ఓంశాంతి. ఇలా ఎవరు చెప్పారు? అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలకు చెప్పారు. మనుషులెవరైనా అనారోగ్యంలో ఉంటే వారికి, ఓర్పు వహించండి - మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి అని ఊరట ఇవ్వడం జరుగుతుంది. వారిని సంతోషపర్చేందుకు ఊరట ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడవి హద్దు యొక్క విషయాలు. ఇది అనంతమైన విషయము, వీరికి ఎంతమంది పిల్లలుంటారు. అందరినీ దుఃఖము నుండి విడిపించాలి. ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీరిది మర్చిపోకూడదు. సర్వులకు సద్గతినిచ్చేందుకు తండ్రి వచ్చారు. వారు సర్వులకు సద్గతిదాత అని అంటున్నారంటే అందరూ దుర్గతిలో ఉన్నారని అర్థము. మొత్తం ప్రపంచములోని మనుష్యమాత్రులు, అందులో కూడా విశేషంగా భారతవాసులు మరియు మిగతా ప్రపంచంలోని వారు ఉన్నారు. విశేషంగా మీరు సుఖధామంలోకి వెళ్తారు. మిగిలినవారంతా శాంతిధామంలోకి వెళ్తారు. తప్పకుండా మనము సుఖధామంలో ఉండేవారమని, ఇతర ధర్మాలవారు శాంతిధామంలో ఉండేవారని మీ బుద్ధిలోకి వస్తుంది. బాబా వచ్చారు, భారత్ ను సుఖధామంగా చేశారు. కనుక అడ్వర్టైజ్మెంట్ కూడా ఈ విధంగా చేయాలి. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నిరాకార శివబాబా వస్తారని అర్థం చేయించాలి. వారు అందరికీ తండ్రి. మిగిలినవారంతా సోదరులు. తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు సోదరులే పురుషార్థము చేస్తారు. అంతేకానీ తండ్రులు పురుషార్థము చేస్తారని కాదు. అందరూ తండ్రులే అయితే మరి వారసత్వం ఎవరి నుండి తీసుకుంటారు? సోదరుల నుండి తీసుకుంటారా? ఇదైతే జరగదు. ఇది చాలా సహజమైన విషయమని మీరిప్పుడు అర్థం చేసుకుంటారు. సత్యయుగంలో ఒక్క దేవీ-దేవతా ధర్మము మాత్రమే ఉంటుంది. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామానికి వెళ్ళిపోతాయి. ప్రపంచ చరిత్ర-భూగోళాలు పునరావృతమవుతాయని అని అంటారు, అంటే పునరావృతమయ్యేందుకు తప్పకుండా ఒకే చరిత్ర-భూగోళాలు ఉంటాయి. కలియుగము తర్వాత మళ్ళీ సత్యయుగము వస్తుంది. రెండిటి మధ్యలో మళ్ళీ తప్పకుండా సంగమయుగము కూడా ఉంటుంది. దీనిని సుప్రీమ్ పురుషోత్తమ కళ్యాణకారి యుగమని అంటారు. ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరుచుకుంది కనుక ఇది చాలా సహజమైన విషయమని భావిస్తారు. క్రొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము. పాత వృక్షములో తప్పకుండా చాలా ఆకులు ఉంటాయి. క్రొత్త వృక్షములో ఆకులు కొద్దిగానే ఉంటాయి. అది సతోప్రధాన ప్రపంచము, దీనిని తమోప్రధానమని అంటారు. మీకు బుద్ధి తాళం కూడా నంబరువారు పురుషార్థానుసారంగా తెరుచుకుంది ఎందుకంటే అందరూ యథార్థ రీతిగా తండ్రిని స్మృతి చేయరు. కనుక ధారణ కూడా జరగదు. తండ్రి అయితే పురుషార్థము చేయిస్తారు, కానీ భాగ్యములో ఉండదు. డ్రామానుసారంగా ఎవరైతే బాగా చదువుకుని చదివిస్తారో, తండ్రికి సహాయకులుగా అవుతారో, వారే ఎట్టి పరిస్థితిలోనూ ఉన్నత పదవిని పొందుతారు. నేను ఎన్ని మార్కులతో పాస్ అవుతాను అనేది స్కూలులో విద్యార్థులు కూడా అర్థం చేసుకుంటారు. తీవ్ర వేగంతో వెళ్ళేవారు వేగంగా పురుషార్థము చేస్తారు. ఎలాగైనా పాస్ అవ్వాలని ట్యూషన్ కోసం టీచరును పెట్టుకుంటారు. ఇక్కడ కూడా చాలా గ్యాలప్ చేయాలి. స్వయం పై దయ చూపించుకోవాలి. ఈ పరిస్థితిలో ఇప్పుడు శరీరం విడిచిపెడితే ఏం పదవిని పొందుతాను? అని ఒకవేళ ఎవరైనా బాబాను అడిగితే, బాబా వెంటనే తెలియజేస్తారు. ఇది చాలా సహజంగా అర్థము చేసుకునే విషయం. హద్దు యొక్క విద్యార్థులు ఏ విధంగా అర్థము చేసుకుంటారో, అనంతమైన విద్యార్థులు కూడా అర్థము చేసుకోగలరు. పదే-పదే నా వలన ఈ తప్పులు జరుగుతున్నాయి, వికర్మలు జరుగుతున్నాయి అని బుద్ధి ద్వారా అర్థము చేసుకోగలరు. రిజిస్టరు పాడయితే రిజల్ట్ కూడా అలాగే వెలువడుతుంది. ప్రతి ఒక్కరూ తమ రిజిస్టరును పెట్టుకోవాలి. నిజానికి డ్రామానుసారముగా అంతా నిర్ణయింపబడే ఉంటుంది. మా రిజిస్టర్ అయితే చాలా పాడయిందని స్వయం కూడా అర్థము చేసుకుంటారు. ఒకవేళ అర్థము చేసుకోలేకపోతే బాబా చెప్పగలరు. స్కూలులో రిజిస్టరు మొదలైనవన్నీ పెట్టడం జరుగుతుంది. దీని గురించి అయితే ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. దీని పేరు గీతా పాఠశాల. వేద పాఠశాల అని ఎప్పుడూ అనరు. వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు మొదలైనవాటివి పాఠశాలలు అని అనరు. పాఠశాలలో, మేము భవిష్యత్తులో ఇలా అవుతామని లక్ష్యం ఉద్దేశ్యముంటుంది. ఎవరైనా వేద శాస్త్రాలు చాలా చదివినట్లయితే వారికి కూడా టైటిల్స్ లభిస్తాయి. సంపాదన కూడా జరుగుతుంది. కొందరైతే చాలా సంపాదిస్తారు కానీ అదేమీ అవినాశీ సంపాదన కాదు, తమతోపాటు రాదు. ఈ సత్యమైన సంపాదన మనతోపాటు వస్తుంది. మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. మనము చాలా-చాలా సంపాదన చేసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. మనము విశ్వానికి యజమానులుగా అవ్వగలము. సూర్యవంశీ రాజ్యములో పిల్లలు తప్పకుండా సింహాసనంపై కూర్చుంటారు. చాలా ఉన్నతమైన పదవి. మేము పురుషార్థము చేసి రాజ్య పదవిని పొందుతామని మీకు కలలో కూడా లేదు. దీనిని రాజయోగమని అంటారు. అది బ్యారిస్టరీ యోగము, డాక్టరు యోగము. చదువు మరియు చదివించేవారు గుర్తుంటారు. ఇక్కడ కూడా ఇది - సహజ స్మృతి. స్మృతిలోనే శ్రమ ఉంది. స్వయాన్ని దేహీ-అభిమానిగా భావించవలసి ఉంటుంది. ఆత్మలోనే సంస్కారాలు నిండుతాయి. చాలా మంది వచ్చి మేము అయితే శివబాబాను పూజించేవారము అని అంటారు కానీ ఎందుకు పూజ చేస్తారో వారికి తెలియదు. శివుడినే బాబా అని అంటారు. ఇంకెవ్వరినీ బాబా అని అనరు. హనుమంతుడు, గణేశుడు మొదలైనవారిని పూజిస్తారు, బ్రహ్మాకు పూజలు జరగవు. అజ్మేరులో మందిరముంది కానీ అక్కడున్న కొద్దిమంది బ్రాహ్మణులు మాత్రమే పూజిస్తూ ఉండవచ్చు. అంతేకానీ గాయనము మొదలైనవేవీ లేవు. శ్రీకృష్ణుడికి, లక్ష్మీ-నారాయణులకు ఎంత గాయనం ఉంది. బ్రహ్మాకు పేరు లేదు ఎందుకంటే బ్రహ్మా ఈ సమయంలో నల్లగా ఉన్నారు. తర్వాత బాబా వచ్చి వీరిని దత్తత తీసుకుంటారు. ఇది కూడా చాలా సహజము. కనుక తండ్రి పిల్లలకు అనేక రకాలుగా అర్థము చేయిస్తారు. శివబాబా మాకు వినిపిస్తున్నారని బుద్ధిలో ఉండాలి. వారు తండ్రి కూడా, టీచరు, గురువు కూడా. జ్ఞానసాగరుడైన శివబాబా మనల్ని చదివిస్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు త్రికాలదర్శులుగా అయ్యారు. మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రము లభిస్తుంది. ఆత్మ అవినాశీ అని కూడా మీకు తెలుసు. ఆత్మల తండ్రి కూడా అవినాశీ. ఇది కూడా ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. వారందరూ బాబా, మమ్మల్ని పతితం నుండి పావనముగా చేయండని పిలుస్తూనే ఉంటారు. మీరు వచ్చి ప్రపంచ చరిత్ర-భూగోళము గురించి వినిపించండి అని ఈ విధంగా అనరు. పతితుల నుండి పావనంగా, మళ్ళీ పావనము నుండి పతితంగా ఎలా అవుతారో బాబా స్వయంగా వచ్చి వినిపిస్తారు. చరిత్ర ఎలా రిపీట్ అవుతుందో, అది కూడా తెలియజేస్తారు. ఇది 84 జన్మల చక్రము. మనము పతితంగా ఎందుకు అయ్యాము, మళ్ళీ పావనంగా అయి ఎక్కడకు వెళ్ళాలనుకుంటున్నాము. మనుష్యులైతే సన్యాసులు మొదలైనవారి వద్దకు వెళ్ళి మనసుకు శాంతి ఎలా లభిస్తుంది? అని అడుగుతారు. అంతేకానీ, మేము సంపూర్ణ నిర్వికారిగా, పావనంగా ఎలా అవ్వాలి? అని అడగరు. అలా అడిగేందుకు సిగ్గు అనిపిస్తుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు - మీరందరూ భక్తులు. నేను భగవంతుడిని, వరుడిని. మీరు వధువులు. మీరందరూ నన్ను స్మృతి చేస్తారు. యాత్రికుడినైన నేను చాలా సుందరంగా ఉంటాను. మొత్తం ప్రపంచములోని మనుష్యమాత్రులను సుందరంగా తయారుచేస్తాను. స్వర్గమే ప్రపంచంలోని అద్భుతము. ఇక్కడ 7 అద్భుతాలను లెక్కిస్తారు. అక్కడ ప్రపంచలోని అద్భుతం స్వర్గము ఒక్కటే. తండ్రి కూడా ఒక్కరే, స్వర్గము కూడా ఒక్కటే, దానినే మనుష్యమాత్రులందరూ స్మృతి చేస్తారు. ఇక్కడైతే అద్భుతమైనది ఏదీ లేదు. ఇప్పుడు సుఖము యొక్క రోజులు రానున్నాయని పిల్లలైన మీకు ఓర్పు ఉంది.
ఈ పాత ప్రపంచం వినాశనమైనప్పుడు స్వర్గ రాజ్యం లభిస్తుందని మీరు భావిస్తారు. ఇప్పుడు ఇంకా రాజధాని స్థాపన అవ్వలేదు. అవును, ప్రజలు తయారవుతూ ఉంటారు. సేవ ఎలా వృద్ధి చెందుతుంది, అందరికీ సందేశము ఎలా ఇవ్వాలి? అని పిల్లలు పరస్పరములో సలహాలను చర్చించుకుంటూ ఉంటారు. తండ్రి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. మిగిలిన అన్నిటినీ వినాశనము చేయిస్తారు. ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి కదా. ఆ తండ్రి మనల్ని రాజ్య తిలకానికి హక్కుదారులుగా చేసి మిగిలిన వాటినన్నింటినీ వినాశనం చేయిస్తారు. ప్రాకృతిక ఆపదలు కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉన్నాయి. ఇవి లేకుండా ప్రపంచం వినాశనం అవ్వదు. ఇప్పుడు మీ పరీక్ష చాలా సమీపంగా ఉంది, మృత్యులోకము నుండి అమరలోకానికి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని తండ్రి చెప్తున్నారు. ఎంత బాగా చదువుకుంటారో మరియు చదివిస్తారో, అంత ఉన్నతమైన పదవిని పొందుతారు ఎందుకంటే మీ ప్రజలను మీరే తయారుచేసుకుంటారు. పురుషార్థము చేసి అందరి కళ్యాణం చేయాలి. దానము ఇంటి నుండే ఆరంభమవుతుంది. ఇది నియమము. మొదట మిత్ర-సంబంధీకులు, వంశస్థులు మొదలైనవారే వస్తారు. తర్వాత పబ్లిక్ వస్తారు. ప్రారంభంలో కూడా అలాగే జరిగింది. నెమ్మది-నెమ్మదిగా వృద్ధి జరిగింది, తర్వాత పిల్లలు నివసించడానికి పెద్ద భవనం తయారయింది, దానిని ఓం నివాస్ అని అనేవారు. పిల్లలు వచ్చి చదువుకోవడం ప్రారంభించారు. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది, అది మళ్ళీ రిపీట్ అవుతుంది. దీనిని ఎవ్వరూ మార్చలేరు. ఈ చదువు ఎంత ఉన్నతమైనది. స్మృతియాత్రయే ముఖ్యమైనది. ముఖ్యంగా కళ్ళే చాలా మోసం చేస్తాయి. కళ్ళు వికారీగా అయినప్పుడు శరీరములోని కర్మేంద్రియాలు చంచలమౌతాయి. ఎవరైనా అందమైన అమ్మాయిని చూస్తే, ఇక వారిలో చిక్కుకుపోతారు. ఇలాంటి కేసులు ప్రపంచంలో చాలా ఉన్నాయి. గురువులకు కూడా వికారీ దృష్టి కలుగుతుంది. ఇక్కడ వికారీ దృష్టి ఏ మాత్రము ఉండకూడదని తండ్రి చెప్తున్నారు. సోదరీ-సోదరులుగా ఉన్నప్పుడే పవిత్రంగా ఉండగలరు. మనుష్యులకు ఏం తెలుసు, వారు హేళన చేస్తారు. శాస్త్రాలలోనైతే ఈ విషయాలు ఉండవు. ఈ జ్ఞానము ప్రాయఃలోపమైపోతుంది అని తండ్రి చెప్తున్నారు. తర్వాత ద్వాపరయుగము నుండి ఈ శాస్త్రాలు మొదలైనవి తయారయ్యాయి. అల్లాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమౌతాయనే ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు 84 జన్మల చక్రము చుట్టి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీ ఆత్మ దేవతగా అవుతుంది. చిన్న ఆత్మలో 84 జన్మల అవినాశీ పాత్ర నిండి ఉంది, ఇది అద్భుతము కదా. ఇటువంటి వండర్ ఆఫ్ వర్ల్డ్ (ప్రాపంచిక అద్భుతాల) విషయాలు తండ్రి మాత్రమే వచ్చి అర్థము చేయిస్తారు. కొందరికి 84 జన్మలు, కొందరికి 50-60 జన్మల పాత్ర ఉంటుంది. పరమపిత పరమాత్మకు కూడా పాత్ర లభించింది. డ్రామానుసారంగా ఇది అనాది, అవినాశీ డ్రామా. ఎప్పుడు ప్రారంభమయిందో, ఎప్పుడు సమాప్తమౌతుందో చెప్పలేరు ఎందుకంటే ఇది అనాది, అవినాశీ డ్రామా. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇప్పుడు పరీక్షల సమయం చాలా సమీపంగా ఉంది కనుక పురుషార్థము చేసి తమ మరియు సర్వుల కళ్యాణము చేయాలి, చదువుకోవాలి మరియు చదివించాలి, దానము ఇంటి నుండే ప్రారంభమౌతుంది.
2. దేహీ-అభిమానులుగా అయి అవినాశీ, సత్యమైన సంపాదన జమ చేసుకోవాలి. మీ రిజిస్టరును పెట్టుకోవాలి. రిజిస్టరు పాడయ్యేటటువంటి వికర్మలేవీ చేయకూడదు.