29-06-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - భవిష్య ఉన్నతమైన వంశములోకి వచ్చేందుకు ఆధారము చదువు, ఈ చదువు ద్వారానే మీరు బెగ్గర్ నుండి ప్రిన్స్ గా అవ్వగలగుతారు"

ప్రశ్న:-

రెండు విధాలుగా గోల్డన్ స్పూన్ ఇన్ మౌత్ (నోటిలో బంగారు స్పూను) ప్రాప్తించగలదు, ఎలా?

జవాబు:-

ఒకటి భక్తిలో దాన-పుణ్యాలు చేయడం ద్వారా, రెండవది, జ్ఞానములో చదువు ద్వారా ప్రాప్తిస్తాయి. భక్తిలో దాన-పుణ్యాలు చేస్తే రాజుల వద్ద లేక షావుకారుల వద్ద జన్మ తీసుకుంటారు కాని అది హద్దుకు సంబంధించినది. మీరు జ్ఞాన మార్గంలో చదువు ద్వారా నోటిలో బంగారు స్పూను కలవారిగా అవుతారు. ఇది అనంతమైన విషయము. భక్తిలో చదువు ద్వారా రాజ్యము లభించదు. ఇక్కడ ఎవరు ఎంత బాగా చదువుకుంటారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు.

ఓం శాంతి. మధురాతి-మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, దీనిని ఆత్మిక జ్ఞానమని అంటారు. తండ్రి వచ్చి భారతవాసీయులైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి, తండ్రి విశేషంగా ఈ ఆజ్ఞను ఇచ్చారు కావున దానిని పాటించాలి కదా. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి శ్రీమతము ప్రసిద్ధమైనది. కేవలం శివబాబాను మాత్రమే శ్రీ శ్రీ అని అనవచ్చని పిల్లలైన మీకిప్పుడు జ్ఞానముంది. వారే శ్రీ శ్రీ గా చేస్తారు, శ్రీ అనగా శ్రేష్ఠం. వీరిని తండ్రియే ఆ విధంగా తయారుచేశారని పిల్లలైన మీకిప్పుడు తెలిసింది. మనమిప్పుడు కొత్త ప్రపంచము కోసం చదువుకుంటున్నాము. కొత్త ప్రపంచము పేరే స్వర్గము, అమరపురి. మహిమ చేసేందుకు అనేక పేర్లున్నాయి. స్వర్గం మరియు నరకం అని కూడా అంటారు. ఫలానావారు స్వర్గస్థులయ్యారు అంటే అంతకుముందు నరకవాసులుగా ఉన్నట్లే కదా. కాని మనుష్యులలో అంతటి వివేకం లేదు, స్వర్గం-నరకం, కొత్త ప్రపంచం, పాత ప్రపంచం అని దేన్ని అంటారో ఏమాత్రము తెలియదు. బాహ్య ఆర్భాటము ఎంతగా ఉంది. తప్పకుండా మమ్మల్ని తండ్రియే చదివిస్తున్నారని భావించేవారు, పిల్లలైన మీలో కూడా కొంతమందే ఉన్నారు. మనము ఈ లక్ష్మీ-నారాయణులుగా అయ్యేందుకు వచ్చాము. మనము బెగ్గర్ నుండి ప్రిన్స్ గా అవుతాము. మొట్టమొదట మనము వెళ్ళి రాకుమారులుగా అవుతాము. ఇది చదువు, ఇంజనీరింగ్, బ్యారిస్టరి మొదలైనవి చదివేటప్పుడు, మేము ఇల్లు కడతాము, తర్వాత ఇది చేస్తాము....... అని బుద్ధిలో ఉంటుంది. ప్రతి ఒక్కరికీ తమ కర్తవ్యము గుర్తుకొస్తుంది. పిల్లలైన మీరు ఈ చదువు ద్వారా చాలా ఉన్నతమైన ఇంట్లో జన్మ తీసుకోవాలి. ఎవరు ఎంత ఎక్కువగా చదువుకుంటారో, అంత ఉన్నతమైన ఇంటిలో జన్మ తీసుకుంటారు. రాజు ఇంట్లో జన్మ తీసుకుని మళ్ళీ రాజ్యం చేయాలి. గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ అని గాయనం కూడా ఉంది. ఒకటి జ్ఞానము ద్వారా గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ (నోటిలో బంగారు స్పూను) లభిస్తుంది. రెండవది, ఒకవేళ దాన-పుణ్యాలు బాగా చేస్తే కూడా రాజుల వద్ద జన్మ లభిస్తుంది. అది హద్దుకు సంబంధించినది. ఇది అనంతమైనది. ప్రతి ఒక్క విషయాన్ని బాగా అర్థము చేసుకోండి. ఏదైనా అర్థము కాకపోతే అడగవచ్చు. ఈ-ఈ విషయాలు బాబాను అడగాలని నోట్ చేసుకోండి. తండ్రి స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. సంశయాలు మొదలైనవి ఏమైనా ఉంటే వాటిని వారు సరి చేస్తారు. భక్తిమార్గములో ఎంతగా దాన-పుణ్యాలు చేస్తారో, అంతగా షావుకార్ల వద్ద జన్మ తీసుకుంటారని కూడా పిల్లలకు తెలుసు. ఎవరైనా ఏదైనా చెడు కర్మ చేస్తే, వారికి మళ్ళీ అటువంటి జన్మ లభిస్తుంది, బాబా వద్దకు ఎందరో వస్తారు. కొంతమందికైతే ఎటువంటి కర్మ బంధనాలున్నాయంటే, వాటి గురించి ఇక అడగకండి. అవన్నీ గతం యొక్క కర్మ బంధనాలు. కొంతమంది రాజులకు కూడా చాలా కఠినమైన కర్మబంధనాలుంటాయి. ఈ లక్ష్మీ-నారాయణులకైతే ఎటువంటి బంధనాలు లేవు. అక్కడ యోగబలము ద్వారా రచన జరుగుతుంది. యోగబలము ద్వారా మనం విశ్వరాజ్యాన్ని పొందగలుగుతునప్పుడు, మరి పిల్లలకు జన్మనివ్వలేమా! అవన్నీ ముందుగానే సాక్షాత్కారమవుతాయి. అక్కడ ఇది సాధారణ విషయము. సంతోషములో వాయిద్యాలు మ్రోగుతూనే ఉంటాయి. వృద్ధుల నుండి పిల్లలుగా అవుతారు. పిల్లలకు మహాత్ముల కన్నా కూడా ఎక్కువ గౌరవము ఇవ్వబడుతుంది ఎందుకంటే ఆ మహాత్ములు జీవితమంతా గడిపి పెద్దవారవుతారు కదా. వికారాల గురించి వారికి తెలుసు. చిన్న పిల్లలకు తెలియదు, అందుకే మహాత్ముల కంటే కూడా ఉన్నతమైన వారని అంటారు. అక్కడైతే అందరూ మహాత్ములే. కృష్ణుడిని కూడా మహాత్మ అని అంటారు. వారు సత్యమైన మహాత్మ. సత్యయుగములోనే మహాత్ములు ఉంటారు. అటువంటివారు ఇక్కడ ఎవ్వరూ ఉండరు.

పిల్లలైన మీలో చాలా సంతోషముండాలి. ఇప్పుడు మనము కొత్త ప్రపంచములో జన్మ తీసుకుంటాము. ఈ పాత ప్రపంచము సమాప్తమైయ్యేది ఉంది. ఇల్లు పాతదిగా అవ్వగానే కొత్త ఇంటి గురించి సంతోషముంటుంది కదా. ఎంత మంచి-మంచి మార్బల్ మొదలైనవాటితో ఇళ్ళులు నిర్మిస్తారు. జైనుల వద్ద చాలా ధనముంటుంది, వారు స్వయాన్ని ఉన్నత కులమువారిగా భావిస్తారు. వాస్తవానికి ఇక్కడ ఉన్నత కులము అంటూ ఏదీ లేదు. ఉన్నత కులము వారికిచ్చి వివాహము చేసేందుకు వెతుకుతారు. అక్కడ కులాలు మొదలైనవాటి విషయమేమీ ఉండదు. అక్కడైతే దేవతా కులము ఒకటే ఉంటుంది, ఇతర కులాలేవీ ఉండవు. అందుకోసం సంగమంలో, మేము ఒక్క తండ్రి పిల్లలము, అందరూ ఆత్మలమే అని మీరు అభ్యాసము చేస్తారు. మొదటిది ఆత్మ. ఆ తర్వాతనే శరీరము, ప్రపంచములో అందరూ దేహాభిమానములో ఉంటారు. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ తమ స్థితిని తయారుచేసుకోవాలి. బాబాకు ఎంతమంది పిల్లలున్నారు, ఎంత పెద్ద గృహస్థముంది, ఎన్ని ఆలోచనలు ఉండి ఉండవచ్చు. వీరు కూడా శ్రమ చేయాల్సి వస్తుంది, నేను సన్యాసిని ఏమీ కాను. తండ్రి వీరిలో ప్రవేశించారు. బ్రహ్మా-విష్ణు-శంకరుల చిత్రం కూడా ఉంది కదా. బ్రహ్మా అందరికన్నా ఉన్నతమైనవారు. మరి తండ్రి వారిని వదిలి ఇంకెవరిలోకి వస్తారు. బ్రహ్మా కొత్తగా ఏమీ జన్మించరు. వీరిని ఎలా దత్తత తీసుకుంటానో చూస్తారు కదా. మీరెలా బ్రాహ్మణులుగా అవుతారు అన్న విషయం మీకు మాత్రమే తెలుసు, ఇతరులకేమి తెలుసు. వీరు వజ్రాల వ్యాపారిగా ఉండేవారు, వీరిని మీరు బ్రహ్మా అంటున్నారు అని అంటారు! ఇంతమంది బ్రాహ్మణ-బ్రాహ్మణీలు ఎలా జన్మిస్తారో వారికేమి తెలుసు. ఒక్కొక్క విషయాన్ని ఎంతగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఇవి చాలా గుహ్యమైన విషయాలు కదా. ఈ బ్రహ్మా వ్యక్తము, వారు అవ్యక్తము. వీరు పవిత్రంగా అయిన తర్వాత అవ్యక్తమౌతారు. నేను ఈ సమయంలో పవిత్రంగా లేను, ఇలా పవిత్రంగా అవుతున్నాను అని వీరు చెప్తున్నారు. ప్రజాపిత అయితే ఇక్కడే ఉండాలి కదా. లేకపోతే ఎక్కడ నుండి వస్తారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను పతిత శరీరములోకి వస్తాను, తప్పకుండా వీరినే ప్రజాపిత అని అంటారు, సూక్ష్మవతనంలో అలా అనరు. అక్కడ ప్రజలేమి చేస్తారు. వీరు ఇండిపెండెంట్ గా పవిత్రంగా అవుతారు. ఏ విధంగా వీరు పురుషార్థము చేస్తున్నారో, అలాగే మీరు కూడా పురుషార్థము చేసి ఇండిపెండెంట్ గా పవిత్రంగా అయిపోతారు. విశ్వానికి అధికారులుగా అవుతారు కదా. స్వర్గము వేరు, నరకము వేరు. ఇప్పుడు ఎంతగా ముక్కలు-ముక్కలుగా అయిపోయింది. 5 వేల సంవత్సరాల క్రితము వీరి రాజ్యము ఉండేది. వారు మళ్ళీ లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఎవరైతే కల్పక్రితము అర్థం చేసుకొని ఉంటారో వారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. ఇక్కడ ముస్లింలు, పారసీలు మొదలైనవారు అందరూ రావడం మీరు చూస్తారు. ముస్లింలు, హిందువులకు జ్ఞానము ఇస్తున్నారు. విచిత్రము కదా. ఎవరైనా సిక్కు ధర్మమువారు ఉంటే వారు కూడా కూర్చుని రాజయోగము నేర్పిస్తారు. ఎవరైతే కన్వర్ట్ అయ్యారో వారు మళ్ళీ ట్రాన్సఫర్ అయ్యి దేవతా కులములోకి వచ్చేస్తారు. అంటు కట్టబడుతుంది. మీ వద్దకు క్రిస్టియన్లు, పారసీలు కూడా వస్తారు, బౌద్ధులు కూడా వస్తారు. సమయం సమీపించినప్పుడు నలువైపుల నుండి మన పేరు వెలువడుతుంది అని పిల్లలైన మీకు తెలుసు. మీరు ఒక్క భాషణ చేస్తే అనేకమంది మీ వద్దకు వచ్చేస్తారు. మా సత్యమైన ధర్మము ఇదే అని అందరికీ స్మృతి కలుగుతుంది. మన ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారందరూ తప్పకుండా వస్తారు కదా. లక్షల సంవత్సరాల విషయమేమీ లేదు. నిన్న మీరు దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు తండ్రి నుండి వారసత్వము తీసుకుంటున్నారు అని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు.

మీరు సత్యాతి-సత్యమైన పాండవులు, పాండవులు అనగా పండాలు (మార్గదర్శకులు). వారు దైహిక పండాలు. బ్రాహ్మణులైన మీరు ఆత్మిక పండాలు. మీరిప్పుడు అనంతమైన తండ్రి నుండి చదువుకుంటున్నారు, ఈ నషా మీకు ఎంతగానో ఉండాలి. మనము తండ్రి వద్దకు వెళ్తాము, వారి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది. వారు మనకు తండ్రి, టీచరు కూడా, ఇందులో చదువుకునేందుకు టేబుల్, కుర్చీ మొదలైనవేవి అవసరము లేదు. మీరు ఈ నోట్స్ కూడా మీ పురుషార్థము కోసమే వ్రాసుకుంటారు. వాస్తవానికి ఇది అర్థము చేసుకునే విషయం. శివబాబా మీకు ఉత్తరాలు వ్రాసేందుకు పెన్సిల్ మొదలైనవి ఉపయోగిస్తారు, శివబాబా రాసిన ఎర్రని అక్షరాలు వచ్చాయని పిల్లలు భావిస్తారు. ఆత్మిక పిల్లలూ అని తండ్రి వ్రాస్తారు. వారు ఆత్మిక తండ్రి అని పిల్లలు కూడా భావిస్తారు. వారు చాలా ఉన్నతాతి ఉన్నతమైనవారు, వారి మతానుసారంగా నడుచుకోవాలి. కామము మహాశత్రువు, అది ఆది-మధ్య-అంతాలు దుఃఖమునిస్తుంది, ఆ భూతానికి వశమవ్వకండి. పవిత్రంగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. ఓ పతిత-పావనా అని కూడా పిలుస్తారు. పిల్లలైన మీకిప్పుడు రాజ్యము చేసేందుకు ఎంతో శక్తి లభిస్తుంది. మీపై ఎవ్వరూ విజయాన్ని పొందలేరు. మీరు ఎంతో సుఖవంతులుగా అవుతారు. కావున ఈ చదువుపై ఎంతటి అటెన్షన్ పెట్టాలి. మనకు రాజ్యాధికారం లభిస్తుంది. మనము ఎలా ఉన్నవారము, ఎలా అవుతున్నామో మీకు తెలుసు. భగవానువాచ కదా. నేను మీకు రాజయోగము నేర్పిస్తున్నాను, రాజులకే రాజుగా చేస్తాను. భగవంతుడని ఎవరిని అంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. ఓ బాబా - అని ఆత్మ పిలుస్తుంది. వారు ఎప్పుడు వస్తారు మరియు ఎలా వస్తారు అన్నది తెలుసుకోవాలి కదా. మనుష్యులే డ్రామా ఆది-మధ్య-అంతాల గురించి, కాలం గురించి తెలుసుకుంటారు కదా. వాటిని తెలుసుకోవడం వలన మీరు దేవతలుగా అయిపోతారు. జ్ఞానము సద్గతి కోసమే ఉంది. ఇది కలియుగం యొక్క అంతిమ సమయము. అందరూ దుర్గతిలో ఉన్నారు. సత్యయుగములో సద్గతి లభిస్తుంది. సర్వుల సద్గతి చేసేందుకు తండ్రి వచ్చారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. అందరినీ మేల్కొల్పేందుకు వచ్చారు. ఇది సమాధి ఏమీ కాదు. కాని ఘోర అంధకారములో ఉన్నారు, వారిని మేల్కొల్పేందుకు వస్తారు. ఏ పిల్లలైతే గాఢమైన నిద్ర నుండి మేల్కొంటారో వారికి లోలోపల చాలా సంతోషము కలుగుతుంది, మనము శివబాబా పిల్లలము, మనకు ఎటువంటి చింతా లేదు. తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. అక్కడ ఏడవడం అన్న మాటే ఉండదు. ఇది ఏడ్చేటటువంటి ప్రపంచము, అది హర్షితంగా ఉండే ప్రపంచము. వారి చిత్రాలను ఎంత సుందరంగా, హంసముఖం వలె తయారుచేస్తారో చూడండి. ఆ రూపురేఖలను ఇక్కడ తయారుచేయలేరు. వీరిలాంటి ముఖకవళికలు అక్కడ కనిపిస్తాయని బుద్ధి ద్వారా అర్థము చేసుకుంటారు. భవిష్యత్తులో మేము అమరపురికి రాకుమారులుగా అవుతామని మధురాతి-మధురమైన పిల్లలైన మీకిప్పుడు స్మృతి కలిగింది. ఇప్పుడు ఈ మృత్యులోకానికి, ఈ అడవికి మంటలు అంటుకోనున్నాయి. సివిల్ వార్ లో కూడా ఒకరినొకరు ఎలా హతమార్చుకుంటున్నారో చూడండి, తాము ఎవరిని కొడుతున్నారో కూడా వారికి తెలియదు. హాహాకారాల తర్వాత జయ జయకారాలు జరగుతాయి. మీకు విజయము లభిస్తుంది, మిగిలినవారందరి వినాశనము జరుగుతుంది. రుద్ర మాలలో స్మరింపబడిన తర్వాత విష్ణు మాలలో స్మరింపబడతారు. మీరిప్పుడు మీ ఇంటికి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నారు. భక్తి విస్తారం ఎంతగా ఉంది. ఏ విధంగా వృక్షానికి అనేక ఆకులుంటాయో, అలాగే భక్తి కూడా ఎంతగానో విస్తరించి ఉంది. జ్ఞానము బీజము. బీజము ఎంత చిన్నగా ఉంటుంది. బాబా బీజము, ఈ వృక్ష స్థాపన, పాలన మరియు వినాశనము ఎలా జరుగుతుందో మీకే తెలుసు. ఇది వెరైటీ ధర్మాల, తలక్రిందులుగా ఉన్న వృక్షము. దీని గురించి ప్రపంచములో ఒక్కరికి కూడా తెలియదు. ఇప్పుడు పిల్లలు తండ్రిని స్మృతి చేసేందుకు చాలా శ్రమ చేయాలి, అప్పుడే వికర్మలు వినాశనమౌతాయి. ఆ గీతను వినిపించేవారు కూడా మన్మనాభవ అని చెప్తారు. దేహం యొక్క ధర్మాలన్నీ విడిచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. మనుష్యులకు దీని అర్థము తెలియదు. అదైతే భక్తి మార్గము. ఇది జ్ఞాన మార్గము. ఈ రాజధాని స్థాపనౌతుంది. ఇందులో చింతించే విషయమేమీ లేదు. ఎవరైనా కొద్దిగా జ్ఞానము విన్నా కూడా ప్రజలలోకి వచ్చేస్తారు. జ్ఞానము వినాశనమవ్వదు. ఇక ఎవరైతే యథార్థంగా తెలుసుకుని పురుషార్థము చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. మనము కొత్త ప్రపంచములో యువరాజులుగా అయ్యేవారము అని బుద్ధిలో ఈ వివేకం ఉంది కదా. విద్యార్థులు పరీక్షలో పాస్ అయితే వారికి ఎంత సంతోషము కలుగుతుంది. మీకైతే వేల రెట్లు ఎక్కువగా అతీంద్రియ సుఖము ఉండాలి. మనము మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతాము. ఏ విషయములోనూ ఎప్పుడూ అలగకూడదు. బ్రాహ్మణితో పడకపోతే, తండ్రిపై అలుగుతారు, అరే మీరు తండ్రితో బుద్ధియోగము జోడించండి కదా. వారిని ప్రేమగా స్మృతి చేయండి. బాబా, కేవలం మిమ్మల్నే స్మృతి చేస్తూ-చేస్తూ మేము ఇంటికి వచ్చేస్తాము. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ విషయము గురించి చింతించకూడదు, సదా హర్షితంగా ఉండాలి. మేము శివబాబా పిల్లలము, తండ్రి మమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేసేందుకు వచ్చారని స్మృతి ఉండాలి.

2. మీ స్థితిని ఏకరసంగా తయారుచేసుకునేందుకు దేహీ-అభిమానులుగా అయ్యే పురుషార్థము చేయాలి. ఈ పాత ఇంటి పట్ల మమకారాన్ని తొలగించాలి.

వరదానము:-

బంధనాల పంజరాన్ని తెంచి జీవన్ముక్త స్థితిని అనుభవం చేసే సత్యమైన ట్రస్టీ భవ

శారీరిక లేక సంబంధాల బంధనమే పంజరము. బాధ్యతను కూడా నిమిత్తమాత్రంగా నిర్వర్తించాలి కాని మోహంతో కాదు, అప్పుడే నిర్బంధనులని అంటారు. ఎవరైతే ట్రస్టీలుగా అయి నడుచుకుంటారో వారే నిర్బంధనులు, ఒకవేళ ఏదైనా నాది అనేది ఉంటే పంజరంలో బందింపబడి ఉంటారు. ఇప్పుడు పంజరములోని మైనా నుండి ఫరిస్తాలుగా అయ్యారు, కావున ఎక్కడా కొద్దిగా కూడా బంధనం ఉండకూడదు. మనసు యొక్క బంధనము కూడా ఉండకూడదు. ఏం చేయాలి, ఎలా చేయాలి, కోరుకుంటున్నాను కాని జరగడం లేదు - ఇవి కూడా మనసు యొక్క బంధనాలే. మరజీవాగా అయినప్పుడు అన్ని రకాల బంధనాలు సమాప్తమైపోతాయి, సదా జీవన్ముక్త స్థితి అనుభవమవుతూ ఉండాలి.

స్లోగన్:-

సంకల్పాలను పొదుపు చేసినట్లయితే సమయము, మాటలు అన్నీ స్వతహాగానే పొదుపు అయిపోతాయి.