24-09-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
“మధురమైన పిల్లలూ - పుణ్యాత్ములుగా అయ్యేందుకు ఎంత
వీలైతే అంత మంచి కర్మలు చేయండి, ఆల్ రౌండర్ గా అవ్వండి, దైవీ గుణాలు ధారణ చేయండి”
ప్రశ్న:-
ఏ శ్రమ చేసినట్లయితే పిల్లలైన మీరు పదమాపదమ పతులుగా అవుతారు?
జవాబు:-
వికారీ దృష్టిని పవిత్ర దృష్టిగా మార్చుకోవడమే అన్నిటికన్నా పెద్ద శ్రమ. కళ్ళే
చాలా మోసము చేస్తాయి. కళ్ళను పవిత్రంగా చేసుకునేందుకు తండ్రి యుక్తిని
తెలియజేసారు - పిల్లలూ, ఆత్మిక దృష్టితో చూడండి. దేహాన్ని చూడకండి. నేను ఆత్మను
అనే అభ్యాసాన్ని పక్కా చేసుకోండి, ఈ శ్రమ ద్వారానే మీరు జన్మ-జన్మాంతరాలకు
పదమపతులుగా అవుతారు.
గీతము:-
ఓర్పు వహించు మానవా
ఓంశాంతి.
ఇలా ఎవరన్నారు? శివబాబా శరీరము ద్వారా అన్నారు. ఏ ఆత్మ
అయినాసరే శరీరము లేకుండా మాట్లాడలేదు. తండ్రి కూడా శరీరములో ప్రవేశించి ఆత్మలకు
అర్థం చేయిస్తారు - పిల్లలూ, ఇప్పుడు మీకు దైహిక సంబంధం లేదు. ఇది ఆత్మిక సంబంధం.
ఆత్మకు పరమపిత పరమాత్మ ద్వారా జ్ఞానము లభిస్తుంది. దేహధారులందరూ
చదువుకుంటున్నారు. తండ్రికి తమ దేహము లేదు కనుక కొంత సమయం కోసం వీరిని ఆధారంగా
తీసుకున్నారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని కూర్చోండి అని ఇప్పుడు తండ్రి
చెప్తున్నారు. అనంతమైన తండ్రి ఆత్మలైన మనకు అర్థము చేయిస్తున్నారు. వారు తప్ప
ఇంకెవ్వరూ ఈ విధంగా అర్థము చేయించలేరు. ఆత్మ, ఆత్మకు ఎలా అర్థము చేయిస్తుంది.
ఆత్మలకు అర్థము చేయించే పరమాత్మ కావాలి. వారి గురించి ఎవ్వరికీ తెలియదు.
త్రిమూర్తి చిత్రము నుండి కూడా శివుడిని తొలగించేశారు. బ్రహ్మా ద్వారా స్థాపన
ఎవరు చేయిస్తారు. బ్రహ్మా అయితే కొత్త ప్రపంచానికి రచయిత కాదు. అందరికీ అనంతమైన
తండ్రి, రచయిత, శివబాబా ఒక్కరే. బ్రహ్మా కూడా కేవలం ఇప్పుడు మాత్రమే మీ తండ్రిగా
ఉన్నారు, తర్వాత ఉండరు. అక్కడ లౌకిక తండ్రి మాత్రమే ఉంటారు. కలియుగములో లౌకిక
తండ్రి మరియు పారలౌకిక తండ్రి ఉంటారు. ఇప్పుడు సంగమయుగములో లౌకిక, అలౌకిక మరియు
పారలౌకిక - ముగ్గురు తండ్రులుంటారు. సుఖధామంలో నన్ను అసలు ఎవ్వరూ స్మృతి చేయరని
తండ్రి చెప్తున్నారు. తండ్రియే విశ్వానికి యజమానులుగా తయారుచేశారు, మరి ఇక
వారిని ఎందుకు పిలుస్తారు? అక్కడ ఇంకే ఖండమూ ఉండదు. కేవలం సూర్య వంశీయులే ఉంటారు.
చంద్ర వంశీయులు కూడా తర్వాత వస్తారు. పిల్లలూ, ఓర్పు వహించండి, ఇక కొద్ది రోజులే
ఉన్నాయి, పురుషార్థము బాగా చేయండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. దైవీగుణాలు
ధారణ చేయకపోతే పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇది చాలా పెద్ద లాటరీ. బ్యారిస్టరు,
సర్జన్ మొదలైనవారిగా అవ్వడం కూడా లాటరీనే కదా. వారు చాలా ధనము సంపాదిస్తారు.
చాలామందిపై అధికారం నడిపిస్తారు. ఎవరైతే బాగా చదువుకుని చదివిస్తారో, వారు
ఉన్నత పదవిని పొందుతారు. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి.
తండ్రిని కూడా క్షణ-క్షణము మర్చిపోతారు. మాయ స్మృతిని మరిపిస్తుంది. జ్ఞానాన్ని
మరిపించదు. మీ ఉన్నతి చేసుకోవాలంటే, రోజంతటిలో ఎటువంటి పాపకర్మ అయితే చేయలేదు
కదా అని చార్టు పెట్టండి, లేదంటే 100 రెట్లు పాపమైపోతుంది అని తండ్రి
చెప్తున్నారు. యజ్ఞాన్ని సంభాళించేవారు కూర్చుని ఉన్నారు, వారి సలహా అనుసారంగా
చేయండి. ఏది తినిపిస్తే, ఎక్కడ కూర్చోబెడితే...... అని కూడా అంటారు కనుక
మిగిలిన ఆశలను వదిలేయాలి. లేదంటే పాపము పెరుగుతూ ఉంటుంది. ఆత్మ పవిత్రంగా ఎలా
అవుతుంది. యజ్ఞములో ఏ పాప కర్మ చేయకూడదు. ఇక్కడ మీరు పుణ్యాత్ములుగా అవుతారు.
దొంగతనం మొదలైనవి చేయడం పాపము కదా. మాయ ప్రవేశిస్తుంది. వారు యోగంలోనూ ఉండలేరు,
జ్ఞానాన్ని కూడా ధారణ చేయలేరు. ఒకవేళ నేను అంధులకు చేతికర్రగా అవ్వలేదంటే నేను
ఏమైనట్లు అని మీ మనసును ప్రశ్నించుకోవాలి. నన్ను అంధుడనే అంటారు కదా.
ధృతరాష్ట్రుని పిల్లలని ఈ సమయం గురించే గాయనం చేయబడింది. వాళ్ళు రావణ రాజ్యంలో
ఉంటారు. మీరు సంగమయుగంలో ఉన్నారు. రామరాజ్యములో మళ్ళీ సుఖాన్ని పొందుతారు.
పరమపిత పరమాత్మ సుఖాన్ని ఎలా ఇస్తారు అనేది ఎవరి బుద్ధిలోకి రాదు. ఎంత బాగా
అర్థము చేయించినా కూడా బుద్ధిలో కూర్చోదు. స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే
పరమాత్మ జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోగలరు. ఆత్మ ఏ విధంగా పురుషార్ధం చేస్తుందో,
ఆ విధంగా తయారవుతుంది. అంతిమ కాలములో ఎవరైతే స్ర్తీ ని స్మరిస్తారో...... అని
గాయనము కూడా ఉంది. ఎవరైతే నన్ను స్మృతి చేస్తారో, వారు నన్ను పొందుతారు అని
తండ్రి చెప్తున్నారు. లేదంటే చాలా-చాలా శిక్షలు అనుభవించి వస్తారు. సత్యయుగంలోకి
కూడా రారు, త్రేతాయుగంలో కూడా చివర్లో వస్తారు. సత్య-త్రేతా యుగాలను బ్రహ్మా
పగలు అని అంటారు. ఒక్క బ్రహ్మా మాత్రమే ఉండరు, బ్రహ్మాకు చాలామంది పిల్లలున్నారు
కదా. బ్రాహ్మణుల పగలు, తర్వాత బ్రాహ్మణుల రాత్రి ఉంటుంది. ఇప్పుడు రాత్రిని
పగలుగా చేయడానికి తండ్రి వచ్చారు. బ్రాహ్మణులే పగలులోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు
చేసుకుంటున్నారు. తండ్రి ఎంతగా అర్థం చేయిస్తారు, దైవీ ధర్మ స్థాపన తప్పకుండా
జరగాల్సిందే. కలియుగ వినాశనం కూడా తప్పకుండా జరగాల్సిందే. ఎవరికైనా లోపల ఏ
మాత్రం సంశయమున్నా వారు పారిపోతారు. మొదట నిశ్చయం ఏర్పడి, తర్వాత సంశయం
కలుగుతుంది. ఇక్కడ నుండి మరణించి మళ్ళీ పాత ప్రపంచములోకి వెళ్ళి జన్మిస్తారు.
వినశ్యంతి అయిపోతారు. తండ్రి శ్రీమతంపై నడవాలి కదా. పిల్లలకైతే చాలా మంచి-మంచి
పాయింట్లు ఇస్తూ ఉంటారు.
నీవు ఒక ఆత్మ, దేహము కాదు అని మొట్టమొదట అర్థం చేయించండి. లేకపోతే లాటరీ అంతా
మాయమైపోతుంది. అక్కడ రాజు మరియు ప్రజలు అందరూ సుఖంగా ఉంటారు, అయినా కానీ ఉన్నత
పదవిని పొందేందుకు పురుషార్థము చేయాలి కదా. సుఖధామములోకైతే వెళ్తాము కదా అని
అనుకోకూడదు. ఉన్నత పదవిని పొందాలి, రాజుగా అయ్యేందుకు వచ్చారు. ఇటువంటి
తెలివైనవారు కూడా కావాలి. తండ్రి సేవను చేయాలి. ఆత్మిక సేవ కాకపోతే స్థూల సేవ
కూడా ఉంది. అక్కడక్కడా పురుషులు కూడా పరస్పరము క్లాసులు నడిపిస్తూ ఉంటారు. ఒక
అక్కయ్య మధ్య-మధ్యలో వెళ్ళి క్లాసులు చేస్తారు. వృక్షము నెమ్మది-నెమ్మదిగా
వృద్ధి చెందుతుంది కదా. సెంటర్లకు ఎంతమంది వస్తారు, ఆ తర్వాత నడుస్తూ-నడుస్తూ
మాయమైపోతారు. వికారాల్లో పడిపోతే ఇక సెంటర్లకు రావడానికి కూడా సిగ్గు
అనిపిస్తుంది. ఢీలా అయిపోతారు. అటువంటివారికి అనారోగ్యం వచ్చిందని అంటారు.
తండ్రి అన్ని విషయాలను అర్థము చేయిస్తూ ఉంటారు. మీ లెక్కాపత్రాన్ని రోజూ
పెట్టుకోండి. జమ మరియు నష్టము అవుతూ ఉంటుంది, లాభము మరియు నష్టము. ఆత్మ
పవిత్రంగా అయ్యిందంటే 21 జన్మలకు జమ అయినట్లు. తండ్రి స్మృతితోనే జమ అవుతుంది.
పాపాలు తొలగిపోతాయి. ఓ పతితపావన బాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని
కూడా అంటారు కదా. మీరు వచ్చి విశ్వానికి యజమానులుగా చేయండి అని ఈ విధంగా అనరు.
ముక్తి మరియు జీవన్ముక్తి - ఈ రెండూ పావనధామాలు అని పిల్లలైన మీకు మాత్రమే
తెలుసు. మనము ముక్తి-జీవన్ముక్తుల వారసత్వాన్ని పొందుతామని మీకు తెలుసు. ఎవరైతే
బాగా చదువుకోరో వారు చివర్లో వస్తారు. స్వర్గంలోకైతే రావల్సిందే, అందరూ తమ-తమ
సమయాలలో వస్తారు. అన్ని విషయాలు అర్థము చేయించడం జరుగుతుంది. వెంటనే ఎవ్వరూ
అర్థము చేసుకోరు. ఇక్కడ మీకు తండ్రిని స్మృతి చేసేందుకు ఎంత సమయం లభిస్తుంది.
ఎవరు వచ్చినాసరే వారికి మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్పండి. ఈ
జ్ఞానాన్ని తండ్రి మాత్రమే ఇస్తారు. వారు ఆత్మలందరికీ తండ్రి. ఆత్మాభిమానులుగా
అవ్వాలి. ఆత్మ జ్ఞానాన్ని తీసుకుంటుంది, పరమాత్మ తండ్రిని స్మృతి చేస్తేనే
వికర్మలు వినాశనమౌతాయి, ఇంకా వారు సృష్టి ఆదిమధ్యాంతముల జ్ఞానాన్నిస్తారు.
రచయితను స్మృతి చేస్తేనే పాపాలు భస్మమౌతాయి. తర్వాత రచన యొక్క ఆదిమధ్యాంతాల
జ్ఞానాన్ని అర్థము చేసుకుంటే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. అంతే, ఇది మళ్ళీ
ఇతరులకు కూడా వినిపించాలి. చిత్రాలు కూడా మీ వద్ద ఉన్నాయి. ఇది రోజంతా బుద్ధిలో
ఉండాలి. మీరు విద్యార్థులు కూడా కదా. చాలామంది గృహస్థులు విద్యార్థులుగా కూడా
ఉంటారు. మీరు కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా అవ్వాలి.
సోదరీ-సోదరులకు వికారీ దృష్టి ఎప్పుడూ ఉండదు. ఇక్కడ బ్రహ్మా యొక్క ముఖవంశావళి
కదా. వికారీ దృష్టిని పవిత్రంగా చేసుకునేందుకు చాలా శ్రమ చేయవల్సి ఉంటుంది.
అర్థకల్పము నుండి అలవాటైపోయింది, దానిని తొలగించుకునేందుకు చాలా శ్రమ చేయాలి.
వికారీ దృష్టిని తొలగించుకునేందుకు ఏ పాయింటునైతే బాబా అర్థం చేయించారో, అది
చాలా కష్టమని అందరూ వ్రాస్తారు. క్షణ-క్షణము బుద్ధి వెళ్ళిపోతుంది. చాలా
సంకల్పాలు వస్తాయి. ఇప్పుడు కళ్ళను ఏం చేయాలి? సూరదాసు ఉదాహరణ చెప్తారు. వారైతే
ఒక కథను తయారుచేశారు. కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయని గ్రహించి కళ్ళను తీసేసారు.
ఇప్పుడు అలాంటి విషయం లేదు. ఈ కళ్ళు అయితే అందరికీ ఉన్నాయి కానీ వికారీగా
ఉన్నాయి, వాటిని పవిత్రంగా చేసుకోవాలి. ఇంట్లో ఉంటూ ఇది సాధ్యం కాదని మనుష్యులు
భావిస్తారు. సాధ్యపడుతుంది అని తండ్రి చెప్తున్నారు ఎందుకంటే ఇందులో చాలా-చాలా
సంపాదన ఉంటుంది. మీరు జన్మ-జన్మాంతరాలకు పదమపతులుగా అవుతారు. అక్కడ అసలు లెక్క
ఉండదు. ఈరోజుల్లో బాబా పదమపతి, పద్మావతి అని పేర్లు పెడ్తున్నారు, మీరు
లెక్కలేనంత పదమపతులుగా అవుతారు. అక్కడ అసలు లెక్కే ఉండదు. రూపాయలు-పైసలు
వెలువడినప్పుడు లెక్కపెట్టడం జరుగుతుంది. అక్కడైతే బంగారం-వెండి నాణాలు
ఉపయోగపడతాయి. ఇంతకుముందు సీతా-రాముల రాజ్యంలోని నాణాలు మొదలైనవి లభించేవి.
అంతేకానీ సూర్యవంశీ రాజ్యములోనివి ఎప్పుడూ చూడలేదు. చంద్రవంశము లోనివి చూస్తూనే
వచ్చారు. మొదట అన్నీ బంగారు నాణాలే ఉండేవి, తర్వాత వెండివి. ఈ రాగి మొదలైనవి
తర్వాత వెలువడ్డాయి. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి నుండి మళ్ళీ వారసత్వం
తీసుకుంటున్నారు. సత్యయుగంలో ఏ ఆచారాలు-పద్ధతులు నడచేది ఉంటే, అవే నడుస్తాయి.
మీరు మీ పురుషార్థం చేయండి. స్వర్గంలో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు, ఆయుష్షు
కూడా ఎక్కువగా ఉంటుంది. అకాల మృత్యువులుండవు. మనము కాలుడిపై విజయం పొందుతామని
మీరు భావిస్తారు. మరణం పేరే ఉండదు. దానిని అమరలోకమని అంటారు, ఇది మృత్యులోకం.
అమరలోకంలో హాహాకారాలు ఉండవు. ఎవరైనా వృద్ధులు మరణిస్తే ఇంకా సంతోషిస్తారు,
వెళ్ళి చిన్న బిడ్డగా అవుతారు. ఇక్కడ మరణిస్తే ఏడ్వడం మొదలుపెడతారు. మీకు ఎంత
మంచి జ్ఞానము లభిస్తుంది, ఎంత ధారణ జరగాలి. ఇతరులకు కూడా అర్థము చేయించాల్సి
ఉంటుంది. మేము ఆత్మిక సేవ చేయాలనుకుంటున్నాము అని బాబాతో ఎవరైనా అంటే, బాబా
వెంటనే చేయండి అని చెప్తారు. బాబా ఎవ్వరినీ వద్దనరు. జ్ఞానము లేదంటే ఇక అజ్ఞానమే
ఉన్నట్లు. అజ్ఞానంతో చాలా డిస్సర్వీస్ చేస్తారు. సేవ అయితే చాలా బాగా చేయాలి కదా,
అప్పుడే లాటరీ లభిస్తుంది. చాలా పెద్ద లాటరీ. ఇది ఈశ్వరీయ లాటరీ. మీరు
రాజా-రాణులుగా అయినట్లయితే మీ మనవళ్ళు-మనవరాళ్ళు అందరూ తింటూ వస్తారు. ఇక్కడైతే
ప్రతి ఒక్కరు తమ కర్మల అనుసారంగా ఫలాన్ని పొందుతారు. ఎవరైనా చాలా ధనాన్ని దానము
చేస్తే రాజుగా అవుతారు. తండ్రి పిల్లలకు అన్నీ అర్థము చేయిస్తారు. బాగా అర్థము
చేసుకోవాలి మరియు ధారణ చేయాలి. సేవ కూడా చేయాలి. వేలమంది సేవ జరుగుతుంది.
అక్కడక్కడా భక్తి భావం కలిగినవారు చాలా మంచివారు ఉంటారు. చాలా భక్తి చేసి
ఉన్నప్పుడే జ్ఞానము కూడా ఇష్టమనిపిస్తుంది. ముఖము ద్వారానే తెలిసిపోతుంది.
వింటూనే సంతోషిస్తూ ఉంటారు. ఎవరైతే అర్థము చేసుకోరో వారు అటూ-ఇటూ చూస్తూ ఉంటారు
లేక కళ్ళు మూసుకుని కూర్చుంటారు. బాబా అంతా చూస్తారు. ఎవరికైనా నేర్పించడం
లేదంటే ఏమీ అర్థము చేసుకోలేదని అర్థము. ఒక చెవితో విని మరొకదానితో వదిలేస్తారు.
ఇప్పుడు ఇది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకునే సమయం. ఎంతగా
తీసుకుంటారో, అంతగా జన్మ-జన్మాంతరాలకు కల్ప-కల్పాంతరాలకు లభిస్తుంది. లేదంటే
మళ్ళీ చివర్లో చాలా పశ్చాత్తాపపడతారు, మేము పూర్తిగా చదువుకోలేదు కనుక పదవిని
కూడా పొందలేము అని అందరికీ మళ్ళీ సాక్షాత్కారమవుతుంది. ఇక వారు వెళ్ళి ఏమౌతారు?
నౌకర్లుగా, సాధారణ ప్రజలుగా అవుతారు. రాజధాని స్థాపనౌతుంది. ఏ విధంగా చేస్తారో,
దాని అనుసారంగా ఫలం లభిస్తుంది. కొత్త ప్రపంచం కోసం కేవలం మీరు మాత్రమే
పురుషార్థము చేస్తారు. మనుష్యులు దాన-పుణ్యాలు చేస్తారు, అది కూడా ఈ ప్రపంచము
కోసం చేస్తారు, ఇది సాధారణ విషయం. మనం మంచి పని చేస్తే తర్వాత జన్మలో దానికి
మంచి ఫలం లభిస్తుంది. మీది 21 జన్మల విషయం. ఎంత వీలైతే అంత మంచి కర్మలు చేయండి,
ఆల్ రౌండర్గా అవ్వండి. మొట్టమొదట జ్ఞానీ ఆత్మలుగా మరియు యోగీ ఆత్మలుగా అవ్వాలి.
జ్ఞానీలు కూడా కావాలి, భాషణ చేసేందుకు మహారథులను పిలుస్తారు కదా. ఎవరైతే అన్ని
రకాల సేవలు చేస్తారో, వారికి పుణ్యము అయితే తప్పకుండా లభిస్తుంది.
సబ్జెక్టులున్నాయి కదా. యోగములో ఉంటూ ఏ పని చేసినా మంచి మార్కులు లభిస్తాయి.
మేము సేవ చేస్తున్నామా? లేక కేవలం తింటున్నాము, నిదురిస్తున్నామా? అని మీ మనసును
ప్రశ్నించుకోవాలి. ఇక్కడైతే ఇది చదువు, ఇంకే విషయమూ లేదు. మీరు మనుష్యుల నుండి
దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా అవుతారు. ఇదే అమరకథ, మూడవ నేత్రం కథ.
మనుష్యులంతా వెళ్ళి అసత్యమైన కథలు వింటారు. మూడవ నేత్రాన్ని తండ్రి తప్ప ఎవ్వరూ
ఇవ్వలేరు. ఇప్పుడు మీకు మూడవ నేత్రము లభించింది, దీని ద్వారా మీరు సృష్టి
ఆదిమధ్యాంతాలను తెలుసుకుంటారు. ఈ చదువులో కుమార-కుమారీలు చాలా చురుకుగా వెళ్ళాలి.
చిత్రాలు కూడా ఉన్నాయి, గీతా భగవంతుడు ఎవరు అని ఎవరినైనా అడగాలి. ఇదే ముఖ్యమైన
విషయం. భగవంతుడైతే ఒక్కరే ఉంటారు, వారి ద్వారా ముక్తిధామం యొక్క వారసత్వం
లభిస్తుంది. మనము అక్కడ నివసించేవారము, ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాము.
ఇప్పుడు పావనంగా ఎలా అవ్వాలి. పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమే. మున్ముందు
పిల్లలైన మీ స్థితి కూడా చాలా బాగా తయారవుతుంది. తండ్రి రకరకాలుగా అర్థము
చేయిస్తూ ఉంటారు. ఒకటి తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడు జన్మ-జన్మాంతరాల పాపాలు
తొలగిపోతాయి. నేను ఎంతగా స్మృతి చేస్తున్నాను? అని మీ మనసును ప్రశ్నించుకోవాలి.
చార్టు పెట్టకోవడం మంచిది, మీ ఉన్నతిని చేసుకోండి. మీపై మీరే దయ చూపించుకొని మీ
నడవడికను గమనించుకుంటూ ఉండండి. ఒకవేళ మనం తప్పులు చేస్తూ ఉన్నట్లయితే రిజిస్టరు
పాడైపోతుంది, ఇందులో దైవీ నడవడిక కావాలి. ఏది తినిపిస్తారో, ఎక్కడ కూర్చోబెడతారో,
ఏ డైరక్షన్ ఇస్తారో అదే చేస్తాము అని గాయనం కూడా ఉంది కదా. డైరక్షన్ ను
తప్పకుండా తనువు ద్వారానే ఇస్తారు కదా. గేట్ వే టు స్వర్గం (స్వర్గ ద్వారము), ఈ
పదాలు బాగున్నాయి. ఇది స్వర్గానికి వెళ్ళే ద్వారము. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పుణ్యాత్ములుగా అయ్యేందుకు ఇతర ఆశలన్నీ వదిలి బాబా మీరు ఏది తినిపిస్తారో,
ఎక్కడ కూర్చోబెడతారో, అన్నది పక్కా చేసుకోవాలి, ఎటువంటి పాపకర్మలూ చేయకూడదు.
2. ఈశ్వరీయ లాటరీని ప్రాప్తి చేసుకునేందుకు ఆత్మిక సేవలో నిమగ్నమవ్వాలి.
జ్ఞానాన్ని ధారణ చేసి ఇతరుల చేత చేయించాలి. మంచి మార్కులు తెచ్చుకునేందుకు ఏ
కర్మనైనా స్మృతిలో ఉంటూ చేయాలి.
వరదానము:-
స్నేహ బాణాల ద్వారా స్నేహంలో గాయపర్చే స్నేహము మరియు ప్రాప్తి సంపన్న లవలీన
ఆత్మా భవ
ఎలాగైతే లౌకిక రీతిలో ఎవరైనా ఎవరి స్నేహంలోనైనా లవలీనమైతే, వారి ముఖం ద్వారా,
కళ్ళ ద్వారా, వాణి ద్వారా, వీరు లవలీనమై ఉన్నారు, ప్రేయసిగా ఉన్నారు - అని
అనుభవమవుతుంది. అదే విధంగా స్టేజి పైకి వెళ్ళినప్పుడు మీ లోపల ఎంతగా తండ్రి
స్నేహము ఇమర్జ్ అయి ఉంటుందో, అంతగా ఆ స్నేహ బాణాలు ఇతరులను కూడా స్నేహములో
గాయపరుస్తాయి. భాషణ యొక్క లింకు ఆలోచించడం, పాయింట్లు రిపీట్ చెయ్యడం - ఈ
స్వరూపంగా ఉండకూడదు, స్నేహము మరియు ప్రాప్తి సంపన్న స్వరూపంగా, లవలీన స్వరూపంగా
ఉండాలి. అథారిటీగా అయి మాట్లాడడంతో దాని ప్రభావం పడుతుంది.
స్లోగన్:-
సంపూర్ణత ద్వారా సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురండి.
|
|