28-09-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరు మొత్తం ప్రపంచానికీ సత్యాతి-సత్యమైన మిత్రులు, మీకు ఎవ్వరితోనూ శత్రుత్వము ఉండకూడదు”

ప్రశ్న:-

మీరు ఆత్మిక మిలట్రీ, మీకు తండ్రి నుండి లభించిన ఏ డైరెక్షన్ ను అమలులోకి తీసుకురావాలి?

జవాబు:-

సదా బ్యాడ్జిని ధరించి ఉండండి అని మీకు డైరెక్షన్ లభించింది. ఎవరైనా ఇదేమిటి? మీరెవరు? అని అడిగితే, మేము మొత్తం ప్రపంచం యొక్క కామాగ్నిని ఆర్పివేసే ఫైర్ బ్రిగేడ్ (అగ్నిమాపక దళము) అని చెప్పండి. ఈ సమయములో మొత్తం ప్రపంచంలో కామాగ్ని అంటుకుని ఉంది, ఇప్పుడు పవిత్రంగా అవ్వండి, దైవీ గుణాలు ధారణ చేసినట్లయితే నావ తీరానికి చేరుతుందని అందరికీ మనము సందేశాన్నిస్తాము.

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు సహజమైన స్మృతిలో కూర్చున్నారు. కొంతమందికి కష్టమనిపిస్తుంది. మేము టైట్ గా లేక స్ర్టిక్ట్ గా కూర్చోవాలని చాలామంది తికమకపడతారు. అలాంటి విషయమేమీ లేదు, ఎలాగైనా కూర్చోండి అని బాబా అంటారు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో కష్టం యొక్క విషయమేమీ లేదు. ఆ హఠయోగులు అలా టైట్ గా కూర్చుంటారు. కాళ్ళు మఠం వేసుకుని కూర్చుంటారు. ఇక్కడైతే తండ్రి విశ్రాంతిగా కూర్చోమని అంటారు. తండ్రిని మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి. ఇది ఉన్నదే సహజమైన స్మృతి. లేస్తూ-కూర్చుంటూ బుద్ధిలో ఉండాలి. చూడండి, ఎలాగైతే ఈ చిన్న పిల్లవాడు తండ్రి ప్రక్కన కూర్చున్నాడు, అతని బుద్ధిలో తల్లిదండ్రులే గుర్తుంటారు. మీరు కూడా పిల్లలే కదా. తండ్రిని స్మృతి చేయడమైతే చాలా సహజం. మనము బాబా పిల్లలము. బాబా నుండే వారసత్వము తీసుకోవాలి. శరీర నిర్వహణార్థం గృహస్థ వ్యవహారములో ఉండండి కానీ కేవలం బుద్ధి నుండి ఇతరుల స్మృతిని తొలగించండి. ఇంతకుముందు కొంతమంది హనుమంతుడిని, కొంతమంది ఇంకొకరిని, కొంతమంది సాధువులు మొదలైనవారిని స్మృతి చేసేవారు, ఆ స్మృతిని వదిలేయాలి. స్మృతి అయితే చేస్తారు కదా, పూజారులు పూజ కోసం మందిరాలకు వెళ్ళాల్సి ఉంటుంది, ఇందులో ఎక్కడకూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరు కలిసినా సరే వారికి, తండ్రి అయిన నన్నొక్కరినే స్మృతి చేయండని శివబాబా చెప్తున్నారు అని చెప్పండి. శివబాబా నిరాకారుడు కావున వారు సాకారములోకి వచ్చి నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్తున్నారు. నేను పతిత-పావనుడను. ఇది రైటు మాట కదా. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. మీరందరూ పతితులు. ఇది పతిత తమోప్రధాన ప్రపంచము కదా, అందువలన ఏ దేహధారినీ స్మృతి చేయకండి అని బాబా చెప్తున్నారు. ఇక్కడ ఏ గురువు మొదలైనవారిని మహిమ చేయరు అనేది మంచి విషయమే కదా. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు తొలగిపోతాయి అని తండ్రి చెప్తున్నారు. ఇది యోగబలము లేక యోగాగ్ని. గీతా భగవంతుడు నిరాకారుడు, కృష్ణుడి విషయం కాదు అని అనంతమైన తండ్రి సత్యమే చెప్తారు కదా. కేవలం నన్ను స్మృతి చేయండి, ఇంకే ఉపాయము లేదు అని భగవంతుడు చెప్తున్నారు. పావనంగా అయి వెళ్తే ఉన్నత పదవిని పొందుతారు లేదంటే పదవి తగ్గిపోతుంది. నేను మీకు తండ్రి సందేశాన్నిస్తున్నాను, నేను సందేశకుడను. ఇది అర్థము చేయించడంలో కష్టమేమీ ఉండదు. మాతలు, అహల్యలు, కుబ్జలు కూడా ఉన్నత పదవిని పొందవచ్చు. వారు ఇక్కడ నివసించేవారైనా లేక ఇంట్లో గృహస్థములో నివసించేవారైనా కావచ్చు. అంతేకానీ, ఇక్కడ నివసించేవారు ఎక్కువ స్మృతి చేయగలరని కాదు. బయట ఉండేవారు కూడా చాలా స్మృతిలో ఉండవచ్చు, చాలా సేవ చేయవచ్చు అని తండ్రి చెప్తున్నారు. ఇక్కడ కూడా తండ్రి ద్వారా రిఫ్రెష్ అయి వెళ్తారు, మరి లోపల ఎంత సంతోషముండాలి. ఈ ఛీ-ఛీ ప్రపంచంలో ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. తర్వాత కృష్ణపురిలోకి వెళ్తాము. కృష్ణ మందిరాన్ని కూడా సుఖధామమని అంటారు. కావున పిల్లలకు అపారమైన సంతోషముండాలి. మీరే అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు కనుక మిమ్మల్నే స్వర్గానికి యజమానులుగా చేశారు. బాబా, 5 వేల సంవత్సరాల క్రితము కూడా మేము మిమ్మల్ని కలిసాము, మళ్ళీ కలుస్తాము అని మీరు కూడా అంటారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి మాయపై విజయము పొందాలి. ఇప్పుడు ఈ దుఃఖధామంలో ఉండకూడదు. సుఖధామంలోకి వెళ్ళేందుకే మీరు చదువుకుంటున్నారు. అందరూ లెక్కాచారాలు పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళాలి. నేను కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకే వచ్చాను. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామానికి వెళ్ళిపోతాయి. నేను కాలుడికే కాలుడను, అందరినీ శరీరాల నుండి విడిపించి ఆత్మలను తీసుకువెళ్తాను అని తండ్రి చెప్తున్నారు. మేము త్వరగా వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండేదే లేదు అని అందరూ అంటారు కూడా. ఇదైతే పాత ప్రపంచము, పాత శరీరము. నేను అందరినీ తీసుకువెళ్తాను, ఎవ్వరినీ వదలను అని ఇప్పుడు తండ్రి అంటున్నారు. ఓ పతిత-పావనా రండి అని మీరందరూ పిలిచారు. గుర్తు చేసుకుంటూ ఉంటారు కానీ అర్థమేమీ తెలియదు. పతితపావనుడిని ఎంతగా తలుచుకుంటారు. మళ్ళీ రఘుపతి రాఘవ రాజా రామ్ అని అంటారు. ఇప్పుడు శివబాబా అయితే రాజుగా అవ్వరు, రాజ్యం చేయరు. వారిని రాజా రామ్ అని అనడం తప్పు. మాలను స్మరించినప్పుడు రామ-రామ అని అంటారు. అప్పుడు భగవంతుని స్మృతి కలుగుతుంది. భగవంతుడైతే శివుడు. మనుష్యులు అనేక పేర్లు పెట్టేశారు. కృష్ణునికి కూడా శ్యామసుందరుడు, వైకుంఠనాథుడు, వెన్న దొంగ మొదలైన పేర్లెన్నో పెట్టారు. మీరిప్పుడు కృష్ణుడిని వెన్నదొంగ అని అంటారా? అస్సలు అనరు. భగవంతుడు అయితే ఒక్క నిరాకారుడేనని మీరిప్పుడు తెలుసుకున్నారు, దేహధారులెవ్వరినీ భగవంతుడని అనలేము. బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా భగవంతుడని అనలేము అన్నప్పుడు మనుష్యులు స్వయాన్ని భగవంతుడని ఎలా చెప్పుకోగలరు. వైజయంతి మాల కేవలం 108 మందిది మాత్రమే గాయనం చేయబడింది. శివబాబా స్వర్గస్థాపన చేశారు, దానికి వీరు యజమానులు. తప్పకుండా గతంలో వారు ఈ పురుషార్థము చేసి ఉంటారు. దీనిని కలియుగ అంతము, సత్యయుగ ఆది అయిన సంగమయుగము అని అంటారు. ఇది కల్పము యొక్క సంగమయుగము. మనుష్యులు యుగే-యుగే అని అన్నారు, అవతారము అనే మాటను కూడా మర్చిపోయి వారిని రాయి-రప్పలలో, కణ-కణములో ఉన్నారని అనేశారు. ఇది కూడా డ్రామా. ఏ విషయమైతే గతించిందో, దానిని డ్రామా అని అంటారు. ఎవరితోనైనా కొట్లాట మొదలైనది జరిగింది, అది గడిచిపోయింది, ఇక దాని గురించి చింతన చేయకూడదు. అచ్ఛా, ఎవరో ఏదో అన్నారు, మీరు దానిని మర్చిపోండి. కల్పక్రితము కూడా ఇలాగే అన్నారు. గుర్తు పెట్టుకుంటే మళ్ళీ బాధపడతారు. ఆ విషయాన్ని ఇక మళ్ళీ ఎప్పుడూ ప్రస్తావించకూడదు కూడా. పిల్లలైన మీరు సేవ చేయాలి కదా. సేవలో విఘ్నములేవీ కలగకూడదు. సేవలో ఎటువంటి బలహీనతను చూపించకూడదు. శివబాబా సేవ కదా. ఈ సేవలో ఎప్పుడూ, నేను చెయ్యను అని అనకూడదు. లేకపోతే మీ పదవిని భ్రష్టం చేసుకుంటారు. తండ్రికి సహాయకులుగా అయ్యారు కనుక పూర్తిగా సహాయం చేయాలి. తండ్రి సేవ చేయడంలో ఏ మాత్రము మోసము చేయకూడదు. అందరికీ సందేశం ఇవ్వవలసిందే. మనుష్యులు చూసి లోపలికి దూరి వచ్చి అర్థము చేసుకునే విధంగా మ్యూజియంకు పేరు పెట్టండి అని తండ్రి చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఇది క్రొత్తది కదా. మనుష్యులు కొత్త విషయాన్ని చూసి లోపలికి దూరుతారు. భారత్ యొక్క ప్రాచీన యోగమును నేర్చుకునేందుకు ఈ రోజులలో బయట నుండి వస్తారు. ఇప్పడు ప్రాచీనము అంటే చాలా పురాతనమైనది, అది 5 వేల సంవత్సరాల క్రితం భగవంతుడే నేర్పించారు. సత్య-త్రేతా యుగాలలో యోగముండదు, ఎవరైతే నేర్పించారో వారైతే వెళ్ళిపోయారు, 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చినప్పుడే రాజయోగము నేర్పిస్తారు. ప్రాచీనము అంటే 5 వేల సంవత్సరాల క్రితము భగవంతుడు నేర్పించారు. ఆ భగవంతుడే మళ్ళీ సంగమయుగంలో వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు, దీని ద్వారా పావనంగా అవుతారు. ఈ సమయంలో తత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయి. నీరు కూడా ఎంత నష్టము కలిగిస్తూ ఉంటుంది. పాత ప్రపంచంలో ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి. సత్యయుగంలో ఉపద్రవాల మాటే ఉండదు. అక్కడైతే ప్రకృతి దాసీగా అయిపోతుంది. ఇక్కడ ప్రకృతి శత్రువుగా అయ్యి దుఃఖం ఇస్తుంది. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యములో దుఃఖమనే మాటే ఉండేది కాదు. అది సత్యయుగము. ఇప్పుడు మళ్ళీ ఆ స్థాపన జరుగుతుంది. తండ్రి ప్రాచీన రాజయోగం నేర్పిస్తున్నారు. మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత నేర్పిస్తారు, ఎవరి పాత్ర ఉంటే వారే అభినయిస్తారు. అనంతమైన తండ్రి కూడా పాత్రను అభినయిస్తున్నారు. నేను వీరిలో ప్రవేశించి, స్థాపన చేసి వెళ్ళిపోతాను అని తండ్రి అంటున్నారు. హాహాకారాల తర్వాత మళ్ళీ జయ జయకారాలు జరుగుతాయి. పాత ప్రపంచము సమాప్తమైపోతుంది. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యమున్నప్పుడు పాత ప్రపంచము లేదు. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము. లక్షల సంవత్సరాల నాటి విషయం కాదు. కనుక ఇతర విషయాలన్నీ వదిలి తమ కళ్యాణము చేసుకునేందుకు ఈ సేవలో నిమగ్నం అవ్వండి అని బాబా చెప్తున్నారు. అలిగి సేవలో మోసము చేయకూడదు. ఇది ఈశ్వరీయ సేవ. మాయ తుఫానులు చాలా వస్తాయి కానీ తండ్రి యొక్క ఈశ్వరీయ సేవలో మోసము చేయకూడదు. తండ్రి, సేవార్థం డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఎవరు వచ్చినా సరే, మీరే అందరికీ సత్యమైన మిత్రులు. బ్రహ్మాకుమార-కుమారీలైన మీరు ప్రపంచమంతటికీ మిత్రులు ఎందుకంటే మీరు తండ్రికి సహాయకులు. మిత్రులలో శత్రుత్వమేమీ ఉండకూడదు. ఏ విషయము వచ్చినా సరే, శివబాబాను స్మృతి చేయమని చెప్పండి. తండ్రి శ్రీమతాన్ని అనుసరించడంలో నిమగ్నమవ్వాలి. లేకపోతే స్వయాన్ని నష్టపర్చుకుంటారు. మీరు ట్రైన్ లో వస్తారు, అక్కడైతే అందరూ ఫ్రీగా ఉంటారు. ఇది సేవ చేసేందుకు చాలా మంచి అవకాశము. బ్యాడ్జ్ అయితే చాలా మంచి వస్తువు. ప్రతి ఒక్కరు ధరించి ఉండాలి. మీరు ఎవరు అని ఎవరైనా అడిగితే, మేము అగ్నిమాపక దళము అని చెప్పండి, ఆ ప్రపంచంలో అగ్నిని ఆర్పేందుకు అక్కడ అగ్నిమాపక దళము ఉంటుంది కదా. ఈ సమయంలో మొత్తం సృష్టిలో అందరూ కామాగ్నిలో కాలిపోతున్నారు. కామము మహాశత్రువుపై విజయము పొందండి అని ఇప్పుడు తండ్రి అంటున్నారు. తండ్రిని స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి, దైవీ గుణాలు ధారణ చేయండి, అప్పుడు నావ తీరానికి చేరుకుంటుంది. ఈ బ్యాడ్జి శ్రీమతంతోనే తయారు చేయబడింది. బ్యాడ్జిపై సేవ చేసే పిల్లలు చాలా కొద్దిమందే ఉన్నారు. బాబా మురళీలలో ఎంతగా అర్థము చేయిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క బ్రాహ్మణుని వద్ద ఈ బ్యాడ్జి ఉండాలి, వీరు తండ్రి, వీరిని స్మృతి చేయాలి అని ఎవరు కలిసినా వారికి దీనిపై అర్థం చేయించాలి. మనము సాకారుని మహిమ చేయము. సర్వుల సద్గతిదాత ఒక్క నిరాకార తండ్రి మాత్రమే, వారిని స్మృతి చేయాలి. స్మృతిబలముతోనే మీ పాపాలు సమాప్తమౌతాయి. ఇక తర్వాత అంతిమతి సో గతి అవుతుంది. దుఃఖధామం నుండి ముక్తులైపోతారు. మళ్ళీ మీరు విష్ణుపురిలోకి వచ్చేస్తారు. ఇది ఎంత గొప్ప శుభవార్త. వారికి లిటరేచర్ కూడా ఇవ్వవచ్చు. మీరు పేదవారైతే ఉచితముగా ఇవ్వగలము అని చెప్పండి. షావుకారులైతే ధనం ఇవ్వాల్సిందే ఎందుకంటే ఇవి ఎక్కువ సంఖ్యలో ముద్రించడం జరుగుతుంది. ఈ వస్తువులు ఎటువంటివి అంటే వీటి ద్వారా మీరు ఫకీరు నుండి విశ్వానికి యజమానులుగా అవుతారు. జ్ఞానము యొక్క వివరణ అయితే లభిస్తూనే ఉంటుంది. ఏ ధర్మమువారైనా సరే, వారికి, మీరు వాస్తవానికి ఆత్మలు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని చెప్పండి. ఇప్పుడు వినాశనము ఎదురుగా నిలబడి ఉంది, ఈ ప్రపంచము మారనున్నది. శివబాబాను స్మృతి చేసినట్లయితే విష్ణుపురిలోకి వచ్చేస్తారు. ఇది కోట్ల పదమాల విలువగల వస్తువు, ఇది మీకిస్తున్నాము అని చెప్పండి. బ్యాడ్జి పై సేవ చేయాలని బాబా ఎంతగా అర్థం చేయించారు కానీ బ్యాడ్జి ధరించరు. సిగ్గుపడతారు. బ్రాహ్మణీలు పార్టీని తీసుకుని వచ్చినప్పుడు లేదా ఆఫీసు మొదలైన చోట్లకు ఒంటరిగా వెళ్ళినప్పుడు, ఈ బ్యాడ్జి తప్పకుండా ధరించి ఉండాలి, దీనిపై మీరు ఎవరికి అర్థం చేయించినా వారు చాలా సంతోషిస్తారు. మేము ఒక్క తండ్రినే నమ్ముతాము, వారే అందరికీ సుఖ-శాంతులనిచ్చేవారు, వారినే స్మృతి చేయండి అని వారికి చెప్పండి. పతితాత్మలైతే వెళ్ళలేవు. ఇప్పుడు ఈ పాత ప్రపంచము మారుతుంది. ఈ విధంగా దారిలో సేవ చేస్తూ రావాలి. మీ పేరు ప్రసిద్ధి చెందుతుంది. బ్యాడ్జి ధరించి సేవ చేయడం లేదంటే బహుశా సిగ్గుగా అనిపిస్తుందేమోనని బాబా భావిస్తారు. ఒకటి బ్యాడ్జి, ఇంకా మెట్ల చిత్రము మరియు త్రిమూర్తి, సృష్టి చక్రం మరియు కల్పవృక్ష చిత్రాలు మీతోపాటే ఉండాలి, పరస్పరం కూర్చొని ఒకరికొకరు అర్థం చేయించుకుంటూ ఉంటే అందరూ వచ్చి చేరుతారు. ఇది ఏమిటి అని అడుగుతారు. శివబాబా వీరి ద్వారా ఈ కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారని చెప్పండి. నన్ను స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. అపవిత్రమైనవారు తిరిగి వెళ్ళలేరు. ఇటువంటి మధురాతి-మధురమైన విషయాలను వినిపించాలి, అప్పుడు అందరూ సంతోషంగా వింటారు. కానీ ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. సెంటరుకు క్లాసుకు వెళ్తున్నా కూడా బ్యాడ్జి ధరించి ఉండాలి. మిలటరీ వాళ్ళకు ఇక్కడ బ్యాడ్జి ఉంటుంది. వారికి ఎప్పుడైనా సిగ్గుగా అనిపిస్తుందా? మరి మీరు కూడా ఆత్మిక మిలటరీ కదా. తండ్రి డైరక్షన్ ఇస్తున్నారు, అయినా ఎందుకు అమలు పరచరు. బ్యాడ్జి ధరించినట్లయితే మేము శివబాబా పిల్లలమని శివబాబా స్మృతి కూడా కలుగుతూ ఉంటుంది. రోజు-రోజుకూ సెంటర్లు కూడా తెరవబడుతూ ఉంటాయి. ఎవరో ఒకరు వెలువడుతూ ఉంటారు. ఫలానా నగరంలో మీ బ్రాంచి లేదు అని చెప్తారు. ఒకవేళ ఎవరైనా ఇల్లు మొదలైనవి ఏర్పాటు చేసి, ఆహ్వానము ఇస్తే మేము వచ్చి సేవ చేస్తాము అని చెప్పండి. పిల్లలు ధైర్యము చేస్తే తండ్రి సహాయము చేస్తారు. సెంటరు తెరవండి, సేవ చేయండి అని తండ్రి పిల్లలకే చెప్తారు. ఇవన్నీ శివబాబా దుకాణాలే కదా. పిల్లల ద్వారా నడిపిస్తున్నారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎప్పుడూ పరస్పరము అలిగి సేవలో మోసము చేయకూడదు. విఘ్నరూపంగా అవ్వకూడదు. మీ బలహీనతలను చూపించకూడదు. తండ్రికి పూర్తిగా సహాయకులుగా అవ్వాలి.

2. ఎప్పుడైనా ఎవరితోనైనా కోట్లాడి ఉంటే, అది ఇక గడిచిపోయింది, దాని చింతన చేయకూడదు. ఎవరో ఏదో అన్నారు, మీరు దానిని మర్చిపోండి. కల్పక్రితము కూడా ఇలాగే అన్నారు. ఆ విషయాన్ని ఇక మళ్ళీ ఎప్పుడూ ప్రస్తావించకూడదు కూడా.

వరదానము:-

గతించిపోయిన విషయాలను దయా హృదయులై ఇముడ్చుకునే శుభచింతక భవ

ఒకవేళ ఎవరైనా, ఎవరివైనా గతించిపోయిన బలహీనత యొక్క విషయాలను వినిపిస్తే, మీరు శుభభావనతో పక్కకు వచ్చేసేయండి. వ్యర్థ చింతన మరియు బలహీనత యొక్క విషయాలు పరస్పరము మాట్లాడుకోకూడదు. గతించిన విషయాలను దయా హృదయులై ఇముడ్చుకోండి. ఇముడ్చుకుని ఆ ఆత్మ పట్ల శుభ భావనతో మనసా సేవ చేస్తూ ఉండండి. సంస్కారాలకు వశమై ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, చేసినా లేక విన్నా, వాటిని పరివర్తన చేయండి. ఒకరి నుండి రెండవవారి వరకు, రెండవవారి నుండి మూడవవారి వరకు, అలా వ్యర్థ విషయాల మాలగా అవ్వకూడదు. ఇటువంటి అటెన్షన్ పెట్టడం అనగా శుభ చింతకులుగా అవ్వడం.

స్లోగన్:-

సంతుష్టమణులుగా అయినట్లయితే ప్రభు ప్రియులుగా, లోక ప్రియులుగా మరియు స్వయం ప్రియులుగా అవుతారు.