08-12-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - తండ్రి ఎవరో, ఎలా ఉంటారో, వారిని యథార్థంగా గుర్తించి స్మృతి చేయండి, దీనికోసం మీ బుద్ధిని విశాలంగా తయారుచేసుకోండి”

ప్రశ్న:-

తండ్రిని పేదలపాలిటి పెన్నిధి అని ఎందుకంటారు?

జవాబు:-

ఎందుకంటే ఈ సమయంలో మొత్తం ప్రపంచం నిరుపేదగా అనగా దుఃఖమయంగా అయినప్పుడు అందరినీ దుఃఖము నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు. అంతేకానీ ఎవరిపైనైనా దయ కలిగి బట్టలివ్వడం, ధనమునివ్వడం, ఇవేవీ అద్భుతమైన విషయాలు కావు. వీటితో వారేమీ షావుకార్లుగా అవ్వరు. అలాగని నేను ఈ ఆటవికులకు ధనమునిచ్చి పేదలపాలిటి పెన్నిధి అని పిలిపించుకోను. నేను పేదలకు అనగా పతితులకు, ఎవరిలోనైతే జ్ఞానము లేదో, వారికి జ్ఞానమునిచ్చి పావనంగా తయారుచేస్తాను.

గీతము:-

ప్రపంచాన్ని మర్చిపోయే వసంతకాలమిదే..... (యహీ బహార్ హై దునియా కో భూల్ జానే కి.....)

ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. పాట అయితే ప్రాపంచంలోని మనుష్యులు పాడారని పిల్లలకు తెలుసు. ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి అన్న పదాలు చాలా బాగున్నాయి. ఇంతకుముందు ఇలా అర్థం చేసుకునేవారు కాదు. కొత్త ప్రపంచములోకి వెళ్ళాలంటే తప్పకుండా పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి అని కలియుగీ మనుష్యులకు కూడా అర్థం కాదు. పాత ప్రపంచాన్ని విడిచిపెట్టాలని అర్థం చేసుకుంటారు కానీ వారు ఇంకా చాలా సమయం ఉందని భావిస్తారు. కొత్తది నుండి పాతదిగా అవుతుందని అయితే అర్థం చేసుకుంటారు కానీ ఎక్కువ సమయాన్ని రాయడంతో మర్చిపోయారు. ఇప్పుడు కొత్త ప్రపంచము స్థాపనౌతుంది కనుక పాత ప్రపంచాన్ని మర్చిపోవాలని మీకిప్పుడు స్మృతినిప్పించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మర్చిపోతే ఏమవుతుంది? మనము ఈ శరీరాన్ని వదిలి కొత్త ప్రపంచములోకి వెళ్తాము. కానీ అజ్ఞాన కాలములో ఇటువంటి విషయాల అర్థము వైపు ఎవ్వరి ధ్యాస వెళ్ళదు. తండ్రి ఏ విధంగానైతే అర్థము చేయిస్తారో, ఆ విధంగా అర్థము చేయించేవారు ఎవ్వరూ లేరు. మీరు దీని అర్థాన్ని తెలుసుకోగలరు. తండ్రి చాలా సాధారణంగా ఉంటారని కూడా పిల్లలకు తెలుసు. అనన్యులైన మంచి-మంచి పిల్లలు కూడా పూర్తిగా అర్థము చేసుకోరు. వీరిలోకి శివబాబా వస్తారని మర్చిపోతారు. ఏదైనా డైరెక్షన్ ఇస్తే, ఇది శివబాబా డైరెక్షన్ అని అర్థం చేసుకోరు. శివబాబాను రోజంతా మర్చిపోయినట్లుగా ఉంటారు. పూర్తిగా అర్థము చేసుకోని కారణంగా ఆ పని చేయరు. మాయ స్మృతి చేయనివ్వదు. ఆ స్మృతి స్థిరంగా నిలవదు. శ్రమ చేస్తూ-చేస్తూ అంతిమంలో ఆ స్థితి తప్పకుండా ఏర్పడనున్నది. ఈ సమయంలో కర్మాతీత స్థితిని పొందేవారు ఎవ్వరూ లేరు. తండ్రి ఎవరో, ఎలా ఉన్నారో, వారిని తెలుసుకునేందుకు విశాల బుద్ధి కావాలి.

బాప్ దాదా వేడినిచ్చే బట్టలు ధరిస్తారా అని మిమ్మల్ని అడుగుతారు. ఇరువురికీ ఉన్నాయని మీరు చెప్తారు. నేను వేడినిచ్చే బట్టలను ధరించను అని శివబాబా అంటారు. నాకు చలి అనిపించదు. అయితే, ఎవరిలోనైతే ప్రవేశించానో వారికి చలి అనిపిస్తుంది. నాకు ఆకలి గానీ, దాహం గానీ ఏమీ అనిపించదు. నేనైతే నిర్లేపిని. సేవ చేస్తూ కూడా ఈ విషయాలన్నిటి నుండి అతీతంగా ఉంటాను. నేను తినను, త్రాగను. ఒక సాధువు కూడా "నేను తినను, త్రాగను.....” అని అనేవారు కదా. అతను తర్వాత కృత్రిమ వేషాన్ని ధరించారు. చాలా మంది దేవతల పేర్లను కూడా పెట్టుకున్నారు. ఇంకే ధర్మములోనూ దేవీ దేవతలుగా అవ్వరు. ఇక్కడ ఎన్ని మందిరాలున్నాయి. బయట అయితే ఒక్క శివబాబాను మాత్రమే నమ్ముతారు. తండ్రి ఒక్కరే ఉంటారని బుద్ధి కూడా చెప్తుంది. తండ్రి ద్వారా మాత్రమే వారసత్వము లభిస్తుంది. కల్పం యొక్క ఈ పురుషోత్తమ సంగమయుగములోనే బాబా నుండి వారసత్వము లభిస్తుందని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మనము సుఖధామములోకి వెళ్ళినప్పుడు మిగిలినవారంతా శాంతిధామములో ఉంటారు. మీలో కూడా ఈ వివేకం నంబరువారుగా ఉంది. ఒకవేళ జ్ఞానం ఆలోచనల్లోనే ఉన్నట్లయితే వారి మాటలు కూడా అవే వెలువడుతాయి. మీరు బాబా ద్వారా రూప-బసంత్ లుగా అవుతున్నారు. మీరు రూప్ కూడా మరియు బసంత్ కూడా. మేము రూప్-బసంతులమని ప్రపంచములో ఇంకెవ్వరూ చెప్పలేరు. మీరిప్పుడు చదువుకుంటున్నారు, చివరి వరకు నంబరువారు పురుషార్థానుసారంగా చదువుకుంటారు. శివబాబా ఆత్మలైన మన తండ్రి కదా. ఇది కూడా మనస్ఫూర్తిగా అనిపిస్తుంది కదా. భక్తి మార్గములో మనస్ఫూర్తిగా అనిపించదు. ఇక్కడ మీరు సమ్ముఖంలో కూర్చున్నారు. తండ్రి ఈ సమయంలోనే వస్తారని, తర్వాత ఇంకే సమయంలోనూ తండ్రి వచ్చే అవసరం ఉండదని మీకు తెలుసు. సత్యయుగము నుండి త్రేతాయుగము వరకు వారు వచ్చేది లేదు. ద్వాపరం నుండి కలియుగం వరకు కూడా రారు. వారు కల్పం యొక్క సంగమయుగములోనే వస్తారు. తండ్రి పేదలపాలిటి పెన్నిధి అనగా దుఃఖమయంగా, నిరుపేదగా అయిపోతున్న మొత్తం ప్రపంచానికి వారు తండ్రి. వీరి హృదయంలో ఏముంటుంది? నేను పేదలపాలిటి పెన్నిధిని, అందరి దుఃఖము మరియు పేదరికము తొలగిపోవాలని ఉంటుంది. అది జ్ఞానముతో తప్ప ఇంకదేనితోనూ తగ్గదు. అంతేకానీ బట్టలు మొదలైనవి ఇచ్చినట్లయితే ఎవ్వరూ షావుకార్లుగా అయితే అయిపోరు కదా. పేదవారిని చూస్తే వారికి బట్టలు ఇవ్వాలని అనిపిస్తుంది, ఎందుకంటే నేను పేదలపాలిటి పెన్నిధిని అని గుర్తుకొస్తుంది కదా. దానితో పాటు ఈ విధంగా కూడా అనుకుంటాను - నేనేమీ ఈ ఆటవికులకు మాత్రమే పేదలపాలిటి పెన్నిధిని కాదు. నేను పేదలపాలిటి పెన్నిధిని, ఎవరైతే పూర్తిగా పతితంగా ఉన్నారో, వారిని పావనంగా తయారుచేస్తాను. నేను పతితపావనుడను. నేను పేదలపాలిటి పెన్నిధిని అని ఆలోచన వస్తుంది కానీ ధనము మొదలైనవి ఎలా ఇస్తాను. ధనము మొదలైనవి ఇచ్చేవారైతే ప్రపంచములో చాలామంది ఉన్నారు. చాలా ఫండ్స్ వస్తాయి, వాటిని అనాథాశ్రమాలకు పంపిస్తారు. అనాథలుగా అంటే నాథుడు లేనివారు అని అర్థం అని వారికి తెలుసు. అనాథలనగా పేదవారు. మీకు కూడా నాథుడు ఉండేవారు కాదు అనగా తండ్రి ఉండేవారు కాదు. మీరు పేదవారిగా ఉండేవారు, జ్ఞానం ఉండేది కాదు. రూప్-బసంతులు కానివారు నిరుపేదలు, అనాథలు. రూప్-బసంత్ లుగా ఉన్నవారిని సనాథలని అంటారు. షావుకార్లను సనాథలని, పేదవారిని అనాథలని అంటారు. అందరూ పేదవారిగా ఉన్నారు, వారికేదైనా ఇవ్వాలని మీ బుద్ధిలో ఉంటుంది. తండ్రి పేదలపాలిటి పెన్నిధి కనుక సదా కోసం షావుకార్లుగా అయ్యేలాంటి వస్తువులివ్వమని వారు చెప్తారు. అంతేకానీ ఈ బట్టలు మొదలైనవి ఇవ్వడమైతే సాధారణ విషయము. మనం వాటిలోకి ఎందుకు వెళ్ళాలి. మనం వారిని అనాథల నుండి సనాథులుగా చేయాలి. ఎవరు ఎంత పదమపతి అయినా కానీ, అదంతా కూడా అల్పకాలము కోసమే. ఇది ఉన్నదే అనాథల ప్రపంచము. ధనవంతులైనా కానీ అదంతా అల్పకాలికమైనదే. అక్కడ సదా సనాథులుగా ఉంటారు. అక్కడ ఈ విధంగా కర్మలను నిందించుకోరు. ఇక్కడ ఎంతమంది పేదవారు ఉన్నారు. ఎవరి వద్దనైతే ధనముందో, వారికి మేము స్వర్గములో ఉన్నామన్న నషా ఎక్కి ఉంటుంది. కానీ అలా కాదని మీకు తెలుసు. ఈ సమయంలో మనుష్యులెవ్వరూ సనాథులు కారు, అందరూ అనాథులు. ఈ ధనము మొదలైనవన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. మా వద్ద ఇంత ధనము ఉంది, దీనిని పుత్రులు-మనమళ్ళు తింటూ ఉంటారు, పరంపరగా కొనసాగుతుంది అని మనుష్యులు భావిస్తారు. కానీ అలా ఏమీ కొనసాగదు. ఇదంతా వినాశనమైపోతుంది కనుక మీకు ఈ మొత్తం పాత ప్రపంచము పట్ల వైరాగ్యముంది.

కొత్త ప్రపంచాన్ని స్వర్గమని, పాత ప్రపంచాన్ని నరకమని అంటారని మీకు తెలుసు. బాబా మనల్ని కొత్త ప్రపంచం కోసం షావుకార్లుగా చేస్తున్నారు. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. తండ్రి ఎంత షావుకార్లుగా తయారుచేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు షావుకార్లుగా ఎలా అయ్యారు? ఎవరైనా షావుకార్ల నుండి వారసత్వం లభించిందా లేక యుద్ధము చేశారా? ఏ విధంగా ఇతరులు రాజ్య సింహాసనాన్ని పొందారో, వీరు అలాగే పొందారా? లేక కర్మలనుసారముగా ఈ ధనం లభించిందా? తండ్రి కర్మలు నేర్పించే విధానం పూర్తిగా అతీతమైనది. కర్మ-అకర్మ-వికర్మలనే పదాలు కూడా స్పష్టంగా ఉన్నాయి కదా. శాస్త్రాలలో కొన్ని పదాలున్నాయి, పిండిలో ఉప్పు అంత ఉన్నాయి. ఇన్ని కోట్ల మంది మనుష్యులెక్కడ, తర్వాత 9 లక్షల మంది మిగులుతారు. 1/4 శాతము కూడా ఉండరు. కావున దీనిని పిండిలో ఉప్పంత అని అంటారు. ప్రపంచమంతా వినాశనమైపోతుంది. సంగమయుగంలో చాలా కొద్ది మంది ఉంటారు. కొంతమంది ముందే శరీరాన్ని వదిలి వెళ్తారు. తర్వాత వారు రిసీవ్ చేసుకుంటారు. మొగలి అనే అమ్మాయి ఉండేది, తాను చాలా బాగా ఉండేది కనుక చాలా మంచి ఇంటిలోనే జన్మ తీసుకొని ఉంటుంది. సుఖములోనే నంబరువారుగా జన్మ తీసుకుంటారు. వారు సుఖమును చూడాలి, కొంచెము దుఃఖమును కూడా చూడాలి. కర్మాతీత స్థితి అయితే ఎవ్వరికీ ఏర్పడలేదు. చాలా సుఖమునిచ్చే ఇంటిలోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. ఇక్కడ సుఖమయమైన ఇళ్ళు ఏవీ లేవని భావించకండి. మంచిగా ఉండే పరివారాలు ఎన్ని ఉన్నాయో, ఇక అడగకండి. బాబా వాటిని చూశారు. ఒకే ఇంట్లో కోడళ్ళు ఎంతో శాంతిగా, కలుపుగోలుగా ఉంటారు, అందరూ కలిసి భక్తి చేస్తారు, గీతను చదువుకుంటారు..... ఇంతమంది కలిసి ఉంటున్నారు, గొడవలు మొదలైనవి ఉండవా అని బాబా వారిని అడిగారు. అప్పుడు వారు - మా వద్ద స్వర్గముంది, మేమంతా కలిసి ఉంటాము, ఎప్పుడూ కొట్లాడుకోము-గొడవపడము, శాంతిగా ఉంటాము అని చెప్పారు. ఇక్కడ స్వర్గములా ఉందని అంటారు అనగా స్వర్గము తప్పకుండా ఒకప్పుడు ఉండి గతించింది, అందుకే ఇక్కడ స్వర్గమున్నట్లు ఉంది అని అంటారు. కానీ ఇక్కడ చాలామందిలో స్వర్గవాసులుగా అయ్యే స్వభావము కనిపించడం లేదు. దాస దాసీలు కూడా తయారవ్వాలి కదా. ఇక్కడ రాజధాని స్థాపనౌతుంది. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారు దైవీ వంశంలో వస్తారు కానీ నంబరువారుగా ఉంటారు. కొంతమంది చాలా మధురంగా ఉంటారు, అందరినీ ప్రేమిస్తూ ఉంటారు. ఎప్పుడూ ఎవ్వరి పైనా కోప్పడరు. కోప్పడితే దుఃఖము కలుగుతుంది. ఎవరైతే మనసా-వాచా-కర్మణా ఇతరులకు దుఃఖమును ఇస్తూ ఉంటారో - వారిని దుఃఖిత ఆత్మ అని అంటారు. పుణ్యాత్మ, పాపాత్మ అని అంటారు కదా. శరీరము పేరు తీసుకుంటారా? వాస్తవానికి అలా ఆత్మయే అవుతుంది. పాపాత్ములందరూ కూడా ఒకేలా ఉండరు. పుణ్యాత్ములు కూడా అందరూ ఒకేలా ఉండరు. నంబరువారు పురుషార్థానుసారంగా ఉంటారు. నా క్యారెక్టర్, స్థితి ఎలా ఉంది? నేను ఎలా నడుచుకుంటున్నాను? అందరితో మధురంగా మాట్లాడుతున్నానా? ఎవరైనా ఏమైనా అన్నా నేను తప్పుడు జవాబులైతే ఇవ్వడం లేదు కదా? అని స్టూడెంట్ కు స్వయం తెలుస్తుంది కదా. బాబాతో చాలామంది పిల్లలు అంటారు - పిల్లల పై కోపమొస్తుంది అని. ఎంత వీలైతే అంత ప్రేమగా నడుచుకోండి అని బాబా చెప్తారు. నిర్మోహులుగా కూడా అవ్వాలి.

మనం ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలని పిల్లలైన మీకు తెలుసు. లక్ష్యము-ఉద్దేశ్యం ఎదురుగా నిలబడి ఉంది. ఇది ఎంత ఉన్నతమైన లక్ష్యము-ఉద్దేశ్యం. చదివించేవారు కూడా చాలా ఉన్నతమైనవారు కదా. సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపన్నులు..... అని శ్రీకృష్ణుని మహిమను ఎంతగా పాడుతారు. ఇప్పుడు మనమలా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. మీరిక్కడకు అలా తయారయ్యేందుకే వచ్చారు. మీది నరుని నుండి నారాయణునిగా అయ్యే సత్యమైన సత్యనారాయణ కథ, అమరపురికి వెళ్ళే అమరకథ. సన్యాసులు మొదలైనవారెవ్వరికీ ఈ విషయాలు తెలియవు. మనుష్యమాత్రులెవ్వరినీ కూడా జ్ఞానసాగరుడు లేక పతితపావనుడు అని అనరు. సృష్టి అంతా పతితంగా ఉన్నప్పుడు మనం పతితపావనుడు అని ఎవరిని అనాలి? ఇక్కడ పుణ్యాత్ములెవరూ ఉండరు. ఇది పతిత ప్రపంచము అని తండ్రి అర్థం చేయిస్తారు. శ్రీకృష్ణుడు మొట్టమొదటి నంబరు కలవారు. వారిని కూడా భగవంతుడని అనలేరు. జనన-మరణ రహితుడు ఒక్క నిరాకార తండ్రి మాత్రమే. శివ పరమాత్మాయ నమః అని గాయనం చేయబడుతుంది, బ్రహ్మా-విష్ణు-శంకరులను దేవతలని అంటూ, తర్వాత శివుడిని పరమాత్మ అని అంటారు. కనుక శివుడు అందరికన్నా పైన ఉంటారు కదా. వారు అందరికీ తండ్రి. వారసత్వము కూడా తండ్రి నుండే లభించాలి, సర్వవ్యాపి అనడంతో వారసత్వము లభించదు. తండ్రి స్వర్గ స్థాపన చేసేవారు కనుక వారు తప్పకుండా స్వర్గ వారసత్వమునే ఇస్తారు. ఈ లక్ష్మీ నారాయణులు నంబరువన్. వీరు చదువు ద్వారా ఈ పదవిని పొందారు. భారతదేశ ప్రాచీన యోగము ఎందుకు ప్రసిద్ధమవ్వదు. దీని ద్వారా మనుష్యులు విశ్వానికి యజమానులుగా అవుతారు, దీనిని సహజ యోగము, సహజ జ్ఞానమని అంటారు. ఇది చాలా సహజము, ఒక్క జన్మ పురుషార్థముతో ఎంత ప్రాప్తి లభిస్తుంది. భక్తిమార్గములో జన్మజన్మలుగా ఎదురుదెబ్బలు తింటూ వచ్చారు, ఏమీ లభించలేదు. ఇదైతే ఒక్క జన్మలోనే లభిస్తుంది కనుక దీనిని సహజమని అంటారు. సెకెండులో జీవన్ముక్తి అని అంటారు. ఈ రోజుల్లో ఎటువంటి ఆవిష్కరణలు చేస్తున్నారో చూడండి. సైన్సు వారిది కూడా అద్భుతము. సైలెన్సు అద్భుతము కూడా ఎలా ఉందో చూడండి? అక్కడ అవన్నీ చూసేందుకు కనిపిస్తాయి, ఇక్కడ ఏవీ కనిపించవు. మీరు శాంతిగా కూర్చున్నారు, ఉద్యోగాలు మొదలైనవి కూడా చేస్తారు, చేతులు పని వైపు మరియు ఆత్మ మనసు ప్రియుని వైపు ఉండాలి. ప్రేయసి ప్రియులు కూడా గాయనం చేయబడతారు కదా. వారు ఒకరి రూపంపై ఒకరు ప్రేమ కలిగి ఉంటారు, వికారాల విషయమేమీ ఉండదు. ఎక్కడ కూర్చున్నా వారు గుర్తుకొస్తారు. రొట్టె తింటూ ఉంటారు, అంతే, ఎదురుగా తనను చూస్తూ ఉంటారు. అంతిమంలో మీకు ఈ స్థితి ఏర్పడుతుంది. కేవలం తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. రూప్-బసంత్ లుగా అయి నోటి ద్వారా సదా సుఖమునిచ్చే మాటలే మాట్లాడాలి, దుఃఖమునిచ్చేవారిగా అవ్వకూడదు. జ్ఞానపు ఆలోచనల్లోనే ఉండాలి, నోటి నుండి జ్ఞానరత్నాలే వెలువడాలి.

2. నిర్మోహులుగా అవ్వాలి, ప్రతి ఒక్కరితోనూ ప్రేమగా పని నడపాలే కానీ కోపగించుకోకూడదు. అనాథలను సనాథులుగా చేసే సేవ చేయాలి.

వరదానము:-

అపవిత్రత యొక్క నామ రూపాలను కూడా సమాప్తం చేసి హిజ్ హోలీనెస్ అనే టైటిల్ ను ప్రాప్తి చేసుకునే హోలీహంస భవ

ఏ విధంగా హంస ఎప్పుడూ రాళ్ళను ఏరదో, రత్నాలనే ధారణ చేస్తుందో, అదే విధంగా హోలీహంసలు ఎవ్వరి అవగుణాలను అనగా రాళ్ళను ధారణ చెయ్యరు. వారు వ్యర్థము మరియు సమర్థాన్ని వేరు చేసి వ్యర్థాన్ని వదిలేస్తారు, సమర్థాన్ని తమదిగా చేసుకుంటారు. ఇటువంటి హోలీహంసలే పవిత్రమైన, శుద్ధమైన ఆత్మలు, వారి ఆహారము, వ్యవహారము అన్నీ శుద్ధంగా ఉంటాయి. ఎప్పుడైతే అశుద్ధత అనగా అపవిత్రత యొక్క నామ-రూపాలు కూడా సమాప్తమవుతాయో, అప్పుడు భవిష్యత్తులో హిజ్ హోలీనెస్ అనే టైటిల్ ప్రాప్తిస్తుంది. కావున ఎప్పుడూ పొరపాటున కూడా ఎవ్వరి అవగుణాలను ధారణ చేయకూడదు.

స్లోగన్:-

ఎవరైతే పాత స్వభావ సంస్కారాల వంశాన్ని కూడా త్యాగం చేస్తారో, వారే సర్వంశ త్యాగులు.