24-12-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఈ శరీరం రూపీ ఆటబొమ్మ ఆత్మ రూపీ చైతన్యమైన తాళంచెవితో నడుస్తుంది, మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకున్నట్లయితే నిర్భయులుగా అయిపోతారు”

ప్రశ్న:-

ఆత్మ శరీరముతో పాటు ఆటను ఆడుతూ కిందికి వచ్చింది, కావున దానికి ఏ పేరును పెడతారు?

జవాబు:-

తోలుబొమ్మ. ఏ విధంగా డ్రామాలో తోలుబొమ్మలాటను చూపిస్తారో, అదే విధంగా ఆత్మలైన మీరు కూడా తోలుబొమ్మల వలె 5 వేల సంవత్సరాలు ఆటను ఆడుతూ కిందికి వచ్చేశారు. తోలుబొమ్మలైన మీకు పైకి ఎక్కే మార్గాన్ని తెలియజేసేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు మీరు శ్రీమతమనే తాళంచెవిని ఉపయోగించినట్లయితే పైకి వెళ్ళిపోతారు.

గీతము:-

సభలో జ్యోతి వెలిగింది..... (మెహఫిల్ మే జల్ ఉఠీ షమా.....)

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి శ్రీమతమునిస్తున్నారు - ఎప్పుడైనా ఎవరి నడవడికైనా బాగా లేకపోతే, "నీకు ఆ ఈశ్వరుడు సద్బుద్ధిని ఇవ్వాలి” అని తల్లితండ్రులు అంటారు. కానీ ఈశ్వరుడు నిజంగానే మతమునిస్తారని పాపం వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది అనగా శ్రేష్ఠంగా తయారయ్యేందుకు ఆత్మిక తండ్రి తమ పిల్లలకు శ్రేష్ఠ మతమునిస్తున్నారు. మేము శ్రేష్ఠాతి-శ్రేష్ఠంగా అవుతున్నామని మీరిప్పుడు అర్థం చేసుకుంటారు. తండ్రి మనకు ఎంత ఉన్నతమైన మతాన్నిస్తున్నారు. మనం వారి మతంపై నడుస్తూ మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము కావున మనుష్యులను దేవతలుగా తయారుచేసేవారు ఆ తండ్రియేనని ఋజువవుతుంది. మనుష్యుల నుండి దేవతలుగా చేసేందుకు క్షణం పట్టదు..... అని సిక్కులు కూడా గాయనము చేస్తారు, అంటే వారు తప్పకుండా మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసే మతమునిస్తారు. ఏక్ ఓంకార్ (ఈశ్వరుడు ఒక్కరే)..... కర్తా పురుష్ (మూల పురుషుడు), నిర్భయుడు..... అని వారి మహిమ కూడా చేయబడుతుంది. మీరందరూ నిర్భయులుగా అయిపోతారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు కదా. ఆత్మకు ఎటువంటి భయము ఉండదు. నిర్భయులుగా అవ్వండి అని తండ్రి అంటారు. మరి ఇక భయమెందుకు. మీకు ఎటువంటి భయము లేదు. మీరు మీ ఇంట్లో కూర్చుని కూడా తండ్రి శ్రీమతాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు శ్రీమతము ఎవరిది? ఎవరిస్తారు? ఈ విషయాలు గీతలోనైతే లేవు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. మీరు పతితులైపోయారు, ఇప్పుడు పావనంగా తయారయ్యేందుకు నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. పురుషోత్తములుగా అయ్యే ఈ మేళా ఇప్పుడు సంగమయుగంలోనే జరుగుతుంది. ఎంతో మంది వచ్చి శ్రీమతాన్ని తీసుకుంటారు. దీనిని ఈశ్వరునితో పాటు పిల్లల మేళా అని అంటారు. ఈశ్వరుడు కూడా నిరాకారుడే. పిల్లలు (ఆత్మలు) కూడా నిరాకారులే. నేను ఆత్మను అనే ఈ అలవాటును పక్కా చేసుకోవాలి. ఏ విధంగా బొమ్మకు ‘కీ’ (తాళంచెవి) ఇచ్చినట్లయితే డాన్స్ చేయడం మొదలుపెడుతుందో, అలా ఆత్మ కూడా ఈ శరీరం రూపీ బొమ్మకు తాళంచెవి వంటిది. ఇందులో ఆత్మ లేకపోతే ఏమీ చేయలేదు. మీరు చైతన్యమైన ఆటబొమ్మలు. బొమ్మలకు ‘కీ’ ఇవ్వనట్లయితే అది పని చేయదు, అలా నిలబడిపోతుంది. ఆత్మ కూడా చైతన్యమైన తాళంచెవి మరియు ఇది అవినాశీ, అమరమైన తాళంచెవి. నేను ఆత్మనే చూస్తాను అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మనే వింటుంది అన్న ఈ అలవాటును పక్కా చేసుకోవాలి. ఈ ‘కీ’ లేకుండా శరీరము నడవదు. ఇతనికి కూడా అవినాశీ తాళంచెవి లభించింది. ఈ తాళంచెవి 5 వేల సంవత్సరాలు నడుస్తుంది. చైతన్యమైన తాళంచెవి అయిన కారణంగా చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇది చైతన్యమైన బొమ్మ. తండ్రి కూడా చైతన్యమైన ఆత్మనే. ఎప్పుడైతే ఈ ‘కీ’ పూర్తవుతుందో, అప్పుడు మళ్ళీ నన్ను స్మృతి చేసినట్లయితే మళ్ళీ 'కీ' తిప్పబడుతుంది అనగా ఆత్మ తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయిపోతుంది అని తండ్రి కొత్తగా యుక్తిని తెలియజేస్తారు. ఉదాహరణకు మోటరులో పెట్రోలు అయిపోతే మళ్ళీ నింపడం జరుగుతుంది కదా. ఇప్పుడు మాలో పెట్రోలు ఎలా నిండుతుంది అని మీ ఆత్మ అర్థము చేసుకుంటుంది. బ్యాటరీ ఖాళీ అయినప్పుడు మళ్ళీ అందులో పవర్ నింపడం జరుగుతుంది కదా. బ్యాటరీ ఖాళీ అయినట్లైతే లైటు సమాప్తమైపోతుంది. ఇప్పుడు మీ ఆత్మ రూపీ బ్యాటరీ నిండుతుంది. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా పవర్ నిండుతూ ఉంటుంది. ఇంతగా 84 జన్మల చక్రాన్ని చుట్టి బ్యాటరీ ఖాళీ అయిపోయింది. సతో, రజో, తమోలలోకి వచ్చింది. ఇప్పుడు ‘కీ’ ఇచ్చేందుకు లేక బ్యాటరీని నింపేందుకు తండ్రి మళ్ళీ వచ్చారు. పవర్ లేకపోతే మనుష్యులు ఎలా అయిపోతారు. కావున ఇప్పుడు స్మృతి ద్వారానే బ్యాటరీని నింపుకోవాలి, వీరిని హ్యూమన్ (మానవ) బ్యాటరీ అని అనవచ్చు. నాతో యోగం జోడించండి అని తండ్రి అంటారు. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. సద్గతిదాత ఆ తండ్రి ఒక్కరే. ఇప్పుడు మీ బ్యాటరీ పూర్తిగా నిండుతుంది, దానితో మళ్ళీ 84 జన్మలు పూర్తిగా పాత్రను అభినయిస్తారు. ఎలాగైతే డ్రామాలో తోలుబొమ్మలు నాట్యం చేస్తాయి కదా, అలా ఆత్మలైన మీరు కూడా ఈ తోలుబొమ్మల వంటివారు. పై నుండి కిందికి దిగుతూ 5 వేల సంవత్సరాలలో పూర్తిగా కిందికి వచ్చేస్తారు, మళ్ళీ తండ్రి వచ్చి పైకి ఎక్కిస్తారు. అదైతే ఒక బొమ్మ. ఎక్కే కళ మరియు దిగే కళ, ఇది 5 వేల సంవత్సరాల విషయమని తండ్రి అర్థాన్ని తెలియజేస్తున్నారు. శ్రీమతం ద్వారా మాకు తాళంచెవి లభిస్తూ ఉందని మీరు అర్థం చేసుకుంటారు. మనము పూర్తిగా సతోప్రధానంగా అయినప్పుడు మొత్తం పాత్రనంతా రిపీట్ చేస్తాము. ఇది అర్థము చేసుకునేందుకు మరియు ఇతరులకు అర్థం చేయించేందుకు ఎంత సహజమైన విషయము. అయినా సరే, కల్పక్రితము అర్థము చేసుకున్నవారే మళ్ళీ అర్థము చేసుకుంటారని తండ్రి అంటారు. మీరు ఎంత తల కొట్టుకున్నా కానీ ఎక్కువేమీ అర్థము చేసుకోరు. తండ్రైతే అందరికీ ఒకే రకమైన వివరణను ఇస్తారు. ఎక్కడ కూర్చున్నా సరే తండ్రిని స్మృతి చేయాలి. మీ ముందు బ్రాహ్మణి లేకపోయినా సరే, మీరు స్మృతిలో కూర్చోవచ్చు. తండ్రి స్మృతి ద్వారానే మన వికర్మలు వినాశనమవుతాయని మీకు తెలుసు. కావున ఆ స్మృతిలో కూర్చుండిపోవాలి. ఎవరూ కూర్చోబెట్టవలసిన అవసరం లేదు. తింటూ-తాగుతూ, స్నానం మొదలైనవి చేస్తూ తండ్రిని స్మృతి చేయండి. కొద్ది సమయం కోసం ఎవరో ఒకరు మీ ముందు కూర్చుంటారు. అలాగని వారు మీకు సహాయం చేస్తారని కాదు. ప్రతి ఒక్కరు తమకు తామే సహాయం చేసుకోవాలి. మీరు ఇలా-ఇలా చేసినట్లయితే మీ బుద్ధి దైవీ బుద్ధిగా అవుతుందని ఈశ్వరుడైతే మతమునిచ్చారు. ఈ టెంప్టేషన్ (ఆశ) ను చూపించడం జరుగుతుంది. శ్రీమతాన్ని అందరికీ ఇస్తూనే ఉంటారు. కానీ కొందరి బుద్ధి మందంగా, కొందరిది చురుకుగా ఉంది. పావనుడితో యోగం కుదరకపోతే, బ్యాటరీ చార్జ్ అవ్వదు. వారు తండ్రి శ్రీమతాన్ని పాటించరు. వారికి యోగమే కుదరదు. మా బ్యాటరీ నిండుతూ ఉందని ఇప్పుడు మీరు ఫీల్ అవుతారు. తమోప్రధానం నుండి సతోప్రధానంగా తప్పకుండా అవ్వాలి. ఈ సమయంలో మీకు పరమాత్మ యొక్క శ్రీమతం లభిస్తూ ఉంది. ఈ విషయాన్ని ప్రపంచం ఏ మాత్రము అర్థం చేసుకోదు. నేను ఇచ్చే ఈ మతము ద్వారా మీరు దేవతలుగా అవుతారు, దీనికన్నా ఉన్నతమైనది మరేదీ ఉండదు అని తండ్రి చెప్తారు. అక్కడ ఈ జ్ఞానముండదు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. మిమ్మల్ని పురుషోత్తములుగా చేసేందుకు తండ్రి సంగమయుగంలోనే వస్తారు, దీని స్మృతిచిహ్నాన్ని భక్తి మార్గంలో జరుపుకుంటారు, దసరా కూడా జరుపుకుంటారు కదా. తండ్రి వచ్చినప్పుడు దసరా జరుగుతుంది. 5 వేల సంవత్సరాల తర్వాత ప్రతి విషయము రిపీట్ అవుతుంది.

పిల్లలైన మీకు మాత్రమే ఈ ఈశ్వరీయ మతము అనగా శ్రీమతము లభిస్తుంది, దీని ద్వారా మీరు శ్రేష్ఠంగా అవుతారు. మీ ఆత్మ సతోప్రధానంగా ఉండేది, అది కిందికి దిగుతూ-దిగుతూ తమోప్రధానంగా, భ్రష్టంగా అయిపోతుంది. మళ్ళీ తండ్రి కూర్చొని జ్ఞాన-యోగాలను నేర్పించి సతోప్రధానంగా, శ్రేష్ఠంగా చేస్తారు. మీరు మెట్లను ఏ విధంగా కిందకు దిగుతారో తెలియజేస్తారు. డ్రామా నడుస్తూ ఉంటుంది. ఈ డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలియదు. మీకిప్పుడు స్మృతి కలిగిందని తండ్రి అర్థము చేయించారు కదా. ప్రతి ఒక్కరి జన్మ కథను వినిపించలేరు. చదివి వినిపించేందుకు అవేమీ వ్రాయబడవు. ఇది తండ్రి కూర్చొని అర్థము చేయిస్తారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, మళ్ళీ మీరే దేవతలుగా అవ్వాలి. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ - ఈ మూడు ధర్మాలను నేను స్థాపన చేస్తానని తండ్రి అర్థము చేయించారు. ఇప్పుడు మేము తండ్రి ద్వారా బ్రాహ్మణ వంశీయులుగా అవుతామని, తర్వాత సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది. ఎవరైతే ఫెయిల్ అవుతారో, వారు చంద్రవంశీయులుగా అవుతారు. ఎందులో ఫెయిల్? యోగంలో. జ్ఞానాన్ని అయితే చాలా సహజంగా అర్థము చేయించారు. మీరు 84 జన్మల చక్రంలో ఎలా తిరుగుతారో తెలియజేశారు. మనుష్యులు 84 లక్షల జన్మలని అన్నందుకు ఎంత దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది. ఈశ్వరుడు ఒక్కసారి మాత్రమే వస్తారు. కావున వారి మతము కూడా ఒక్కసారే లభిస్తుంది. ఒకే దేవీ దేవతా ధర్మముండేది. వారికి తప్పకుండా ఈశ్వరీయ మతము లభించింది, దానికి ముందు సంగమయుగం ఉండేది. తండ్రి వచ్చి ప్రపంచాన్ని మారుస్తారు. మీరిప్పుడు మారుతున్నారు. ఈ సమయంలో తండ్రి మిమ్మల్ని మారుస్తారు. కల్ప-కల్పము మేము మారుతూనే వచ్చాము, మారుతూనే ఉంటామని మీరంటారు. ఇది చైతన్యమైన బ్యాటరీ కదా. అది జడమైనది. 5 వేల సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చారని పిల్లలకు తెలిసింది. శ్రేష్ఠాతి-శ్రేష్ఠమైన మతమును కూడా ఇస్తారు. ఉన్నతోన్నతుడైన భగవంతుని ఉన్నతమైన మతము లభిస్తుంది, దీని ద్వారా మీరు ఉన్నత పదవిని పొందుతారు. మీ వద్దకు ఎవరైనా వచ్చినప్పుడు, మీరు ఈశ్వరుని సంతానం కదా అని చెప్పండి. శివబాబానే ఈశ్వరుడు, శివజయంతిని కూడా జరుపుకుంటారు. వారే సద్గతిదాత. వారికి తమ శరీరము లేదు. మరి ఎవరి ద్వారా మతమునిస్తారు? మీరు కూడా ఆత్మనే, ఈ శరీరము ద్వారా మాట్లాడుతారు కదా. శరీరము లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. నిరాకార తండ్రి కూడా ఎలా రావాలి? వారు రథముపై వస్తారని గాయనం కూడా ఉంది. దీనిని ఒకరు ఒక రకంగా, మరొకరు మరో రకంగా తయారుచేశారు. త్రిమూర్తులను కూడా సూక్ష్మవతనంలో చూపించారు. ఇవన్నీ సాక్షాత్కార విషయాలని తండ్రి అర్థం చేయిస్తారు. నిజానికి రచనంతా ఇక్కడే ఉంది కదా. కావున రచయిత అయిన తండ్రి కూడా ఇక్కడికే రావలసి ఉంటుంది. పతిత ప్రపంచములోకే వచ్చి పావనంగా తయారుచేయాలి. ఇక్కడ పిల్లలను డైరెక్టుగా పావనంగా తయారుచేస్తున్నారు. అర్థము కూడా చేసుకుంటారు కానీ జ్ఞానము బుద్ధిలో కూర్చోదు. ఎవ్వరికీ అర్థము చేయించలేరు. శ్రీమతాన్ని తీసుకోకపోతే శ్రేష్ఠాతి-శ్రేష్ఠంగా అవ్వలేరు. అసలు అర్థమే చేసుకోనివారు ఏ పదవిని పొందుతారు? ఎంత సేవ చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. సేవలో ఎముక-ఎముకను ఇవ్వాలని తండ్రి అన్నారు. ఆల్ రౌండ్ సేవను చేయాలి. తండ్రి సేవలో మేము ఎముకలను సైతం ఇచ్చేందుకు తయారుగా ఉన్నాము. చాలా మంది పిల్లలు సేవ కోసం తపిస్తూ ఉంటారు. బాబా, మమ్మల్ని విడిపించినట్లయితే మేము సేవలో నిమగ్నమవుతాము, అప్పుడు అనేకుల కళ్యాణం జరుగుతుందని అంటారు. పూర్తి ప్రపంచమంతా శారీరిక సేవ చేస్తుంది, దాని వలన మెట్లు కిందకు దిగుతూ వస్తారు. ఇప్పుడీ ఆత్మిక సేవతో ఎక్కే కళ ఏర్పడుతుంది. ఫలానావారు మా కంటే ఎక్కువ సేవ చేస్తున్నారని ప్రతి ఒక్కరు అర్థము చేసుకోగలరు. సేవ చేసే మంచి కన్యలున్నారు, వారు సెంటర్లు కూడా సంభాళించగలరు. క్లాసులో నంబరువారుగా కూర్చుంటారు. ఇక్కడ నంబరువారుగా కూర్చోబెట్టరు, నిరాశపడతారు. కానీ అర్థం చేసుకోగలరు కదా. సేవ చేయకపోతే తప్పకుండా పదవి కూడా తగ్గిపోతుంది. నంబరువారుగా ఎన్నో పదవులు ఉన్నాయి కదా. కానీ అది సుఖధామము, ఇది దుఃఖధామము. అక్కడ వ్యాధులు మొదలైనవేవీ ఉండవు. బుద్ధిని ఉపయోగించవలసి ఉంటుంది. మేము సేవ చేయడం లేదు కావున చాలా తక్కువ పదవిని పొందుతామని అర్థము చేసుకోవాలి. సేవ ద్వారానే పదవి లభిస్తుంది. స్వయాన్ని పరిశీలించుకోవాలి. ప్రతి ఒక్కరికీ తమ స్థితి గురించి తెలుసు. మమ్మా-బాబా కూడా సేవ చేస్తూ వచ్చారు. మంచి-మంచి పిల్లలు కూడా ఉన్నారు. వారు ఉద్యోగంలో ఉన్నా కానీ, హాఫ్ పే (సగం జీతం) పై సెలవు తీసుకుని వెళ్ళి సేవ చేయండి, ఫర్వాలేదు అని వారికి చెప్పడం జరుగుతుంది. ఎవరైతే బాబా హృదయంపైకి ఎక్కుతారో, వారు నంబరువారు పురుషార్థానుసారంగా సింహాసనము పై కూర్చుంటారు. అటువంటివారే విజయమాలలోకి వచ్చేస్తారు. సమర్పణ కూడా అవుతారు, సేవ కూడా చేస్తారు. కొందరు సమర్పణ అవుతారు కానీ సేవ చేయకపోతే పదవి తగ్గిపోతుంది కదా. శ్రీమతము ద్వారా ఈ రాజధాని స్థాపనవుతుంది. ఈ విధంగా ఎప్పుడైనా విన్నారా? లేక చదువు ద్వారా రాజధాని స్థాపనవుతుందని ఎప్పుడైనా విన్నారా, ఎప్పుడైనా చూశారా? దానపుణ్యాదులను చేస్తే రాజుల ఇంట్లో జన్మించవచ్చు. అంతేకానీ చదువు ద్వారా రాజ్యపదవిని పొందుతారని ఎప్పుడూ విని ఉండరు. ఇది ఎవ్వరికీ తెలియదు కూడా. మీరు మాత్రమే పూర్తి 84 జన్మలను తీసుకున్నారని తండ్రి అర్థం చేయిస్తారు. మీరిప్పుడు పైకి వెళ్ళాలి. ఇది చాలా ఈజీ. మీరు కల్ప-కల్పము నంబరువారు పురుషార్థానుసారముగా అర్థము చేసుకుంటారు. తండ్రి ప్రియస్మృతులను కూడా నంబరువారు పురుషార్థానుసారముగానే తెలుపుతారు, సేవలో ఉన్నవారికి చాలా ప్రియస్మృతులను ఇస్తారు. కావున నేను తండ్రి హృదయంపైకి ఎక్కానా, మాలలోని మణిగా అవ్వగలనా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. చదువుకోనివారు తప్పకుండా చదువుకున్నవారి ముందు సేవకులవుతారు. పిల్లలూ, పురుషార్థము చేయండి, కానీ డ్రామాలో పాత్ర లేకపోతే ఎంతగా తల కొట్టుకున్నా (కష్టపడినా) ఎక్కలేరు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఏదో ఒక గ్రహచారము పట్టుకుంటుంది. దేహాభిమానం నుండే ఇతర వికారాలు కూడా వస్తాయి. ముఖ్యమైన, చాలా కఠినమైన రోగం - దేహాభిమానము. సత్యయుగంలో దేహాభిమానమనే పేరే ఉండదు. అక్కడ మీ ప్రారబ్ధము మాత్రమే ఉంటుంది. ఇది తండ్రి మనకు ఇక్కడే అర్థం చేయిస్తారు. ఈ విధంగా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేయండి అన్న శ్రీమతమును ఇతరులెవ్వరూ ఇవ్వరు. ఇది ముఖ్యమైన విషయము. నన్నొక్కరినే స్మృతి చేయండి అని నిరాకార భగవంతుడు చెప్తున్నారని వ్రాయాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మీ దేహాన్ని కూడా స్మృతి చేయకండి. భక్తిలో కూడా ఒక్క శివుని పూజయే చేస్తారు. ఇప్పుడు జ్ఞానాన్ని కూడా నేను మాత్రమే ఇవ్వగలను. మిగిలినదంతా భక్తి, అవ్యభిచారి జ్ఞానము ఒక్క శివబాబా ద్వారానే మీకు లభిస్తుంది. ఈ జ్ఞానసాగరుడి నుండి రత్నాలు వెలువడతాయి. ఆ సాగరుని విషయం కాదు. ఈ జ్ఞానసాగరుడు పిల్లలైన మీకు జ్ఞాన రత్నాలనిస్తారు, దానితో మీరు దేవతలుగా అవుతారు. శాస్త్రాలలో ఏమేమో వ్రాసేశారు. సాగరము నుండి దేవత వచ్చి రత్నాలిచ్చిన్నట్లు వ్రాశారు. ఈ జ్ఞానసాగరుడు పిల్లలైన మీకు రత్నాలిస్తారు. మీరు జ్ఞానరత్నాలను గ్రోలుతారు. ఇంతకుముందు రాళ్ళను ఏరుకునేవారు, కావున రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు. ఇప్పుడు రత్నాలు గ్రోలడంతో మీరు పారసబుద్ధి కలవారిగా అయిపోతారు. పారసనాథులుగా అవుతారు కదా. పారసనాథులైన ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. భక్తి మార్గములో అనేక పేర్లు, అనేక చిత్రాలు తయారుచేసి పెట్టారు. వాస్తవానికి లక్ష్మీనారాయణులన్నా, పారసనాథులన్నా ఒక్కరే. నేపాల్ లో పశుపతినాథుని మేళా జరుగుతుంది, వారు కూడా పారసనాథుడే. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఏ జ్ఞాన రత్నాలనైతే ఇచ్చారో, వాటిని మాత్రమే గ్రోలాలి, రాళ్ళను తీసుకోకూడదు. దేహాభిమానమనే కఠినమైన రోగం నుండి స్వయాన్ని రక్షించుకోవాలి.

2. మీ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకునేందుకు పవర్ హౌస్ అయిన తండ్రితో యోగము జోడించాలి. ఆత్మాభిమానులుగా ఉండేందుకు పురుషార్థము చేయాలి. నిర్భయులుగా ఉండాలి.

వరదానము:-

సర్వ సంబంధాలు మరియు సర్వ గుణాల అనుభూతిలో సంపన్నంగా అయ్యే సంపూర్ణ మూర్త భవ

సంగమయుగంలో విశేషంగా సర్వ ప్రాప్తులతో స్వయాన్ని సంపన్నంగా చేసుకోవాలి, కావున సర్వ ఖజానాలను, సర్వ సంబంధాలను, సర్వ గుణాలను మరియు కర్తవ్యాన్ని ఎదురుగా పెట్టుకుని, అన్ని విషయాలలో అనుభవీగా అయ్యానా అని చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా విషయంలో అనుభవం తక్కువగా ఉన్నట్లయితే, అందులో స్వయాన్ని సంపన్నంగా చేసుకోండి. ఒక్క సంబంధము లేక ఒక్క గుణము తక్కువగా ఉన్నా, సంపూర్ణ స్థితి లేక సంపూర్ణ మూర్తి అని పిలవబడలేరు, కావున తండ్రి గుణాలను మరియు తమ ఆది స్వరూపం యొక్క గుణాలను అనుభవం చేయండి, అప్పుడు సంపూర్ణ మూర్తులుగా అవుతారు.

స్లోగన్:-

ఆవేశంలోకి రావడం కూడా మానసిక రోదనయే - ఇప్పుడు రోధించే (ఏడ్చే) ఫైలును సమాప్తం చేయండి.