ఓంశాంతి. మనము సత్యమైన తీర్థ వాసులమని మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు. వారు సత్యమైన పండా మరియు వారి పిల్లలైన మనము కూడా సత్యమైన తీర్థస్థానానికి వెళ్తున్నాము. ఇది అసత్య ఖండము, పతిత ఖండము. ఇప్పుడు సత్య ఖండము, పావన ఖండములోకి వెళ్తున్నాము. మనుష్యులు యాత్రలకు వెళ్తారు కదా. కొన్ని-కొన్ని విశేషమైన యాత్రలుంటాయి, అక్కడకు ఎప్పుడైనా ఎవ్వరైనా వెళ్ళవచ్చు. ఇది కూడా యాత్రనే, సత్యమైన పండా స్వయంగా వచ్చినప్పుడే అక్కడకు వెళ్ళడం జరుగుతుంది. వారు కల్ప-కల్పము సంగమయుగములోనే వస్తారు. ఇందులో చలి, వేడి విషయమేమీ లేదు. ఎదురుదెబ్బలు తినే విషయము లేదు. ఇది స్మృతియాత్ర. ఆ యాత్రలకు సన్యాసులు కూడా వెళ్తారు. సత్యాతి-సత్యమైన యాత్ర చేసేవారు పవిత్రంగా ఉంటారు. మీలో కూడా అందరూ యాత్రలో ఉన్నారు. మీరు బ్రాహ్మణులు. సత్యాతి-సత్యమైన బ్రహ్మాకుమార-కుమారీలు ఎవరు? ఎవరైతే ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళరో వారు. మీరందరూ తప్పకుండా పురుషార్థీలే. మనసులో సంకల్పాలు వచ్చినాకానీ, ముఖ్యమైన విషయమేమిటంటే వికారాల్లోకి వెళ్ళకూడదు. మీ వద్ద నిర్వికారీ బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు అని ఎవరైనా అడిగితే, ఈ విషయం అడగవలసిన అవసరము లేదు, ఈ విషయాలతో మీకేం కడుపు నిండుతుంది అని చెప్పండి. మీరు యాత్రికులుగా అవ్వండి. యాత్ర చేసేవారు ఎంత మంది ఉన్నారని అడగడం వలన ఎటువంటి లాభముండదు. బ్రాహ్మణులలో సత్యమైనవారు కూడా ఉన్నారు, అసత్యమైనవారు కూడా ఉన్నారు. నేడు సత్యంగా ఉంటారు, రేపు అసత్యంగా అయిపోతారు. వికారాలలోకి వెళ్తే వారు ఇక బ్రాహ్మణులు కారు. మళ్ళీ పూర్తిగా శూద్రులుగా అయిపోతారు. నేడు ప్రతిజ్ఞ చేసి రేపు వికారాలలో పడిపోయి అసురులుగా అయిపోతారు. ఇప్పుడు ఈ విషయాలను ఎంతవరకు కూర్చొని అర్థం చేయించాలి. వీటి ద్వారా కడుపు నిండదు, నోరు తీపి కాదు. ఇక్కడ మనము తండ్రిని స్మృతి చేస్తాము మరియు తండ్రి రచన యొక్క ఆదిమధ్యాంతాలు తెలుసుకుంటాము. ఇక ఇతర విషయాలలో ఏమీ లేదు. ఇక్కడ తండ్రిని స్మృతి చేయడం నేర్పించబడుతుంది మరియు పవిత్రత ముఖ్యమైనది అని చెప్పండి. ఎవరైతే ఈరోజు పవిత్రంగా అయి మళ్ళీ అపవిత్రంగా అయిపోతారో, వారు అసలు బ్రాహ్మణులే కాదు. ఆ లెక్కను కూర్చుని మీకు ఎంతవరకు వినిపించాలి. ఇలా చాలామంది మాయా తుఫానుల్లో పడిపోతూ ఉంటారు, అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు. మనము సందేశకుని పిల్లలము, సందేశాన్ని వినిపిస్తాము, మెసంజర్ పిల్లలం మెసేజ్ ఇస్తాము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్నితో వికర్మలు వినాశనమౌతాయి. ఈ చింతను పెట్టుకోండి. అయితే అనేకమంది మనుష్యులు ప్రశ్నలు అడుగుతారు. ఒక్క విషయం గురించి తప్ప ఇంకే విషయంలోకి వెళ్ళినా లాభమేమీ ఉండదు. నాథుడి నుండి వారసత్వం పొందడం కోసం నాస్తికుల నుండి ఆస్తికులుగా, అనాథల నుండి నాథునికి చెందినవారిగా ఎలా అవ్వాలి అనేది ఇక్కడ తెలుసుకోవాలి, ఈ విషయం మీరు అడగండి. ఇకపోతే, అందరూ పురుషార్థీలే. వికారాల విషయములోనే చాలా మంది ఫెయిల్ అవుతారు. చాలా రోజుల తర్వాత స్త్రీని చూసినట్లయితే ఇక అడగకండి. కొందరికి మద్యం యొక్క అలవాటు ఉంటుంది, మద్యం లేక బీడి అలవాటు ఉన్నవారు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా అవి లేకుండా ఉండలేరు. దాచి పెట్టుకొని కూడా తాగుతారు. ఎవరైనా ఏం చెయ్యగలరు. సత్యము చెప్పనివారు చాలా మంది ఉన్నారు. దాచిపెడుతూ ఉంటారు.
యుక్తిగా సమాధానాలు ఎలా ఇవ్వాలో బాబా పిల్లలకు యుక్తులు తెలియజేస్తున్నారు. మనుష్యులు ఆస్తికులుగా అయ్యే విధంగా ఒక్క తండ్రి పరిచయమునే ఇవ్వాలి. ఎప్పటివరకైతే తండ్రిని మొదట తెలుసుకోరో, అప్పటివరకు ప్రశ్నలు అడగడమే వ్యర్థము. అలాంటివారు చాలామంది వస్తారు, కొంచెము కూడా అర్థము చేసుకోరు. కేవలం వింటూ ఉంటారు, ఏ లాభమూ ఉండదు. వెయ్యి, రెండు వేల మంది వచ్చారు అని బాబాకు రాస్తారు, వారిలో ఒకరిద్దరు అర్థము చేసుకునేందుకు వస్తూ ఉంటారు. ఫలానా-ఫలానా గొప్ప వ్యక్తి వస్తున్నారు, వారికి ఏ పరిచయము అయితే లభించాలో అది లభించలేదని అర్థమవుతుంది. పూర్తి పరిచయము లభించినట్లయితే, ఆత్మలైన మన తండ్రి పరమపిత పరమాత్మ, వారు చదివిస్తున్నారు అని వీరు సరైన మాట చెప్తున్నారని భావిస్తారు. బాబా చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. ఈ అంతిమ జన్మ పవిత్రంగా అవ్వండి. ఎవరైతే పవిత్రంగా ఉండరో, వారు బ్రాహ్మణులు కాదు, శూద్రులు. ఇది యుద్ధ మైదానము. వృక్షము వృద్ధి అవుతూ ఉంటుంది మరియు తుఫానులు కూడా వస్తాయి. చాలా ఆకులు రాలిపోతూ ఉంటాయి. సత్యమైన బ్రాహ్మణులు ఎవరు అని ఎవరు కూర్చొని లెక్కపెడతారు. ఎవరైతే ఎప్పుడూ శూద్రులుగా అవ్వరో, ఎవరికైతే కొద్దిగా కూడా దృష్టి ఎటూ వెళ్ళదో, వారే సత్యమైనవారు. అంతిమంలో కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. మనస్సులో కూడా రాకూడదు, ఆ స్థితి చివర్లో వస్తుంది. ఈ సమయంలో అటువంటి స్థితి ఒక్కరికి కూడా లేదు. ఈ సమయంలో అందరూ పురుషార్థీలు. కిందా-మీదా అవుతూ ఉంటారు. కళ్ళ విషయమే ముఖ్యమైనది. నేను ఆత్మను, ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తున్నాను - ఈ అభ్యాసము పక్కాగా ఉండాలి. రావణ రాజ్యము ఉన్నంతవరకు, యుద్ధము నడుస్తూ ఉంటుంది. చివర్లో కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. ఈ విషయములో మీకు మున్ముందు ఫీలింగ్ కలుగుతుంది, ఇది అర్థము చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే వృక్షము చాలా చిన్నది, తుఫానులు వస్తాయి. ఆకులు రాలిపోతాయి. కచ్చాగా ఉన్నవారు పడిపోతారు. నా స్థితి ఎంతవరకు తయారయ్యింది అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. మిగితా ఏవైతే ప్రశ్నలు అడుగుతారో, ఆ విషయాలలోకి ఎక్కువగా వెళ్ళకండి. మేము తండ్రి శ్రీమతంపై నడుస్తున్నాము అని చెప్పండి. ఆ అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సుఖమునిస్తారు మరియు కొత్త ప్రపంచ స్థాపన చేస్తారు. అక్కడ సుఖమే ఉంటుంది. ఎక్కడైతే మనుష్యులుంటారో దానినే ప్రపంచమని అంటారు. నిరాకారీ ప్రపంచములో ఆత్మలుంటాయి కదా. ఆత్మ ఏ విధంగా బిందువులా ఉంటుందో, ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. ఇది కూడా కొత్తవారెవ్వరికీ మొదటే అర్థం చేయించకూడదు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్నిస్తారని మొట్టమొదట అర్థము చేయించాలి. భారత్ పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా ఉంది. కలియుగము తర్వాత మళ్ళీ సత్యయుగము రావాలి. బి.కె.లు తప్ప ఈ విషయాలు వేరెవ్వరూ అర్థం చేయించలేరు. ఇది కొత్త రచన. తండ్రి చదివిస్తున్నారు, ఈ వివరణ బుద్ధిలో ఉండాలి. కష్టమైన విషయమేమీ కాదు కానీ మాయ మరిపింపజేస్తుంది, వికర్మలు చేయిస్తుంది. అర్థకల్పము నుండి వికర్మలు చేసే అలవాటైపోయింది. ఆ ఆసురీ అలవాట్లన్నీ తొలగించుకోవాలి. అందరూ పురుషార్థీలు అని బాబా స్వయంగా చెప్తున్నారు. కర్మాతీత స్థితిని పొందడానికి చాలా సమయము పడుతుంది. బ్రాహ్మణులు ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళరు. యుద్ధ మైదానంలో నడుస్తూ-నడుస్తూ ఓటమి పొందుతారు. ఈ ప్రశ్నల వల్ల లాభమేమీ ఉండదు. మొదట మీ తండ్రిని స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి అని మనకు శివబాబా కల్పక్రితము వలె ఆజ్ఞాపించారు. ఇది అదే యుద్ధము. తండ్రి ఒక్కరే, కృష్ణుడిని తండ్రి అని అనరు. కృష్ణుడి పేరు రాసేశారు. రాంగ్ ను రైట్ గా తయారుచేసేవారు తండ్రి, అందుకే వారిని ట్రూత్ అని అంటారు కదా. ఈ సమయంలో పిల్లలైన మీకు మాత్రమే మొత్తం సృష్టి రహస్యం తెలుసు. సత్యయుగంలో దైవీ రాజ్యముంటుంది. రావణరాజ్యంలో మళ్ళీ ఆసురీ రాజ్యముంటుంది. సంగమయుగాన్ని స్పష్టము చేసి చూపించాలి, ఇది పురుషోత్తమ సంగమయుగము. అటువైపు దేవతలు, ఇటువైపు అసురులు ఉన్నారు. కానీ వారి యుద్ధము జరగలేదు. బ్రాహ్మణులైన మీకు వికారాలతో యుద్ధము జరుగుతుంది, దీనిని కూడా యుద్ధమని అనరు. అన్నిటికన్నా పెద్దది కామ వికారము, ఇది మహాశత్రువు. దీనిపై విజయము పొందడం ద్వారానే మీరు జగత్ జీతులుగా అవుతారు. ఈ విషము గురించే అబలలు దెబ్బలు తింటూ ఉంటారు. అనేక రకాలైన విఘ్నాలు వస్తాయి. ముఖ్యమైన విషయము పవిత్రతకు సంబంధించినది. పురుషార్థము చేస్తూ-చేస్తూ, తుఫానులు వస్తూ-వస్తూ మీకు గెలుపు లభిస్తుంది. మాయ అలసిపోతుంది. కుస్తీలో పహల్వాన్లు ఉంటారు, వారు వెంటనే ఎదుర్కొంటారు. బాగా పోరాడి విజయము పొందడమే వారి వృత్తి. పహల్వాన్ కు చాలా పేరు లభిస్తుంది. బహుమానము లభిస్తుంది. మీ ఈ విషయమైతే గుప్తమైనది.
ఆత్మలమైన మేము పవిత్రంగా ఉండేవారము, ఇప్పుడు అపవిత్రంగా అయ్యాము, మళ్ళీ పవిత్రంగా అవ్వాలి అని మీకు తెలుసు. ఈ సందేశాన్నే అందరికీ ఇవ్వాలి, ఇక వేరే ఏ ప్రశ్నలు అడిగినా, మీరు ఆ విషయాల్లోకి అసలు వెళ్ళకండి. మీది ఆత్మిక వ్యాపారం. ఆత్మలమైన మనలో బాబా జ్ఞానము నింపారు, తర్వాత ప్రారబ్ధాన్ని పొందాము, అప్పుడు జ్ఞానము సమాప్తమైపోయింది. ఇప్పుడు బాబా మళ్ళీ జ్ఞానము నింపుతున్నారు. ఇక నషాలో ఉండండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే కళ్యాణము జరుగుతుందనే తండ్రి సందేశాన్ని ఇస్తున్నాము అని చెప్పండి. ఇదే మీ ఆత్మిక వ్యాపారము. తండ్రిని తెలుసుకోవడమే మొట్టమొదటి విషయము. తండ్రియే జ్ఞానసాగరుడు. వారేమీ పుస్తకాలు చదివి వినిపించరు. ఎవరైతే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ మొదలైనవారిగా అవుతారో, వారు పుస్తకాలు చదువుతారు. భగవంతుడు అయితే నాలెడ్జ్ ఫుల్. వారికి సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. వారు ఏమైనా చదివారా? వారికి వేద-శాస్త్రాలు మొదలైనవన్నీ తెలుసు. మీకు జ్ఞానాన్ని అర్థం చేయించడమే నా పాత్ర అని బాబా చెప్తున్నారు. జ్ఞానానికి మరియు భక్తికి గల తేడాను ఇతురులెవ్వరూ తెలియజేయలేరు. ఇది జ్ఞానం యొక్క చదువు. భక్తిని జ్ఞానమని అనరు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. ప్రపంచం యొక్క చరిత్ర తప్పకుండా పునరావృతమవుతుంది. పాత ప్రపంచము తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచము తప్పకుండా వస్తుంది. బాబా మనల్ని మళ్ళీ చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. నన్ను స్మృతి చేయండి, తీవ్రత అంతా ఇందులోనే ఉంది అని తండ్రి చెప్తున్నారు. చాలా మంచి-మంచి పేరు గాంచిన పిల్లలు ఈ స్మృతియాత్రలో చాలా బలహీనంగా ఉన్నారు, మరియు పేరు లేనివారు, బంధనములో ఉన్నవారు, పేదవారు స్మృతియాత్రలో చాలా ఉంటారు అని బాబాకు తెలుసు. నేను బాబాను ఎంత సమయము స్మృతి చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ తమ మనసును ప్రశ్నించుకోండి. పిల్లలూ, ఎంత వీలైతే అంత మీరు నన్ను స్మృతి చేయండి, లోపల చాలా హర్షితంగా ఉండండి అని బాబా చెప్తున్నారు. భగవంతుడు చదివిస్తున్నారు అంటే ఎంత సంతోషముండాలి. మీరు పవిత్రమైన ఆత్మలుగా ఉండేవారు, తర్వాత శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ పతితంగా అయిపోయారని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. తర్వాత అదే దైవీ పాత్రను అభినయించాలి. మీరు దైవీ ధర్మానికి చెందినవారు కదా. మీరే 84 జన్మల చక్రములో తిరిగారు. సూర్యవంశీయులందరూ 84 జన్మలు తీసుకోరు. వెనుక వస్తూ ఉంటారు కదా. లేదంటే అందరూ వెంటనే వచ్చేస్తారు. ఉదయమే లేచి బుద్ధిని ఉపయోగించినట్లయితే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. పిల్లలే విచార సాగర మథనము చేయాలి. శివబాబా అయితే చేయరు. బాబా అంటున్నారు - డ్రామానుసారంగా నేను ఏదైతే వినిపిస్తున్నానో, అది కల్పక్రితము అర్థం చేయించినదే మళ్ళీ అర్థం చేయిస్తున్నాను అని మీరు భావించండి. మీరు మథనము చేస్తారు. మీరే అర్థం చేయించాలి, జ్ఞానమునివ్వాలి. ఈ బ్రహ్మా కూడా మథనము చేస్తారు. బి.కె.లు మథనము చేయాలి, శివబాబా కాదు. ముఖ్యమైన విషయము, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకూడదు. శాస్త్రవాదులు పరస్పరము చాలా వాదిస్తారు, మీరు వాద-వివాదము చేయకూడదు. మీరు కేవలం సందేశమునివ్వాలి. కేవలం ముఖ్యమైన ఒకే విషయము గురించి మొదట అర్థం చేయించండి మరియు వ్రాయించండి. ఎవరు చదివిస్తున్నారు అన్న మొట్టమొదటి పాఠాన్ని రాయండి. ఈ విషయాన్ని మీరు చివర్లోకి తీసుకువెళ్తారు, అందుకే సంశయము కలుగుతూ ఉంటుంది. నిశ్చయబుద్ధి కలవారిగా లేని కారణంగా అర్థము చేసుకోరు. ఈ విషయము కరెక్టు అని కేవలం అంటారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయమే ఇది. రచయిత అయిన తండ్రిని తెలుసుకోండి, తర్వాత రచన యొక్క రహస్యాన్ని అర్థము చేసుకోండి. ముఖ్యమైన విషయము, గీతా భగవంతుడు ఎవరు? మీ విజయము కూడా ఇందులోనే ఉండాలి. మొట్టమొదట ఏ ధర్మము స్థాపన చేయబడింది? పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా ఎవరు తయారుచేస్తారు. తండ్రియే ఆత్మలకు కొత్త జ్ఞానాన్ని వినిపిస్తారు, దీని ద్వారా కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది. మీకు తండ్రి మరియు రచనల పరిచయము లభిస్తుంది. మొట్టమొదట అల్లా గురించి పక్కా చేయించండి, అప్పుడు రాజ్యాధికారం దానంతట అదే లభిస్తుంది. తండ్రి నుండే వారసత్వము లభిస్తుంది. తండ్రిని తెలుసుకోవడం అంటే వారసత్వానికి హక్కుదారులుగా అవ్వడము. బిడ్డ జన్మ తీసుకుంటాడు, తల్లిదండ్రులను చూస్తాడు, అంతే, సంబంధము పక్కా అయిపోతుంది. తల్లిదండ్రుల వద్దకు తప్ప ఎవ్వరి వద్దకు వెళ్ళడు కూడా ఎందుకంటే తల్లి నుండి పాలు లభిస్తాయి. ఇక్కడ కూడా జ్ఞానమనే పాలు లభిస్తాయి. వీరు తల్లిదండ్రులు కదా. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు, త్వరగా ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సత్యాతి-సత్యమైన, పవిత్రమైన బ్రాహ్మణులుగా అవ్వాలి, ఎప్పుడూ శూద్రులుగా (పతితులుగా) అయ్యే ఆలోచన మనసులో కూడా రాకూడదు, కొద్దిగా కూడా దృష్టి వెళ్ళకూడదు, ఇటువంటి స్థితిని తయారుచేసుకోవాలి.
2. తండ్రి ఏదైతే చదివిస్తున్నారో, ఆ వివరణను బుద్ధిలో ఉంచుకోవాలి. వికర్మలు చేసే ఆసురీ అలవాట్లు ఏవైతే ఉన్నాయో, వాటిని తొలగించాలి. పురుషార్థము చేస్తూ-చేస్తూ సంపూర్ణ పవిత్రత యొక్క ఉన్నతమైన గమ్యాన్ని ప్రాప్తి చేసుకోవాలి.