ఓంశాంతి. వృక్షపతి వారం అంటారు, అందుకే బృహస్పతి అని పేరు పెట్టారు. ఈ పండుగలు మొదలైన వాటినైతే ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. మీరు ప్రతి వారము బృహస్పతి రోజును జరుపుకుంటారు. వృక్షపతి అంటే ఈ మనుష్య సృష్టి రూపి వృక్షానికి బీజరూపుడు, చైతన్యమైనవారు, వారికే ఈ వృక్షము ఆది-మధ్య-అంతాలు తెలుసు, మిగిలిన వృక్షాలన్నీ జడమైనవి. ఇది చైతన్యమైనది, దీనిని కల్పవృక్షమని అంటారు. దీని ఆయుష్షు 5 వేల సంవత్సరాలు మరియు ఈ వృక్షము నాలుగు భాగాలుగా ఉంటుంది. ప్రతి వస్తువు 4 భాగాలలో ఉంటుంది. ఈ ప్రపంచము కూడా నాలుగు భాగాలుగా ఉంది. ఇప్పుడు ఇది ఈ పాత ప్రపంచం యొక్క అంతిమం. ప్రపంచము ఎంత పెద్దది, ఈ జ్ఞానము మనుష్యమాత్రులెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇది కొత్త ప్రపంచము కోసం కొత్త శిక్షణ. మరియు కొత్త ప్రపంచానికి రాజులుగా అయ్యేందుకు లేక ఆదిసనాతన దేవీ-దేవతలుగా అయ్యేందుకు శిక్షణ కూడా కొత్తదే. భాష అయితే హిందీయే. వేరే రాజ్య స్థాపన జరిగినప్పుడు వారి భాష వేరుగా ఉంటుందని బాబా అర్థం చేయించారు. సత్యయుగములో ఏ భాష ఉంటుంది? అది పిల్లలకు కొద్ది-కొద్దిగా తెలుసు. ఇంతకుముందు పిల్లలు ధ్యానములోకి వెళ్ళి చెప్పేవారు. అక్కడ సంస్కృతమేమీ ఉండదు. సంస్కృతమైతే ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఏదైతే ఉందో అది మళ్ళీ అక్కడ ఉండదు. కావున వీరు వృక్షపతి అని పిల్లలకు తెలుసు. వారిని తండ్రి లేక వృక్ష రచయిత అని కూడా అంటారు. వీరు చైతన్య బీజరూపులు. అవన్నీ జడమైనవి. సృష్టి ఆది-మధ్య-అంతాలను కూడా పిల్లలు తెలుసుకోవాలి కదా. ఈ సమయములో జ్ఞానము లేని కారణంగా మనుష్యులకు సుఖము లేదు. ఇది అనంతమైన జ్ఞానము, దీని ద్వారా అనంతమైన సుఖము లభిస్తుంది. హద్దులోని జ్ఞానము ద్వారా కాకిరెట్టతో సమానమైన సుఖము లభిస్తుంది. మనం అనంతమైన సుఖము కోసమే ఇప్పుడు మళ్ళీ పురుషార్థము చేస్తున్నామని మీకు తెలుసు. ఈ మళ్ళీ అనే పదము మీరు మాత్రమే వింటారు. మీరే మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఈ రాజయోగ శిక్షణను ప్రాప్తించుకుంటున్నారు. జ్ఞానసాగరుడైన తండ్రి నిరాకారుడని కూడా మీకు తెలుసు. పిల్లలైన ఆత్మలు కూడా నిరాకారులే, కాని అందరికీ తమ-తమ శరీరాలున్నాయి, దీనిని అలౌకిక జన్మ అని అంటారు. వారు జన్మ తీసుకున్న విధంగా ఇతర మనుష్యమాత్రులెవ్వరూ తీసుకోలేరు మరియు వీరి వానప్రస్థ స్థితిలో వారు ప్రవేశిస్తారు. పిల్లలకు (ఆత్మలకు) సన్ముఖములో కూర్చుని అర్థం చేయిస్తున్నారు, ఇతరులెవ్వరూ ఆత్మలను పిల్లలూ-పిల్లలూ అని అనలేరు. ఏ ధర్మమువారికైనా - శివబాబా ఆత్మలైన మనందరికీ తండ్రి అని తెలుసు, వారు తప్పకుండా పిల్లలూ-పిల్లలూ అనే అంటారు. మనుష్యాత్మలెవ్వరినీ కూడా ఈశ్వరుడని అనలేము, బాబా అని పిలువలేము. గాంధీని కూడా బాపూ అని అనేవారు. మునిసిపాలిటీ మేయర్ ను కూడా ఫాదర్ అని అంటారు. కాని ఆ తండ్రులందరూ దేహధారులు. మన ఆత్మల తండ్రి మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా పదే-పదే చెప్తున్నారు. ఆ తండ్రి వచ్చి ఆత్మలనే చదివిస్తారు. ఇది ఈశ్వరీయ కుటుంబము. తండ్రికి ఎంతోమంది పిల్లలున్నారు. బాబా, మేము మీకు చెందినవారము అని మీరు కూడా అంటారు. తద్వారా మీరు పిల్లలు అవుతారు. బాబా, నేను ఒక రోజు బిడ్డను, 8 రోజుల బిడ్డను, నెల బిడ్డను అని చెప్తారు. మొదట తప్పకుండా చిన్నగానే ఉంటారు. 2-4 రోజుల పిల్లలైనా కాని ఇంద్రియాలైతే పెద్దవే కదా, కావున పెద్ద పిల్లలందరికీ చదువు కావాలి. ఎవరు వచ్చినా సరే అందరినీ తండ్రి చదివిస్తారు. మీరు కూడా చదువుకుంటున్నారు. బాబా పిల్లలైన తర్వాత మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, నేను కూడా అనేక జన్మల అంతిమంలో వీరిలో ప్రవేశిస్తాను మరియు చదివిస్తాను. ఇక్కడ మనము అతి పెద్ద టీచరు వద్దకు వచ్చామని పిల్లలకు తెలుసు. వీరి నుండే మళ్ళీ ఈ టీచర్లు వెలువడ్డారు, వారిని పండాలు (మార్గదర్శకులు) అని అంటారు. వారు కూడా అందరినీ చదివిస్తూ ఉంటారు. ఎవరెవరైతే తెలుసుకుంటూ ఉంటారో, వారు ఇతరులను చదివిస్తూ ఉంటారు.
మొట్టమొదట ఇద్దరు తండ్రులున్నారని అర్థం చేయించాలి కదా. ఒకరు లౌకికము, ఇంకొకరు పారలౌకికము. పెద్దవారు తప్పకుండా పారలౌకిక తండ్రే కదా, వారిని భగవంతుడని అంటారు. ఇప్పుడు మనకు పారలౌకిక తండ్రి లభించారని మీకు తెలుసు, ఇది ఇంకెవ్వరికీ తెలియదు. నెమ్మది-నెమ్మదిగా తెలుసుకుంటూ ఉంటారు. ఆత్మలైన మనల్ని తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మలైన మనమే ఒక శరీరాన్ని విడిచి మరొకటి తీసుకుంటాము. ఉన్నతాతి ఉన్నతమైన దేవతలుగా అవుతాము. ఉన్నతాతి ఉన్నతంగా అయ్యేందుకే వచ్చారు. చాలామంది పిల్లలు నడుస్తూ-నడుస్తూ ఉన్నతాతి ఉన్నతమైన చదువును విడిచిపెట్టేస్తారు, ఏదో ఒక విషయములో సంశయము వచ్చేస్తుంది లేక మాయ తుఫాను ఏదైనా వస్తే, సహనము చేయలేరు. కామ మహాశత్రువుతో ఓడిపోతారు, ఈ కారణాల వల్ల చదువును వదిలేస్తారు. కామ మహాశత్రువు కారణంగానే పిల్లలు చాలా సహనం చేయవలసి వస్తుంది. బాబా చెప్తున్నారు, కల్ప-కల్పము అబలలైన, మాతలైన మీరే పిలుస్తూ ఉంటారు. బాబా, మమ్మల్ని నగ్నంగా అవ్వడం నుండి రక్షించండి అని అంటారు. స్మృతి చేయడం తప్ప వేరే మార్గము లేదు అని బాబా చెప్తున్నారు. స్మృతి ద్వారానే శక్తి లభిస్తూ ఉంటుంది. శక్తివంతమైన మాయ శక్తి తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత మీరు విముక్తులైపోతారు. ఇలా చాలామంది బంధనాల నుండి విముక్తులై వస్తారు. తర్వాత అత్యాచారాలు జరగడం సమాప్తమైపోతుంది, మళ్ళీ వచ్చి శివబాబాతో బ్రహ్మా ద్వారా మాట్లాడుతారు. ఇది కూడా అలవాటైపోవాలి. మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము, వారు ఈ బ్రహ్మా తనువులోకి వస్తారు, మేము శివబాబా ఎదురుగా కూర్చున్నామని బుద్ధిలో ఉండాలి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమౌతాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి, ఇదే శిక్షణ లభిస్తుంది. బాబాను కలుసుకునేందుకు వచ్చినప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మాభిమానీ భవ. ఈ జ్ఞానము కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది. ఇదే శ్రమ. ఆ భక్తి మార్గములోనైతే అనేక వేద శాస్త్రాలు మొదలైనవి చదువుతారు. ఇక్కడైతే కేవలం స్మృతి చేసే ఒకే ఒక్క శ్రమ ఉంటుంది. ఇది చాలా సహజాతి సహజమైనది, అలాగే అతి కష్టమైనది కూడా. తండ్రిని స్మృతి చేయడం కన్నా సహజమైన విషయము మరొకటి ఉండదు. కొడుకు పుట్టగానే నోటి నుండి నాన్నా-నాన్నా అనే వస్తుంది. కూతురి నోటి నుండి అమ్మా అని వస్తుంది. ఆత్మ స్త్రీ శరీరాన్ని ధరించింది. ఆడపిల్లలు తల్లి వద్దకే వెళ్తూ ఉంటారు. మగపిల్లలు తరచుగా తండ్రినే స్మృతి చేస్తారు ఎందుకంటే వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు ఆత్మలైన మీరందరూ పిల్లలే. మీకు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. స్మృతి చేయడం ద్వారా, ఆత్మకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. దేహాభిమానులుగా ఉంటే వారసత్వము పొందడం కష్టమౌతుంది. నేను పిల్లలనే చదివిస్తాను అని తండ్రి చెప్తున్నారు. పిల్లలైన మనల్ని తండ్రి చదివిస్తున్నారని పిల్లలకు కూడా తెలుసు. ఈ విషయాలను తండ్రి తప్ప మరెవ్వరూ తెలియజేయలేరు. భక్తిమార్గములో మీకు వారిపైనే ప్రేమ ఉండేది. మీరంతా ఆ ఒక్క ప్రియతమునికి, ప్రేయసులుగా ఉండేవారు. ప్రపంచమంతా ఒక్క ప్రియునికి ప్రేయసులు. పరమాత్మను అందరూ పరమపిత అని కూడా అంటారు. తండ్రిని ప్రేయసి అని అనరు. మీరు భక్తిమార్గములోని ప్రేయసులుగా ఉండేవారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు, కాని పరమాత్మ అని ఎవరిని అంటారు అనే విషయంలో చాలా తికమక పడుతున్నారు. గణేశుడు, హనుమాన్ మొదలైన వారిని కూడా పరమాత్మ అని అంటూ ఒక్కసారిగా దారాన్ని చిక్కుపరిచేశారు. ఒక్కరు తప్ప మరెవ్వరూ దీన్ని సరి చేయలేరు. ఎవ్వరికీ అంతటి శక్తి లేదు. తండ్రియే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు మళ్ళీ నంబరువారు పురుషార్థానుసారముగా అర్థం చేసుకుంటారు మరియు అర్థం చేయించేందుకు యోగ్యులుగా అవుతారు. రాజధాని స్థాపనౌతుంది. కల్పక్రితము వలె మీరిక్కడ చదువుకుంటున్నారు. మళ్ళీ కొత్త ప్రపంచములో ప్రారబ్ధాన్ని పొందుతారు, దానిని అమరలోకమని అంటారు. మీరు మృత్యువుపై విజయము పొందుతారు. అక్కడ ఎప్పుడూ అకాలమృత్యువులు ఉండవు. దాని పేరే స్వర్గము. పిల్లలైన మీకు ఈ చదువును గురించి చాలా సంతోషముండాలి. తండ్రి స్మృతి ద్వారా తండ్రి ఆస్తి కూడా గుర్తుకొస్తుంది. క్షణములో మొత్తం డ్రామా జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, 84 జన్మల చక్రము అంతే, ఈ నాటకమంతా భారత్ పైనే రచించబడింది. మిగిలినవన్నీ శాఖోపశాఖలే. తండ్రి జ్ఞానాన్ని కూడా మీకే వినిపిస్తున్నారు. మీరే ఉన్నతాతి ఉన్నతంగా, మళ్ళీ నీచులుగా అయ్యారు. డబల్ కిరీటధారీ రాజులుగా, మళ్ళీ పూర్తిగా నిరుపేదలుగా అయ్యారు. ఇప్పుడు భారత్ బికారిగా, నిరుపేదదిగా ఉంది. ప్రజలపై ప్రజా రాజ్యముంది. సత్యయుగములో డబల్ కిరీటధారులైన మహారాజా-మహారాణుల రాజ్యము ఉండేది. ఆదిదేవ్ బ్రహ్మాకు ఎన్నో పేర్లు పెట్టారు, వారిని అందరూ గౌరవిస్తారు. వారినే మహావీరుడని కూడా అంటారు, హనుమంతుడిని కూడా మహావీరుడని అంటారు. వాస్తవానికి పిల్లలైన మీరే సత్యాతి-సత్యమైన మహావీరులైన హనుమంతులు ఎందుకంటే మీరు యోగములో ఎంతగా ఉంటారంటే, మాయ తుఫానులు ఎన్ని వచ్చినా కాని, అవి మిమ్మల్ని కదిలించలేవు. మహావీరుని పిల్లలైన మీరూ మహావీరులుగా అయ్యారు ఎందుకంటే మీరు మాయపై విజయం పొందుతారు. పంచ వికారాల రూపీ రావణునిపై ప్రతి ఒక్కరు విజయము పొందుతారు. ఎదో ఒక్క మనిషి విషయం కాదు. మీరు ప్రతి ఒక్కరూ ధనస్సును విరచాలి అంటే మాయపై విజయము పొందాలి. ఇందులో యుద్ధము మొదలైనవాటి విషయమేదీ లేదు. యూరోప్ వాసులు ఎలా యుద్ధము చేస్తారు, భారత్ లో కౌరవులు మరియు యవనుల యుద్ధము జరుగుతుంది. రక్తపు నదులు ప్రవహిస్తాయని గాయనం కూడా ఉంది. పాల నదులు కూడా ప్రవహిస్తాయి. విష్ణువును క్షీరసాగరములో చూపిస్తారు, లక్ష్మీ-నారాయణులు పారసనాథులు. వారిదే నేపాల్ లో పశుపతినాథుడని పేరు పెట్టేశారు. అది కూడా ఒక్క విష్ణువుకే రెండు రూపాలు, పారసనాథ్ పారసనాథిని. వారు పశుపతినాథ్ పతి, పశుపతినాథ్ పత్ని. అందులో విష్ణువు చిత్రమును తయారుచేస్తారు. సరోవరాన్ని కూడా తయారుచేస్తారు. ఇప్పుడు సరోవరములో పాలు ఎక్కడ నుండి వస్తాయి. పండుగ రోజున ఆ సరోవరములో పాలు వేస్తారు, మళ్ళీ క్షీరసాగరములో విష్ణువు పవళించినట్లుగా చూపిస్తారు. ఏమాత్రం అర్థం లేదు. నాలుగు భుజాల మనుష్యులెవ్వరూ ఉండరు.
ఇప్పుడు పిల్లలైన మీరు సమాజ సేవకులు, ఆత్మిక తండ్రికి పిల్లలు కదా. తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తున్నారు, ఇందులో ఎటువంటి సంశయమూ రాకూడదు. సంశయమనగా మాయా తుఫాను. ఓ పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని మీరు నన్నే పిలుస్తారు. నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు పావనంగా అయిపోతారు అని తండ్రి చెప్తున్నారు. 84 జన్మల చక్రమును కూడా స్మృతి చేయాలి. తండ్రిని పతిత-పావనుడు, జ్ఞానసాగరుడు అని అంటారు, అంటే రెండు మహిమలు ఉన్నాయి కదా. వారు పతితులను పావనంగా చేస్తారు మరియు 84 జన్మల చక్ర జ్ఞానమును కూడా వినిపిస్తారు. 84 జన్మల చక్రము నడుస్తూనే ఉంటుంది. దీనికి అంతం లేదని పిల్లలైన మీకు కూడా తెలుసు. తండ్రి ఎంత మధురమైనవారో మీకు నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. వారిని పతులకే పతి అని కూడా అంటారు. వారు తండ్రి కూడా. నా నుండి పిల్లలైన మీకు చాలా గొప్ప వారసత్వము లభిస్తుందని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. కాని ఇటువంటి తండ్రినైన నాకు కూడా విడాకులిచ్చేస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది, చదువునే విడిచిపెట్టేస్తారు అనగా విడాకులిచ్చేస్తారు, ఎంత బుద్ధిహీనులుగా ఉన్నారు. తెలివైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు సహజంగానే అన్ని విషయాలు అర్థము చేసుకొని ఇతరులను చదివించడం ప్రారంభిస్తారు. ఆ చదువు ద్వారా ఏం లభిస్తుంది మరియు ఈ చదువు ద్వారా ఏం లభిస్తుంది, మరి ఏది చదువుకోవాలి అన్నది వారు వెంటనే నిర్ణయము తీసుకుంటారు. బాబా పిల్లలను అడుగుతారు, ఈ చదువు చాలా మంచిదని పిల్లలు కూడా భావిస్తారు. అయినా ఏమి చేయాలి, లౌకిక చదువును చదవకపోతే మిత్ర-సంబంధీకులు మొదలైనవారు కోపగించుకుంటారని అంటారు. రోజు-రోజుకూ సమయము తగ్గిపోతూ ఉంటుంది, ఇంతటి చదువునైతే చదవలేరు అని బాబా చెప్తున్నారు. చాలా వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతాయి కదా. రోజు-రోజుకూ ఒకరిపట్ల ఒకరికి శత్రుత్వము పెరుగుతూ ఉంటుంది. వెంటనే అందరినీ సమాప్తము చేయగలిగేటటువంటి వస్తువులను తయారుచేశారని కూడా చెప్తారు. డ్రామానుసారముగా ఇప్పుడే యుద్ధము జరగదని పిల్లలైన మీకు తెలుసు, రాజ్యం స్థాపన జరగనున్నది, అప్పటివరకు మనము కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. వారు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అంతిమంలో మీ ప్రభావము చాలా వెలువడుతుంది. ఓహో ప్రభు, నీ లీల అని గాయనం కూడా చేయబడుతుంది. అది ఈ సమయంలోని గాయనము. అలాగే, మీ గతి, మతి అతీతమైనవి అని కూడా గాయనం ఉన్నది. ఆత్మలందరి పాత్ర అతీతమైనదే. ఇప్పుడు నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమౌతాయని తండ్రి మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. శ్రీమతము ఎక్కడ, మనుష్యుల మతము ఎక్కడ. విశ్వములో శాంతిని పరమపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ స్థాపన చేయలేరని మీకు తెలుసు. 100 శాతము పవిత్రత-సుఖ-శాంతులను 5 వేల సంవత్సరాల క్రితము వలె డ్రామానుసారముగా స్థాపన చేస్తున్నారు. అది ఎలా? వచ్చి తెలుసుకోండి. పిల్లలైన మీరు కూడా సహాయకులుగా అవుతున్నారు. ఎవరైతే చాలా సహాయము చేస్తారో, వారు విజయమాలలోని మణులుగా అవుతారు. పిల్లలైన మీ పేర్లు కూడా ఎంత రమణీయంగా ఉండేవి. ఆ పేర్ల లిస్టుని ఆల్బమ్ లో పెట్టాలి. మీరు భట్టీలో ఉన్నారు, ఇళ్ళు వాకిళ్ళు వదిలి వచ్చి తండ్రికి చెందినవారిగా అయ్యారు. పూర్తిగా భట్టిలోకి వచ్చేసారు. ఎటువంటి పక్కా భట్టీ ఉండేదంటే ఎవ్వరినీ లోపలకు అనుమతించేవారు కాదు. తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత పేర్లు తప్పకుండా ఉండాలి. సర్వస్వాన్ని సమర్పించేశారు, అందుకే పేర్లు పెట్టారు. తండ్రి అందరికీ పేర్లు పెట్టారు - అద్భుతము కదా. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఏ విషయములోనూ సంశయబుద్ధి కలవారిగా అవ్వకూడదు, మాయా తుఫానులను మహావీరులుగా అయి దాటివేయాలి, మాయా తుఫానులు కదిలించలేని విధంగా యోగములో ఉండాలి.
2. వివేకవంతులై మీ జీవితాన్ని ఈశ్వరీయ సేవలో వినియోగించాలి. సత్యాతి-సత్యమైన ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వాలి. ఆత్మిక చదువును చదువుకోవాలి మరియు చదివించాలి.