కూడా తెలియదు, ముక్తి కోసం ఎంతో భక్తి చేస్తూ ఉంటారు. అనేక మతాలున్నాయి. బ్రాహ్మణులైన మీదంతా ఒకే మతము, ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారందరికీ శ్రీమతముంది. మీరు తండ్రి శ్రీమతం ద్వారా దేవతలుగా అవుతారు. దేవతలకు శ్రీమతమేమీ లేదు. శ్రీమతం బ్రాహ్మణులైన మీకు ఇప్పుడే లభిస్తుంది. భగవంతుడు నిరాకారుడు. వారు మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. దాని ద్వారా మీరు మీ రాజ్యభాగ్యాన్ని తీసుకొని విశ్వానికి ఉన్నతమైన అధికారులుగా అవుతారు. భక్తిమార్గపు వేదశాస్త్రాలు మొదలైనవి అనేకమున్నాయి. కాని పనికొచ్చేది ఒక్క గీత మాత్రమే. భగవంతుడు వచ్చి రాజయోగం నేర్పిస్తారు. దానినే గీత అని అంటారు. ఇప్పుడు మీరు బాబా ద్వారా చదువుకుంటున్నారు. దీని ద్వారా స్వర్గ రాజ్యం పొందుతారు. ఎవరు చదువుతారో, వారు పొందుతారు. డ్రామాలో పాత్ర ఉంది కదా. జ్ఞానం వినిపించే జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. వారు డ్రామా ప్లాన్ అనుసారంగా కలియుగాంతము, సత్యయుగం ఆది యొక్క సంగమంలోనే వస్తారు. ఏ విషయంలోనూ తికమక పడకండి. తండ్రి వీరిలోకి వచ్చి చదివిస్తారు, ఇంకెవ్వరు చదివించలేరు. ఈ దాదా కూడా ఇంతకుముందు ఎవరి వద్దనైనా చదివి ఉంటే, వారితో పాటుగా ఇంకెంతోమంది చదివి ఉండేవారు కదా. ఈ గురువులు మొదలైన వారందరినీ ఉద్ధరించేందుకు నేను వస్తానని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీ ఎదురుగా లక్ష్యముంది. మనం ఈ విధంగా అవుతాము. ఇదే నరుడి నుండి నారాయణుడిగా అయ్యే సత్యమైన కథ. భక్తిమార్గంలో వీరి మహిమ నడుస్తుంది. భక్తిమార్గపు ఆచారాలు కొనసాగుతూ వస్తాయి. ఇప్పుడు ఈ రావణరాజ్యం పూర్తవ్వాలి. ఇప్పుడు మీరు దసరా మొదలైన వాటికి ఏమీ వెళ్ళరు. వారేమి చేస్తున్నారో వారికి మీరు అర్థం చేయించగలరు, అది పిల్లల ఆట వంటి పని. పెద్ద, పెద్ద వ్యక్తులు దానిని చూసేందుకు వెళ్తారు. రావణుడిని ఎలా తగలబెడతారు! రావణుడంటే ఎవరో ఎవ్వరూ చెప్పలేరు. రావణ రాజ్యం కదా! దసరా మొదలైనవాటిలో ఎంత సంతోషంగా జరుపుకుంటారు, అందులో రావణుడిని తగలబెడుతూ ఉంటారు. దుఃఖము కూడా కొనసాగుతూనే ఉంది, ఏమీ అర్థం చేసుకోరు. ఎంత అవివేకులుగా ఉండేవారిమో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. రావణుడు అవివేకులుగా చేస్తాడు. బాబా, మేము తప్పకుండా లక్ష్మీనారాయణులుగా అవుతామని మీరిప్పుడు చెప్తారు. మేము తక్కువ పురుషార్థమేమి చేయము. ఇది ఒక్కటే పాఠశాల, చదువు చాలా సహజమైనది. వృద్ధ మాతలు ఇంకేమీ స్మృతి చేయలేకపోయినా కేవలం తండ్రిని స్మృతి చేయండి. నోటితో ఓ రామా అని అయితే అంటారు కదా. బాబా చాలా సులభంగా అర్థం చేయిస్తారు. మీరు ఆత్మలు, పరమాత్మ తండ్రిని స్మృతి చేస్తే మీ నావ తీరానికి చేరుతుంది. ఎక్కడకు వెళ్తారు? శాంతిధామానికి-సుఖధామానికి. మిగిలిన వాటన్నింటినీ మర్చిపోండి. ఏదైతే విన్నారో, చదివారో, వాటినన్నింటినీ మరచి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. బాబా స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి. ఎంత సహజం! భృకుటి మధ్యలో మెరిసే ఒక అద్భుత నక్షత్రం అని పాడారు అంటే తప్పకుండా ఇంత చిన్నని ఆత్మయే ఉంటుంది కదా! ఆత్మను చూసేందుకు డాక్టర్లు చాలా ప్రయత్నిస్తారు కాని అది అత్యంత సూక్ష్మమైనది. హఠముతో దానిని ఎవ్వరూ చూడలేరు. తండ్రి కూడా అటువంటి బిందువే. ఏ విధంగా మీరు సాధారణంగా ఉన్నారో, అలానే నేను కూడా సాధారణంగా అయ్యి మిమ్మల్ని చదివిస్తున్నాను. వీరిని భగవంతుడు కూర్చొని ఎలా చదివిస్తున్నారో ఎవరికైనా ఏమి తెలుసు. కృష్ణుడు చదివిస్తే అమెరికా, జపాన్ మొదలైన స్థానాలన్నింటి నుండి వచ్చేస్తారు. అతనిలో అంతటి ఆకర్షణ ఉంది. అందరికీ శ్రీకృష్ణుడంటే ప్రేమ ఉంది కదా. ఇప్పుడు మనమలా తయారవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. కృష్ణుడు యువరాజు, కృష్ణుడిని ఒడిలోకి తీసుకోవాలంటే పురుషార్థం చేయాల్సి ఉంటుంది, అదేమంత పెద్ద విషయం కాదు. తండ్రి తన పిల్లలను స్వర్గ రాకుమారులుగా, విశ్వానికి అధికారులుగా తయారుచేసేందుకు చదివిస్తారు.

పిల్లలూ, ప్రపంచంలోని అన్ని విషయాలను వదిలేయండి, ఇదే చదువు సారము అని తండ్రి చెప్తున్నారు. మా వద్ద కోట్లున్నాయి, లక్షలున్నాయి అని ఎప్పుడూ భావించకండి. అవేవీ చేతికి రావు కనుక పురుషార్థం బాగా చేయండి. బాబా వద్దకు వచ్చినప్పుడు బాబా ఫిర్యాదు చేస్తారు - 8 నెలల నుండి వస్తున్నారు, ఏ తండ్రి నుండైతే స్వర్గ వారసత్వం లభిస్తుందో వారిని ఇంతవరకు కలుసుకోను కూడా కలుసుకోలేదే? బాబా ఫలానా పని ఉందని పిల్లలంటారు. అరే! ఒకవేళ మీరు మరణిస్తే, మళ్ళీ ఇక్కడికెలా రాగలరు. ఈ సాకులు ఏమైనా నడుస్తాయా. తండ్రి రాజయోగం నేర్పుతూ ఉంటే మీరు నేర్చుకోరా? ఎవరైతే ఎక్కువ భక్తి చేసి ఉంటారో, వారికి ఏడు రోజులు కాదు, ఒక్క సెకెండులోనే బాణం తగులగలదు. క్షణంలో విశ్వాధికారులుగా అవ్వగలరు. స్వయంగా అనుభవజ్ఞులైన వీరు కూర్చొని ఉన్నారు, వినాశనాన్ని చూశారు, చతుర్భుజ రూపాన్ని చూశారు. చాలు, ఓహో! నేను విశ్వానికి యజమానిగా అవుతానని భావించడం మొదలుపెట్టారు. సాక్షాత్కారం జరిగింది, ఉత్సాహం కలిగింది, సర్వస్వమూ వదిలేశారు. ఇక్కడ విశ్వ చక్రవర్తి పదవిని ఇచ్చేందుకు తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. నిశ్చయం ఎప్పుడు కలిగిందని తండ్రి అడుగుతారు. 8 నెలలు అని చెప్తారు. ముఖ్యమైన విషయం - స్మృతి మరియు జ్ఞానం అని బాబా అర్థం చేయించారు. అంతేగాని సాక్షాత్కారాలు ఎందుకూ పనికిరావు. తండ్రిని గుర్తించి చదవడం ప్రారంభిస్తే మీరు కూడా ఇలా తయారవుతారు. ఎవరికైనా అర్థం చేయించేందుకు పాయింట్లు లభిస్తూ ఉంటాయి. చాలా మధురంగా అర్థం చేయించండి. నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారని పతితపావనులైన శివబాబా చెప్తున్నారు. యుక్తిగా అర్థం చేయించాలి. గాడ్ ఫాదర్ విముక్తులను చేసి మధురమైన ఇంటికి తిరిగి తీసుకెళ్ళాలని మీరు కోరుకుంటారు కదా! అచ్ఛా, ఇప్పుడు మీపై ఏ తుప్పు అయితే పట్టి ఉందో దాని కోసం తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1.ఉదయముదయమే లేచి వాకింగ్ చేస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఎవరు ఎంత సమయం బాబాను స్మృతి చేస్తున్నారో, ఇవే విషయాల గురించి పరస్పరం మధురమైన ఆత్మిక సంభాషణ చేసుకోండి. ఆ తర్వాత మీ అనుభవాలను వినిపించండి.

2.తండ్రిని గుర్తించిన తర్వాత ఎటువంటి సాకులు చెప్పకూడదు. చదువులో నిమగ్నమైపోవాలి. మురళిని ఎప్పుడూ మిస్ చేయకూడదు.

వరదానము:-

రియాలిటీ ద్వారా ప్రతి కర్మలో మరియు మాటలో రాయల్టీని చూపించే ఫస్ట్ డివిజన్ కు అధికారి భవ

రియాలిటీ అనగా సదా మీ వాస్తవిక స్వరూపం స్మృతిలో ఉండడం. దీని ద్వారా స్థూలమైన ముఖంలో కూడా రాయల్టీ కనిపిస్తుంది. రియాలిటీ అనగా ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు. ఈ స్మృతి ద్వారా ప్రతి కర్మ మరియు మాటలో రాయల్టీ కనిపిస్తుంది. సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి ప్రతి కర్మలో తండ్రి సమానమైన చరిత్ర అనుభవమవుతుంది. ప్రతి మాటలో తండ్రి సమానమైన అథారిటీ మరియు ప్రాప్తి అనుభవమవుతుంది. వారి సాంగత్యం రియల్ గా ఉండటం వలన అది పారస్ యొక్క పని చేస్తుంది. ఇటువంటి రియాలిటీ కల రాయల్ ఆత్మలే ఫస్ట్ డివిజన్కు అధికారులుగా అవుతారు.

స్లోగన్:-

శ్రేష్ఠ కర్మల ఖాతాను పెంచినట్లయితే, వికర్మల ఖాతా సమాప్తమవుతుంది.