09-12-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - ఈశ్వరీయ సేవార్థము కలిగే సంకల్పాలను శుద్ధ సంకల్పాలు లేక నిస్సంకల్పాలనే అంటారు, అవి వ్యర్థమైనవి కావు”

ప్రశ్న:-

వికర్మల నుండి రక్షింపబడేందుకు ఏ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ కూడా అనాసక్తులుగా ఉండాలి?

జవాబు:-

బంధు-మిత్రుల సేవ చేయండి, కానీ అలౌకిక ఈశ్వరీయ దృష్టితో చేయండి, వారి పట్ల మోహపు బంధం ఉండకూడదు. ఒకవేళ ఏదైనా వికారీ సంబంధంతో సంకల్పము కలిగినా, అది వికర్మగా అయిపోతుంది, కావున అనాసక్తులుగా అయి కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఎంత వీలైతే అంత దేహీ-అభిమానులుగా ఉండే పురుషార్థము చేయండి.

ఓంశాంతి. ఈ రోజు పిల్లలైన మీకు సంకల్పము, వికల్పము, నిస్సంకల్పము మరియు కర్మ, అకర్మ, వికర్మలను గురించి అర్థము చేయించడం జరుగుతుంది. మీరు ఇక్కడున్నంత వరకు తప్పకుండా మీకు సంకల్పాలు నడుస్తూనే ఉంటాయి. సంకల్పాలను ధారణ చేయకుండా ఏ మనిషీ ఒక్క క్షణము కూడా ఉండలేడు. ఇప్పుడీ సంకల్పాలు ఇక్కడ కూడా నడుస్తాయి, సత్యయుగములో కూడా నడుస్తాయి, అజ్ఞాన కాలములో కూడా నడుస్తాయి, కానీ జ్ఞానములోకి వచ్చిన తర్వాత సంకల్పాలు సంకల్పాలు కావు, ఎందుకంటే మీరు పరమాత్మ సేవార్థం నిమిత్తంగా అయ్యారు, కావున యజ్ఞము కోసం ఏ సంకల్పాలైతే చేస్తారో, అవి సంకల్పాలు కావు, అవి నిస్సంకల్పాలే అవుతాయి. మిగిలిన అనవసరమైన సంకల్పాలు ఏవైతే నడుస్తాయో, అనగా కలియుగీ ప్రపంచము గురించి, కలియుగములోని బంధు-మిత్రుల గురించి కలిగే సంకల్పాలను వికల్పాలని అంటారు. వీటి వల్లనే వికర్మలు జరుగుతాయి. వికర్మల ద్వారా దుఃఖము ప్రాప్తిస్తుంది. యజ్ఞము గురించి గానీ, ఈశ్వరీయ సేవ గురించి గానీ కలిగే సంకల్పాలు నిస్సంకల్పాలుగా అవుతాయి. సేవ కోసం శుద్ధ సంకల్పాలు కలిగినా పర్వాలేదు. పిల్లలైన మిమ్మల్ని సంభాళించేందుకు బాబా ఇక్కడ కూర్చుని ఉన్నారు. పిల్లల సేవ చేసేందుకు మాతా-పితలకు తప్పకుండా సంకల్పాలు నడుస్తాయి. కానీ ఈ సంకల్పాలు సంకల్పాలు కావు, వీటి ద్వారా వికర్మలు తయారవ్వవు, కానీ ఒకవేళ ఏదైనా వికారీ సంబంధము గురించి సంకల్పాలు కలిగినట్లయితే ఆ సంకల్పాలకు వికర్మలు తప్పకుండా తయారవుతాయి.

మీరు బంధు-మిత్రుల సేవ చేయండి కానీ అలౌకిక ఈశ్వరీయ దృష్టితో చేయండి అని పిల్లలైన మీకు బాబా చెప్తున్నారు. మోహపు బంధం ఉండకూడదు. అనాసక్తులుగా అయి మీ కర్తవ్యాన్ని పాలన చేయండి. కానీ ఎవరైనా ఇక్కడ కర్మ సంబంధములో ఉంటూ వాటిని తెంచుకోలేకపోయినా సరే, వారు పరమాత్మను వదిలిపెట్టకూడదు. వారి చేయి పట్టుకుని ఉన్నట్లయితే ఏదో ఒక పదవిని ప్రాప్తి చేసుకుంటారు. నాలో ఏ వికారముంది అన్నదైతే ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎవరిలోనైనా ఒక్క వికారమున్నా కానీ వారు తప్పకుండా దేహాభిమానులే, వికారాలు లేని వారు దేహీ-అభిమానులు. ఎవరిలో ఏ వికారమున్నా వారు తప్పకుండా శిక్షలు అనుభవిస్తారు, వికారాలు లేనివారు శిక్షల నుండి ముక్తులైపోతారు. కామము, క్రోధము, మోహము, లోభము..... లేని పిల్లలు కొంతమంది ఉన్నారు, వారు చాలా బాగా సేవ చేయగలరు. వారి స్థితి చాలా జ్ఞాన-విజ్ఞానమయంగా ఉంటుంది. దానికి మీరందరూ కూడా ఓటు వేస్తారు. ఇప్పుడు ఈ విషయం నాకు ఎలా తెలుసో, అలానే పిల్లలైన మీకు కూడా తెలుసు, మంచివారిని అందరూ మంచివారనే అనే అంటారు, ఎవరిలోనైనా ఏదైనా లోపముంటే అందరూ వారికి ఆ ఓటే వేస్తారు. వికారాలుండే వారు సేవ చేయలేరు అనేది ఇప్పుడు నిశ్చయము చేసుకోండి. వికార ప్రూఫ్ (వికారాలు లేని వారు) సేవ చేసి ఇతరులను తమ సమానంగా చేయగలరు, కావున వికారాలను పూర్తిగా జయించాలి, వికల్పాలను పూర్తిగా జయించాలి. ఈశ్వరార్థము చేసిన సంకల్పాలను నిస్సంకల్పాలని అనడం జరుగుతుంది.

వాస్తవానికి నిస్సంకల్పత అనగా సంకల్పాలు కలగకుండా ఉండడం, సుఖ-దుఃఖాల నుండి అతీతంగా అవ్వడం. అది అంతిమంలో మీరు లెక్కాచారాలను తీర్చుకుని వెళ్ళినప్పుడు, అక్కడ సుఖ-దుఃఖాల నుండి అతీతమైన స్థితిలో ఎటువంటి సంకల్పాలు కలగవు. ఆ సమయంలో కర్మ-అకర్మలు రెండింటి నుండి అతీతమైన అకర్మీ స్థితిలో ఉంటారు.

ఇక్కడ మీకు సంకల్పాలు తప్పకుండా కలుగుతాయి ఎందుకంటే ఈ ప్రపంచమంతటినీ శుద్ధంగా చేసేందుకు మీరు నిమిత్తులుగా అయ్యారు. కావున మీకు శుద్ధ సంకల్పాలు తప్పకుండా కలుగుతాయి. సత్యయుగములో శుద్ధ సంకల్పాలు కలగడం వలన ఆ సంకల్పాలు, సంకల్పాలు కావు, కర్మలు చేస్తున్నా కూడా కర్మ బంధనాలు ఏర్పడవు. అర్థమయిందా? ఇప్పుడు కర్మ, అకర్మ, వికర్మల గతి గురించి పరమాత్మ మాత్రమే అర్థము చేయించగలరు. ఈ సంగమయుగంలో మిమ్మల్ని చదివించేవారే మిమ్మల్ని వికర్మల నుండి విడిపించేవారు కావున - పిల్లలూ, మీపై మీరు చాలా ధ్యానముంచండి అని ఆ తండ్రి చెప్తున్నారు. మీ లెక్కాచారాన్ని కూడా గమనిస్తూ ఉండండి. మీరు లెక్కాచారాన్ని తీర్చుకునేందుకు ఇక్కడకు వచ్చారు. ఇక్కడకు వచ్చి కూడా లెక్కాచారాన్ని తయారుచేసుకుంటూ ఉన్నట్లయితే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. గర్భజైలులోని శిక్షలు తక్కువేమీ కాదు. కావున ఎంతో పురుషార్థము చేయాలి. ఈ గమ్యము చాలా గొప్పది కావున అప్రమత్తంగా నడుచుకోవాలి. వికల్పాలపై తప్పకుండా విజయం పొందాలి. ఇప్పుడు ఎంతవరకు మీరు వికల్పాలపై విజయము పొందారు, ఎంతవరకు ఈ నిస్సంకల్ప అవస్థ అనగా సుఖ-దుఃఖాల నుండి అతీతమైన స్థితిలో ఉంటారు అనేది మీకు మీరే తెలుసుకుంటూ ఉండండి. ఎవరైతే స్వయాన్ని అర్థం చేసుకోలేరో వారు మమ్మా-బాబాలను అడగవచ్చు ఎందుకంటే మీరు వారి వారసులు, కనుక వారు మీకు తెలియజేయగలరు.

నిస్సంకల్ప స్థితిలో ఉండడం వలన మీరు మీ వికర్మలనే కాకుండా, ఎటువంటి వికారీ మనుష్యుల వికర్మలనైనా కూడా అణిచివేయగలరు. కామముతో ఉన్న పురుషుడు ఎవరైనా మీ ముందుకు వచ్చినా కానీ అతనికి వికారీ సంకల్పాలు కలగవు. ఎలాగైతే ఎవరైనా దేవతల వద్దకు వెళ్ళినప్పుడు వారి ఎదురుగా శాంతిగా అయిపోతారో, అలాగే మీరు కూడా గుప్త రూపంలో ఉన్న దేవతలు. మీ ఎదురుగా కూడా ఎవ్వరి వికారీ సంకల్పాలు నడవవు, కానీ ఇలా ఎంతోమంది కామానికి వశమైన పురుషులు ఉన్నారు, వారికి అటువంటి సంకల్పాలు కలిగినా సరే మీరు యోగయుక్తంగా నిలబడినట్లయితే, వారు మీపై దాడి చేయలేరు.

చూడండి - పిల్లలూ, మీరు పరమాత్మకు వికారాల ఆహుతిని ఇచ్చేందుకు వచ్చారు కానీ కొందరు నియమానుసారంగా ఇంకా ఆహుతి ఇవ్వలేదు. వారి యోగము పరమపితతో జోడింపబడి లేదు. రోజంతా బుద్ధియోగము భ్రమిస్తూ ఉంటుంది అనగా దేహీ-అభిమానులుగా అవ్వలేదు. దేహాభిమానులుగా ఉండడం వలన ఎవరో ఒకరి స్వభావము యొక్క ప్రభావములోకి వచ్చేస్తారు, దీని వలన పరమాత్మతో ప్రీతిని నిర్వర్తించలేరు, అనగా పరమాత్మ కోసం సేవ చేసేందుకు అధికారులుగా అవ్వలేరు. కనుక ఎవరైతే పరమాత్మతో సేవ తీసుకొని మళ్ళీ సేవ చేస్తున్నారో అనగా పతితులను పావనంగా చేస్తున్నారో, వారే నా సత్యమైన పక్కా పిల్లలు. వారికి చాలా గొప్ప పదవి లభిస్తుంది.

ఇప్పుడు పరమాత్మ స్వయంగా వచ్చి మీకు తండ్రిగా అయ్యారు. ఆ తండ్రిని ఆ సాధారణ రూపంలో తెలుసుకోకుండా, ఎటువంటి సంకల్పాలనైనా ఉత్పన్నం చేయడం అనగా వినాశనాన్ని ప్రాప్తి చేసుకోవడమే అవుతుంది. 108 జ్ఞాన గంగలు పూర్ణ అవస్థను ప్రాప్తి చేసుకునే సమయము వస్తుంది. ఎవరైతే చదవకుండా ఉంటారో వారు తమకు తామే నాశనము చేసుకుంటారు.

ఈ ఈశ్వరీయ యజ్ఞములో ఎవరైతే దాక్కుని పనులు చేస్తారో, వారిని జానీజానన్ హార్ బాబా (అన్నీ తెలిసిన బాబా) చూసేస్తారు అన్నది ఖచ్చితంగా తెలుసుకోండి. అటువంటివారిని సావధానపరిచేందుకు, ఆ బాబా సాకార స్వరూపంలో ఉన్న తమ బాబాను టచ్ చేస్తారు. కావున ఏ విషయాన్నీ దాచి పెట్టకూడదు. పొరపాట్లు జరిగినా కానీ వారికి తెలియజేస్తేనే భవిష్యత్తు కోసం రక్షింపబడతారు, అందుకే పిల్లలు, జాగ్రత్తగా ఉండండి.

పిల్లలు మొట్టమొదట - నేను ఎవరిని, వాట్ ఏమ్ ఐ (నేను ఏమిటి) అని స్వయాన్ని అర్థం చేసుకోవాలి. "నేను” అని శరీరాన్ని అనరు, "నేను” అని ఆత్మను అంటారు. ఆత్మనైన నేను ఎక్కడ నుండి వచ్చాను? ఎవరి సంతానాన్ని? ఆత్మనైన నేను పరమపిత పరమాత్మ సంతానాన్ని అని ఆత్మకు ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు తమ తండ్రిని స్మృతి చేస్తే సంతోషము కలుగుతుంది. తమ తండ్రి కర్తవ్యాన్ని తెలుసుకున్నప్పుడు బిడ్డకు సంతోషము కలుగుతుంది. ఎంతవరకు చిన్నవారిగా ఉంటారో, తండ్రి కర్తవ్యం గురించి తెలియదో, అంతవరకు అంత సంతోషము ఉండదు. పెద్దవాడిగా అయ్యే కొద్దీ తండ్రి కర్తవ్యాన్ని తెలుసుకున్నప్పుడు, ఆ నషా, ఆ సంతోషం పెరుగుతూ ఉంటాయి. కావున మొదటగా, మా బాబా ఎవరు, వారు ఎక్కడ ఉంటారు అని వారి కర్తవ్యాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ ఆత్మ వారిలో కలిసిపోతుందని అంటే ఆత్మ వినాశనమైనట్లు, అప్పుడు ఎవరికి సంతోషము కలుగుతుంది.

మీ వద్దకు కొత్తగా ఎవరైనా జిజ్ఞాసువులు వస్తే, వారిని ఇక్కడ మీరు ఏం చదువుకుంటారు, దీని వలన ఎటువంటి హోదా లభిస్తుంది అని అడగాలి. ఆ కళాశాలలో చదువుకునేవారు, మేము డాక్టర్లుగా అవుతున్నాము, ఇంజనీర్లుగా అవుతున్నాము..... అని అన్నప్పుడు వీరు బాగా చదువుకుంటున్నారని నమ్మకము కలుగుతుంది కదా. ఇక్కడ కూడా - ఇది దుఃఖపు ప్రపంచము, దీనిని నరకము, హెల్ లేక ఆసురీ ప్రపంచము అని అంటారని విద్యార్థులు చెప్తారు. దీనికి వేరుగా హెవెన్ లేక దైవీ ప్రపంచముంది, దానిని స్వర్గమని అంటారు. ఇది ఆ స్వర్గము కాదు, ఇది నరకము మరియు దుఃఖపు ప్రపంచము, పాపాత్ముల ప్రపంచము అని అందరికీ తెలుసు, అందరూ అర్థం కూడా చేసుకోగలరు. అందుకే మమ్మల్ని పుణ్యాత్ముల ప్రపంచములోకి తీసుకువెళ్ళండని వారిని అందరూ పిలుస్తూ ఉంటారు. కావున పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో, వారికి - బాబా మనల్ని ఆ పుణ్య ప్రపంచములోకి తీసుకువెళ్తున్నారని తెలుసు. కనుక కొత్త విద్యార్థులు ఎవరైతే వస్తారో, వారు పిల్లలను అడగాలి, వారి ద్వారా చదువుకోవాలి. వారు తమ టీచరు కర్తవ్యాన్ని లేక తండ్రి కర్తవ్యాన్ని తెలుపగలరు. తండ్రి కూర్చుని స్వయంగా వారి మహిమను వారే చేసుకోరు, టీచరు తన గొప్పతనాన్ని తానే వినిపిస్తారా ఏమిటి! ఈ టీచరు ఇటువంటివారు అని విద్యార్థులు వినిపిస్తారు, అప్పుడు విద్యార్థులు టీచరును ప్రత్యక్షము చేస్తారని అంటారు. పిల్లలైన మీరు ఇంత కోర్సు చదువుకుని వచ్చారు, కొత్త వాళ్ళకు కూర్చుని అర్థము చేయించడం మీ కర్తవ్యం. బి.ఎ, ఎమ్.ఎ. చదువును చదివించే టీచర్లు కూర్చుని కొత్త విద్యార్థులకు ఎ, బి, సి....లు నేర్పిస్తారా ఏమిటి! కొందరు విద్యార్థులు తెలివైనవారిగా ఉంటారు, వారు ఇతరులను కూడా చదివిస్తారు. అందులో మాతా గురువు ప్రసిద్ధి చెందారు. వీరు దైవీ ధర్మానికి చెందిన మొదటి మాత, వీరిని జగదంబ అని అంటారు. మాతకు చాలా మహిమ ఉంది. బెంగాల్ లో కాళీ, దుర్గ, సరస్వతి, లక్ష్మీ - ఈ నలుగురు దేవీలను ఎక్కువగా పూజిస్తారు. ఇప్పుడు ఆ నలుగురి కర్తవ్యమేమిటో తెలియాలి. ఉదాహరణకు లక్ష్మి గాడెస్ ఆఫ్ వెల్త్ (ధన దేవి). వారు ఇక్కడే రాజ్యము చేసి వెళ్ళారు. ఇకపోతే కాళీ, దుర్గ మొదలైన పేర్లన్నీ వీరికి చెందినవే. ఒకవేళ నలుగురు మాతలుంటే వారికి నలుగురు పతులు కూడా ఉండాలి కదా. లక్ష్మికి పతిగా నారాయణుడు ప్రసిద్ధి చెందారు. కాళీ పతి ఎవరు? (శంకరుడు) కానీ శంకరుడిని పార్వతికి పతి అని అంటారు. పార్వతి, కాళీ ఏమీ కాదు. కాళీని పూజించేవారు చాలామంది ఉన్నారు, తల్లిని స్మృతి చేస్తారు, కానీ తండ్రి గురించి తెలియదు. కాళీ కు పతి ఉండాలి లేక తండ్రి ఉండాలి, కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు.

ప్రపంచము ఇదొక్కటే ఉంది, ఇది ఒకప్పుడు దుఃఖపు ప్రపంచము లేక నరకంగా అయిపోతుంది, ఇదే మళ్ళీ సత్యయుగంలో స్వర్గంగా అవుతుందని మీరు అందరికీ అర్థం చేయించాలి. లక్ష్మీనారాయణులు కూడా ఇదే సృష్టిపై సత్యయుగం ఉన్నప్పుడు రాజ్యం చేసేవారు. అయితే సూక్ష్మలోకంలో వైకుంఠమేమీ లేదు, అక్కడ లక్ష్మీనారాయణులు సూక్ష్మంగా లేరు. వారి చిత్రాలు ఇక్కడే ఉన్నాయి కనుక వారు తప్పకుండా ఇక్కడే రాజ్యం చేసి వెళ్ళారు. ఆట అంతా ఈ స్థూల ప్రపంచములోనే జరుగుతుంది. చరిత్ర-భూగోళాలు ఈ స్థూల ప్రపంచానికి చెందినవే. సూక్ష్మవతనానికి చరిత్ర-భూగోళాలేవీ ఉండవు. కానీ ఈ విషయాలన్నీ వదిలి మీరు కొత్తగా వచ్చిన జిజ్ఞాసువులకు మొట్టమొదట అల్ఫ్ (పరమాత్మ) గురించి నేర్పించాలి, తర్వాత బే (వారసత్వము) గురించి అర్థం చేయించాలి. అల్ఫ్ అనగా గాడ్, వారు సుప్రీమ్ సోల్ (పరమాత్మ). ఎంతవరకైతే ఇది పూర్తిగా అర్థమవ్వదో అంతవరకు పరమపిత పట్ల ప్రేమ కలగదు, ఆ సంతోషము ఉండదు ఎందుకంటే మొదట తండ్రి ఎవరో తెలుసుకుంటే వారి కర్తవ్యము గురించి కూడా తెలుసుకుని సంతోషిస్తారు. ఈ మొదటి విషయాన్ని అర్థం చేసుకోవడంలోనే సంతోషం ఉంది. భగవంతుడు సదా సంతోషంగా ఉంటారు, వారు ఆనంద స్వరూపుడు. మనము వారి పిల్లలము కనుక మనకెందుకు ఆ సంతోషముండకూడదు! ఆ ఆనందం ఎందుకు కలగదు! ఐ ఆమ్ సన్ ఆఫ్ గాడ్ (నేను భగవంతుని కుమారుడను), ఐ ఆమ్ ఎవర్ హ్యాపీ మాస్టర్ గాడ్ (నేను సదా సంతోషంగా ఉండే మాస్టర్ భగవంతుడను). ఆ సంతోషము లేకపోతే స్వయాన్ని భగవంతుని కుమారునిగా భావించడం లేదని అర్థమవుతుంది. గాడ్ ఇజ్ ఎవర్ హ్యాపీ బట్ ఐ ఆమ్ నాట్ హ్యాపీ (భగవంతుడు సదా సంతోషంగా ఉంటారు కానీ నేను సంతోషంగా లేను), ఎందుకంటే తండ్రి గురించి తెలియదు. ఇది సహజమైన విషయము.

కొందరికి జ్ఞానము వినడం కంటే శాంతి బాగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది జ్ఞానము తీసుకోలేరు. అంత సమయము ఎక్కడ ఉంది. కేవలం అల్ఫ్ ను (భగవంతుడు) తెలుసుకొని శాంతిగా ఉన్నాసరే అది కూడా మంచిదే. ఎలాగైతే సన్యాసులు కూడా కొండలలోకి వెళ్ళి గుహలలో పరమాత్ముని స్మృతిలో కూర్చుంటారో, అలా పరమపిత పరమాత్ముని స్మృతిలో, ఆ సుప్రీమ్ లైట్ స్మృతిలో ఉన్నా మంచిదే. వారి స్మృతితో సన్యాసులు కూడా నిర్వికారులుగా అవ్వగలరు. కానీ ఇంట్లో కూర్చుని ఉంటే స్మృతి చేయలేరు. అక్కడ పిల్లలపై మోహము కలుగుతూ ఉంటుంది, అందుకే సన్యసిస్తారు. పవిత్రంగా అయితే అందులో సుఖముంటుంది కదా. సన్యాసులు అందరికంటే మంచివారు. ఆదిదేవ్ కూడా సన్యాసిగా అయ్యారు కదా. ఎదురుగా వారి (ఆదిదేవ్) మందిరము ఉంది, అక్కడ తపస్సు చేస్తున్నారు. గీతలో కూడా దేహ ధర్మాలన్నీ సన్యసించండి అని అంటారు. వారు సన్యసించి వెళ్ళినట్లయితే మహాత్ములుగా అవుతారు. గృహస్థులను, మహాత్ములు అని అనడం నియమ విరుద్ధము. పరమాత్మయే వచ్చి మీకు సన్యాసము చేయించారు. సుఖము కోసమే సన్యసిస్తారు. మహాత్ములు ఎప్పుడూ దుఃఖపడరు. రాజులు కూడా సన్యసించినప్పుడు తమ కిరీటము మొదలైనవి విసిరేస్తారు. గోపిచంద్ సన్యసించారు కదా, కనుక అందులో తప్పకుండా సుఖముంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దాక్కుని ఎటువంటి తప్పుడు కర్మలను చేయకూడదు. బాప్ దాదా వద్ద ఏ విషయాన్ని దాచి పెట్టకూడదు. చాలా-చాలా జాగ్రత్తగా ఉండాలి.

2. స్టూడెంట్ షోస్ మాస్టర్ (విద్యార్థులు టీచరును ప్రత్యక్షము చేస్తారు). మీరు చదివినదానిని ఇతరులకు చదివించాలి. ఎవర్ హ్యాపీ గాడ్ (సదా సంతోషంగా ఉండే భగవంతుని)కు పిల్లలమనే స్మృతి ద్వారా అపారమైన సంతోషంలో ఉండాలి.

వరదానము:-

ప్రతి ఆత్మను ఉన్నతిలోకి తీసుకువెళ్ళాలనే భావనతో గౌరవమిచ్చే శుభచింతక భవ

ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ఠభావన అనగా ఉన్నతంగా చేసే లేక ముందుకు నడిపించే భావన ఉంచుకోవాలి అనగా శుభచింతకులుగా అవ్వాలి. మీ శుభ వృత్తి ద్వారా, శుభచింతక స్థితి ద్వారా ఇతరుల అవగుణాలను కూడా పరివర్తన చేయాలి. ఇతరుల బలహీనతలను లేక అవగుణాలను తమ బలహీనతలుగా భావించి వర్ణించేందుకు బదులుగా లేక వ్యాపింపజేసేందుకు బదులుగా ఇముడ్చుకోవాలి లేక పరివర్తన చేయాలి, ఇదే గౌరవించడం. పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయడం, నిరాశగా ఉండేవారిని శక్తివంతులుగా చేయడం, వారి సాంగత్యపు రంగులోకి రాకపోవడం, సదా వారిని కూడా ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకురావడం - ఇది గౌరవమివ్వడం. ఇలా గౌరవించేవారే శుభచింతకులు.

స్లోగన్:-

త్యాగము యొక్క భాగ్యాన్ని పాత స్వభావ-సంస్కారాలు సమాప్తం చేస్తాయి కావున వాటిని కూడా త్యాగం చేయాలి.