ఓంశాంతి. ఆత్మిక పిల్లలు (ఆత్మలు) శరీరము ద్వారా పాట విన్నారా? ఎందుకంటే తండ్రి ఇప్పుడు పిల్లలను ఆత్మాభిమానులుగా చేస్తున్నారు. మీకు ఆత్మ యొక్క జ్ఞానము కూడా లభిస్తుంది. ప్రపంచంలో ఆత్మ గురించిన సరైన జ్ఞానమున్నవారు ఒక్కరు కూడా లేరు. మరి అటువంటప్పుడు పరమాత్మ జ్ఞానం వారికి ఎలా ఉంటుంది? ఇది తండ్రి మాత్రమే కూర్చొని అర్థం చేయిస్తారు. శరీరము ద్వారానే అర్థం చేయించాలి. శరీరము లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. మనము ఎక్కడ నివసించేవారము, ఎవరి పిల్లలము అనేది ఆత్మకు తెలుసు. ఇప్పుడు మీరు యథార్థంగా తెలుసుకున్నారు. నటులందరూ పాత్రధారులు. వేర్వేరు ధర్మాల ఆత్మలు ఎప్పుడు వస్తారు అనేది కూడా మీ బుద్ధిలో ఉంది. తండ్రి వివరంగా అర్థం చేయించరు. హోల్ సేల్ గా అర్థం చేయిస్తారు. హోల్ సేల్ అంటే ఒక్క క్షణంలోనే ఏ విధంగా అర్థం చేయిస్తారంటే, ఇక సత్యయుగం ఆది నుండి మొదలుకొని అంతిమం వరకు మన పాత్ర ఎలా నిర్ణయింపబడిందో తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు తండ్రి ఎవరు, ఈ డ్రామాలో వారి పాత్ర ఏమిటి అన్నది తెలుసు. తండ్రి ఉన్నతాతి ఉన్నతమైనవారు, సర్వుల సద్గతిదాత, దుఃఖహర్త సుఖకర్త అని కూడా తెలుసు. శివజయంతి గాయనం చేయబడింది. శివజయంతి అన్నిటికన్నా ఉన్నతమైనదని తప్పకుండా అంటారు. విశేషంగా భారత్ లోనే జయంతిని జరుపుకుంటారు. ఎవరెవరి రాజ్యాలలో ఏయే ఉన్నత పురుషుల గత చరిత్ర బాగుంటుందో, వారి స్టాంపులు కూడా తయారుచేస్తారు. ఇప్పుడు శివజయంతిని కూడా జరుపుకుంటారు. అందరికన్నా ఉన్నతమైన జయంతి ఎవరిది అన్నది అర్థం చేయించాలి. ఎవరి స్టాంపు తయారుచేయాలి? ఏ విధంగా రాణా ప్రతాప్ మొదలైనవారి స్టాంపులు కూడా తయారుచేస్తారో, అదే విధంగా సాధు-సత్పురుషులలో లేక సిక్కులలో, ముసల్మానులలో లేక ఆంగ్లేయులలో, ఎవరైనా మంచి ఫిలాసఫర్ ఉంటే వారి స్టాంపులు తయారుచేస్తూ ఉంటారు. ఇప్పుడు వాస్తవానికి అందరి సద్గతిదాత అయిన తండ్రి స్టాంపు ఉండాలి. ఈ సమయంలో తండ్రి రాకపోతే సద్గతి ఎలా జరుగుతుంది ఎందుకంటే అందరూ రౌరవ నరకంలో మునకలు వేస్తున్నారు. అందరికన్నా ఉన్నతాతి ఉన్నతమైనవారు శివబాబా, పతిత-పావనుడు. శివుని మందిరాలు కూడా చాలా ఎత్తైన స్థానాలలో నిర్మిస్తారు ఎందుకంటే వారు ఉన్నతాతి ఉన్నతమైనవారు కదా. తండ్రియే వచ్చి భారత్ ను స్వర్గానికి యజమానిగా చేస్తారు. వారు వచ్చినప్పుడు సద్గతి చేస్తారు కనుక ఆ తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. శివబాబా స్టాంపును కూడా ఎలా తయారుచేయాలి? భక్తిమార్గములోనైతే శివలింగాన్ని తయారుచేస్తారు. వారే ఉన్నతాతి ఉన్నతమైన ఆత్మ. ఉన్నతాతి ఉన్నతమైన మందిరాలు కూడా శివునివేనని భావిస్తారు. సోమనాథ మందిరము శివునిదే కదా. తమోప్రధానంగా అయిన కారణంగా శివుడు ఎవరు అన్నది కూడా భారతవాసులకు తెలియదు, ఎవరినైతే పూజిస్తున్నారో, వారి వృత్తి గురించి తెలియదు. రాణా ప్రతాప్ కూడా యుద్ధము చేశారు, అయితే అది హింస. ఈ సమయంలో అందరూ డబల్ హింసకులు. వికారాలలోకి వెళ్ళడం, కామ ఖడ్గాన్ని నడిపించడం, ఇది కూడా హింసయే కదా. ఈ లక్ష్మీనారాయణులు డబల్ అహింసకులు. మనుష్యులకు పూర్తి జ్ఞానం ఉన్నప్పుడు అర్థ సహితంగా ఉన్న స్టాంపులు వెలువడతాయి. సత్యయుగంలో ఈ లక్ష్మీనారాయణుల స్టాంపునే వెలువడుతుంది. శివబాబా జ్ఞానము అయితే అక్కడ ఉండదు కావున తప్పకుండా ఉన్నతాతి ఉన్నతమైన లక్ష్మీనారాయణుల స్టాంపు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కూడా భారత్ కు ఆ స్టాంపులే ఉండాలి. ఉన్నతాతి ఉన్నతమైనవారు త్రిమూర్తి శివ. వారి స్టాంపు అయితే అవినాశీగా ఉండాలి, ఎందుకంటే వారు భారత్ కు అవినాశీ రాజ్య సింహాసనాన్నిస్తారు. పరమపిత పరమాత్మయే భారత్ ను స్వర్గంగా తయారుచేస్తారు. బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారని మర్చిపోయేవారు మీలో కూడా చాలామంది ఉన్నారు. మాయ ఈ విషయాన్ని మరిపింపజేస్తుంది. తండ్రిని తెలుసుకోని కారణంగా భారతవాసులు ఎన్ని తప్పులు చేస్తూ వచ్చారు. శివబాబా ఏమి చేస్తారో, ఎవ్వరికీ తెలియదు. శివజయంతి అర్థము కూడా తెలియదు. ఈ జ్ఞానము తండ్రికి తప్ప ఇంకెవ్వరికీ లేదు.
మీరు ఇతరులపై కూడా దయ చూపించండి, మీపై మీరు కూడా దయ చూపించుకోండి అని ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. టీచరు చదివిస్తారు, ఇది కూడా దయ చూపించడమే కదా. నేను టీచరును, మిమ్మల్ని చదివిస్తాను అని వీరు కూడా అంటారు. వాస్తవానికి దీని పేరు పాఠశాల అని కూడా అనరు. ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయము. మిగిలినవన్నీ అసత్యమైన పేర్లు. ఆ కాలేజీలేవీ మొత్తం విశ్వం కోసం కాదు. అయితే, ఈ విశ్వవిద్యాలయము ఒక్క తండ్రిది మాత్రమే, వీరు విశ్వమంతటికీ సద్గతినిస్తారు. వాస్తవానికి విశ్వవిద్యాలయము ఇది ఒక్కటి మాత్రమే. దీని ద్వారానే అందరూ ముక్తి-జీవన్ముక్తులలోకి వెళ్తారు అనగా శాంతి మరియు సుఖాలను ప్రాప్తి చేసుకుంటారు. యూనివర్స్ అయితే ఇదే కదా, అందుకే బాబా భయపడకండి అని చెప్తున్నారు. ఇది అర్థము చేయించాల్సిన విషయము. ఎమర్జన్సీ సమయంలో ఎవ్వరూ ఎవ్వరి మాటా వినడం జరగదు. ప్రజలపై ప్రజా రాజ్యము నడుస్తుంది, ఇంకే ధర్మములోనూ ప్రారంభము నుండి రాజ్యం నడవదు. వారు ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. తర్వాత సంఖ్య లక్షల్లోకి చేరుకున్నప్పుడే రాజ్యం చేయగలరు. ఇక్కడ తండ్రి విశ్వం కోసం రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఇది కూడా అర్థము చేయించవలసిన విషయము. దైవీ రాజధానిని ఈ పురుషోత్తమ సంగమయుగములో స్థాపన చేస్తున్నారు. బాబా అర్థం చేయించారు - కృష్ణుడు, నారాయణుడు, రాముడు మొదలైనవారి నల్లని చిత్రాలను కూడా మీరు చేతిలోకి తీసుకుని అర్థం చేయించండి - కృష్ణుడిని శ్యామ-సుందరుడని ఎందుకంటారు? ఒకప్పుడు సుందరంగా ఉండేవారు, మళ్ళీ నల్లగా ఎలా అవుతారు? భారత్ యే స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉంది. హెల్ అనగా నలుపు, హెవెన్ అనగా తెలుపు. రామరాజ్యాన్ని పగలు, రావణరాజ్యాన్ని రాత్రి అని అంటారు. దేవతలను ఎందుకు నల్లగా చేశారో మీరు అర్థము చేయించగలరు. మీరిప్పుడు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వాళ్ళు సంగమయుగంలో లేరు, మీరైతే ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా. ఇక్కడ మీరు ఉన్నదే సంగమయుగంలో, మీరు పురుషోత్తములగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. వికారీ పతిత మనుష్యులతో మీకు ఎటువంటి సంబంధమూ లేదు, అయితే, ఇప్పుడింకా కర్మాతీత అవస్థ ఏర్పడలేదు కనుక కర్మ సంబంధాల వైపుకు కూడా మనసు వెళ్తుంది. కర్మాతీతులుగా అవ్వాలి, దాని కోసం స్మృతియాత్ర కావాలి. నీవు ఒక ఆత్మ, నీకు పరమాత్మ తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉండాలి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఓహో! బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అనే ఆ ఉత్సాహము ఎవ్వరిలోనూ ఉండదు. మాయ పదే-పదే దేహాభిమానములోకి తీసుకొచ్చేస్తుంది. శివబాబా ఆత్మలైన మాతో మాట్లాడుతున్నారని అర్థం చేసుకున్నప్పుడు, ఆ ఆకర్షణ, ఆ సంతోషం ఉండాలి కదా. ఏ సూది పైన అయితే కొంచెము కూడా త్రుప్పు ఉండదో, దాన్ని మీరు అయస్కాంతము ఎదుట ఉంచితే అది వెంటనే అతుక్కుంటుంది. ఏ మాత్రం తుప్పు ఉన్నా అతుక్కోదు. ఆకర్షణ ఉండదు. ఎటువైపైతే తుప్పు ఉండదో, అటువైపు నుండి అయస్కాంతము ఆకర్షిస్తుంది. పిల్లలు స్మృతియాత్రలో ఉన్నప్పుడే పిల్లలకు ఆకర్షణ ఉంటుంది. తుప్పు ఉంటే ఆకర్షించలేదు. సూది వంటి నేను పూర్తిగా పవిత్రంగా అయినప్పుడే ఆకర్షణ కూడా ఉంటుందని ప్రతి ఒక్కరూ అర్థము చేసుకోగలరు. తుప్పు పట్టి ఉన్నందుకు ఆకర్షణ ఉండదు. మీరు చాలా స్మృతిలో ఉన్నట్లయితే వికర్మలు భస్మమవుతాయి. అచ్ఛా, ఒకవేళ మళ్ళీ ఏదైనా పాపము చేస్తే, దానికి 100 రెట్ల శిక్ష పడుతుంది. అప్పుడు తుప్పు పడుతుంది, ఇక స్మృతి చేయలేరు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, స్మృతిని మర్చిపోతే తుప్పు పడుతుంది. అప్పుడ ఆ ఆకర్షణ, ప్రేమ ఉండదు. తుప్పు వదిలితేనే ప్రేమ ఉంటుంది, సంతోషం కూడా ఉంటుంది. ముఖము సంతోషంగా ఉంటుంది. మీరు భవిష్యత్తులో ఈ విధంగా తయారవ్వాలి. సేవ చేయకపోతే పాత పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవి తండ్రితో బుద్ధియోగాన్ని తెంచేస్తాయి. ఏదైతే ప్రకాశము ఉండేదో, అది కూడా మాయమైపోతుంది. తండ్రి పట్ల కొంచెము కూడా ప్రేమ ఉండదు. ఎవరైతే తండ్రిని బాగా స్మృతి చేస్తారో వారికి ప్రేమ ఉంటుంది. తండ్రికి కూడా వారి పట్ల ఆకర్షణ ఉంటుంది. ఈ బిడ్డ సేవ కూడా బాగా చేస్తారు మరియు యెగములో కూడా ఉంటారు అని తండ్రికి వారిపై ప్రేమ ఉంటుంది. అటువంటివారు నా వలన ఏ పాపమూ జరగలేదు కదా అని స్వయంపై ధ్యానముంచుతారు. ఒకవేళ స్మృతి చేయకపోతే తుప్పు ఎలా వదులుతుంది. చార్టు పెడితే త్రుప్పు తొలగిపోతుందని తండ్రి చెప్తున్నారు. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలంటే త్రుప్పు తొలగిపోవాలి. త్రుప్పు తొలగిపోతుంది, మళ్ళీ పడుతుంది. 100 రెట్ల శిక్ష పడుతుంది. తండ్రిని స్మృతి చేయకపోతే ఏదో ఒక పాపము చేసేస్తారు. త్రుప్పు తొలగిపోకుండా మీరు నా వద్దకు రాలేరు లేదంటే తర్వాత శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అని తండ్రి అంటున్నారు. దెబ్బలు తినడమే కాక పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇక తండ్రి నుండి ఏం వారసత్వం లభిస్తుంది? ఇంకా తుప్పు పట్టే విధమైన కర్మలేవీ చేయకూడదు. మొదట మీ తుప్పును తొలగించుకోవడం గురించి ఆలోచించండి. అలా ఆలోచించకపోతే ఇక వారి భాగ్యంలో లేదని తండ్రి భావిస్తారు. క్వాలిఫికేషన్ కావాలి. మంచి క్యారెక్టర్లు ఉండాలి. లక్ష్మీనారాయణుల క్యారెక్టర్లు అయితే గాయనం చేయబడ్డాయి. ఈ సమయంలో మనుష్యులు వారి ఎదురుగా స్వయం యొక్క క్యారెక్టర్ ను వర్ణన చేస్తారు. శివబాబా గురించి తెలియనే తెలియదు కానీ సద్గతినిచ్చేది వారు మాత్రమే. సన్యాసుల వద్దకు వెళ్తారు కానీ సర్వుల సద్గతిదాత ఒక్కరు మాత్రమే. తండ్రియే స్వర్గ స్థాపన చేస్తారు, మళ్ళీ క్రిందకు దిగాల్సిందే. తండ్రి తప్ప ఎవ్వరూ పావనంగా చేయలేరు. మనుష్యులు లోతైన గోతుల్లోకి వెళ్ళి కూర్చుంటారు, దీని కన్నా గంగలోకి వెళ్ళి కూర్చుంటే శుభ్రంగా అన్నా అవుతారు ఎందుకంటే పతితపావని గంగ అని అంటారు కదా. మనుష్యులు శాంతిని కోరుకుంటారు కానీ వారి ఇంటికి వెళ్ళినప్పుడు పాత్ర పూర్తవుతుంది. ఆత్మలైన మన ఇల్లు నిర్వాణధామము. ఇక్కడ శాంతి ఎక్కడ నుండి వస్తుంది? తపస్సు చేస్తారు, వారు కూడా కర్మలు చేస్తారు కదా, కాకపోతే శాంతిగా కూర్చుండిపోతారు. వారికి శివబాబా గురించి అసలు తెలియదు. అదంతా భక్తిమార్గము, తండ్రి ఒక్క పురుషోత్తమ సంగమయుగములో మాత్రమే వస్తారు. ఆత్మ స్వచ్ఛంగా అయి ముక్తి-జీవన్ముక్తిలోకి వెళ్ళిపోతుంది. ఎవరైతే శ్రమ చేస్తారో వారే రాజ్యం చేస్తారు, మిగిలినవారు ఎవరైతే శ్రమ చేయరో వారు శిక్షలు అనుభవిస్తారు. ప్రారంభంలో శిక్షల గురించి సాక్షాత్కారము చేయించాను. మళ్ళీ చివర్లో కూడా సాక్షాత్కారమవుతుంది. శ్రీమతంపై నడవకపోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడిందని చూస్తారు. పిల్లలు కళ్యాణకారులుగా అవ్వాలి. తండ్రి మరియు రచనల పరిచయమునివ్వాలి. ఎలాగైతే సూదిని కిరోసిన్లో వేస్తే త్రుప్పు తొలగిపోతుందో, అదే విధంగా తండ్రి స్మృతిలో ఉండటం వలన కూడా తుప్పు వదులుతుంది. లేకపోతే తండ్రి పట్ల ఆ ఆకర్షణ, ఆ ప్రేమ ఉండవు. ప్రేమ అంతా మిత్ర-సంబంధీకులు మొదలైనవారి వైపుకి వెళ్ళిపోతుంది, మిత్ర-సంబంధీకుల వద్దకు వెళ్ళి ఉంటారు. తుప్పు పట్టి ఉన్న ఆ సాంగత్యము ఎక్కడ మరియు ఈ సాంగత్యము ఎక్కడ. తుప్పు పట్టిన వారి సాంగత్యంలో ఉన్నవారికి కూడా త్రుప్పు పడుతుంది. తుప్పును తొలగించేందుకే తండ్రి వస్తారు. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. అర్థకల్పము నుండి చాలా తీవ్రంగా తుప్పు పట్టి ఉంది. నన్ను స్మృతి చేయండి, నాతో ఎంతగా బుద్ధియోగము ఉంటుందో, అంతగా త్రుప్పు తొలగిపోతుంది అని ఇప్పుడు అయస్కాంతం అయిన తండ్రి చెప్తున్నారు. కొత్త ప్రపంచం అయితే తయారవ్వాల్సిందే, సత్యయుగంలో మొదట చాలా చిన్న దేవీ దేవతల వృక్షముంటుంది, తర్వాత అది వృద్ధి చెందుతుంది. ఇక్కడి నుండే మీ వద్దకు వచ్చి పురుషార్థము చేస్తూ ఉంటారు. పై నుండి ఎవరూ రారు. ఇతర ధర్మాలవారు పై నుండి వస్తారు. ఇక్కడ మీ రాజధాని తయారవుతూ ఉంది. అంతా చదువు పైన, తండ్రి శ్రీమతముపై నడవడం పైన ఆధారపడి ఉంటుంది, బుద్ధియోగము బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడు కూడా త్రుప్పు పడుతుంది. లెక్కాచారాలన్నీ పూర్తి చేసుకొని, జీవిస్తూనే అన్నీ సమాప్తము చేసుకొని ఇక్కడకు వస్తారు. సన్యాసులు, సన్యాసం చేస్తున్నా కూడా తర్వాత ఎంత సమయం వరకూ అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి.
ఇప్పుడు మనకు సత్యమైన సాంగత్యము లభించిందని పిల్లలైన మీకు తెలుసు. మేము మన తండ్రి స్మృతిలోనే ఉంటాము, మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరూ తెలుసు కదా, గృహస్థ వ్యవహారంలో ఉంటూ, కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేస్తాము. పవిత్రంగా అవ్వాలి, ఇతరులకు కూడా నేర్పించాలి. ఇక భాగ్యంలో ఉంటే కొనసాగుతారు. బ్రాహ్మణ కులానికి చెందినవారిగా అవ్వకపోతే, ఇక దేవతా కులములోకి ఎలా వస్తారు? ఎవరి బుద్ధిలోనైనా వెంటనే కూర్చోగలిగేలా చాలా సహజమైన పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. వినాశ కాలంలో విపరీత బుద్ధి కలవారి చిత్రము కూడా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఆ రాజ్యం అయితే లేదు. దైవీ రాజ్యముండేది, దాన్ని స్వర్గమని అనేవారు. ఇప్పుడైతే పంచాయతి రాజ్యము, ఈ విషయం అర్థము చేయించడంలో తప్పేమీ లేదు. కానీ తుప్పు తొలగిపోయి ఉంటేనే ఎవరికైనా బాణము తగులుతుంది. మొదట తుప్పు తొలగించుకునేందుకు ప్రయత్నించాలి. రాత్రి-పగలు నేను ఏమి చేస్తున్నాను అని మీ క్యారెక్టర్ ను చూసుకోవాలి? కిచెన్ లో కూడా భోజనం తయారు చేస్తూ, రొట్టెలు చేస్తూ ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండండి, తిరిగేందుకు వెళ్ళినా కూడా స్మృతిలో ఉండండి. తండ్రికి అందరి స్థితులు తెలుసు కదా. పరచింతన చేసినట్లయితే ఇంకా తుప్పు పడుతుంది. పరచింతన విషయాలేవీ వినకండి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి ఏ విధంగా టీచరు రూపంలో చదివించి అందరిపై దయ చూపిస్తారో, అదే విధంగా మీరు మీ పై మరియు ఇతరుల పై కూడా దయ చూపించాలి. చదువు మరియు శ్రీమతము పై పూర్తిగా ధ్యానముంచాలి, మీ క్యారెక్టర్ ను సరిదిద్దుకోవాలి.
2. పరస్పరము పాత పనికిరాని పరచింతన విషయాలు మాట్లాడుకుంటూ తండ్రి నుండి బుద్ధియోగాన్ని తొలగించకూడదు. పాప కర్మలేవీ చేయకూడదు, స్మృతిలో ఉంటూ తుప్పు తొలగించుకోవాలి.