ఓంశాంతి. తండ్రి పిల్లలకు బ్రహ్మాండం మరియు సృష్టి చక్రం యొక్క ఆదిమధ్యాంత జ్ఞానములను వినిపిస్తున్నారు. దీన్ని మరెవ్వరూ వినిపించలేరు. ఒక్క గీతలో మాత్రమే రాజయోగం గురించి వర్ణించారు, భగవంతుడు వచ్చి నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తారు. ఈ విషయం ఒక్క గీతలో తప్ప ఇంకే శాస్త్రంలోనూ లేదు. ఇది కూడా తండ్రియే తెలియజేశారు. నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను. ఈ జ్ఞానం పరంపరగా కొనసాగదని కూడా అర్థం చేయించాను. తండ్రి వచ్చి ఏకధర్మ స్థాపన చేస్తారు. మిగిలిన ధర్మాలన్నీ వినాశనమవుతాయి. ఈ శాస్త్రాలు మొదలైనవేవీ పరంపరగా కొనసాగవు. ఎవరైతే ధర్మ స్థాపనను చేసేందుకు వస్తారో, ఆ సమయంలో అంతా సమాప్తం అయిపోయేందుకు, వినాశనమేమీ జరగదు. భక్తిమార్గంలోని శాస్త్రాలను చదువుతూనే వస్తారు, ఈ బ్రాహ్మణ ధర్మ శాస్త్రం గీతయే, కాని దాన్ని కూడా భక్తిమార్గంలోనే తయారుచేస్తారు ఎందుకంటే సత్యయుగములోనైతే శాస్త్రాలేవీ ఉండనే ఉండవు. ఇతర ధర్మాల సమయంలో కూడా వినాశనమేమీ జరగదు. మళ్ళీ కొత్త ప్రపంచం వచ్చేందుకు పాత ప్రపంచమేమీ సమాప్తమవ్వదు. అదే కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడీ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నదని పిల్లలైన మీకు తెలుసు. మనల్ని తండ్రి చదివిస్తున్నారు. ఒక్క గీతకు మాత్రమే గాయనం ఉంది. గీతా జయంతిని కూడా జరుపుకుంటారు. వేద జయంతి లేనే లేదు. భగవంతుడు ఒక్కరే, కనుక ఒక్కరి జయంతినే జరుపుకోవాలి. మిగిలినదంతా వారి రచన, దాని నుండి ఏమీ లభించదు. తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. పినతండ్రి, మామయ్య మొదలైనవారి నుండి ఏ వారసత్వమూ లభించదు. ఇప్పుడు ఇక్కడ అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చేవారు, మీ అనంతమైన తండ్రి. వీరు ఏ శాస్త్రాలను వినిపించడం లేదు. ఇవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవని చెప్తున్నారు. వీటన్నిటి సారాన్ని మీకు అర్థం చేయిస్తున్నాను. శాస్త్రాలు చదువేమీ కాదు. చదువు ద్వారానైతే పదవి ప్రాప్తిస్తుంది, ఈ చదువును తండ్రి పిల్లలకు చదివిస్తున్నారు. పిల్లల కోసం ఇది భగవానువాచ - మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే జరుగుతుంది. మనం తండ్రి నుండి రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతములను తెలుసుకున్నామని పిల్లలకు తెలుసు. తండ్రి తప్ప ఇది వేరెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ ముఖకమలం ద్వారా వినిపిస్తున్నారు. ఇది భగవంతుడు అప్పుగా తీసుకున్నటువంటి ముఖం కదా, దీన్ని గోముఖమని కూడా అంటారు. వీరు పెద్ద తల్లి కదా. వీరి నోటి ద్వారా జ్ఞానం యొక్క మహావాక్యాలు వెలువడతాయే కానీ నీరు మొదలైనవి కాదు. భక్తిమార్గంలో మళ్ళీ గోముఖం ద్వారా నీరు చూపించారు. భక్తిమార్గంలో ఏమేమి చేస్తుంటారో పిల్లలైన మీకిప్పుడు తెలుసు. నీరు తాగేందుకు ఎంత దూరదూరాల వరకు గోముఖం మొదలైన స్థానాలకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. బాబా కల్ప-కల్పం వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేందుకు చదువిస్తున్నారనైతే పిల్లలకు తెలుసు. ఎలా చదివిస్తున్నారో చూస్తున్నారు. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని మీరు అందరికీ తెలియజేస్తారు. నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని చెప్తున్నారు. సత్యయుగంలో కొద్దిమంది మనుష్యులు మాత్రమే ఉంటారని మీకు తెలుసు. కలియుగంలో అనేకమంది మనుష్యులున్నారు. తండ్రి వచ్చి ఆదిసనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. మనం మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పిల్లల్లో దైవీగుణాలు కనిపిస్తాయి. వారిలో క్రోధం అంశమాత్రము కూడా ఉండదు. ఒకవేళ ఎప్పుడైనా కోపం వస్తే వెంటనే బాబాకు, బాబా, ఈరోజు మా ద్వారా ఈ తప్పు జరిగింది, నేను కోపము చేసాను, వికర్మ చేసాను అని వ్రాస్తారు. బాబాతో మీకు ఎంతటి సంబంధముంది. బాబా, క్షమించండి అని అడుగుతారు. క్షమించడం మొదలైనవేవీ జరగవు అని తండ్రి చెప్తున్నారు. ఇక ముందు అటువంటి తప్పులు చేయకండి. టీచర్ ఎప్పుడూ క్షమించరు, మీ నడవడిక సరిగ్గా లేదని రిజస్టరు చూపిస్తారు. మీరు మీ నడవడికను చూసుకుంటున్నారా అని అనంతమైన తండ్రి కూడా చెప్తున్నారు. ఎవరికీ దుఃఖమైతే ఇవ్వలేదు కదా, ఎవ్వరినీ విసిగించలేదు కదా అని ప్రతిరోజూ తమ లెక్కాచారాన్ని చూసుకోండి. దైవీగుణాలు ధారణ చేసేందుకు సమయమైతే పడుతుంది కదా. దేహాఅభిమానం ఎంతో కష్టంగా తొలగుతుంది. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మ అని భావిస్తారో అప్పుడు తండ్రిపై కూడా ప్రేమ కలుగుతుంది. లేకపోతే దేహం యొక్క కర్మ బంధనంలోనే బుద్ధి వేలాడుతూ ఉంటుంది. మీరు శరీర నిర్వాహణార్థం కర్మలు కూడా చేయాలి, అందులో నుండి సమయాన్ని తీయవచ్చని బాబా అంటారు. భక్తి కోసం కూడా సమయాన్ని తీస్తారు కదా. మీరాభాయి కృష్ణుని స్మృతిలోనే ఉండేవారు కదా. పునర్జన్మైతే ఇక్కడే తీసుకుంటూ వచ్చారు.
ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచం పట్ల వైరాగ్యం కలుగుతుంది. ఈ పాత ప్రపంచంలో మళ్ళీ పునర్జన్మ తీసుకునేది లేదని తెలుసు. ప్రపంచమే సమాప్తమైపోతుంది. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. ఎలాగైతే బాబాలో జ్ఞానముందో అలా పిల్లలలో కూడా ఉంది. ఈ సృష్టి చక్రం ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఉన్నతాతి ఉన్నతమైనవారు పతిత-పావనుడు తండ్రి, వారు మమ్మల్ని చదివిస్తున్నారని ఎవరి బుద్ధిలో అయితే ఉంటుందో, వారు కూడా నంబరువారుగా ఉన్నారు. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. మీ బుద్ధిలో మొత్తం 84 జన్మల చక్రముంది. ఇప్పుడు ఈ నరకంలో ఇది అంతిమ జన్మ అని స్మృతి ఉంటుంది, దీన్నే రౌరవ నరకమని అంటారు. ఎంతో మురికి ఉంది, అందువలన సన్యాసులు ఇళ్ళు-వాకిళ్ళు విడిచి వెళ్ళిపోతారు. అది శారీరిక విషయం. మీరు బుద్ధి ద్వారా సన్యసిస్తారు ఎందుకంటే మనిమిప్పుడు తిరిగి వెళ్ళాలని మీకు తెలుసు. అందరినీ మర్చిపోవాల్సి వస్తుంది. ఈ పాత ఛీ-ఛీ ప్రపంచం సమాప్తమైపోయినట్లే. ఇల్లు పాతబడిపోతుంది, మళ్ళీ కొత్తది నిర్మించాక అది తయారయిపోతే, ఇప్పుడు ఈ పాత ఇల్లు కూలిపోతుందని మనస్సులోకి వస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు చదువుతున్నారు కదా. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతూ ఉందని తెలుసు. ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది. చాలామంది పిల్లలు వచ్చి చదువుకుంటారు. కొత్త ఇల్లు ఇప్పుడు తయారవుతుంది, పాతది కూలిపోతూ ఉంటుంది. ఇక కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. మీ బుద్ధిలో ఈ అనంతమైన విషయాలున్నాయి. ఇప్పుడు ఈ పాత ప్రపంచంపై మీకు మనస్సు ఉండదు. ఆఖరికి ఇవేవీ ఉపయోగపడవు, మనమిక్కడ నుండి వెళ్ళాలనుకుంటున్నాము. తండ్రి కూడా పాత ప్రపంచము పై మనస్సు పెట్టుకోవద్దని చెప్తున్నారు. తండ్రినైన నన్ను మరియు ఇంటిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. లేకపోతే ఎన్నో శిక్షలు అనుభవిస్తారు, పదవి కూడా భ్రష్టమైపోతుంది. నేను 84 జన్మలు అనుభవించానని ఆత్మకు స్మృతి కలిగింది. ఇప్పుడిక తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి మతాన్ని అనుసరించాలి, అప్పుడే శ్రేష్ఠ జీవితము తయారవుతుంది. తండ్రి ఉన్నతాతి ఉన్నతమైనవారు. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. తండ్రి బాగా స్మృతినిప్పిస్తున్నారు, ఆ అనంతమైన తండ్రియే జ్ఞానసాగరులు, వారే వచ్చి చదివిస్తున్నారు. ఈ చదువును కూడా చదవండి, అలాగే శరీర నిర్వహణార్థం కూడా అన్నీ చేయండి, కాని నిమిత్తంగా అయ్యి ఉండండి అని తండ్రి చెప్తున్నారు.
ఏ పిల్లలకైతే పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యముంటుందో వారు తమదంతా తండ్రికి అర్పణ చేస్తారు. మాదంటూ ఏమీ లేదు. బాబా, ఈ దేహం కూడా మాది కాదు. ఇది పాత దేహం, దీన్ని కూడా విడిచిపెట్టాలి, అందరి నుండి మోహం తొలగిపోతూ ఉంటుంది. నష్టోమోహులుగా అవ్వాలి. ఇది అనంతమైన వైరాగ్యం. అది హద్దులోని వైరాగ్యం. మేము స్వర్గానికి వెళ్ళి మా మహళ్ళను తయారుచేసుకుంటామని బుద్ధిలో ఉంది. ఇక్కడిదేదీ పనికిరాదు ఎందుకంటే ఇవన్నీ హద్దుకు సంబంధించినవి. మీరిప్పుడు హద్దు నుండి బయటకు వచ్చి అనంతంలోకి వెళ్తున్నారు. మీ బుద్ధిలో ఈ అనంతమైన జ్ఞానమే ఉండాలి. ఇప్పుడు వేరెవ్వరి వైపు మీ నేత్రాలు ఆకర్షింపబడవు. ఇప్పుడైతే మన ఇంటికి వెళ్ళాలి. కల్ప-కల్పం తండ్రి వచ్చి మనల్ని చదివించి, తర్వాత తోడుగా తీసుకువెళ్తారు. మీకు ఇదేమీ కొత్త చదువు కాదు. కల్ప-కల్పమూ చదువుకుంటామని మీకు తెలుసు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. మొత్తం ప్రపంచంలో ఎంతమంది మనుష్యులున్నారు, కాని మీకు తెలియదు, నెమ్మది-నెమ్మదిగా ఈ బ్రాహ్మణుల వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. డ్రామా ప్లాన్ అనుసారంగా స్థాపన జరగాల్సందే. మనది ఆత్మిక గవర్నమెంట్ అని పిల్లలకు తెలుసు. మనం దివ్యదృష్టి ద్వారా కొత్త ప్రపంచాన్ని చూస్తాము. అక్కడికే వెళ్ళాలి. భగవంతుడు కూడా ఒక్కరే, చదివించేవారు కూడా వారే, రాజయోగాన్ని తండ్రియే నేర్పించారు. ఆ సమయంలో యుద్ధం కూడా జరిగింది, అనేక ధర్మాల వినాశనం, ఏకధర్మ స్థాపన జరిగింది. మీరు కూడా అప్పటివారే, కల్ప-కల్పమూ మీరే చదువుతూ వచ్చారు, వారసత్వం తీసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం చేయాలి. ఇది అనంతమైన చదువు. ఈ శిక్షణను మనుష్యమాత్రులెవ్వరూ ఇవ్వలేరు.
తండ్రి శ్యామం మరియు సుందరం యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఇప్పుడు మనం సుందరంగా అవుతున్నామని మీకు కూడా తెలుసు. ఇంతకు ముందు శ్యామంగా ఉండేవారము. కృష్ణుడు ఒక్కడే ఉండరు కదా. మొత్తం రాజధాని ఉండేది కదా. మనం నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీకు ఈ నరకం పట్ల ద్వేషం కలుగుతుంది. మీరిప్పుడు పురుషోత్తమ సంగమయుగంలోకి వచ్చేశారు. ఎంతోమంది వస్తారు, కాని వారిలో కూడా ఎవరైతే కల్పక్రితం వచ్చారో వారే వస్తారు. సంగమయుగాన్ని కూడా బాగా స్మృతి చేయాలి. మనం పురుషోత్తములుగా అనగా మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము. మనుష్యులకైతే నరకమంటే ఏమిటో మరియు స్వర్గమంటే ఏమిటో కూడా తెలియదు. అంతా ఇక్కడే ఉందని అంటారు, ఎవరైతే సుఖంగా ఉంటారో వారు స్వర్గంలో ఉన్నారని, ఎవరైతే దుఃఖితులుగా ఉంటారో వారు నరకంలో ఉన్నారని అంటారు. అనేక మతాలున్నాయి కదా. ఒక ఇంటిలోనే అనేక మతాలు ఉంటాయి. పిల్లలు మొదలైనవారిపై మోహం యొక్క బంధం ఉంటుంది, అది తెగిపోదు. మోహానికి వశమై తాము ఎలా ఉంటున్నారో కూడా అర్థం చేసుకోరు. పిల్లలకు వివాహం చేయవచ్చా అని అడుగుతారు. కాని పిల్లలకు ఈ నియమం కూడా అర్థం చేయించబడింది. మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు ఒకవైపు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు, మరొకవైపు పిల్లలను నరకంలోకి తోయమంటారా అని అడుగుతున్నారు. అలా అడిగితే, చేయండి అని బాబా చెప్తారు. బాబాను అడిగితే వీరికి మోహముందని బాబా అర్థం చేసుకుంటారు. ఒకవేళ వద్దని చెప్పినా కూడా ఆజ్ఞను ఉల్లంఘిస్తారు. కూతురికైతే చేయాల్సిందే, లేకపోతే సాంగత్య దోషంలోకి వచ్చి పాడైపోతారు. కొడుకులకు చేయకండి. కాని ధైర్యం కావాలి కదా. బాబా వీరి ద్వారా కార్యం చేయించారు కదా. వీరిని చూసి మళ్ళీ ఇతరులు కూడా చేయడం ప్రారంభిస్తారు. ఇంట్లో కూడా చాలా కొట్లాటలు జరుగుతాయి. ఇది ఉన్నదే గొడవల ప్రపంచం, ముళ్ళ అడవి కదా. ఒకరినొకరు బాధపెట్టుకుంటూ ఉంటారు. స్వర్గాన్ని పుష్పాలతోట అని అంటారు. ఇది అడవి. తండ్రి వచ్చి ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేస్తారు. ఎవరో అరుదుగా తయారవుతారు, ప్రదర్శనీలో అవును-అవును అని అంటారు కాని ఏమీ అర్థం చేసుకోరు. ఒక చెవితో వింటారు మరియు మరొక చెవితో విడిచిపెట్టేస్తారు. రాజధాని స్థాపన చేసేందుకు సమయమైతే పడుతుంది కదా. మనుష్యులు స్వయాన్ని ముళ్ళగా భావించరు. ఈ సమయంలో ముఖం మనుష్యుల వలె ఉంది కాని గుణాలు కోతి కన్నా కూడా హీనంగా ఉన్నాయి. కాని స్వయాన్ని అలా అనుకోరు. కనుక మీ రచనకు అర్థం చేయించండి అని తండ్రి చెప్తున్నారు. ఒకవేళ అర్థం చేసుకోకపోతే వారిని పంపించేయాలి. కాని అంతటి శక్తి ఉండాలి కదా. మోహమనే పురుగు ఎలా ఉంటుందంటే దానిని తొలగించలేరు. ఇక్కడైతే నష్టోమోహులుగా అవ్వాలి. నాకైతే ఒక్కరు తప్ప వేరెవ్వరూ లేరు. ఇప్పుడు తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. పావనంగా అవ్వాలి. లేకపోతే చాలా శిక్షలు అనుభవిస్తారు, పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇప్పుడు స్వయాన్ని సతోప్రధానంగా తయారుచేసుకునే తపన ఉంది. శివాలయానికి వెళ్ళి మీరు అర్థం చేయించవచ్చు - భగవంతుడు భారత్ ను స్వర్గానికి యజమానిగా తయారుచేశారు, ఇప్పుడు వారు మళ్ళీ అలా తయారుచేస్తున్నారు, కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్తున్నారు.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం కలవారిగా అయి తమదంతా అర్పణ చేయాలి. నాదంటూ ఏమీ లేదు, ఈ దేహం కూడా నాది కాదు. దీనిపై మోహాన్ని తెంచి నష్టోమోహులుగా అవ్వాలి.
2. రిజిస్టరులో మచ్చ పడే విధంగా ఎప్పుడూ ఏ తప్పు చేయకూడదు. సర్వ దైవీగుణాలను ధారణ చేయాలి, లోపల క్రోధం యొక్క అంశం కొద్దిగా కూడా ఉండకూడదు.