17-06-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - స్మృతిలో ఉన్నట్లయితే దూరంగా ఉంటూ కూడా తోడుగా ఉంటారు, స్మృతి ద్వారా తోడు యొక్క అనుభవం కూడా కలుగుతుంది మరియు వికర్మలు కూడా వినాశనమవుతాయి"

ప్రశ్న:-

దూరదేశీ అయిన తండ్రి పిల్లలను దూరదృష్టి కలవారిగా తయారుచేసేందుకు ఏ జ్ఞానాన్నిస్తారు?

జవాబు:-

ఆత్మ ఏ విధంగా చక్రములో భిన్న-భిన్న వర్ణాలలోకి వస్తుందో, ఆ జ్ఞానాన్ని దూరదృష్టి గల తండ్రి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు మనము బ్రాహ్మణ వర్ణానికి చెందినవారము, ఇంతకుముందు జ్ఞానము లేనప్పుడు శూద్ర వర్ణానికి చెందినవారిగా ఉండేవారిమని, అంతకంటే ముందు వైశ్య వర్ణానికి చెందినవారిగా ఉండేవారిమని మీరు తెలుసుకున్నారు. దూరదేశములో నివసించే తండ్రి వచ్చి దూరదృష్టి కలవారిగా అయ్యేందుకు కావలసిన పూర్తి జ్ఞానాన్ని పిల్లలకు ఇస్తారు.

గీతము:-

ఎవరైతే ప్రియునితో ఉన్నారో... (జో పియాకే సాథ్ హై...)

ఓంశాంతి. ఎవరైతే జ్ఞానసాగరునితో ఉన్నారో వారిపై జ్ఞాన వర్షము కురుస్తుంది. మీరు తండ్రి తోడుగానే ఉన్నారు కదా. విదేశాలలో ఉన్నా లేక ఇంకెక్కడ ఉన్నాగానీ, తోడుగానే ఉన్నారు. గుర్తుంచుకుంటారు కదా. ఏ పిల్లలైతే స్మృతిలో ఉంటారో, వారు సదా తోడుగా ఉన్నట్లే. స్మృతిలో ఉండడం ద్వారా తోడుగా ఉంటారు మరియు వికర్మలు వినాశనమవుతాయి, అప్పుడు ఇక వికర్మాజీత్ శకం ప్రారంభమవుతుంది. తర్వాత రావణ రాజ్యం ఏర్పడినప్పుడు, రాజా విక్రముని శకమని అంటారు. అది వికర్మాజీత్ శకమైతే ఇది వికర్మీ శకము. ఇప్పుడు మీరు వికర్మాజీతులుగా అవుతున్నారు. తర్వాత మీరు వికర్ములుగా అవుతారు. ఈ సమయంలో అందరూ అతి వికర్ములుగా ఉన్నారు. ఎవ్వరికీ తమ ధర్మం గురించి తెలియదు. ఈ రోజు బాబా ఒక చిన్న ప్రశ్నను అడుగుతున్నారు - సత్యయుగములోని దేవతలకు మేము ఆదిసనాతన దేవీ-దేవతా ధర్మస్థులమని తెలిసి ఉంటుందా? ఎలాగైతే మేము హిందూ ధర్మానికి చెందినవారమని మీరు భావిస్తారో, మరి కొందరు మేము క్రిస్టియన్ ధర్మస్థులమని అంటారో, అలా అక్కడ దేవతలు స్వయాన్ని దేవీ-దేవతా ధర్మస్థులమని భావిస్తారా? ఆలోచించవలసిన విషయం కదా. మేము ఫలానా ధర్మానికి చెందినవారిమని భావించడానికి అక్కడ ఇతర ధర్మమేదీ ఉండదు. ఇక్కడ అనేక ధర్మాలున్నాయి కనుక గుర్తింపు కోసం వేరు-వేరు పేర్లు పెట్టారు. అక్కడ ఒకే ధర్మము ఉంటుంది కావున మేము ఈ ధర్మానికి చెందినవారిమని చెప్పే అవసరం ఉండదు. వేరే ధర్మాలు అనేవి ఉంటాయని కూడా వారికి తెలియదు, అక్కడ వారిదే రాజ్యము. మేము ఆదిసనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిమని ఇప్పుడు మీకు తెలుసు. దేవీ-దేవతలని ఇతరులెవ్వరినీ అనలేరు. పతితంగా అయిన కారణంగా స్వయాన్ని దేవతలమని పిలుచుకోలేరు. పవిత్రమైన వారినే దేవతలని అంటారు. అక్కడ ఇటువంటి విషయమేదీ ఉండదు. ఎవరితోనూ పోల్చడమూ ఉండదు. ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు, ఆదిసనాతన దేవీ-దేవతా ధర్మము మళ్ళీ స్థాపనవుతుందని తెలుసు. అక్కడైతే ధర్మము అన్న మాటే ఉండదు. అక్కడ ఉండేది ఒకే ధర్మము. మహాప్రళయము జరుగుతుంది అనగా ఏమీ మిగలదు అని వీరు ఏదైతే చెప్తున్నారో, అది కూడా తప్పే, ఈ విషయం కూడా పిల్లలకు అర్థం చేయించారు. రైట్ ఏమిటి అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. శాస్త్రాలలో అయితే జలమయమైనట్లు చూపించారు. భారత్ తప్ప మిగిలినవన్నీ జలమయమైపోతాయి అని తండ్రి చెప్తున్నారు. ఇంత పెద్ద సృష్టిని ఏం చేసుకుంటారు. ఒక్క భారత్ లోనే ఎన్ని గ్రామాలున్నాయో చూడండి. మొదట అడవిగా ఉండేది, ఆ తర్వాత దాని నుండి వృద్ధి జరుగుతుంది. అక్కడైతే కేవలం ఆది సనాతన దేవీ-దేవతా ధర్మస్థులైన మీరు మాత్రమే ఉంటారు. తండ్రి బ్రాహ్మణులైన మీ బుద్ధిలో ధారణ చేయిస్తున్నారు. ఉన్నాతి ఉన్నతుడైన శివబాబా ఎవరు? వారినెందుకు పూజిస్తున్నారు? వారిపై జిల్లేడు మొదలైన పుష్పాలెందుకు అర్పిస్తారు? ఈ విషయాలు మీరిప్పుడు తెలుసుకున్నారు. వారు నిరాకారుడు కదా! వారు నామ రూపాలకు అతీతమైనవారని అంటారు కానీ నామ రూపాలకు అతీతమైన వస్తువేదీ ఉండదు. అటువంటప్పుడు పుష్పాలు మొదలైనవి ఎవరిపై అర్పించినట్లు? మొట్టమొదట వారికే పూజ జరుగుతుంది. మందిరాలు కూడా వారివే తయారౌతాయి ఎందుకంటే వారు భారత్ లోని పిల్లలకు మరియు మొత్తము ప్రపంచములోని పిల్లలకు సేవ చేస్తారు. మనుష్యులకే కదా సేవ చేస్తారు. ఈ సమయంలో స్వయాన్ని దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిమని చెప్పుకోలేరు. మనము దేవీ-దేవతలుగా ఉండేవారిమని, ఇప్పుడు మళ్ళీ తయారవుతున్నామని ఇంతకుముందు మీకు తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ జ్ఞానం తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరని అర్థం చేయించాలి. వారినే జ్ఞానసాగరులు, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. రచయిత మరియు రచన గురించి ఋషులు-మునులు మొదలైనవారెవ్వరికీ తెలియదని గాయనం చేయబడింది. మాకు తెలియదు-తెలియదు (నేతి-నేతి) అని అంటూ వెళ్ళిపోయారు. చిన్న పిల్లలకు ఏమైనా జ్ఞానం ఉంటుందా? పెద్దవారయ్యే కొద్ది, బుద్ధి వికసిస్తూ ఉంటుంది. విదేశాలు ఎక్కడున్నాయనేది, మిగతా ఏమైనా ఎక్కడున్నాయనేది, ఆ తర్వాత బుద్ధిలోకి వస్తుంది. ఇంతకుముందు పిల్లలైన మీకు కూడా ఈ అనంతమైన జ్ఞానము గురించి ఏమీ తెలియదు. నేను శాస్త్రాలు మొదలైనవి చదివేవాడిని కానీ ఏమీ అర్థమయ్యేది కాదని వీరు కూడా అంటున్నారు. ఈ డ్రామాలోని పాత్రధారులు మనుష్యులే కదా.

మొత్తము ఆటంతా రెండు విషయాలపైనే తయారుచేయబడింది. భారత్ యొక్క ఓటమి మరియు భారత్ యొక్క గెలుపు. భారత్ లో సత్యయుగ ఆది సమయములో పవిత్రమైన ధర్మముండేది, ఈ సమయంలో అపవిత్రమైన ధర్మము ఉంది. అపవిత్రత కారణంగానే స్వయాన్ని దేవతలుగా పిలుచుకోవడం లేదు, కానీ శ్రీ శ్రీ అని పేర్లు పెట్టించుకుంటున్నారు. శ్రీ అనగా శ్రేష్ఠమైనవారు. పవిత్రమైన దేవతలనే శ్రేష్ఠమైనవారు అని అంటారు. శ్రీమత్ భగవానువాచ అని అంటారు కదా. ఇప్పుడు శ్రీ అనగా ఎవరన్నట్లు? ఎవరైతే తండ్రి సన్ముఖంలో విని శ్రీ గా తయారవుతారో వారా, లేక తమను శ్రీ శ్రీ అని పిలిపించుకునేవారా? తండ్రి కర్తవ్యానికి ఏర్పడిన పేరును కూడా స్వయానికి పెట్టించుకుంటున్నారు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. అయినాసరే పిల్లలూ, ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి, ఇదే వశీకరణ మంత్రము అని తండ్రి చెప్తున్నారు. మీరు రావణునిపై విజయాన్ని పొంది జగత్ జీతులుగా అవుతారు. క్షణ-క్షణం స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరమైతే ఇక్కడ పంచ తత్వాలతో తయారుచేయబడింది. తయారవుతుంది, వదిలిపోతుంది, మళ్ళీ తయారవుతుంది. ఆత్మ అవినాశి. అవినాశి ఆత్మలను ఇప్పుడు అవినాశి తండ్రి సంగమయుగములో చదివిస్తున్నారు. ఎన్ని విఘ్నాలు మొదలైనవి వచ్చినా, మాయా తుఫానులు వచ్చినా, మీరు తండ్రి స్మృతిలో ఉండండి. మనమే సతోప్రధానంగా ఉండేవారము, తర్వాత తమోప్రధానంగా అయ్యామని మీరు అర్థము చేసుకున్నారు. మీలో కూడా నంబరువారుగా తెలుసుకున్నారు. మొట్టమొదట మనమే భక్తి చేశామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఎవరైతే మొట్టమొదట భక్తి చేశారో, తప్పకుండా వారే శివుని మందిరాలను తయారుచేసి ఉంటారు ఎందుకంటే వారే ధనవంతులుగా ఉంటారు కదా. పెద్ద రాజులను చూసి ఇతర రాజులు మరియు ప్రజలు కూడా తయారుచేస్తారు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. ఒక్క సెకెండులో జీవన్ముక్తి అని అంటారు. కానీ అర్థము చేయించేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది. జ్ఞానము సహజమైనది, స్మృతియాత్రకు ఎంత సమయం పడుతుందో, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అంత సమయము పట్టదు. బాబా, రండి, మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయండి అని పిలుస్తారు, కానీ మమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేయండి అని అనరు. అందరూ పతితుల నుండి పావనంగా చేయమనే పిలుస్తారు. సత్యయుగాన్ని పావన ప్రపంచమని అంటారు, దీనిని పతిత ప్రపంచమని అంటారు. దీనిని పతిత ప్రపంచమని అంటున్నా కూడా స్వయాన్ని పతితులమని భావించరు. స్వయం పట్ల ద్వేషం కలిగి ఉండరు. మీరు ఎవరి చేతి వంటను తినరు అంటే మేము అంటరానివారమా అని అంటారు. అరే, మీరు స్వయమే అంటున్నారు కదా. అందరూ పతితులే కదా. మేము పతితులము, ఈ దేవతలు పావనమైనవారని మీరు అంటారు కూడా. మరి పతితులను ఏమంటారు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తాగాలనే గాయనము ఉంది కదా. విషము అశుద్ధమైనది కదా. ఈ విషము మీకు ఆది-మధ్య-అంతాలు దుఃఖాన్నిస్తుందని తండ్రి చెప్తున్నారు కాని దీనిని విషమని భావించరు. ఏ విధంగా మత్తుపానీయాలు తాగేవారు అవి లేకుండా ఉండలేరో, తాగుడు అలవాటు ఉన్నవారు మద్యం లేకుండా ఉండలేరో, ఇదీ అంతే. యుద్ధ సమయములో వారికి మద్యం త్రాగించి నషా ఎక్కించి యుద్ధానికి పంపిస్తారు. నషా ఎక్కిందంటే చాలు, ఇక మేమిలాగే చేయాలి అని భావిస్తారు. అటువంటివారికి మృత్యువు భయముండదు. ఎక్కడికైనా సరే బాంబులు తీసుకువెళ్ళి బాంబుల సహితంగా పడిపోతారు. మూసలాల యుద్ధము జరిగిందని గాయనం కూడా ఉంది, యథార్థ విషయాన్ని మీరు ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తున్నారు. ఇంతకుముందు మీరు కేవలం కడుపు నుండి మూసలం వెలువడిందని, ఆ తర్వాత ఇంకేవో చేశారని చదువుకునేవారు. ఇప్పుడు మీరు పాండవులు ఎవరో, కౌరవులు ఎవరో అర్థము చేసుకున్నారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు పాండవులు జీవిస్తూనే దేహా-అభిమానము నుండి కరిగిపోయేందుకు పురుషార్థము చేశారు. మీరిప్పుడు ఈ పాత చెప్పును వదిలేందుకు పురుషార్థము చేస్తున్నారు. పాత చెప్పుని విడిచి క్రొత్తది తీసుకోవాలని అంటారు కదా. తండ్రి పిల్లలకు మాత్రమే అర్థము చేయిస్తారు. నేను కల్ప-కల్పము వస్తానని, నా పేరు శివ అని తండ్రి చెప్తున్నారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు. భక్తిమార్గము కోసం మందిరాలు మొదలైనవి ఎన్ని తయారుచేస్తారు. పేర్లు కూడా చాలా పెట్టేస్తారు. దేవతలకు కూడా అటువంటి పేర్లు పెట్టేస్తారు. ఈ సమయంలో మీకు పూజలు జరుగుతున్నాయి. మనము ఎవరినైతే పూజించేవారిమో వారు మనల్ని చదివిస్తున్నారని కూడా పిల్లలైన మీరు మాత్రమే తెలుసుకున్నారు. ఏ లక్ష్మీ-నారాయణులకైతే మనము పూజారులుగా ఉండేవారిమో వారిలా ఇప్పుడు స్వయంగా మనమే అవుతున్నామనే ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది. స్మరణ చేస్తూ ఉండండి, మళ్ళీ ఇతరులకు కూడా వినిపించండి. ధారణ చేయలేనివారు చాలామంది ఉన్నారు. ఎక్కువగా ధారణ చేయలేకపోయినా ఫర్వాలేదు, స్మృతి చేసే ధారణైతే ఉంది కదా అని బాబా అంటున్నారు. తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి. ఎవరికైతే మురళి చెప్పడం రాదో వారిక్కడ కూర్చొని స్మరిస్తూ ఉండండి. ఇక్కడ బంధనాలు, చిక్కులు మొదలైనవేవీ లేవు. ఇంటిలో మనవలు, మనవరాళ్లు మొదలైనవారి వాతావరణాన్ని చూసి నషా మాయమైపోతుంది. ఇక్కడ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇతరులకు అర్థము చేయించడం చాలా సహజము. వారైతే గీతను పూర్తిగా కంఠస్తము చేస్తారు. సిక్కులకు కూడా గ్రంథము కంఠస్థమై ఉంటుంది. మీరేమి కంఠస్థము చేయాలి? తండ్రిని. బాబా, ఇది పూర్తిగా కొత్తదని మీరు అంటారు కూడా. మిమ్మల్ని మీరు ఆత్మ అని భావించి ఒక్క తండ్రిని స్మృతి చేసే సమయము ఇది ఒక్కటే. 5 వేల సంవత్సరాల క్రితం కూడా నేర్పించారు, ఈ విధంగా అర్థము చేయించగలిగే శక్తి ఇంకెవ్వరికీ లేదు. తండ్రి ఒక్కరే జ్ఞానసాగరుడు, ఇతరులెవ్వరూ కాదు. జ్ఞానసాగరుడైన తండ్రియే మీకు అర్థము చేయిస్తున్నారు, నేను అవతారమెత్తానని చెప్పేవారు కూడా ఈ రోజుల్లో చాలామంది వెలువడ్డారు. కావున సత్య స్థాపనలో చాలా విఘ్నాలు కలుగుతాయి. కాని సత్యం అనే నావ కదులుతుంది, ఊగుతుంది కాని మునగదని గాయనముంది.

ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి వద్దకు వచ్చారు కనుక మీ హృదయములో ఎంత సంతోషము ఉండాలి. ఇంతకుముందు యాత్రలకు వెళ్ళేటప్పుడు మనసులో ఏమనిపించేది? ఇప్పుడు ఇళ్ళూ వాకిళ్ళు వదిలి ఇక్కడకు వచ్చినప్పుడు ఏ ఆలోచనలు వస్తాయి? మేము బాప్ వాదా వద్దకు వెళ్తామని భావిస్తారు. తండ్రి ఇది కూడా అర్థము చేయించారు - నన్ను కేవలం శివబాబా అని అంటారు, నేను ఎవరిలోనైతే ప్రవేశించానో, వారు బ్రహ్మా. వంశాలుంటాయి కదా. మొట్టమొదటి వంశము బ్రాహ్మణులది, ఆ తర్వాత దేవతల వంశము ఉంటుంది. ఇప్పుడు దూరదేశస్థులైన తండ్రి పిల్లలను దూరదృష్టి కలవారిగా తయారుచేస్తున్నారు. ఆత్మ ఏ విధంగా మొత్తం చక్రములో భిన్న-భిన్న వర్ణాలలోకి వస్తుందో మీరు తెలుసుకున్నారు, ఈ జ్ఞానము దూరదేశి అయిన తండ్రి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు మేము బ్రాహ్మణ వర్ణానికి చెందినవారిగా అయ్యాము, ఇంతకుముందు జ్ఞానము లేనప్పుడైతే శూద్ర వర్ణస్థులుగా ఉండేవారిమి అని భావిస్తారు. వీరు మన గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్. గ్రేట్ శూద్రులు, గ్రేట్ వైశ్యులు, గ్రేట్ క్షత్రియులు..... అంతకుముందు గ్రేట్ బ్రాహ్మణులుగా ఉండేవారు. ఇప్పుడు ఈ విషయాలు తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థము చేయించలేరు. దీనిని దూరదృష్టికలవారిగా తయారుచేసే జ్ఞానము అని అంటారు. దూరదేశములో నివసించే తండ్రి వచ్చి పిల్లలకు దూరదేశ జ్ఞానమంతటినీ ఇస్తారు. మన బాబా దూరదేశము నుండి వీరిలోకి వస్తారని మీకు తెలుసు. ఇది పరాయి దేశము, పరాయి రాజ్యము. శివబాబాకు తమ శరీరము లేదు మరియు వారు జ్ఞానసాగరులు, స్వర్గ రాజ్యము కూడా వారే ఇస్తారు. కృష్ణుడు ఇవ్వరు. శివబాబాయే ఇస్తారు. కృష్ణుడిని తండ్రి అని అనరు. తండ్రి రాజ్యాన్నిస్తారు, తండ్రి నుండే వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు హద్దు వారసత్వాలన్నీ పూర్తి అవుతాయి. మనము సంగమయుగములో 21 జన్మల వారసత్వాన్ని తీసుకున్నామని మీకు సత్యయుగములో తెలియదు. మనము 21 జన్మల వారసత్వాన్ని అర్థకల్పము కొరకు తీసుకుంటున్నామని ఇప్పుడు మీకు తెలుసు. 21 తరాలు లేక మొత్తము తరాలన్నిటిలోనూ శరీరము వృద్ధాప్యానికి వచ్చినప్పుడు సమయానుసారముగా శరీరాన్ని విడిచిపెడతాము. ఏ విధంగా సర్పము పాత కుబుసాన్ని వదిలి కొత్తదానిని తీసుకుంటుందో, అలా తీసుకుంటారు. పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ మన ఈ వస్త్రం పాతదైపోయింది కదా.

మీరు సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులు. మిమ్మల్నే భ్రమరము అని అంటారు. మీరు పురుగులను మీ సమానముగా బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. పురుగులను తీసుకొచ్చి భూ - భూ అంటూ వారిని మార్చండని మీకు చెప్పడం జరుగుతుంది. భ్రమరము కూడా పురుగులను భూ - భూ చేస్తుంది, దాంతో కొన్నిటికి రెక్కలు వస్తాయి, కొన్ని మరణిస్తాయి. ఈ ఉదాహరణలన్నీ ఈ సమయానికి చెందినవే. మీరు ప్రియమైన పిల్లలు, పిల్లలను కంటిరత్నాలని అంటారు. తండ్రి అంటున్నారు, నా కంటి రత్నాల్లారా, నేను మిమ్మల్ని నావారిగా చేసుకున్నాను కావున మీరు కూడా నావారు కదా. ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తే అంతగా పాపము తొలగిపోతుంది. ఇంకెవ్వరిని స్మృతి చేసినా పాపము తొలగిపోదు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జీవిస్తూనే దేహా-అభిమానము నుండి కరిగిపోయేందుకు పురుషార్థము చేయాలి. ఈ పాత చెప్పుపై కొద్దిగా కూడా మమకారము ఉండకూడదు.

2. సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యి పురుగుల వంటివారిని కూడా జ్ఞానపు భూ-భూ చేస్తూ వారిని తమ సమానముగా బ్రాహ్మణులుగా తయారుచేయాలి.

వరదానము:-

ఆశ వదిలేసినవారిలో కూడా ఆశను ఉత్పన్నం చేసే సత్యమైన పరోపకారి, సంతుష్టమణి భవ

త్రికాలదర్శులుగా అయి ప్రతి ఆత్మ యొక్క బలహీనతను పరిశీలించి, వారి బలహీనతలను స్వయంలో ధారణ చేసేందుకు లేక వర్ణించేందుకు బదులుగా బలహీనతలనే ముళ్ళను కళ్యాణకారి స్వరూపంతో సమాప్తం చేయాలి, ముళ్ళను పుష్పాలుగా చేయాలి, స్వయం కూడా సంతుష్టమణి సమానంగా సంతుష్టంగా ఉండాలి మరియు సర్వులను సంతుష్టపరచాలి. ఎవరి పట్ల అయితే అందరూ నిరాశ చూపిస్తారో, అటువంటి వ్యక్తి పట్ల లేక అటువంటి స్థితిలో సదా కోసం ఆశా దీపాన్ని వెలిగించాలి అనగా నిరాశగా ఉన్నవారిని శక్తివంతులుగా చేయాలి - ఇటువంటి శ్రేష్ఠ కర్తవ్యము నడుస్తూ ఉంటే పరోపకారి, సంతుష్టమణి అనే వరదానాలు ప్రాప్తిస్తాయి.

స్లోగన్:-

పరీక్ష సమయంలో ప్రతిజ్ఞ గుర్తుకొస్తే ప్రత్యక్షత జరుగుతుంది.