ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలూ, ఇక్కడ స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోవాలి. ఈ రహస్యాన్ని పిల్లలైన మీరు కూడా అర్థం చేయించాలి. ఆత్మాభిమానులుగా అయి కూర్చుంటే తండ్రి పట్ల ప్రేమ ఉంటుంది. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. బాబా నుండి మనం స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఈ స్మృతి రోజంతా బుద్ధిలో ఉండాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఈ విషయం క్షణ-క్షణము మర్చిపోతారు కనుక సంతోషపు పాదరసం దిగిపోతుంది. పిల్లలూ, దేహీ-అభిమానులుగా అయి కూర్చోండి అని బాబా సావధానపరుస్తూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు ఆత్మ మరియు పరమాత్మల మేళా జరుగుతుంది కదా. ఇంతకుముందు మేళా జరిగింది, ఎప్పుడు జరిగింది? తప్పకుండా కలియుగాంతము మరియు సత్యయుగం ఆది యొక్క సంగమంలోనే జరిగి ఉంటుంది. ఈ రోజు పిల్లలకు టాపిక్ పై అర్థం చేయిస్తారు. మీరు టాపిక్ నైతే తప్పకుండా తీసుకోవాలి. ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడు, వారి తర్వాత బ్రహ్మా-విష్ణు-శంకరులు. తండ్రి మరియు దేవతలు. శివునికి మరియు బ్రహ్మా-విష్ణు-శంకరులకు మధ్యన గల సంబంధమేమిటో మనుష్యులకు తెలియదు. ఎవ్వరికీ వారి జీవిత కథ గురించి తెలియదు. త్రిమూర్తి చిత్రము ప్రసిద్ధమైనది. ఈ ముగ్గురూ దేవతలు. కేవలం ముగ్గురితోనే ధర్మముండదు. ధర్మమైతే పెద్దదిగా ఉంటుంది, అది దేవతా ధర్మము. వారు సూక్ష్మవతన వాసులు, పైన శివబాబా ఉన్నారు. బ్రహ్మా మరియు విష్ణువు ముఖ్యమైనవారు. బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా ఎలా అవుతారనే టాపిక్ మీకు ఇవ్వాలని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. మేము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతామని మీరు ఎలా అయితే అంటారో, అలాగే వీరిది కూడా, మొట్టమొదట బ్రహ్మా నుండి విష్ణువుగా, మళ్ళీ విష్ణువు నుండి బ్రహ్మాగా అవుతారు. వారైతే ఆత్మనే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనేస్తారు. అది పొరపాటు. ఇది సాధ్యమే కాదు. కనుక ఈ టాపిక్ గురించి బాగా అర్థం చేయించాలి, పరమాత్మ కృష్ణుని తనువులోకి వచ్చారని కొందరు చెప్తారు. ఒకవేళ కృష్ణునిలోకి వస్తే, బ్రహ్మా పాత్రయే సమాప్తమైపోతుంది కదా. కృష్ణుడు సత్యయుగపు ప్రథమ రాకుమారుడు. అక్కడ వారు వచ్చి పావనంగా తయారుచేసేందుకు, పతితులు ఎలా ఉండగలరు. ఇది పూర్తిగా తప్పు. ఈ విషయాలను కూడా మహారథులు, సేవాధారి పిల్లలే అర్థం చేసుకుంటారు. మిగతా ఎవరి బుద్ధిలోనూ కూర్చోనే కూర్చోవు. ఈ టాపిక్ అయితే చాలా ఫస్టుక్లాసుగా ఉంటుంది. బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా ఎలా అవుతారు. వారి జీవితకథను తెలియచేస్తారు ఎందుకంటే వీరిరువురికీ సంబంధముంది. ప్రారంభం కూడా ఇలాగే చేయాలి. ఒక్క క్షణంలో బ్రహ్మా నుండి విష్ణువుగా అవుతారు. విష్ణువు నుండి బ్రహ్మాగా అయ్యేందుకు 84 జన్మలు పడుతుంది. ఇవి చాలా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు. ప్రజాపిత బ్రహ్మా యొక్క బ్రాహ్మణ కులం ఏమయ్యింది? ప్రజాపిత బ్రహ్మాకైతే కొత్త ప్రపంచం కావాలి కదా. కొత్త ప్రపంచమంటే సత్యయుగం. అక్కడైతే ప్రజాపిత ఉండరు. కలియుగంలో కూడా ప్రజాపిత ఉండరు. సంగమయుగంలో ఉంటారు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. తండ్రి బ్రహ్మాను దత్తత తీసుకున్నారు. శివబాబా వీరిని ఎలా రచించారో, ఎవ్వరికీ తెలియదు. త్రిమూర్తి చిత్రంలో రచయిత అయిన శివుని చిత్రమే లేదు, కనుక ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడని ఎలా తెలుస్తుంది. మిగిలినవారంతా వారి రచన. ఇది బ్రాహ్మణ సాంప్రదాయము కనుక తప్పకుండా ప్రజాపిత కావాలి. కలియుగంలోనైతే ఉండరు. సత్యయుగములో కూడా ఉండరు. బ్రాహ్మణ దేవీ-దేవతాయ నమః అని గాయనముంది. ఇప్పుడు బ్రాహ్మణులు ఎక్కడివారు? ప్రజాపిత బ్రహ్మా ఎక్కడివారు? తప్పకుండా సంగమయుగానికి చెందినవారని చెప్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఈ సంగమయుగం గురించి ఏ శాస్త్రాలలోనూ వర్ణన లేదు. మహాభారత యుద్ధము సంగమయుగంలోనే జరిగింది కానీ సత్యయుగంలో లేక కలియుగంలో కాదు. పాండవులు మరియు కౌరవులు సంగమయుగంలో ఉన్నారు. పాండవులైన మీరు సంగమయుగవాసులు మరియు కౌరవులు కలియుగవాసులు. గీతలో కూడా భగవానువాచ ఉంది కదా. పాండవులైన మీరు దైవీ సాంప్రదాయానికి చెందినవారు. మీరు ఆత్మిక పండాలుగా అవుతారు. మీది ఆత్మిక యాత్ర, దీనిని మీరు బుద్ధి ద్వారా చేస్తారు.
స్వయాన్ని ఆత్మగా భావించండి, స్మృతియాత్రలో ఉండండి అని తండ్రి చెప్తున్నారు. దైహిక యాత్రలలో తీర్థ స్థానాలు మొదలైనవాటికి వెళ్ళి తిరిగి వస్తారు. అది అర్థకల్పం నడుస్తుంది. ఈ సంగమయుగంలోని యాత్ర ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. మీరు వెళ్ళి మృత్యులోకంలోకి తిరిగి రారు. పవిత్రంగా అయ్యి మళ్ళీ మీరు పవిత్ర ప్రపంచంలోకి రావాలి, కావున మీరిప్పుడు పవిత్రంగా అవుతున్నారు. ఇప్పుడు మనం బ్రాహ్మణ సాంప్రదాయస్థులమని మీకు తెలుసు. తర్వాత దైవీ సాంప్రదాయస్థులుగా, విష్ణు సంప్రదాయస్థులుగా అవుతాము. సత్యయుగంలోని దేవీ-దేవతలు విష్ణు సాంప్రదాయానికి చెందినవారు. అక్కడ చతుర్భుజుని ప్రతిమ ఉంటుంది, తద్వారా వీరు విష్ణు సాంప్రదాయానికి చెందినవారని తెలుస్తుంది. ఇక్కడ రావణుని ప్రతిమ ఉంది, కనుక రావణ సాంప్రదాయానికి చెందినవారు. కావున ఈ టాపిక్ పెడితే మనుష్యులు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు రాజయోగం నేర్చుకుంటున్నారు. బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులైన మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. దత్తత తీసుకోబడ్డారు. బ్రాహ్మణులు కూడా ఇక్కడే ఉన్నారు, తర్వాత దేవతలుగా కూడా ఇక్కడే అవుతారు. వంశము ఇక్కడే ఉంటుంది. వంశమని రాజ్యాన్ని అంటారు. విష్ణు వంశము ఉంటుంది. బ్రాహ్మణ వంశమని అనరు. రాజ్యవంశములో రాజ్యము నడుస్తుంది. మొదటివారు, తర్వాత రెండవవారు, తర్వాత మూడవవారు. మనం బ్రాహ్మణ కులభూషణులమని ఇప్పుడు మీకు తెలుసు. తర్వాత దేవతలుగా అవుతాము. బ్రాహ్మణుల నుండి విష్ణు కులములోకి, విష్ణుకులము నుండి క్షత్రియ చంద్రవంశీ కులములోకి వస్తాము, తర్వాత వైశ్యకులములోకి, తర్వాత శూద్ర కులములోకి వస్తాము. మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. అర్థం చాలా స్పష్టంగా ఉంది. చిత్రాలలో ఏవేవో చూపిస్తారు. బ్రాహ్మణులైన మనమే విష్ణుపురికి యజమానులుగా అవుతాము. ఇందులో తికమకపడకూడదు. బాబా ఏ అంశాలు అయితే ఇస్తారో వాటిపై ఎవరికి ఎలా అర్థం చేయించాలి అని విచార సాగర మథనము చేయాలి, వీరు అర్థం చేయించడం ఎంత బాగుంది అని మనుష్యులు ఆశ్చర్యపోవాలి. జ్ఞానసాగరుడు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. విచార సాగర మథనము చేసిన తర్వాత కూర్చుని వ్రాయాలి. ఆ తర్వాత చదివితే ఈ-ఈ పదాలను కలపాలి అన్న ఆలోచన కలుగుతుంది. బాబా కూడా మొట్టమొదట మురళీని వ్రాసి మీ చేతికి ఇచ్చేవారు, ఆ తర్వాత మీరు వినిపించేవారు. ఇక్కడైతే మీరు బాబాతోపాటు ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడిక మీరు బయటకు వెళ్ళి వినిపించవలసి ఉంటుంది. ఈ అంశాలు చాలా అద్భుతమైనవి. బ్రహ్మా నుండి విష్ణువుగా ఎలా అవుతారు అన్నది ఎవ్వరికీ తెలియదు. గాంధి నాభి నుండి నెహ్రూను చూపించినట్లు విష్ణువు నాభి నుండి బ్రహ్మా వచ్చినట్లుగా చూపిస్తారు. కాని వంశమైతే ఉండాలి కదా. బ్రాహ్మణ కులంలో రాజ్యముండదు. బ్రాహ్మణ సాంప్రదాయము నుండి దైవీ వంశము తయారవుతుంది. తర్వాత చంద్రవంశీయుల వంశంలోకి వెళ్తారు, తర్వాత వైశ్యవంశము. ఇలా ప్రతి వంశము నడుస్తుంది కదా. సత్యయుగం నిర్వికారి ప్రపంచము, కలియుగం వికారి ప్రపంచము. ఈ రెండు పదాలు కూడా ఎవరి బుద్ధిలోనూ లేవు. వికారుల నుండి నిర్వికారులుగా ఎలా అవుతారు అన్నది బుద్ధిలో తప్పకుండా ఉండాలి. మనుష్యులకు నిర్వికారుల గురించి తెలియదు, వికారుల గురించి తెలియదు. దేవతలు నిర్వికారులని మీకు అర్థం చేయిండం జరుగుతుంది. బ్రాహ్మణులు నిర్వికారులని అని ఎక్కడైనా విన్నారా. కొత్త ప్రపంచంలో నిర్వికారులు, పాత ప్రపంచంలో వికారులు ఉంటారు. కావున తప్పకుండా సంగమయుగాన్ని చూపించవలసి ఉంటుంది. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. పురుషోత్తమ మాసమును జరుపుకుంటారు కదా. మూడు సంవత్సరాల తర్వాత ఒక నెలను జరుపుకుంటారు. మీకు 5 వేల సంవత్సరాల తర్వాత ఒక సంగమయుగం వస్తుంది. మనుష్యులకు ఆత్మ మరియు పరమాత్మల గురించి యథార్థంగా తెలియదు. కేవలం ఒక అద్భుతమైన నక్షత్రము ప్రకాశిస్తుందని అంటారు. రామకృష్ణ పరమహంస శిష్యుడైన వివేకానందుడు, నేను గురువు ఎదురుగా కూర్చుని ఉండేవాడిని అని చెప్పేవారు, గురువును కూడా ధ్యానము చేస్తారు కదా. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఇందులో ధ్యానం యొక్క విషయమేమీ లేదు, గురువు స్మృతి అయితే ఉండనే ఉంటుంది. ప్రత్యేకంగా కూర్చుని స్మృతి చేస్తేనే గుర్తుకొస్తారా. అతనికి గురువే భగవంతుడనే భావన ఉండేది కనుక గురువు ఆత్మ వచ్చి తనలో కలిసిపోయిందని భావించారు. వారి ఆత్మ వచ్చి ఎక్కడ కూర్చుంది, తర్వాత ఏమయింది, దాని గురించిన వర్ణన ఏమీ లేదు, అంతే. నాకు భగవంతుని సాక్షాత్కారమయిందని సంతోషించారు. భగవంతుడంటే ఎవరో అతనికి తెలియదు. మెట్ల చిత్రంపై మీరు అర్థం చేయించండి అని తండ్రి చెప్తున్నారు. ఇది భక్తి మార్గము. ఒకటి భక్తి యొక్క నావ, మరొకటి జ్ఞానం యొక్క నావ అని మీకు తెలుసు. జ్ఞానము వేరు, భక్తి వేరు. నేను కల్పక్రితం మీకు జ్ఞానాన్ని ఇచ్చాను, విశ్వానికి యజమానులుగా తయారుచేశాను అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మీరెక్కడ ఉన్నారు. ఇతర వంశాలు ఎలా వస్తాయో, వృక్షము ఎలా పెరుగుతుందో, మొత్తం జ్ఞానం పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పుష్పగుచ్చముంటుంది కదా. ఈ సృష్టిరూపి వృక్షము కూడా పుష్పగుచ్చము వంటిది. మధ్యలో మీ ధర్మము, ఆ తర్వాత దీని నుండి ఇతర మూడు ధర్మాలు వెలువడతాయి. అక్కడి నుండి వృద్ధి జరుగుతూ ఉంటుంది. కావున ఈ వృక్షాన్ని కూడా స్మృతి చేయాలి. ఎన్ని శాఖోపశాఖలు మొదలైనవి వెలువడుతూ ఉంటాయి. వెనుక వచ్చేవారికి కూడా గౌరవముంటుంది. మర్రి వృక్షము ఉంటుంది కదా, దానికి కాండము ఉండదు. మొత్తం వృక్షమంతా నిలబడి ఉంటుంది. దేవీ-దేవతా ధర్మము కూడా సమాప్తమైపోయింది. పూర్తిగా పాడైపోయింది. భారతవాసీయులకు తమ ధర్మం గురించి ఏ మాత్రమూ తెలియదు, మిగిలినవారందరికీ తమ తమ ధర్మాల గురించి తెలుసు, మేము ధర్మమునే అంగీకరించమని కొందరంటారు. ముఖ్యమైనవి 4 ధర్మాలు. ఇవి కాక చిన్న-చిన్నవైతే అనేకమున్నాయి. ఈ వృక్షం గురించి మరియు సృష్టిచక్రం గురించి మీకిప్పుడు తెలుసు. దేవీ-దేవతా ధర్మం పేరే మాయం చేసేసారు. మళ్ళీ బాబా దానిని స్థాపించి మిగిలిన ధర్మాలన్నిటినీ వినాశనం చేస్తారు. సృష్టిచక్ర చిత్రం వద్దకు కూడా తప్పకుండా తీసుకువెళ్ళాలి. ఇది సత్యయుగము, ఇది కలియుగము. కలియుగములో ఎన్ని ధర్మాలున్నాయి, సత్యయుగములో ఒకే ధర్మముంటుంది. ఏకధర్మ స్థాపన, అనేక ధర్మాల వినాశనాన్ని ఎవరు చేస్తూ ఉండవచ్చు? భగవంతుడు కూడా తప్పకుండా ఎవరి ద్వారానో చేయిస్తారు కదా. బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తాను అని తండ్రి చెప్తున్నారు. బ్రాహ్మణులే విష్ణుపురిలో దేవతలుగా అవుతారు.
సంగమయుగంలో బ్రాహ్మణులైన మీరు పవిత్రంగా అయ్యేందుకే గుప్తమైన శ్రమ చేయవలసి వస్తుంది. బ్రహ్మా పిల్లలైన మీరు సంగమయుగంలో సోదరీ-సోదరులు. సోదరీ-సోదరుల మధ్యన అశుద్ధమైన దృష్టి ఉండకూడదు. స్త్రీ-పురుషులు ఇరువురూ స్వయాన్ని బి.కె.లమని భావిస్తారు. ఇందులో చాలా శ్రమ ఉంది. స్త్రీ-పురుషుల ఆకర్షణ ఎటువంటిదంటే, ముట్టుకోకుండా ఉండలేరు. ఇక్కడ సోదరీ-సోదరులు ఎప్పుడూ ఒకరినొకరు ముట్టుకోకూడదు, లేకపోతే పాపం ఫీలింగ్ కలుగుతుంది. మనం బి.కె.లము, ఇది మర్చిపోతే సమాప్తమైపోతారు. ఇందులో చాలా గుప్తమైన శ్రమ ఉంది. యుగళులుగా ఉన్నా ఎవరికి ఏమి తెలుసు? తాము బి.కె.లము, ఫరిశ్తాలమని వారికి స్వయమే తెలుసు. ఎప్పుడూ ముట్టుకోకూడదు. ఇలా చేస్తూ-చేస్తూ సూక్ష్మవతనవాసులైన ఫరిశ్తాలుగా అయిపోతారు. లేకపోతే ఫరిశ్తాలుగా అవ్వలేరు. ఫరిశ్తాలుగా అవ్వాలంటే పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. నంబరువన్ లోకి వెళ్ళే జంటగా వెలువడాలి. దాదా అయితే అన్నిటినీ అనుభవం చేశారు, చివర్లో సన్యసించారు. ఎవరైతే జంటగా అయిపోతారో, వారికే చాలా కష్టమని అంటారు. అందులో జ్ఞానం మరియు యోగం కూడా కావాలి. అనేకులను తమ సమానంగా తయారుచేసినప్పుడే గొప్ప రాజులుగా అవుతారు. కేవలం ఒక్క విషయమే చాలదు కదా. మీరు శివబాబాను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. వీరు ప్రజాపిత. మాకు శివబాబాతో మాత్రమే పని ఉంది అనేవారు కూడా చాలామంది ఉన్నారు. మేము బ్రహ్మాను ఎందుకు స్మృతి చేయాలి, వారికి ఉత్తరాలు ఎందుకు వ్రాయాలి అని అనేవారు కూడా ఉన్నారు. మీరు శివబాబాను స్మృతి చేయాలి, అందుకే బాబా ఫోటో మొదలైనవి కూడా ఇవ్వరు. వీరిలోకి శివబాబా వస్తారు, వీరైతే దేహధారి కదా. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది. వారు స్వయాన్ని ఈశ్వరునిగా భావించుకుంటారు, మరి వారి నుండి ఏమి లభిస్తుంది, భారతవాసీయులు ఎంతగా నష్టపోతారు. భారతవాసీయులు పూర్తిగా దివాలా తీసేశారు. ప్రజల నుండి భిక్షం యాచిస్తూ ఉంటారు. 10-20 సంవత్సరాలు అప్పులు తీసుకుంటారు, ఆ తర్వాత ఇచ్చేది కూడా ఉండదు. ఇచ్చేవారు, తీసుకునేవారు ఇరువురూ సమాప్తమైపోతారు. ఆటనే సమాప్తమవ్వనున్నది. తలపై అనేక సమస్యలున్నాయి. దివాలా తీస్తారు, వ్యాధులు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. కొందరు షావుకారుల వద్ద ఉంచుతారు, మరి వారు దివాలా తీస్తే, పేదవారికి ఎంత దుఃఖం కలుగుతుంది. అడుగడుగులోనూ దుఃఖమే దుఃఖముంది. అకస్మాత్తుగా కూర్చుని-కూర్చునే మరణిస్తారు. ఇది ఉన్నదే మృత్యులోకము. ఇప్పుడు మీరు అమరలోకానికి వెళ్తున్నారు. అమరపురికి అధికారులుగా అవుతారు. అమరనాథుడు పార్వతులైన మీకు సత్యాతి-సత్యమైన అమరకథను వినిపిస్తున్నారు. బాబా అమరుడు, వారి ద్వారా మనం అమరకథను వింటున్నాము అని మీకు తెలుసు. ఇప్పుడు అమరలోకానికి వెళ్ళాలి. ఈ సమయంలో మీరు సంగమయుగంలో ఉన్నారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. విచార సాగర మథనము చేసి బ్రహ్మా నుండి విష్ణువుగా ఎలా అవుతారు అన్న టాపిక్ గురించి వినిపించాలి. బుద్ధిని జ్ఞాన మథనములో బిజీగా ఉంచుకోవాలి.
2. రాజ్యపదవిని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞానం మరియు యోగంతో పాటు తమ సమానంగా తయారుచేసే సేవను కూడా చేయాలి. తమ దృష్టిని చాలా శుద్ధంగా చేసుకోవాలి.