ఓంశాంతి. ఇప్పుడిక పాటలు వినే అవసరముండదు. ఎక్కువగా భక్తులే పాటలు పాడుతారు మరియు వింటారు. మీరైతే చదువు చదువుకుంటున్నారు. ఈ పాటలు కూడా విశేషంగా పిల్లల కోసమే తయారుచేయబడ్డాయి. తండ్రి మా భాగ్యాన్ని ఉన్నతంగా చేస్తున్నారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనము ఆ తండ్రినే స్మృతి చేయాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి. మీ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. జమ అవుతూ ఉందా లేక నష్టము కలుగుతూ ఉందా అని చూసుకోవాలి. నాలో ఎటువంటి లోపాలు లేవు కదా. నా భాగ్యానికి నష్టము కలిగించేలా ఏమైనా లోపాలు ఉంటే వాటిని తొలగించాలి. ఈ సమయంలో ప్రతి ఒక్కరు తమ భాగ్యాన్ని ఉన్నతంగా చేసుకోవాలి. ఒక్క తండ్రిని తప్ప ఇతరులెవ్వరినీ స్మృతి చేయకపోతేనే మనము లక్ష్మీనారాయణులుగా అవ్వగలమని మీరు ఇతరులకు అర్థము చేయిస్తారు. ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరిని చూస్తున్నా సరే బుద్ధియోగము అక్కడ ఒక్కరితోనే జోడింపబడి ఉండాలి. ఆత్మలమైన మనము ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఒక్క నాపై తప్ప ఇతరులెవ్వరిపై మనస్సు పెట్టుకోకండి, దైవీ గుణాలను ధారణ చేయండి అని తండ్రి ఆజ్ఞ లభించి ఉంది. ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయ్యాయి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి రాజ్యంలో మొదటి నంబరు తీసుకోండి. రాజ్య పదవి నుండి క్రిందపడి ప్రజల్లోకి, ప్రజల్లో కూడా క్రిందకు వెళ్ళిపోయేలా అవ్వకండి. మీరు స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రిని, టీచరును స్మృతి చేస్తూ ఉంటే మనకు ఎటువంటి శిక్షలు లభించకూడదు అన్న భయముంటుంది. పాపకర్మలు చేయడం వలన శిక్షలు అనుభవించవలసి ఉంటుందని భక్తిలో కూడా భావిస్తారు. పెద్ద తండ్రి (శివబాబా) యొక్క డైరెక్షన్లు ఈ సమయంలోనే లభిస్తూ ఉంటాయి, దానినే శ్రీమతము అని అంటారు. శ్రీమతము ద్వారా మేము శ్రేష్ఠంగా అవుతామని పిల్లలకు తెలుసు. ఎక్కడైనా మేము శ్రీమతానికి విరుద్ధంగా ఏమీ చేయడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఏ విషయమైతే బాగా అనిపించదో, అది చేయకూడదు. ఇప్పుడు మీరు మంచి-చెడులను బాగా అర్థము చేసుకున్నారు, ఇంతకుముందు తెలిసేది కాదు. జన్మ జన్మాంతరాలకు మీరు చేసే కర్మలు అకర్మలుగా అయ్యే విధంగా మీరిప్పుడు కర్మలను నేర్చుకుంటున్నారు. ఈ సమయంలో అందరిలోనూ 5 భూతాలు ప్రవేశించి ఉన్నాయి. ఇప్పుడు మంచి రీతిలో పురుషార్థము చేసి కర్మాతీతులుగా అవ్వాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. సమయం నాజుకుగా అవుతూ ఉంది, ప్రపంచం పాడైపోతూ ఉంది. రోజు రోజుకు ఇంకా ఎక్కువగా పాడవుతూనే ఉంటుంది. ఈ ప్రపంచముతో మీకు ఎటువంటి సంబంధము లేనట్లుగా ఉండాలి. మీకు స్థాపన అవ్వబోతున్న కొత్త ప్రపంచముతో సంబంధం ఉంది. కొత్త ప్రపంచ స్థాపన చేసేందుకు మీరు నిమిత్తులుగా అవుతారు అని మీకు తెలుసు. కావున ఎదురుగా ఏదైతే లక్ష్యము ఉందో, అలా తయారవ్వాలి. లోపల ఎటువంటి ఆసురీ గుణాలు ఉండకూడదు. ఆత్మిక సేవలో నిమగ్నమై ఉన్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది. ప్రదర్శినీలు, మ్యూజియంలు మొదలైనవి తయారుచేస్తారు. ఎంతోమంది వస్తారు, వారికి తండ్రి పరిచయమిస్తాము, తర్వాత వారు కూడా తండ్రిని స్మృతి చేస్తారని మీరు భావిస్తారు. సేవాకేంద్రాలు తెరవాలి, సేవ పెంచాలి అనే ఆలోచనలే రోజంతా నడుస్తూ ఉండాలి. ఈ రత్నాలన్నీ మీ వద్ద ఉన్నాయి. తండ్రి దైవీ గుణాలను కూడా ధారణ చేయిస్తారు మరియు ఖజానాలను కూడా ఇస్తారు. మీరిక్కడ కూర్చుని ఉన్నారు, సృష్టి ఆదిమధ్యాంతాలను మీరు బుద్ధితో తెలుసుకున్నారు. మీరు పవిత్రంగా కూడా ఉంటారు. మనసా-వాచా-కర్మణా ఎటువంటి చెడు కర్మలు చేయకూడదు అని పూర్తిగా చెక్ చేసుకుంటూ ఉండాలి. పతితులను పావనంగా చేసేందుకే తండ్రి వచ్చారు. దాని కోసం యుక్తులు కూడా తెలియజేస్తూ ఉంటారు. అందులోనే రమిస్తూ ఉండాలి. సేవాకేంద్రాలను తెరిచి అనేకమందికి నిమంత్రణ ఇవ్వాలి. ప్రేమగా కూర్చుని అర్థం చేయించాలి. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. ముందుగా కొత్త ప్రపంచ స్థాపన చాలా అవసరము. సంగమయుగములో స్థాపన జరుగుతుంది. ఇప్పుడిది సంగమయుగమని కూడా మనుష్యులకు తెలియదు. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనము యొక్క సంగమ సమయమని కూడా అర్థము చేయించాలి. శ్రీమతము అనుసారంగా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ కొత్త ప్రపంచ స్థాపనకు మతమును ఇవ్వరు. తండ్రియే వచ్చి పిల్లలైన మీ ద్వారా కొత్త ప్రపంచ ప్రారంభోత్సవము చేయిస్తారు. వారు ఒంటరిగా చేయరు కదా. పిల్లలందరి సహాయాన్ని తీసుకుంటారు. ఇతరులు ప్రారంభోత్సవము చేసేందుకు ఇలా సహాయము తీసుకోరు. వారు వచ్చి కత్తెరతో రిబ్బను కత్తిరిస్తారు. ఇక్కడ కత్తిరించే విషయము లేదు. ఇందులో బ్రాహ్మణ కులభూషణులైన మీరు సహాయకులుగా అవుతారు. మనుష్య మాత్రులందరూ దారి తెలియక తికమక చెంది ఉన్నారు. పతిత ప్రపంచాన్ని పావనంగా చేయడము - ఇది తండ్రి కర్తవ్యమే. తండ్రియే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు, దీని కోసం ఆత్మిక జ్ఞానాన్నిస్తారు. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వద్ద యుక్తులున్నాయని మీకు తెలుసు. భక్తిమార్గములో ఓ పతితపావనా, రండి అని వారిని పిలుస్తారు కదా. శివుడిని పూజిస్తూ కూడా ఉంటారు కానీ పతితపావనుడు ఎవరు అన్నది వారికి తెలియదు. దుఃఖములో ఓ భగవంతుడా, ఓ రామా అని స్మృతి చేస్తారు. రాముడు అని నిరాకారుడినే అంటారు. నిరాకారుడినే ఉన్నతమైన భగవంతుడని అంటారు. కానీ మనుష్యులు చాలా తికమక చెంది ఉన్నారు. తండ్రి వచ్చి బయటకు తీశారు. పొగ మంచులో మనుష్యులు తికమకపడుతూ ఉంటారు కదా. ఇది అనంతమైన విషయము. మీరు చాలా పెద్ద అడవిలోకి వచ్చి పడ్డారు. మనము ఎలాంటి అడవిలో పడి ఉండేవారిమి అన్నది తండ్రి మనకు అనుభవము చేయించారు. ఇది పాత ప్రపంచము, ఇప్పుడిది అంతమవుతుంది అని కూడా ఇప్పుడు మీకు తెలిసింది. మనుష్యులకు మార్గం పూర్తిగా తెలియనే తెలియదు. తండ్రిని పిలుస్తూ ఉంటారు. మీరిప్పుడు పిలవరు. ఇప్పుడు పిల్లలైన మీకు డ్రామా ఆదిమధ్యాంతాలు తెలుసు. అది కూడా నంబరువారుగా తెలుసు. ఎవరైతే తెలుసుకున్నారో, వారు చాలా సంతోషంగా ఉంటారు. ఇతరులకు కూడా మార్గం తెలిపేందుకు తత్పరులై ఉంటారు. తండ్రి అయితే పెద్ద-పెద్ద సెంటర్లు తెరవమని చెప్తూ ఉంటారు. పెద్ద-పెద్ద చిత్రాలుంటే మనుష్యులు సహజంగా అర్థము చేసుకోగలరు. పిల్లల కోసం (చిత్రాలు) తప్పకుండా కావాలి. ఇది కూడా ఒక పాఠశాల అని చెప్పాలి. ఇవి ఇక్కడి అద్భుతమైన మ్యాపులు, ఆ స్కూల్లోని మ్యాపులలో హద్దులోని విషయాలుంటాయి. ఇవి అనంతమైన విషయాలు. ఇది కూడా పాఠశాలనే, ఇక్కడ తండ్రి మనకు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తెలియజేసి అర్హులుగా తయారుచేస్తారు. ఇది మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే ఈశ్వరీయ పాఠశాల. ఈశ్వరీయ విశ్వ విద్యాలయమని కూడా వ్రాయబడి ఉంది. ఇది ఆత్మిక పాఠశాల. కేవలం ఈశ్వరీయ విశ్వ విద్యాలయమని వ్రాసినా మనుష్యులు అర్థము చేసుకోలేరు, యూనివర్సిటీ అని కూడా వ్రాయాలి. ఇటువంటి ఈశ్వరీయ విశ్వ విద్యాలయము ఇంకేదీ లేదు. బాబా కార్డులను చూసారు, అందులో కొన్ని పదాలు మర్చిపోయారు. ప్రజాపిత అనే పదాన్ని తప్పకుండా వ్రాయమని తండ్రి ఎన్ని సార్లు చెప్పినా పిల్లలు మర్చిపోతూ ఉంటారు. పూర్తిగా వ్రాయబడి ఉండాలి. తద్వారా ఇది ఈశ్వరుని పెద్ద కాలేజి అని మనుష్యులకు తెలియాలి. మంచి సేవాధారి పిల్లలు ఎవరైతే సేవలో ఉంటారో, వారికి కూడా ఫలానా సెంటరు డల్ గా ఉంది, మనము వెళ్ళి దానిని పైకి తీసుకువారాలి, వారిని మేల్కొలపాలని ఉంటుంది, ఎందుకంటే మాయ పదే-పదే నిద్రపోయేలా చేస్తుంది. నేను స్వదర్శన చక్రధారిని అని కూడా మర్చిపోతారు. మాయ చాలా అపోజిషన్ చేస్తుంది. మీరు యుద్ధ మైదానములో ఉన్నారు. మాయ తలను ప్రక్కకు తిప్పేసి వ్యతిరేక మార్గములో తీసుకువెళ్ళకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయా తుఫానులైతే అందరికీ చాలా వస్తూ ఉంటాయి. చిన్న, పెద్ద అందరూ యుద్ధ మైదానంలోనే ఉన్నారు. పహల్వానులను మాయ తుఫానులు కదిలించలేవు, అటువంటి స్థితి కూడా రానున్నది.
సమయము చాలా పాడైపోయింది, పరిస్థితులు కూడా పాడైపోయాయి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పటి ఈ రాజరికం అంతా సమాప్తమయ్యేదే ఉంది. అందరినీ దించేస్తారు. ఆ తర్వాత ప్రపంచమంతటా ప్రజలపై ప్రజా రాజ్యము ఉంటుంది. మీరు మీ కొత్త రాజ్యాన్ని స్థాపన చేసినప్పుడు, ఇక్కడ రాజ్యము అన్న పేరు కూడా సమాప్తం అయిపోతుంది. పంచాయతీ రాజ్యం ఏర్పడుతూ ఉంటుంది. ప్రజల రాజ్యము ఉన్నప్పుడు పరస్పరములో కొట్లాడుకుంటూ, గొడవపడుతూ ఉంటారు. స్వ రాజ్యము అనగా రామరాజ్యము వాస్తవానికి ఇప్పుడు లేనే లేదు, అందుకే ప్రపంచమంతటా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ రోజుల్లో అన్నివైపులా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మనము మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. మీరు అందరికీ మార్గాన్ని తెలియజేస్తారు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటున్నారు. తండ్రి స్మృతిలో ఉంటూ, దేహీ-అభిమానులుగా అవ్వండి, దేహాభిమానాన్ని వదలండి అని ఇతరులకు కూడా అర్థం చేయించండి. అలాగని మీలో అందరూ దేహీ-అభిమానులుగా అయ్యారని కాదు. ఇంకా అవ్వలేదు, అవ్వాలి. మీరు పురుషార్థము చేస్తారు, ఇతరుల చేత కూడా పురుషార్థం చేయిస్తారు. స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు, మళ్ళీ మర్చిపోతారు. ఇదే పురుషార్థము చేయాలి. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. స్మృతి చేయమని పిల్లలకు ఎంతగానో అర్థం చేయిస్తారు. చాలా మంచి జ్ఞానము లభిస్తుంది. ముఖ్యమైనది పవిత్రంగా ఉండడం. పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు, ఇక మళ్ళీ పతితులుగా అవ్వకూడదు. స్మృతి ద్వారానే మీరు సతోప్రధానంగా తయారవుతారు. ఇది మర్చిపోకూడదు. ఇందులోనే మాయ విఘ్నాలను కలిగించి మరపింపజేస్తుంది. తండ్రిని స్మృతి చేసి సతోప్రధానంగా అవ్వాలి అనే చింత రాత్రింబవళ్ళు ఉండాలి. స్మృతి అనేది ఎంత పక్కాగా ఉండాలంటే - చివర్లో ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు. ప్రదర్శినీలో కూడా - వీరు అందరికీ తండ్రి, ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు అని మొట్టమొదట అర్థం చేయించాలి. వీరే అందరికీ తండ్రి, పతితపావనుడు, సద్గతిదాత. స్వర్గ రచయిత కూడా వీరే.
తండ్రి సంగమయుగములోనే వస్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రియే రాజయోగాన్ని నేర్పిస్తారు. పతితపావనుడు వారొక్కరు తప్ప ఇతరులెవ్వరూ అవ్వలేరు. ముందుగా తండ్రి పరిచయము ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరికీ ఒక్కొక్క చిత్రము గురించి కూర్చుని అర్థము చేయిస్తే, అంతమందికి ఎలా అర్థము చేయించగలరు. ముందుగా తండ్రి చిత్రము చూపించి అర్థము చేయించడం చాలా ముఖ్యం. భక్తి అపారంగా ఉంది కానీ జ్ఞానమైతే ఇదొక్కటే అని అర్థము చేయించాలి. తండ్రి పిల్లలకు ఎన్ని యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమే. వారే మార్గాన్ని కూడా తెలియజేస్తారు. గీతను ఎప్పుడు వినిపించారు అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. ద్వాపరయుగాన్ని సంగమయుగమని అనడం జరగదు. ప్రతి యుగములోనూ తండ్రి రారు. మనుష్యులు పూర్తిగా తికమక చెంది ఉన్నారు. ఎవరెవరికి ఎలా అర్థం చేయించాలి అని రోజంతా ఇదే ఆలోచన నడుస్తూ ఉండాలి. తండ్రి డైరెక్షన్ ఇవ్వవలసి వస్తుంది. పూర్తి మురళీని టేపు ద్వారా కూడా వినవచ్చు. మేము టేపు ద్వారా వింటున్నాము, మరి డైరెక్టుగా ఎందుకు వినకూడదని కొందరు అంటారు, కావున సమ్ముఖములోకి వస్తారు. పిల్లలు చాలా సేవ చేయాలి. మార్గం చూపించాలి. ప్రదర్శినీలోకి వస్తారు - బాగుంది, బాగుంది అని కూడా అంటారు, మళ్ళీ బయటకు వెళ్తూనే మాయావీ వాయుమండలంలో అంతా ఎగిరిపోతుంది. స్మరణ చేయరు. వారిని మళ్ళీ కలుస్తూ ఉండాలి. బయటకు వెళ్ళగానే మాయ తనవైపు లాగేసుకుంటుంది. వ్యాపార-వ్యవహారాల్లో నిమగ్నమైపోతారు, అందుకే మధువనానికి మహిమ ఉంది. మీకిప్పుడు జ్ఞానము లభించింది. మీరు అక్కడకు కూడా వెళ్ళి అందరికీ గీతా భగవంతుడెవరు అనేది అర్థము చేయిస్తారు. ఇంతకుముందు మీరు కూడా ఇలాగే వెళ్ళి తల వంచేవారు. ఇప్పుడు మీరు పూర్తిగా మారిపోయారు. భక్తిని వదిలేశారు. మీరిప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలు ఎవరు అన్నది ఇతరులకేమి తెలుసు. వాస్తవానికి మీరు కూడా ప్రజాపిత బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలే అని మీరు అర్థం చేయిస్తారు. ఈ సమయంలోనే బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది. బ్రాహ్మణ కులము కూడా తప్పకుండా కావాలి కదా. సంగమయుగంలో బ్రాహ్మణ కులముంటుంది. ఇంతకుముందు బ్రాహ్మణుల పిలక ఎంతో ప్రసిద్ధముగా ఉండేది. పిలకతో లేక జంధ్యముతో వీరు హిందువులని గుర్తించేవారు. ఇప్పుడు ఆ గుర్తులు కూడా లేవు. మనము బ్రాహ్మణులమని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. బ్రాహ్మణులుగా అయిన తర్వాతనే దేవతలుగా అవ్వగలరు. బ్రాహ్మణులే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేశారు. యోగబలముతో సతోప్రధానంగా అవుతున్నారు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఎటువంటి ఆసురీ గుణము ఉండకూడదు. ఉప్పునీరుగా అవ్వకూడదు. ఇది యజ్ఞము కదా. యజ్ఞము ద్వారానే అందరి సంభాళన జరుగుతూ ఉంటుంది. యజ్ఞములో సంభాళించే ట్రస్టీలు కూడా ఉంటారు. శివబాబాయే యజ్ఞానికి యజమాని. ఈ బ్రహ్మా కూడా ట్రస్టీయే. యజ్ఞాన్ని సంభాళించవలసి ఉంటుంది. పిల్లలైన మీరు ఏది కావాలంటే అది యజ్ఞము నుండి తీసుకోవచ్చు. ఇతరులెవరి నుండైనా తీసుకుని ధరిస్తే వారే గుర్తుకువస్తూ ఉంటారు. ఇందులో బుద్ధి లైను చాలా క్లియర్గా (స్పష్టంగా) ఉండాలి. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. సమయం చాలా తక్కువగా ఉంది, కావున స్మృతియాత్ర పక్కాగా ఉండాలి. ఈ పురుషార్థమే చేయాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మీ ఉన్నతి కోసం ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి. ఏ జ్ఞాన రత్నాలైతే లభించాయో, వాటిని ధారణ చేసి ఇతరులచేత ధారణ చేయించాలి.
2. నాలో ఎటువంటి ఆసురీ గుణాలు లేవు కదా, నేను ట్రస్టీగా (నిమిత్తంగా) ఉంటున్నానా, ఎప్పుడూ ఉప్పు నీరుగా అవ్వడం లేదు కదా, బుద్ధి లైను క్లియర్ గా ఉందా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి.