19-12-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీరు వచ్చినప్పుడు మేము మీ పై బలిహారం అవుతామని మీరు ప్రతిజ్ఞ చేశారు, మీకు ఈ ప్రతిజ్ఞను గుర్తు చేయించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు”

ప్రశ్న:-

ఏ ముఖ్యమైన విశేషత కారణంగా కేవలం దేవతలను మాత్రమే పూజ్యులని అనగలరు?

జవాబు:-

ఎప్పుడూ ఎవ్వరినీ స్మృతి చేయకపోవడమనేది దేవతల విశేషత. వారు తండ్రినీ గుర్తు చేయరు, ఎవరి చిత్రాలనూ గుర్తు చేయరు, అందుకే వారిని పూజ్యులని అంటారు. అక్కడ సుఖమే సుఖముంటుంది కనుక ఎవ్వరినీ స్మృతి చేయవలసిన అవసరముండదు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రి స్మృతితో ఇటువంటి పూజ్యులుగా, పావనంగా అవుతారు, అప్పుడిక మీకు స్మృతి చేయవలసిన అవసరమే ఉండదు.

ఓంశాంతి. మధురాతి-మధురమైన రుహాని పిల్లలు (ఆత్మిక పిల్లలు)..... ఇప్పుడు రుహాని ఆత్మలని అనరు. రూహ్ అన్నా లేక ఆత్మ అన్నా ఒక్కటే మాట. ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తారు. ఇంతకుముందు ఎప్పుడూ పరమపిత పరమాత్మ ఆత్మలకు జ్ఞానమివ్వలేదు. నేను ఒకేసారి కల్పము యొక్క పురుషోత్తమ సంగమయుగములో వస్తానని తండ్రి స్వయంగా చెప్తారు. ఈ విధంగా ఎవ్వరూ చెప్పలేరు - మొత్తం కల్పములో సంగమయుగములో తప్ప తండ్రి స్వయం ఇంకెప్పుడూ రారు. భక్తి పూర్తయినప్పుడు సంగమయుగములోనే తండ్రి వస్తారు మరియు తండ్రి కూర్చొని పిల్లలకు జ్ఞానమిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలా మంది పిల్లలకు చాలా కష్టమనిపిస్తుంది. వాస్తవానికి ఇది చాలా సహజము కానీ బుద్ధిలో సరైన రీతిలో కూర్చోదు కావున పదే-పదే అర్థం చేయిస్తూ ఉంటారు. అర్థం చేయించినా కూడా అర్థము చేసుకోరు. స్కూల్లో టీచరు 12 నెలలు చదివిస్తారు, అయినా కానీ కొంతమంది ఫెయిల్ అయిపోతారు. ఈ అనంతమైన తండ్రి కూడా పిల్లలకు ప్రతిరోజూ చదివిస్తారు, అయినా కానీ కొంతమందికి ధారణ అవుతుంది, కొంతమంది మర్చిపోతారు. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి - ఈ ముఖ్యమైన విషయమే అర్థం చేయించడం జరుగుతుంది. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రియే అంటారు, ఇతర మనుష్యమాత్రులెవ్వరూ ఎప్పుడూ ఇలా చెప్పలేరు. నేను ఒక్కసారి మాత్రమే వస్తాను, కల్పము తర్వాత మళ్ళీ సంగమయుగములో ఒక్కసారి మాత్రమే పిల్లలైన మీకు మాత్రమే అర్థం చేయిస్తాను అని తండ్రి అంటారు. ఈ జ్ఞానాన్ని మీరు మాత్రమే ప్రాప్తి చేసుకుంటారు, ఇతరులెవ్వరూ తీసుకోరు. ప్రజాపిత బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులైన మీరే ఈ జ్ఞానాన్ని అర్థము చేసుకుంటారు. కల్పక్రితము కూడా తండ్రి ఈ సంగమయుగములో ఈ జ్ఞానాన్ని వినిపించారని మీకు తెలుసు. బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఈ పాత్ర ఉంది, ఈ వర్ణాలలో కూడా తప్పకుండా తిరగవలసిందే. ఇతర ధర్మాల వారు ఈ వర్ణాలలోకి రారు, భారతవాసులే ఈ వర్ణాలలోకి వస్తారు. భారతవాసులే బ్రాహ్మణులుగా అవుతారు, అందుకే తండ్రి భారతదేశములోనే రావలసి వస్తుంది. మీరు ప్రజాపిత బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులు. బ్రాహ్మణుల తర్వాత దేవతలు మరియు క్షత్రియులు ఉంటారు. ఎవ్వరూ క్షత్రియులుగా అవ్వరు. మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారుచేస్తారు, తర్వాత మీరు దేవతలుగా అవుతారు. నెమ్మది-నెమ్మదిగా కళలు తగ్గిపోయినప్పుడు వారినే మళ్ళీ క్షత్రియులని అంటారు. ఆటోమెటిక్ గా క్షత్రియులుగా అవ్వడం జరుగుతుంది. తండ్రి అయితే వచ్చి బ్రాహ్మణులుగా తయారుచేస్తారు, మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా, మళ్ళీ వారే క్షత్రియులుగా అవుతారు. 3 ధర్మాలను ఒక్క తండ్రియే ఇప్పుడు స్థాపన చేస్తారు. అలాగని సత్య, త్రేతా యుగాలలో వారు మళ్ళీ వస్తారని కాదు. మనుష్యులు అర్థము చేసుకోని కారణంగా వారు సత్య, త్రేతాయుగాలలో కూడా వస్తారని అంటారు. నేను ప్రతి యుగములోనూ రాను, నేను ఒక్కసారి మాత్రమే కల్పం యొక్క సంగమయుగంలో వస్తాను అని తండ్రి అంటారు. నేనే ప్రజాపిత బ్రహ్మా ద్వారా మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారుచేస్తాను. నేను పరంధామము నుండి వస్తాను. అచ్ఛా, బ్రహ్మా ఎక్కడ నుండి వస్తారు? బ్రహ్మా 84 జన్మలు తీసుకుంటారు, నేను తీసుకోను. బ్రహ్మా-సరస్వతులే విష్ణువు యొక్క రెండు రూపాలుగా, లక్ష్మీ-నారాయణులుగా అవుతారు, వారే 84 జన్మలు తీసుకుంటారు, మళ్ళీ వారి అనేక జన్మల అంతిమంలో ప్రవేశించి వీరిని బ్రహ్మాగా చేస్తాను. నేను వీరికి బ్రహ్మా అని పేరు పెడతాను. ఇదేమీ వీరి సొంత పేరు కాదు. పిల్లలు జన్మించినప్పుడు 6వ రోజు వేడుకను జరుపుతారు, జన్మ దినాన్ని జరుపుతారు, వీరి జన్మ పత్రికలోని పేరు అయితే లేఖ్ రాజ్. అది బాల్యము నాటి పేరు. సంగమయుగములో వీరిలో తండ్రి ప్రవేశించినప్పుడు పేరు మారింది, అది కూడా వీరు వానప్రస్థ అవస్థలో ఉన్నప్పుడు పేరు మారుస్తారు. ఆ సన్యాసులు ఇళ్ళు-వాకిళ్ళను వదలి వెళ్ళినప్పుడు పేరు మారుతుంది. వీరైతే ఇంట్లోనే ఉంటారు, వీరికి బ్రహ్మా అని పేరు పెట్టారు, ఎందుకంటే బ్రాహ్మణులు కావాలి కదా. మిమ్మల్ని తమవారిగా చేసుకుని పవిత్ర బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. పవిత్రంగా తయారు చేయడం జరుగుతుంది, అంతేకానీ మీరు జన్మించడంతోనే పవిత్రంగా ఉంటారని కాదు. మీకు పవిత్రంగా తయారయ్యేందుకు శిక్షణ లభిస్తుంది. పవిత్రంగా ఎలా అవ్వాలి? ఇదే ముఖ్యమైన విషయము.

భక్తి మార్గములో ఒక్కరు కూడా పూజ్యులుగా ఉండరని మీకు తెలుసు. మనుష్యులు, గురువులు మొదలైనవారికి తల వంచి నమస్కరిస్తారు ఎందుకంటే వాళ్ళు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి పవిత్రంగా అవుతారు, అంతేకానీ వారిని పూజ్యులని అనరు. ఎవ్వరినీ స్మృతి చేయనివారే పూజ్యులు. సన్యాసులు బ్రహ్మతత్వమును స్మృతి చేస్తారు కదా, ప్రార్థన చేస్తారు. సత్యయుగములో ఎవ్వరినీ స్మృతి చేయరు. మీరు ఒక్కరినే స్మృతి చేయాలని ఇప్పుడు తండ్రి అంటారు. అదైతే భక్తి. మీ ఆత్మ కూడా గుప్తంగా ఉంది. ఆత్మ గురించి యథార్థ రీతిగా ఎవ్వరికీ తెలియదు. సత్య, త్రేతాయుగాలలో కూడా శరీరధారులు తమ పేర్లతోనే పాత్రను అభినయిస్తారు. పేరు లేకుండా పాత్రధారులు అవ్వలేరు. ఎక్కడున్నా సరే శరీరానికి తప్పకుండా పేరు ఉంటుంది. పేరు లేకుండా పాత్రనెలా అభినయిస్తారు. మీరు వచ్చినట్లయితే మేము మిమ్మల్నే మా వారిగా చేసుకుంటాము, ఇతరులెవ్వరినీ కాదు అని భక్తి మార్గములో పాడుతారని బాబా అర్థం చేయించారు. మేము మీకు చెందినవారిగానే అవుతాము అని ఆత్మ అంటుంది. భక్తి మార్గములో దేహధారులెవరైతే ఉంటారో, వారికి పేర్లు పెట్టడం జరుగుతుంది, వారిని మనం పూజించము. మీరు వచ్చినప్పుడు మీపైనే బలిహారమవుతాము. ఎప్పుడు వస్తారు అనేది కూడా తెలియదు. అనేక దేహధారులను, నామధారులను పూజిస్తూ ఉంటారు. అర్థకల్పము భక్తి పూర్తయినప్పుడు తండ్రి వస్తారు. మేము మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయము, మా దేహాన్ని కూడా స్మృతి చేయము అని మీరు జన్మ జన్మాంతరాలుగా అంటూ వచ్చారని బాబా అంటారు. కానీ నా గురించి తెలియనే తెలియకపోతే ఎలా స్మృతి చేస్తారు. మధురాతి-మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రియే పతితపావనుడు, వారిని స్మృతి చేస్తే మీరు పావనంగా, సతోప్రధానంగా అవుతారు. సత్య, త్రేతా యుగాలలో భక్తి ఉండదు, మీరు ఎవ్వరినీ స్మృతి చేయరు. తండ్రినీ స్మృతి చేయరు, చిత్రాలనూ స్మృతి చేయరు. అక్కడ సుఖమే సుఖముంటుంది. మీరు ఎంతగా సమీపంగా వస్తూ ఉంటారో, అంతగా కర్మాతీత అవస్థ ఏర్పడుతూ ఉంటుందని తండ్రి అర్థం చేయించారు. సత్యయుగంలో కొత్త ప్రపంచం, కొత్త ఇంట్లో సంతోషము కూడా చాలా ఉంటుంది, తర్వాత 25 శాతము పాతదిగా అయినప్పుడు స్వర్గాన్నే మర్చిపోయినట్లవుతుంది. మీ వారిగానే అవుతాము, మీ నుండే వింటామని మీరు పాడేవారని బాబా అంటారు. కావున తప్పకుండా మీరు పరమాత్మకే చెప్పారు కదా. ఆత్మ పరమాత్మ అయిన తండ్రి కోసం చెప్తుంది. ఆత్మ సూక్ష్మమైన బిందువు, దానిని చూసేందుకు దివ్యదృష్టి కావాలి. ఆత్మపై ధ్యానము పెట్టలేరు. ఆత్మనైన నేను ఇంత చిన్న బిందువును, ఈ విధంగా భావిస్తూ స్మృతి చేయడము శ్రమతో కూడుకున్నది. ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించరు, పరమాత్మ కోసం ప్రయత్నిస్తారు, వారు వెయ్యి సూర్యుల కన్నా తేజోమయుడు అని వారి గురించి విన్నారు. ఎవరికైనా సాక్షాత్కారమయితే, వారు చాలా తేజోమయంగా ఉన్నారని అంటారు ఎందుకంటే అదే విని ఉన్నారు. ఎవరికైతే నవ విధ భక్తి చేస్తారో, వారినే చూస్తారు. లేకపోతే విశ్వాసమే కూర్చోదు. ఆత్మనే చూడకపోతే పరమాత్మను ఎలా చూస్తారని తండ్రి అంటారు. ఆత్మను ఎలా చూడగలరు, మిగిలినవారందరికీ శారీరిక చిత్రాలున్నాయి, పేర్లున్నాయి, కానీ ఆత్మ ఒక బిందువు, చాలా చిన్నది, దానిని ఎలా చూడగలరు. చాలా ప్రయత్నిస్తారు కానీ ఈ కళ్ళతో చూడలేరు. ఆత్మకు జ్ఞానపు అవ్యక్త నేత్రాలు లభిస్తాయి.

ఆత్మలైన మనం ఎంత చిన్నగా ఉంటాము అనేది మీకిప్పుడు తెలుసు. ఆత్మనైన నాలో 84 జన్మల పాత్ర నిండి ఉంది, దానిని నేను రిపీట్ చేయాలి. శ్రేష్ఠంగా తయారయ్యేందుకు తండ్రి శ్రీమతము లభిస్తుంది కనుక దానిపై నడవాలి. మీరు దైవీగుణాలను ధారణ చేయాలి. అన్నపానాదులు రాయల్ గా ఉండాలి, నడవడిక చాలా రాయల్ గా ఉండాలి. మీరు దేవతలుగా అవుతారు. దేవతలు స్వయంగా పూజ్యులు, వారెప్పుడూ ఎవ్వరి పూజను చేయరు. వారు డబుల్ కిరీటధారులు కదా. వారు ఎప్పుడూ ఎవ్వరినీ పూజించరు కనుక పూజ్యులు కదా. సత్యయుగంలో ఎవ్వరినీ పూజించే అవసరమే ఉండదు. కానీ ఒకరికొకరు తప్పకుండా గౌరవమునిస్తారు. ఈ విధంగా నమస్కరించడాన్ని రిగార్డ్ (గౌరవం) అని అంటారు. అలాగని మనసులో వారిని తలచుకోవడం కాదు. గౌరవం అయితే ఇవ్వాల్సిందే. ప్రెసిడెంటును అందరూ గౌరవిస్తారు. వీరు పెద్ద పదవి కలవారు అని తెలుసు. అతడికి నమస్కరించవలసిన అవసరం లేదు. ఈ జ్ఞాన మార్గము పూర్తిగా వేరు, ఇందులో కేవలం స్వయాన్ని ఆత్మగా భావించాలి, దీనిని మీరు మర్చిపోయారని తండ్రి అర్థం చేయిస్తారు. శరీరం యొక్క పేరును స్మృతి చేశారు. పనులైతే తప్పకుండా పేర్లతోనే చేయాలి. పేరు లేకుండా ఎవరినైనా ఎలా పిలుస్తాము. మీరు శరీరధారులై పాత్రను అభినయిస్తారు కానీ బుద్ధితో శివబాబాను స్మృతి చేయాలి. కృష్ణుని భక్తులు, మేము కృష్ణుడినే స్మృతి చేయాలని భావిస్తారు. ఎక్కడ చూసినా, కృష్ణుడే కృష్ణుడని అంటారు. నేనూ కృష్ణుడినే, నీవు కూడా కృష్ణుడివే. అరే, నీ పేరు వేరు, అతని పేరు వేరు..... అందరూ కృష్ణులే కృష్ణులుగా ఎలా అవుతారు. అందరికీ కృష్ణుడు అన్న పేరు ఉండదు, ఏది అనిపిస్తే అది అంటూ ఉంటారు. భక్తిమార్గపు చిత్రాలు మొదలైనవన్నీ మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. చిత్రాలనైతే మీరు పతితపావన అని అనరు, హనుమంతుడు మొదలైనవారు పతితపావనులు కాదు. అనేక చిత్రాలున్నాయి. ఎవ్వరూ పతితపావనులు కారు. శరీరమున్న దేవీలు మొదలైన వారెవ్వరిని పతితపావనులని అనరు. 6-8 భుజాల కల దేవీలు మొదలైనవారిని, అంతా తమ బుద్ధితోనే తయారుచేస్తారు. వారెవరు అన్నది తెలియదు. ఈ పతితపావనుడైన తండ్రికి, పిల్లలు సహాయకులని ఎవ్వరికీ తెలియదు. మీ రూపమైతే సాధారణంగానే ఉంటుంది. ఈ శరీరమైతే వినాశనమైపోతుంది. మీ చిత్రాలు మొదలైనవి ఉంటాయని కాదు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. వాస్తవానికి మీరే దేవీలు. సీతా దేవి, ఫలానా దేవి అని పేర్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. రామ దేవత అని అనరు. ఫలానా దేవీ లేక శ్రీమతి అని అంటారు, అది కూడా తప్పే అవుతుంది. ఇప్పుడు పావనంగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి. పతితుల నుండి పావనంగా చేయండి అని కూడా మీరంటారు. లక్ష్మీ-నారాయణులుగా చేయండి అని అనరు. పతితుల నుండి పావనంగా కూడా తండ్రియే తయారుచేస్తారు. నరుని నుండి నారాయణునిగా కూడా వారే తయారుచేస్తారు. వారు నిరాకారుడిని పతితపావనుడని అంటారు. సత్యనారాయణ కథను వినిపించేవారిని వేరుగా చూపించారు. బాబా, సత్యనారాయణ కథను వినిపించి అమరులుగా చేయండి, నరుని నుండి నారాయణునిగా తయారుచేయండి అని అయితే అనరు. కేవలం మీరు వచ్చి పావనంగా చేయండి అని అంటారు. తండ్రియే సత్యనారాయణ కథను వినిపించి పావనంగా తయారుచేస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు సత్య కథను వినిపిస్తారు. దీనిని ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. మీరు మాత్రమే తెలుసుకుంటారు. మీ ఇంట్లో మిత్రసంబంధీకులు, సోదరులు మొదలైనవారు ఉన్నా కానీ వారు కూడా అర్థం చేసుకోరు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయాన్ని శ్రేష్ఠంగా తయారు చేసుకునేందుకు తండ్రి నుండి లభించే శ్రీమతంపై నడవాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి. అన్నపానాదులు, నడవడిక అన్నీ రాయల్ గా ఉంచుకోవాలి.

2. ఒకరినొకరు స్మృతి చేయకూడదు కానీ తప్పకుండా గౌరవమునివ్వాలి. పావనంగా అయ్యే పురుషార్థము చేయాలి మరియు చేయించాలి.

వరదానము:-

సర్వ ఖజానాలను సమయానికి ఉపయోగిస్తూ నిరంతరం సంతోషం యొక్క అనుభవం చేసే భాగ్యశాలి ఆత్మ భవ

బాప్ దాదా ద్వారా బ్రాహ్మణ జన్మ లభించడంతోనే రోజంతటి కోసం అనేక శ్రేష్ఠమైన సంతోషపు ఖజానాలు ప్రాప్తిస్తాయి. అందుకే మీ పేరుతోనే ఇప్పటివరకు అనేకమంది భక్తులు అల్పకాలిక సంతోషంలోకి వచ్చేస్తారు, మీ జడ చిత్రాలను చూసి సంతోషంలో నాట్యం చేయడం మొదలుపెడతారు. ఈ విధంగా మీరందరూ అదృష్టవంతులు, మీకు చాలా ఖజానాలు లభించాయి, కానీ కేవలం వాటిని సమయానికి ఉపయోగించండి. తాళంచెవిని సదా ఎదురుగా ఉంచుకోండి అనగా సదా స్మృతిలో ఉంచుకోండి మరియు స్మృతిని స్వరూపంలోకి తీసుకురండి, అప్పుడు నిరంతరం సంతోషం యొక్క అనుభవమవుతూ ఉంటుంది.

స్లోగన్:-

తండ్రి యొక్క శ్రేష్ఠమైన ఆశల దీపాన్ని వెలిగించేవారే కులదీపకులు.