07-12-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరు చాలా సమయం తర్వాత మళ్ళీ తండ్రిని కలుసుకున్నారు కనుక మీరు చాలా ప్రియమైన, చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు”

ప్రశ్న:-

మీ స్థితిని ఏకరసంగా తయారుచేసుకునేందుకు సాధనమేమిటి?

జవాబు:-

ఏ క్షణమైతే గతించిందో, అది డ్రామా అని సదా గుర్తుంచుకోండి. కల్పక్రితము కూడా ఈ విధంగానే జరిగింది. ఇప్పుడు నింద-స్తుతి, మానావమానాలు అన్నీ ఎదురవుతాయి కనుక మీ స్థితిని ఏకరసంగా తయారుచేసుకునేందుకు గతించినదాని గురించి చింతన చేయకండి.

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి పేరేమిటి? శివబాబా. వారు ఆత్మలందరికీ తండ్రి. ఆత్మిక పిల్లలందరి పేరు ఏమిటి? ఆత్మ. జీవానికి పేరు పెట్టడం జరుగుతుంది, ఆత్మకు అదే పేరు ఉంటుంది. అనేక సత్సంగాలున్నాయని కూడా పిల్లలకు తెలుసు. ఇది సత్యాతి-సత్యమైన సత్సంగము, ఇక్కడ సత్యమైన తండ్రి రాజయోగాన్ని నేర్పించి మనల్ని సత్యయుగంలోకి తీసుకువెళ్తారు. ఇటువంటి సత్సంగము మరియు పాఠశాల ఇంకేదీ ఉండదు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. మొత్తం సృష్టి చక్రమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పిల్లలైన మీరే స్వదర్శన చక్రధారులు. ఈ సృష్టిచక్రమెలా తిరుగుతుంది అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఎవరికైనా అర్థము చేయించేటప్పుడు వారిని చక్రము ఎదురుగా నిలబెట్టండి. ఇప్పుడు మీరు ఇటు వైపు వెళ్తారు అని చెప్పండి. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి జీవాత్మలకు చెప్తారు. ఇది కొత్త విషయమేమీ కాదు, కల్ప-కల్పము వింటారు, ఇప్పుడు మళ్ళీ వింటున్నారని మీకు తెలుసు. మీ బుద్ధిలో దేహధారులైన తండ్రి, టీచరు, గురువు ఎవ్వరూ లేరు. విదేహీ శివబాబా మనకు టీచరు, గురువు అని మీకు తెలుసు. ఇతర ఏ సత్సంగము మొదలైనవాటిలో ఈ విధంగా మాట్లాడరు. మధువనము అయితే ఇది ఒక్కటే ఉంది. వారు ఒక మధువనాన్ని బృందావనములో చూపిస్తారు. అది భక్తి మార్గములో మనుష్యులు కూర్చొని తయారుచేశారు. ప్రాక్టికల్ గా ఇది మధువనము. మనము సత్య-త్రేతాయుగాల నుండి మొదలుకొని పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు పురుషోత్తములుగా అయ్యేందుకు సంగమయుగంలోకి వచ్చి నిల్చున్నామని మీ బుద్ధిలో ఉంది. తండ్రి వచ్చి మనకు స్మృతినిప్పించారు. 84 జన్మలను ఎవరు, ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా మీకు తెలుసు. మనుష్యులు కేవలం చెప్తూ ఉంటారు, ఏమీ అర్థము చేసుకోరు. తండ్రి మంచి రీతిగా అర్థము చేయిస్తారు. సత్యయుగంలో సతోప్రధాన ఆత్మలుండేవి, శరీరాలు కూడా సతోప్రధానంగా ఉండేవి. ఈ సమయంలో సత్యయుగము లేదు, ఇది కలియుగము. మనము బంగారు యుగంలో ఉండేవారము. మళ్ళీ చక్రములో తిరుగుతూ, పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ మనము ఇనుప యుగములోకి వచ్చేసాము, తప్పకుండా మళ్ళీ చక్రము తిరగాలి. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలి. మీరు చాలా కాలం దూరమై తర్వాత కలిసిన గారాబాల పిల్లలు కదా. ఎవరైతే తప్పిపోయి, మళ్ళీ చాలా సమయము తర్వాత కలుస్తారో, వారిని సికీలధే అని అంటారు. మీరు 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు. మాకు 5 వేల సంవత్సరాల క్రితము ఈ సృష్టిచక్ర జ్ఞానాన్నిచ్చిన తండ్రి వీరేనని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వారే మమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా చేశారు. జన్మ సిద్ధ అధికారాన్ని ఇచ్చేందుకు ఇప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ కలుసుకున్నారు. ఇక్కడ తండ్రి రియలైజ్ చేయిస్తారు. ఇందులో ఆత్మ యొక్క 84 జన్మల రియలైజేషన్ కూడా వచ్చేస్తుంది. ఇదంతా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మనుష్యులను దేవతలుగా లేక నిరుపేదలను కిరీటధారులుగా చేసేందుకు 5 వేల సంవత్సరాల క్రితము కూడా ఈ విధంగా అర్థం చేయించారు. మనము 84 జన్మలు తీసుకున్నాము, ఎవరైతే తీసుకోలేదో వారు ఇక్కడకు నేర్చుకునేందుకు కూడా రారు అని మీకు తెలుసు. కొందరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. నంబరువారుగా అయితే ఉంటారు కదా. తమ తమ ఇళ్ళల్లో, గృహస్థంలో ఉండాలి. అందరూ అయితే ఇక్కడకు వచ్చి కూర్చోరు. ఎవరైతే చాలా మంచి పదవిని పొందేది ఉందో, వారు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. తక్కువ పదవి వారు ఎక్కువగా పురుషార్థము కూడా చేయరు. ఈ జ్ఞానము ఎటువంటిదంటే, పురుషార్థము కొద్దిగా చేసినా కూడా అది వ్యర్థమవ్వదు. శిక్షలు అనుభవించి వచ్చేస్తారు. పురుషార్థము బాగా చేస్తే, శిక్షలు కూడా తక్కువగా ఉంటాయి. స్మృతి యాత్ర లేకుండా వికర్మలు వినాశనమవ్వవు. ఇది పదే-పదే స్వయానికి గుర్తు తెప్పించుకోండి. మనుష్యులెవ్వరు కలిసినా సరే, వారికి మొదట స్వయాన్ని ఆత్మగా భావించమని అర్థం చేయించాలి. ఈ పేరైతే శరీరానికి తర్వాత పెట్టడం జరిగింది, ఎవరినైనా శరీరము యొక్క పేరుతోనే పిలుస్తారు. ఈ సంగమయుగములోనే అనంతమైన తండ్రి ఆత్మిక పిల్లలను పిలుస్తారు. ఆత్మిక తండ్రి వచ్చారని మీరంటారు. ఆత్మిక పిల్లలూ అని తండ్రి అంటారు. మొదట ఆత్మ, తర్వాత పిల్లల పేర్లు తీసుకుంటారు. ఆత్మిక తండ్రి ఏం అర్థం చేయిస్తున్నారు అనేది ఆత్మిక పిల్లలైన మీకు తెలుసు. శివబాబా ఈ భగీరథునిపై విరాజమానమై ఉన్నారు, వారే మనకు సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీ బుద్ధికి తెలుసు. తండ్రి ప్రవేశించి రాజయోగాన్ని నేర్పించే మనుష్యమాత్రులెవ్వరూ లేరు. ఆ తండ్రి పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తారు, ఇతర మనుష్యులెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు, అర్థం చేయించలేరు. ఈ శిక్షణ ఈ తండ్రిది (బ్రహ్మాబాబా) కాదు అని కూడా మీకు తెలుసు. కలియుగము సమాప్తమై సత్యయుగము వస్తుందని వీరికి తెలియదు. వీరికిప్పుడు దేహధారి గురువులెవ్వరూ లేరు. మనుష్యమాత్రులందరూ మా గురువు ఫలానా, ఫలానా వారి జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని అంటారు. అందరికీ దేహధారి గురువులున్నారు. ధర్మస్థాపకులు కూడా దేహధారులే. ఈ ధర్మాన్ని ఎవరు స్థాపించారు? పరమపిత పరమాత్మ త్రిమూర్తి శివబాబా బ్రహ్మా ద్వారా స్థాపన చేశారు. వీరి శరీరము పేరు బ్రహ్మా. ఫలానా ధర్మాన్ని క్రీస్తు స్థాపన చేశారని క్రిస్టియన్లు అంటారు. వారు దేహధారి. చిత్రము (శరీరము) కూడా ఉంది. ఈ ధర్మ స్థాపకునికి ఏ చిత్రాన్ని చూపిస్తారు? శివుడిదే చూపిస్తారు. శివుని చిత్రము కూడా కొందరు చిన్నదిగా, కొందరు పెద్దదిగా చేస్తారు. వాస్తవానికి వారు ఒక బిందువు. నామ-రూపాలు కూడా ఉన్నాయి కానీ వారు అవ్యక్తమైనవారు. ఈ కళ్ళతో చూడలేరు. శివబాబా పిల్లలైన మీకు రాజ్యభాగ్యమునిచ్చి వెళ్ళిపోయారు, అందుకే వారిని స్మృతి చేస్తారు కదా. మన్మనాభవ, తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేయండి అని శివబాబా చెప్తారు. ఇంకెవ్వరి మహిమ చేయకూడదు. ఆత్మ బుద్ధిలో ఏ దేహము గుర్తు రాకూడదు, ఇది బాగా అర్థము చేసుకోవలసిన విషయము. మాకు శివబాబా చదివిస్తున్నారు. రోజంతా దీనిని రిపీట్ చేస్తూ ఉండండి. శివభగవానువాచ - మొట్టమొదట అల్ఫ్ నే అర్థము చేసుకోవలసి ఉంటుంది. ఇది పక్కాగా చేసుకోకుండా బే గురించి చెప్తే వారి బుద్ధిలో ఏమీ కూర్చోదు. ఈ విషయం రైట్ అని కొందరు అంటారు. ఇది అర్థము చేసుకునేందుకు టైమ్ కావాలి అని కొందరు అంటారు. కొందరు ఆలోచిస్తామని అంటారు. రకరకాల వారు వస్తారు. ఇది కొత్త విషయము. పరమపిత పరమాత్మ శివ ఇక్కడ కూర్చుని ఆత్మలను చదివిస్తారు. మనుష్యులకు ఇది అర్థమయ్యేందుకు ఏం చేయాలి అని ఆలోచన నడుస్తుంది. శివుడే జ్ఞానసాగరుడు. శరీరము లేని ఆత్మను జ్ఞానసాగర అని ఎలా అంటారు. జ్ఞాన సాగరుడు అన్నప్పుడు తప్పకుండా ఎప్పుడో జ్ఞానము వినిపించి ఉంటారు, కావుననే వారిని జ్ఞానసాగరుడని అంటారు. ఊరికినే ఎందుకంటారు. కొంతమంది ఎక్కువగా చదువుకుంటే వీరు చాలా వేదశాస్త్రాలు చదువుకున్నారు అని అంటారు, అందుకే వారిని శాస్త్రి లేక విద్వాంసులు అని అంటారు. తండ్రిని జ్ఞానసాగరుడు, అథారిటీ అని అంటారు. వారు తప్పకుండా ఇక్కడకు వచ్చి వెళ్ళారు. ఇప్పుడిది కలియుగమా లేక సత్యయుగమా? కొత్త ప్రపంచమా లేక పాత ప్రపంచమా? అని ముందు అడగాలి. లక్ష్యం-ఉద్దేశ్యం మీ ఎదురుగా నిలబడి ఉంది. ఈ లక్ష్మీనారాయణులు ఒకవేళ ఇక్కడ ఉండి ఉంటే వారి రాజ్యముండేది. ఇది పాత ప్రపంచము, అక్కడ పేదరికమే ఉండదు. ఇప్పుడైతే కేవలం వీరి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. మందిరాలలో మోడల్స్ చూపిస్తారు. లేదంటే వారిక్కడ ఉన్నట్లయితే భవనాలు, తోటలు మొదలైనవి ఎంత పెద్దవిగా ఉంటాయి, కేవలం మందిరాలలోనే ఉండరు. ప్రెసిడెంటు ఇల్లు ఎంత పెద్దది. దేవీ-దేవతలైతే పెద్ద-పెద్ద మహళ్ళలో ఉంటారు. చాలా స్థలం ఉంటుంది. అక్కడ భయపడటం మొదలైన విషయాలేవీ ఉండవు. ఎల్లప్పుడూ పూదోటగానే ఉంటుంది. ముళ్ళు ఉండనే ఉండవు. అది ఉన్నదే పూదోట. అక్కడ కట్టెలు మొదలైనవి కాల్చరు. కట్టెలు కాల్చినప్పుడు పొగ వస్తే దుఃఖము కలుగుతుంది. అక్కడ మనము చాలా చిన్న స్థలంలో ఉంటాము. తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది. చాలా మంచి తోటలుంటాయి, సుగంధం వస్తూ ఉంటుంది. అడవులు ఉండనే ఉండవు. ఇప్పుడు దానిని చూడలేకపోయినా, అనుభూతి కలుగుతుంది. మీరు ధ్యానములో పెద్ద-పెద్ద మహళ్ళు మొదలైనవి చూసి వస్తారు, వాటిని ఇక్కడ కట్టలేరు. సాక్షాత్కారమైన తర్వాత మాయమైపోతాయి. సాక్షాత్కారం అయ్యింది కదా. రాజులు, రాకుమారి-రాకుమారులు ఉంటారు. చాలా రమణీకమైన స్వర్గముంటుంది. ఎలాగైతే ఇక్కడ మైసూరు మొదలైనవి రమణీకంగా ఉంటాయో, అదే విధంగా అక్కడ చాలా మంచి గాలులు వీస్తూ ఉంటాయి. జలపాతాలు ప్రవహిస్తూ ఉంటాయి. మేము మంచి-మంచి వస్తువులు తయారుచేయాలని ఆత్మ భావిస్తుంది. ఆత్మకు స్వర్గమైతే గుర్తుకొస్తుంది కదా.

ఏమేమి ఉంటాయి, మనమెక్కడ ఉంటామని పిల్లలైన మీకు రియలైజ్ అవుతుంది. ఈ సమయంలో ఈ స్మృతి ఉంటుంది. మీరెంత అదృష్టవంతులో చిత్రాలలో చూడండి. అక్కడ దుఃఖమనే విషయమే ఉండదు. మనము స్వర్గములో ఉండేవారము, తర్వాత క్రిందికి దిగిపోయాము. ఇప్పుడు మళ్ళీ స్వర్గములోకి వెళ్ళాలి. అక్కడకు ఎలా వెళ్ళాలి? తాడుకు వ్రేలాడుతూ వెళ్తారా? ఆత్మలైన మనము శాంతిధామ నివాసులము. ఇప్పుడు మీరు మళ్ళీ దేవతలుగా అవుతున్నారు మరియు ఇతరులను తయారుచేస్తున్నారని తండ్రి స్మృతినిప్పించారు. ఇంట్లో కూర్చునే ఎంతో మంది సాక్షాత్కారాలు చూస్తారు. బంధనములో ఉండేవారు ఎప్పుడూ చూసి ఉండరు. ఆత్మకు ఎంత ఉత్సాహము కలుగుతుంది. తన ఇల్లు సమీపించే కొద్దీ ఆత్మకు సంతోషము కలుగుతుంది. బాబా నాకు జ్ఞానమునిచ్చి అలంకరించేందుకు వచ్చారని అర్థం చేసుకుంటారు. చివరికి ఒక రోజు వార్తా ప్రతికలలో కూడా వస్తుంది. ఇప్పుడు నింద-స్తుతి, మానావమానాలు అన్నీ ఎదురుగా వస్తాయి. కల్ప క్రితము కూడా ఇలాగే జరిగిందని మీకు తెలుసు, ఏ సెకెండు అయితే గతించిందో దాని చింతన చేయకూడదు. కల్పక్రితము కూడా వార్తాపత్రికలలో ఇలాగే వచ్చింది. మళ్ళీ పురుషార్థము చేయడం జరుగుతుంది. ఏ హంగామాలైతే జరిగాయో, అవి జరిగిపోయాయి. పేరైతే అందరికీ తెలిసింది కదా. మీరు మళ్ళీ బదులు ఇస్తారు. కొందరు చదువుతారు, కొందరు చదవరు. తీరిక లభించదు. ఇతర పనులలో మునిగిపోతారు. ఇది అనంతమైన పెద్ద డ్రామా అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. టిక్ టిక్ అని నడుస్తూ ఉంటుంది, చక్రము తిరుగుతూ ఉంటుంది. ఒక్క సెకెండులో ఏదైతే గతించిందో, అది మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. జరిగిపోయినదాని గురించి సెకెండు తర్వాత ఆలోచన కలుగుతుంది. ఈ పొరపాటు జరిగిపోయింది, డ్రామాలో రచింపబడిపోయింది. కల్పక్రితము కూడా ఇలాగే తప్పు జరిగింది, ఇప్పుడు గతించిపోయింది. ఇప్పుడు మున్ముందు ఇక చెయ్యము అనుకుంటారు. పురుషార్థము చేస్తూ ఉంటారు. పదే-పదే ఈ పొరపాటు చెయ్యడం మంచిది కాదు, ఈ కర్మ మంచిది కాదు అని మీకు అర్థము చేయించడం జరుగుతుంది. నా ద్వారా ఈ తప్పుడు పని జరిగింది అని మనస్సు తింటూ ఉంటుంది. ఈ విధంగా చేయవద్దు, ఎవరికైనా దుఃఖం కలుగుతుంది అని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. వద్దు అని చెప్పడం జరుగుతుంది. ఈ పని చేయకండి, అడగకుండా వస్తువు తీసుకుంటే, దానిని దొంగతనము అని అంటారని తండ్రి తెలియజేస్తూ ఉంటారు. ఇటువంటి పనులు చేయకండి. కఠినంగా మాట్లాడకండి. ఈ రోజులలో ప్రపంచం ఎలా ఉందో చూడండి - ఎవరైనా పనివాడిపై కోపం చేస్తే, అతడు కూడా శత్రుత్వం చూపించడం ప్రారంభిస్తాడు. అక్కడ పులి-మేక పరస్పరము క్షీరఖండం వలె ఉంటాయి. ఉప్పు నీరు మరియు క్షీరఖండము. సత్యయుగంలో మనుష్యాత్మలందరూ పరస్పరంలో క్షీరఖండం వలె ఉంటారు. మరియు ఈ రావణ ప్రపంచంలో మనుష్యులందరూ ఉప్పు నీరులా ఉన్నారు. తండ్రి కొడుకులు కూడా ఉప్పు నీరులానే ఉన్నారు. కామము మహాశత్రువు కదా. కామ ఖడ్గాన్ని నడిపిస్తూ ఒకరికొకరు దుఃఖము కలిగిస్తారు. ఈ ప్రపంచమంతా ఉప్పు నీరులా ఉంది. సత్యయుగ ప్రపంచము క్షీరఖండము. ఈ విషయాలు ప్రపంచములోని వారికేమి తెలుసు. మనుష్యులైతే స్వర్గానికి లక్షల సంవత్సరాలని అంటారు. కనుక ఏ విషయము బుద్ధిలోకి రాలేదు. దేవతలుగా ఉన్న వారికే స్మృతిలోకి వస్తుంది. ఈ దేవతలు సత్యయుగంలో ఉండేవారని మీకు తెలుసు. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో వారే మళ్ళీ వచ్చి చదువుకుంటారు మరియు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. ఇది తండ్రి యొక్క ఏకైక యూనివర్సిటీ, దీని శాఖలు వెలువడుతూ ఉంటాయి. ఖుదా వచ్చినప్పుడు మీరు వారికి సహాయకులుగా అవుతారు, మీ ద్వారా స్వయంగా ఖుదా రాజ్యాన్ని స్థాపన చేస్తారు. మేము ఈశ్వరీయ సేవాధారులమని మీరు అర్థం చేసుకుంటారు. వారు దైహిక సేవ చేస్తారు, ఇది ఆత్మిక సేవ. బాబా ఆత్మలైన మనకు ఆత్మిక సేవ నేర్పిస్తున్నారు, ఎందుకంటే ఆత్మనే తమోప్రధానమైపోయింది. బాబా మళ్ళీ సతోప్రధానంగా చేస్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని బాబా అంటారు. ఇది యోగాగ్ని. భారతదేశపు ప్రాచీన యోగము గాయనం చేయబడింది కదా. కృత్రిమ యోగాలైతే చాలా ఉన్నాయి కనుక స్మృతియాత్ర అని అనడం రైట్ అని బాబా అంటారు. శివబాబాను స్మృతి చేస్తూ-చేస్తూ మీరు శివపురిలోకి వెళ్ళిపోతారు. అది శివపురి. మరొకటి విష్ణుపురి. ఇది రావణపురి. విష్ణుపురి తర్వాత రామపురి ఉంటుంది. సూర్యవంశము తర్వాత చంద్ర వంశముంటుంది. ఇది సాధారణ విషయము. అర్థకల్పము సత్య-త్రేతా యుగాలు, అర్థకల్పము ద్వాపర-కలియుగాలు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు. ఎవరైతే బాగా ధారణ చేస్తారో, వారు ఇతరులకు కూడా అర్థము చేయిస్తారు. మేము పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నాము. ఈ విషయం ఎవరి బుద్ధిలో గుర్తున్నా కూడా మొత్తం డ్రామా బుద్ధిలోకి వచ్చేస్తుంది. కానీ కలియుగీ దేహ సంబంధీకులు మొదలైనవారు గుర్తుకొస్తూ ఉంటారు. మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి అని బాబా అంటారు. సర్వుల సద్గతిదాత, రాజయోగము నేర్పించేవారు ఒక్కరు మాత్రమే, అందువలన శివబాబా జయంతి మాత్రమే మొత్తం ప్రపంచాన్ని మారుస్తుందని తండ్రి అర్థం చేయించారు. మేమిప్పుడు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నామని బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. బ్రాహ్మణులకు మాత్రమే రచయిత మరియు రచనల జ్ఞానము బుద్ధిలో ఉంటుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరికైనా దుఃఖము కలిగించే కర్మలేవీ చేయకూడదు. కఠినమైన మాటలు మాట్లాడకూడదు. చాలా-చాలా క్షీరఖండముగా అయి ఉండాలి.

2. ఏ దేహధారినీ మహిమ చేయకూడదు. మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారని బుద్ధిలో ఉండాలి, ఆ ఒక్కరినే మహిమ చేయాలి, ఆత్మిక సేవాధారులుగా అవ్వాలి.

వరదానము:-

సర్వుల గుణాలను చూస్తూ స్వయంలో తండ్రి గుణాలను ధారణ చేసే గుణమూర్త్ భవ

సంగమయుగంలో ఏ పిల్లలైతే గుణాల మాలను ధారణ చేస్తారో వారే విజయమాలలోకి వస్తారు, కావున హోలీ హంసలుగా అయి అందరి గుణాలను చూడండి మరియు ఒక్క తండ్రి గుణాలను స్వయంలో ధారణ చేయండి, ఈ గుణమాల అందరి మెడలో ఉండాలి. ఎవరు ఎంతగా స్వయంలో తండ్రి గుణాలను ధారణ చేస్తారో, వారి మెడలో అంత పెద్ద మాల పడుతుంది. గుణమాలను స్మరిస్తే స్వయం కూడా గుణమూర్తులుగా అవుతారు. దీనికి స్మృతిచిహ్నంగానే దేవతలు మరియు శక్తుల మెడలో మాలను చూపిస్తారు.

స్లోగన్:-

సాక్షీ స్థితియే యథార్థమైన నిర్ణయానికి సింహాసనము.