ఓంశాంతి. జ్ఞానం యొక్క మూడవ నేత్రమునిచ్చే ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. కనుక ఇప్పుడు పిల్లలకు జ్ఞాన నేత్రము లభించింది. భక్తి మార్గము అంధకార మార్గమని ఇప్పుడు తండ్రి అర్థము చేయించారు. రాత్రివేళ వెలుతురు లేని కారణంగా మనుష్యులు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. బ్రహ్మా రాత్రి, బ్రహ్మా పగలు అని గాయనము కూడా ఉంది. సత్యయుగంలో ‘‘మాకు మార్గము చూపండి’’ అని అనరు, ఎందుకంటే ఇప్పుడు మీకు మార్గము లభిస్తుంది. తండ్రి వచ్చి ముక్తిధామము మరియు జీవన్ముక్తిధామానికి మార్గము చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు పురుషార్థము చేస్తున్నారు. ఇంకా కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది, ఈ ప్రపంచం మారనున్నది అని మీకు తెలుసు. ప్రపంచం మారనున్నది (దునియా బదల్నే వాలీ హై)..... అనే పాట కూడా ఉంది కానీ పాపం మనుష్యులకు ప్రపంచం ఎప్పుడు మారనున్నది, ఎలా మారనున్నది, ఎవరు మారుస్తారు అనేది తెలియదు. ఎందుకంటే జ్ఞానం యొక్క మూడవ నేత్రము లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రము లభించింది. దీనితో మీరు ఈ సృష్టిచక్రం యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇదే మీ బుద్ధిలో ఉన్న జ్ఞాన శ్యాక్రీన్. ఎలాగైతే శ్యాక్రీన్ కొద్దిగా అయినా సరే చాలా తియ్యగా ఉంటుందో, అలా ఈ జ్ఞానం యొక్క రెండు పదాలు ‘మన్మనాభవ’..... ఇవే అన్నింటికంటే మధురమైనవి, కేవలం తండ్రిని స్మృతి చేయండి.
తండ్రి వస్తారు, వచ్చి దారి చూపిస్తారు. ఎక్కడికి దారి చూపిస్తారు? శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళే మార్గాన్ని చూపిస్తారు. కనుక పిల్లలకు సంతోషము కలుగుతుంది. వేడుకలు ఎప్పుడు జరుపుకుంటారు అనేది ప్రపంచానికి తెలియదు. అసలైన వేడుకలు కొత్త ప్రపంచంలో జరుపుకొబడతాయి కదా. పాత ప్రపంచములో సంతోషము ఎక్కడ నుండి వస్తుంది, ఇది చాలా సామాన్యమైన విషయము. పాత ప్రపంచంలో మనుష్యులు ‘త్రాహి త్రాహి’ అని అంటున్నారు ఎందుకంటే తమోప్రధానంగా ఉన్నారు. తమోప్రధాన ప్రపంచంలో సంతోషం ఎక్కడ నుండి వస్తుంది? సత్యయుగ జ్ఞానమైతే ఎవ్వరిలోనూ లేదు, అందుకే పాపం వారు ఇక్కడే వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. క్రిస్మస్ వేడుకలను కూడా ఎంతగా జరుపుకుంటూ ఉంటారో చూడండి. ఒకవేళ సంతోషం గురించి అడగాలంటే గోప-గోపికలను (నా పిల్లలను) అడగండి అని బాబా అంటారు. ఎందుకంటే తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ మీ వ్యాపార వ్యవహారాలను చేసుకుంటూ కమల పుష్ప సమానంగా ఉండండి మరియు నన్ను స్మృతి చేయండి. ఉదాహరణకు ప్రేయసీ-ప్రియులు ఉంటారు కదా, వారు కూడా వారి-వారి పనులు చేసుకుంటూ ఒకరినొకరు తలచుకుంటూ ఉంటారు. వారికి సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. లైలా-మజ్ను, హీరా-రాంఝా మొదలైనవారు వికారాల కోసం పరస్పరములో ప్రేమించుకోరు. వారి ప్రేమ గాయనం చేయబడింది. వారు ఒకరినొకరు ప్రేమించుకుంటారు కానీ ఇక్కడ అలాంటి విషయము కాదు. ఇక్కడైతే మీరు జన్మ జన్మాంతరాలుగా ఆ ప్రియునికి ప్రేయసులుగానే ఉన్నారు. ఆ ప్రియుడు మీకు ప్రేయసి కాదు. ఇక్కడకు రమ్మని మీరు వారిని - ‘‘ఓ భగవంతుడా! మీరు వచ్చి కనులు లేనివారికి దారి చూపండి’’ అని పిలుస్తారు. మీరు అర్ధకల్పము పిలిచారు. దుఃఖము ఎక్కువైనప్పుడు ఎక్కువగా పిలుస్తారు. ఎక్కువ దుఃఖములో ఎక్కువగా స్మరణ చేసేవారు కూడా ఉంటారు. ఇప్పుడు స్మృతి చేసేవారు ఎంతమంది ఉన్నారో చూడండి. దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు..... అని గాయనం చేయబడింది కదా. ఎంతగా ఆలస్యమవుతూ ఉంటుందో, అంత ఎక్కువగా తమోప్రధానమవుతూ ఉంటారు. మీరు పైకి ఎక్కుతూ ఉన్నారు, వారు ఇంకా కిందకు దిగుతూ ఉన్నారు, ఎందుకంటే ఎప్పటివరకైతే వినాశనమవ్వదో, అప్పటివరకు తమోప్రధానత వృద్ధి చెందుతూ ఉంటుంది. రోజురోజుకూ మాయ కూడా తమోప్రధానమవుతూ, వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ సమయంలో తండ్రి కూడా సర్వశక్తివంతుడే, అలాగే మాయ కూడా సర్వశక్తివంతమైనదే, అది కూడా శక్తిశాలిగా ఉన్నది.
పిల్లలైన మీరు ఈ సమయంలో బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణ కులభూషణులు. మీది సర్వోత్తమ కులము, దీనిని అత్యంత ఉన్నతమైన కులమని అంటారు. ఈ సమయంలో మీ జీవితం చాలా అమూల్యమైనది, కావుననే ఈ జీవితాన్ని (శరీరాన్ని) సంభాళన కూడా చేయాలి ఎందుకంటే పంచ వికారాల కారణంగా శరీర ఆయువు కూడా తగ్గిపోతూ ఉంటుంది కదా. అందుకే ఇప్పుడు పంచ వికారాలను వదిలి యోగములో ఉన్నట్లయితే ఆయువు పెరుగుతూ ఉంటుంది అని బాబా అంటున్నారు. ఆయువు పెరుగుతూ-పెరుగుతూ భవిష్యత్తులో మీ ఆయువు 150 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అలా లేదు. అందుకే ఈ శరీరాన్ని కూడా చాలా జాగ్రత్తగా సంభాళించుకోవాలి అని తండ్రి అంటారు. లేదంటే ఈ శరీరము పనికి రాదు, ఇది మట్టి బొమ్మ అని అంటారు. ఎప్పటివరకైతే జీవించి ఉంటారో, అప్పటివరకు బాబాను స్మృతి చేయాలని పిల్లలైన మీకు వివేకం లభించింది. ఆత్మ బాబాను స్మృతి చేస్తుంది - ఎందుకు? వారసత్వము కోసము. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మరియు దైవీ గుణాలను ధారణ చేయండి, అప్పుడు మీరు మళ్ళీ ఇలా లక్ష్మీ- నారాయణులుగా అవుతారు అని తండ్రి అంటారు. కావున పిల్లలు చదువును బాగా చదువుకోవాలి. చదువులో సోమరితనము మొదలైనవి ఉండకూడదు లేదంటే ఫెయిల్ అయిపోతారు. చాలా చిన్న పదవి లభిస్తుంది. చదువులో కూడా ముఖ్యమైన విషయమేమిటంటే అనగా సారమేమిటంటే - తండ్రిని స్మృతి చేయండి. ప్రదర్శినిలో లేక సెంటరుకు ఎవరైనా వస్తే, వారికి మొట్టమొదట ‘‘బాబాను స్మృతి చేయండి’’ అని అర్థం చేయించండి, ఎందుకంటే వారు అత్యంత ఉన్నతమైనవారు. అత్యంత ఉన్నతమైనవారినే స్మృతి చేయాలి. అంతకంటే తక్కువవారిని స్మృతి చేయకూడదు. ఉన్నతోన్నతుడు భగవంతుడని అంటారు. భగవంతుడే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. చూడండి, కొత్త ప్రపంచ స్థాపనను నేను చేస్తాను అని తండ్రి అంటున్నారు. అందుకే మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి అని తండ్రి అంటున్నారు. ఇది పక్కాగా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే తండ్రి పతితపావనుడు కదా. నన్ను మీరు పతితపావనుడు అని అంటున్నారు అంటే మీరు తమోప్రధానంగా, చాలా పతితంగా ఉన్నారు, ఇప్పుడు మీరు పావనంగా అవ్వండి అని తండ్రి అంటున్నారు.
తండ్రి వచ్చి పిల్లలకు అర్థము చేయిస్తున్నారు - ఇప్పుడు మీ సుఖము యొక్క రోజులు రానున్నవి, దుఃఖము యొక్క రోజులు సమాప్తమైపోయాయి. నన్ను మీరు ఓ దుఃఖహర్త-సుఖకర్త అని కూడా పిలుస్తారు కావున సత్యయుగంలో అందరికీ సుఖమే సుఖముంటుందని తెలుసు కదా. కనుక అందరూ శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి అని తండ్రి పిల్లలకు చెప్తున్నారు. ఇది సంగమయుగము. నావికుడు మిమ్మల్ని తీరానికి తీసుకువెళ్తారు. ఇందులో నావికుడు లేక నావ యొక్క విషయమేమీ లేదు. నావను తీరానికి చేర్చమని వారి మహిమను చేస్తారు. ఇప్పుడు ఒక్కరి నావను మాత్రమే తీరానికి చేర్చరు కదా. మొత్తం ప్రపంచ నావనంతటినీ తీరానికి చేర్చాలి. ఈ మొత్తం ప్రపంచము ఒక పెద్ద నావ లాంటిది. దీనిని వారు తీరానికి చేరుస్తారు. కనుక పిల్లలైన మీరు చాలా వేడుక జరుపుకోవాలి ఎందుకంటే మీ కొరకు సదా సంతోషమే, సదా క్రిస్మస్ పండుగే. ఎప్పటినుండైతే పిల్లలైన మీకు తండ్రి లభించారో, అప్పటి నుండి మీకు సదా క్రిస్మస్ పండుగే, అందుకే అతీంద్రియ సుఖము గాయనం చేయబడింది. చూడండి, వీరు సదా సంతోషంగా ఉంటారు, ఎందుకు? అరే! అనంతమైన తండ్రి లభించారు కదా. వారు మనల్ని చదివిస్తున్నారు కావున రోజూ ఈ సంతోషము ఉండాలి కదా. అనంతమైన తండ్రి చదివిస్తున్నారు, వాహ్! ఇది ఎప్పుడైనా ఎవరైనా విన్నారా? గీతలో కూడా భగవానువాచ, నేను మీకు రాజయోగము నేర్పిస్తాను అని ఉంది. ఎలాగైతే వారు బ్యారిస్టరీ యోగము, సర్జన్ యోగము మొదలైనవాటిని నేర్పిస్తారో, అలా నేను ఆత్మిక పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మీరిక్కడకు వచ్చినప్పుడు తప్పకుండా రాజయోగాన్ని నేర్చుకునేందుకు వస్తారు కదా. ఇందులో తికమకపడే అవసరము లేదు. కావున రాజయోగాన్ని నేర్చుకొని పూర్తి చెయ్యాలి కదా. పారిపోకూడదు. చదువుకోవాలి మరియు ధారణ కూడా బాగా చెయ్యాలి. ధారణ చేసేందుకే టీచరు చదివిస్తారు.
ప్రతి ఒక్కరికీ తమ-తమ బుద్ధి ఉంటుంది. కొంతమంది బుద్ధి ఉత్తమంగా, కొంతమందిది మధ్యమంగా, కొంతమందిది కనిష్టంగా ఉంటుంది. కావున, నేను ఉత్తమంగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా లేక కనిష్టంగా ఉన్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. నేను ఇటువంటి అత్యంత ఉన్నతమైన పరీక్షను పాస్ అయి, ఉన్నత పదవిని పొందేందుకు అర్హునిగా అయ్యానా, నేను సేవ చేస్తున్నానా అని మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి. తండ్రి అంటున్నారు - పిల్లలూ! సేవాధారులుగా అవ్వండి, బాబాను అనుసరించండి. ఎందుకంటే నేను కూడా సేవ చేస్తున్నాను కదా. నేను సేవ చేసేందుకే వచ్చాను మరియు ప్రతిరోజు సేవ చేస్తాను ఎందుకంటే రథమును కూడా తీసుకున్నాను కదా. రథము కూడా చాలా దృఢంగా, బాగా ఉంది మరియు వీరి సేవ సదా ఉంది. బాప్ దాదా అయితే వీరి రథములో సదా ఉంటారు. ఇతని శరీరానికి అనారోగ్యం చేసినా కానీ నేనైతే కూర్చున్నాను కదా. కావున నేను ఇతనిలో కూర్చుని వ్రాస్తాను కూడా. ఇతను నోటితో మాట్లాడలేకపోయినా కానీ నేనైతే వ్రాయగలను. మురళీ అయితే మిస్ అవ్వదు. ఎప్పటివరకైతే కూర్చోగలరో, వ్రాయగలరో, అప్పటివరకు నేను మురళీని కూడా మ్రోగిస్తాను, పిల్లలకు వ్రాసి పంపిస్తాను, ఎందుకంటే నేను సేవాధారిని కదా. కావున మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి సేవలో నిమగ్నమవ్వండి అని తండ్రి వచ్చి అర్థము చేయిస్తున్నారు. బాబా సర్వీస్ అనగా ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్. ఎలాగైతే వారు ఆన్ హిస్ మెజెస్టీ సర్వీస్ (మహారాజుగారి సేవలో) అని వ్రాస్తారో, అలా మీరేమంటారు? ఇది మెజెస్టీ సేవ కంటే ఉన్నతమైన సేవ ఎందుకంటే వారు మెజెస్టీ (మహారాజు) గా తయారుచేస్తారు. మేము తప్పకుండా ప్రపంచానికి యజమానులుగా అవుతామని కూడా మీరు అర్థము చేసుకోగలరు.
పిల్లలైన మీలో ఎవరైతే మంచి పురుషార్థము చేస్తారో, వారిని మహావీరులని అంటారు. బాబా డైరెక్షన్ పై నడిచే మహావీరులెవరు అని చెక్ చేయవలసి ఉంటుంది. పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి, సోదర ఆత్మను చూడండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి స్వయాన్ని ‘సోదరులందరి తండ్రిని’ అని భావిస్తారు మరియు సోదరులనే చూస్తారు. వారు అందరినీ చూడరు కదా. శరీరము లేకుండా ఎవరూ వినలేరు, మాట్లాడలేరు అన్న జ్ఞానమైతే మీకు ఉంది. నేను కూడా ఇక్కడ శరీరములోకి వచ్చానని మీకు తెలుసు కదా. నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను. శరీరమైతే అందరికీ ఉంది. శరీరంతోటే ఆత్మ ఇక్కడ చదువుకుంటుంది. కనుక ఇప్పుడు బాబా మమ్మల్ని చదివిస్తున్నారని ఆత్మలు అర్థము చేసుకోవాలి. బాబా ఎక్కడ కూర్చున్నారు? అకాల సింహాసనము పై. ప్రతి ఆత్మ అకాల మూర్తి అని తండ్రి అర్థము చేయించారు. అది ఎప్పుడూ వినాశనమవ్వదు. ఎప్పుడూ తగులబడదు, ఖండించబడదు, మునగదు. అది చిన్నదిగా-పెద్దదిగా అవ్వదు. శరీరము చిన్నదిగా-పెద్దదిగా అవుతుంది. కనుక ప్రపంచములో మనుష్యమాత్రులెవరైతే ఉన్నారో, వారి ఆత్మల సింహాసనము ఈ భృకుటి. శరీరాలు వేరు వేరుగా ఉన్నాయి. ఒకరి అకాల సింహాసనము పురుషునిదైతే, మరొకరిది స్త్రీది, ఇంకొకరిది చిన్న పిల్లలది. కావున ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడినప్పుడు, నేను ఆత్మను, నా సోదరునితో మాట్లాడుతున్నాను అని భావించండి. శివబాబాను స్మృతి చేసినట్లయితే ఈ తుప్పు ఏదైతే పట్టిందో, అది తొలగిపోతుందని శివబాబా సందేశాన్ని ఇవ్వండి. బంగారములో కల్తీ కలిస్తే దాని విలువ తగ్గిపోయినట్లుగా, ఇప్పుడు మీ విలువ కూడా తగ్గిపోయింది. ఇప్పుడైతే పూర్తిగా విలువలేనివారిగా అయిపోయారు. దీనిని దివాలా తీయడమని కూడా అంటారు. భారతదేశము ఎంత సంపన్నంగా ఉండేది. ఇప్పుడు అప్పులు తీసుకుంటూ ఉంటారు. వినాశనంలో అందరి ధనము సమాప్తమైపోతుంది. ఇచ్చేవారు, తీసుకునేవారు, అందరూ సమాప్తమైపోతారు. ఇకపోతే, అవినాశీ జ్ఞాన రత్నాలు తీసుకునేవారు ఎవరైతే ఉంటారో, వారు మాత్రం మళ్ళీ వచ్చి తమ భాగ్యాన్ని తీసుకుంటారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రిని ఫాలో చేసి తండ్రి సమానంగా సేవాధారులుగా అవ్వాలి. నేను అత్యంత ఉన్నతమైన పరీక్షలో పాస్ అయ్యి ఉన్నతమైన పదవిని పొందేందుకు అర్హునిగా ఉన్నానా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి.
2. బాబా డైరెక్షన్ పై నడుస్తూ మహావీరులుగా అవ్వాలి. ఏ విధంగా బాబా ఆత్మలను చూస్తారో, ఆత్మలను చదివిస్తారో, అలా ఆత్మ రూపీ సోదరులను చూస్తూ మాట్లాడాలి.