29-12-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - సంగమయుగంలో మీరు బ్రాహ్మణ సంప్రదాయానికి చెందినవారిగా అయ్యారు, మీరిప్పుడు మృత్యులోకపు మనుష్యుల నుండి అమరలోకపు దేవతలుగా అవ్వాలి”

ప్రశ్న:-

పిల్లలైన మీరు ఏ జ్ఞానాన్ని అర్థము చేసుకున్న కారణంగా అనంతమైన సన్యాసము చేస్తారు?

జవాబు:-

మీకు డ్రామా గురించిన యథార్థ జ్ఞానముంది, డ్రామానుసారంగా ఇప్పుడు ఈ మృత్యులోకమంతా భస్మీభూతమవ్వనున్నది అని మీకు తెలుసు. ఇప్పుడీ ప్రపంచము పైసకు కొరగానిదిగా అయిపోయింది, మనము ఎంతో విలువైనవారిగా అవ్వాలి. ఇందులో ఏదైతే జరుగుతుందో, అది మళ్ళీ ఖచ్చితంగా కల్పం తర్వాత రిపీట్ అవుతుంది. కావున మీరు ఈ పూర్తి ప్రపంచము నుండి అనంతమైన సన్యాసం చేశారు.

గీతము:-

రాబోయే రేపటికి మీరు... (ఆనే వాలే కల్ కీ తుమ్...)

ఓంశాంతి. పిల్లలు పాటలోని లైను విన్నారు. రానున్నది అమరలోకము. ఇది మృత్యులోకము. అమరలోకానికి మరియు మృత్యులోకానికి మధ్యన ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇప్పుడు సంగమయుగములో తండ్రి చదివిస్తారు, వారు ఆత్మలకు చదివిస్తారు కావున ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి అని పిల్లలకు చెప్తారు. మనల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారన్న ఈ నిశ్చయం ఏర్పరచుకోవాలి. లక్ష్మీనారాయణులుగా అవ్వడం లేక మృత్యులోకపు మనుష్యుల నుండి అమరలోకపు దేవతలుగా అవ్వడం మన లక్ష్యము. ఇటువంటి చదువును ఎప్పుడూ చెవుల ద్వారా విని ఉండరు, పిల్లలూ, మీరు ఆత్మాభిమానులై కూర్చోండి అని ఎవరూ చెప్పడం కూడా చూసి ఉండరు. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారని నిశ్చయము ఏర్పరచుకోండి. ఏ తండ్రి? అనంతమైన తండ్రి అయిన నిరాకార శివుడు. ఇప్పుడు మేము పురుషోత్తమ సంగమయుగములో ఉన్నామని మీరు భావిస్తారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ సంప్రదాయానికి చెందినవారిగా అయ్యారు, మళ్ళీ మీరు దేవతలుగా అవ్వాలి. మొదట శూద్ర సంప్రదాయానికి చెందినవారిగా ఉండేవారు. తండ్రి వచ్చి రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా చేస్తారు. మొదట సతోప్రధాన, పారసబుద్ధి కలవారిగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ అలా అవుతారు. సత్యయుగానికి యజమానులుగా ఉండేవారమని అనకూడదు, సత్యయుగంలో విశ్వానికి యజమానులుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు తీసుకొని మెట్లు దిగుతూ-దిగుతూ సతోప్రధానము నుండి సతో, రజో, తమోలోకి వచ్చారు. మొదట సతోప్రధానంగా ఉన్నప్పుడు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు, తర్వాత ఆత్మలో మలినం ఏర్పడుతుంది. మనుష్యులు అర్థము చేసుకోరు. మీకేమీ తెలిసేది కాదు అని తండ్రి అంటారు. అంధవిశ్వాసములో ఉండేవారు. ఎవరి గురించైనా తెలుసుకోకుండా వారిని పూజించడం లేక స్మృతి చేయడాన్ని అంధవిశ్వాసమనే అంటారు. అలాగే తమ శ్రేష్ఠ ధర్మాన్ని, శ్రేష్ఠ కర్మలను మర్చిపోవడంతో కర్మ భ్రష్టులుగా, ధర్మ భ్రష్టులుగా అవుతారు. భారతవాసులు ఈ సమయంలో దైవీ ధర్మం నుండి కూడా భ్రష్టులుగా ఉన్నారు. వాస్తవానికి మీరు ప్రవృత్తి మార్గములోని వారు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఆ దేవతలు అపవిత్రులుగా అయినప్పుడు వారిని దేవీదేవతలని అనలేరు, కావుననే పేరు మార్చి హిందు ధర్మమని పెట్టేసారు. ఇది కూడా డ్రామా ప్లాను అనుసారముగానే జరుగుతుంది. ఓ పతితపావనా, రండి అని అందరూ ఒక్క తండ్రినే పిలుస్తారు. జనన-మరణ రహితుడైన గాడ్ ఫాదర్ వారొక్కరే. నామ రూపాలకు అతీతమైన వస్తువేదీ ఉండదు. ఆత్మ మరియు పరమాత్మల రూపము చాలా సూక్ష్మమైనది, దానిని నక్షత్ర రూపం లేక బిందువని అంటారు. శివుడిని పూజిస్తారు, వారికి శరీరమైతే లేదు. ఇప్పుడు బిందువైన ఆత్మకు పూజ జరుగజాలదు, కావున పూజించేందుకు పెద్దగా తయారుచేస్తారు. శివుడిని పూజిస్తున్నామని భావిస్తారు కానీ వారి రూపమేమిటి అన్నది తెలియదు. ఈ విషయాలన్నీ తండ్రి ఈ సమయంలోనే వచ్చి అర్థం చేయిస్తారు. మీకు మీ జన్మల గురించి తెలియదని తండ్రి అంటారు. 84 లక్షల యోనులని వ్యర్థ ప్రలాపాలు పలికారు. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలైన మీకు అర్థము చేయిస్తారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, మళ్ళీ దేవతలుగా అవ్వాలి. కలియుగపు మనుష్యులు శూద్రులు. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడము బ్రాహ్మణులైన మీ లక్ష్యము. ఈ మృత్యులోకము పతిత ప్రపంచము. ఎక్కడైతే దేవీ-దేవతలు రాజ్యం చేసేవారో, అది కొత్త ప్రపంచము. వీరి రాజ్యము ఒక్కటే ఉండేది. వీరు విశ్వమంతటికీ యజమానులుగా ఉండేవారు. ఇప్పుడిది తమోప్రధాన ప్రపంచము. అనేక ధర్మాలున్నాయి. ఈ దేవీదేవతా ధర్మము ప్రాయః లోపమైపోయింది. దేవీ-దేవతల రాజ్యము ఎప్పుడుండేది, అది ఎంతకాలం కొనసాగింది, ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికములను గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి మీకు అర్థం చేయిస్తారు. ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ (భగవంతుడైన తండ్రి విశ్వవిద్యాలయము), అమరలోకపు దేవతలుగా తయారుచేయడము దీని లక్ష్యము. దీనిని అమరకథ అని కూడా అంటారు. ఈ జ్ఞానము ద్వారా మీరు దేవతలుగా అయి మృత్యువుపై విజయము పొందుతారు. అక్కడ ఎప్పుడూ మృత్యువు కబళించలేదు. అక్కడ మరణించడము అన్న మాటే ఉండదు. డ్రామా ప్లాను అనుసారముగా ఇప్పుడు మీరు మృత్యువుపై విజయము పొందుతున్నారు. భారతవాసులు కూడా పంచవర్ష లేక దశవర్ష ప్రణాళికలు తయారుచేస్తారు కదా. మేము రామరాజ్యం స్థాపన చేస్తున్నామని భావిస్తారు. రామరాజ్యాన్ని తయారుచేయాలని అనంతమైన తండ్రికి కూడా ప్లాను ఉంది. వారంతా మనుష్యులు. మనుష్యులు రామరాజ్యాన్ని స్థాపన చేయలేరు. రామరాజ్యమని సత్యయుగాన్ని అనడం జరుగుతుంది. ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియదు. మనుష్యులు ఎంతగా భక్తి చేస్తారు, దైహిక యాత్రలు చేస్తారు. పగలు అనగా సత్య-త్రేతా యుగాలలో ఈ దేవీదేవతల రాజ్యముండేది. మళ్ళీ రాత్రివేళలో భక్తి మార్గము ప్రారంభమవుతుంది. సత్యయుగంలో భక్తి ఉండదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము, వీటిని తండ్రి అర్థం చేయిస్తారు. వైరాగ్యము రెండు రకాలుగా ఉంటుంది - ఒకటి నివృత్తి మార్గానికి చెందిన హఠయోగులది, వారు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవులకు వెళ్తారు. ఇప్పుడు మీరు మొత్తం మృత్యులోకాన్ని అనంతమైన సన్యాసం చేయాలి. ఈ ప్రపంచమంతా భస్మీభూతమవ్వనున్నదని తండ్రి అంటారు. డ్రామాను చాలా బాగా అర్థము చేసుకోవాలి. ఈ డ్రామా పేను వలె నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడేదైతే జరుగుతుందో, అది మళ్ళీ 5 వేల సంవత్సరాల కల్పము తర్వాత ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. దీనిని చాలా బాగా అర్థము చేసుకొని అనంతమైన సన్యాసం చేయాలి. ఎవరైనా విదేశాలకు వెళ్తే, మేము ఈ జ్ఞానాన్ని అక్కడ చదవవచ్చా అని అడుగుతారు. ఎక్కడైనా కూర్చొని మీరు ఈ చదువును చదవవచ్చు అని తండ్రి అంటున్నారు. ఇందులో మొదట 7 రోజుల కోర్సు తీసుకోవలసి ఉంటుంది. ఇది చాలా సహజము, ఆత్మ కేవలం దీనిని అర్థము చేసుకోవలసి ఉంటుంది. మనము సతోప్రధాన విశ్వానికి యజమానులుగా ఉన్నప్పుడు సతోప్రధానంగా ఉండేవారము. ఇప్పుడు తమోప్రధానమైపోయాము. 84 జన్మలలో పూర్తిగా విలువలేనివారిగా అయిపోయాము. మనమిప్పుడు మళ్ళీ విలువైనవారిగా ఎలా అవ్వాలి? ఇప్పుడిది కలియుగము, తప్పకుండా మళ్ళీ సత్యయుగము రానున్నది, తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు, 7 రోజుల కోర్సును అర్థము చేసుకోవాలి. సతోప్రధానము నుండి తమోప్రధానంగా ఎలా అయ్యాము. కామచితిపై కూర్చొని తమోప్రధానంగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ జ్ఞానచితిపై కూర్చొని సతోప్రధానంగా అవ్వాలి. ప్రపంచ చరిత్ర-భౌగోళికము రిపీట్ అవుతుంది, చక్రము తిరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడిది సంగమయుగము, మళ్ళీ సత్యయుగము రానున్నది. ఇప్పుడు మనము కలియుగీ వికారులుగా అయ్యాము, మళ్ళీ సత్యయుగీ నిర్వికారులుగా ఎలా అవ్వాలి? దాని కోసం తండ్రి మార్గాన్ని తెలియజేస్తున్నారు. మాలో ఏ గుణాలు లేవు, ఇప్పుడు మమ్మల్ని ఈ విధంగా గుణవంతులుగా తయారుచేయండని కూడా పిలుస్తారు. కల్పక్రితము ఎవరైతే తయారయ్యారో, మళ్ళీ వారే తయారవుతారు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించండని తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఇప్పుడు మాత్రమే మీకు దేహీ-అభిమానులుగా అయ్యే శిక్షణ లభిస్తుంది. అలాగని మీరు సదా దేహీ-అభిమానులుగా ఉంటారని కాదు. సత్యయుగములోనైతే శరీరాలకు పేర్లుంటాయి. లక్ష్మీనారాయణుల పేర్లతోనే కార్య వ్యవహారాలన్నీ జరుగుతాయి. ఇప్పుడిది సంగమయుగము, ఇప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. మీరు నగ్నంగా (అశరీరిగా) వచ్చారు, మళ్ళీ శరీరము లేకుండానే వెళ్ళిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది ఆత్మిక యాత్ర. ఆత్మ తన ఆత్మిక తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే పాపము భస్మమైపోతుంది, దీనిని యోగాగ్ని అని అంటారు. మీరు ఎక్కడైనా స్మృతి చేయవచ్చు. 7 రోజులలో అర్థము చేయించవలసి ఉంటుంది. ఈ సృష్టిచక్రం ఎలా తిరుగుతుంది, మనము మెట్లు ఎలా దిగుతాము? ఇప్పుడు మళ్ళీ ఈ ఒక్క జన్మలోనే ఎక్కే కళ ఏర్పడుతుంది. విదేశాలలో పిల్లలుంటారు, అక్కడికి కూడా మురళి వెళ్తుంది. ఇది స్కూలు కదా. వాస్తవానికి ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ (ఈశ్వరీయ విశ్వవిద్యాలయము). ఇది గీతలోని రాజయోగము. కానీ శ్రీకృష్ణుడిని భగవంతుడని అనలేరు. బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా దేవతలని అంటారు. ఇప్పుడు మీరు పురుషార్థము చేసి మళ్ళీ దేవతలుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మా కూడా తప్పకుండా ఇక్కడ ఉంటారు కదా. ప్రజాపిత మనిషే కదా. ప్రజలు తప్పకుండా ఇక్కడే రచింపబడతారు. హమ్ సో యొక్క అర్థాన్ని తండ్రి చాలా సహజరీతిలో అర్థము చేయించారు. భక్తి మార్గంలోనైతే ఆత్మ అయిన మనమే పరమాత్మ అని అంటారు, కావుననే పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు. అందరిలోనూ ఉండేది ఆత్మ అని తండ్రి అంటారు. నేను ఎలా వ్యాపించి ఉంటాను? మీరే నన్ను - ఓ పతిత పావనా! రండి, మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు. నిరాకార ఆత్మలన్నీ వచ్చి తమ-తమ రథాలు తీసుకుంటాయి. ఇది ప్రతి అకాలమూర్తి అయిన ఆత్మకు సింహాసనము. సింహాసనమని అనండి లేక రథమని అనండి. తండ్రికైతే రథము లేదు. వారిని నిరాకారుడనే మహిమ చేస్తారు. వారికి సూక్ష్మ శరీరమూ లేదు, స్థూల శరీరమూ లేదు. నిరాకారుడు స్వయంగా రథములో కూర్చున్నప్పుడే మాట్లాడగలరు. రథము లేకుండా పతితులను పావనంగా ఎలా చేస్తారు? నేను నిరాకారుడను, నేను వచ్చి ఇతని శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను అని తండ్రి అంటారు. తాత్కాలికంగా అప్పు తీసుకున్నారు, వీరిని భాగ్యశాలి రథమని అంటారు. తండ్రియే సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాలను తెలిపి పిల్లలైన మిమ్మల్ని త్రికాలదర్శులుగా తయారుచేస్తారు. ఇతర మనుష్యులెవ్వరూ ఈ జ్ఞానాన్ని తెలుసుకోలేరు. ఈ సమయంలో అందరూ నాస్తికులుగా ఉన్నారు. తండ్రి వచ్చి ఆస్తికులుగా తయారుచేస్తారు. రచయిత-రచనల రహస్యాన్ని తండ్రి మీకు తెలియజేశారు. ఇప్పుడు మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థము చేయించలేరు. ఈ జ్ఞానము ద్వారా మళ్ళీ మీరే ఇంత ఉన్నత పదవిని పొందుతారు. ఈ జ్ఞానమిప్పుడు బ్రాహ్మణులైన మీకు మాత్రమే లభిస్తుంది. తండ్రి సంగమయుగంలోనే వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తారు. సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. మనుష్యులు మనుష్యులకు సద్గతినివ్వలేరు. వారంతా భక్తి మార్గములోని గురువులు. సద్గురువు ఒక్కరే, వారిని "వాహ్! సద్గురు వాహ్!” అని అంటారు. దీనిని పాఠశాలని కూడా అంటారు. ఇక్కడ నరుని నుండి నారాయణునిగా అయ్యే లక్ష్యముంది. అవన్నీ భక్తి మార్గములోని కథలు. గీత ద్వారా కూడా ఎటువంటి ప్రాప్తి లభించదు. నేను పిల్లలైన మీ సమ్ముఖములోకి వచ్చి చదివిస్తాను, దీని ద్వారా మీరు ఈ పదవిని పొందుతారని తండ్రి అంటారు. ఇందులో ముఖ్యమైనది పవిత్రంగా అయ్యే విషయము. తండ్రి స్మృతిలో ఉండాలి. ఇందులోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. మీరు మీ వారసత్వాన్ని పొందేందుకు తండ్రిని స్మృతి చేస్తారు. ఈ జ్ఞానము పిల్లలందరి వద్దకు వెళ్తుంది. ఎప్పుడూ మురళి మిస్ అవ్వకూడదు. మురళి మిస్ అయితే ఆబ్సెంట్ పడుతుంది. మురళి ద్వారా ఎక్కడ కూర్చున్నా రిఫ్రెష్ అవుతూ ఉంటారు. శ్రీమతముపై నడవవలసి ఉంటుంది. బయటకు వెళ్ళినా, తప్పకుండా పవిత్రంగా అవ్వాలి, వైష్ణవులై ఉండాలి అని తండ్రి అర్థం చేయిస్తారు. వైష్ణవులలో రెండు రకాలవారు ఉంటారు. ఒకటి వైష్ణవులు, వల్లభాచారులు కూడా ఉంటారు కానీ వారు వికారాలలోకి వెళ్తారు. పవిత్రంగా అయితే ఉండరు కదా. మీరు పవిత్రంగా అయి విష్ణు వంశీయులుగా అవుతారు. అక్కడ మీరు వైష్ణవులుగా ఉంటారు, వికారాలలోకి వెళ్ళరు. అది అమరలోకము, ఇది మృత్యులోకము, ఇక్కడ వికారాలలోకి వెళ్తారు. ఇప్పుడు మీరు విష్ణుపురికి వెళ్తారు, అక్కడ వికారాలు ఉండవు. అది నిర్వికారీ ప్రపంచము. యోగబలముతో మీరు విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. వారిరువురూ పరస్పరములో కొట్లాడుకుంటారు, మధ్యలో వెన్న మీకు లభిస్తుంది. మీరు మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. అందరికీ ఇదే సందేశమునివ్వాలి. చిన్న పిల్లలకు కూడా హక్కు ఉంది. శివబాబాకు పిల్లలు కదా. కావున అందరికీ హక్కు ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి అని అందరికీ చెప్పాలి. తల్లిదండ్రులకు జ్ఞానముంటే శివబాబాను స్మృతి చేయమని పిల్లలకు కూడా నేర్పిస్తారు. శివబాబాను తప్ప మరెవ్వరినీ స్మృతి చేయకూడదు. ఒక్కరి స్మృతి ద్వారానే తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. దీనికోసం చాలా బాగా చదువుకోవాలి. విదేశాలలో ఉంటూ కూడా మీరు చదువుకోవచ్చు. ఇందులో పుస్తకాలు మొదలైనవేవీ అవసరము లేదు. ఎక్కడ కూర్చున్నా మీరు చదువుకోవచ్చు. బుద్ధి ద్వారా స్మృతి చేయవచ్చు. ఈ చదువు చాలా సహజమైనది. యోగము లేక స్మృతితో శక్తి లభిస్తుంది. మీరిప్పుడు విశ్వానికి యజమానులుగా అవుతున్నారు. తండ్రి రాజయోగాన్ని నేర్పించి పావనంగా తయారుచేస్తారు. అది హఠయోగము, ఇది రాజయోగము. ఇందులో పథ్యము చాలా బాగా ఉండాలి. ఈ లక్ష్మీనారాయణుల వలె సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి కదా. అన్నపానాదుల విషయంలో కూడా పథ్యముండాలి, మరియు రెండవ విషయము - తండ్రిని స్మృతి చేస్తే జన్మ-జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. దీనిని రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు నేర్చుకునే సహజ రాజయోగమని అంటారు. రాజ్యము తీసుకోకపోతే పేదవారిగా అయిపోతారు. శ్రీమతంపై పూర్తిగా నడిచినట్లయితే శ్రేష్ఠంగా అవుతారు. భ్రష్టుల నుండి శ్రేష్ఠులుగా అవ్వాలి. దానికోసం తండ్రిని స్మృతి చేయాలి. కల్పక్రితము కూడా ఈ జ్ఞానాన్ని మీరే తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ మీరే తీసుకుంటారు. సత్యయుగములో ఇతర రాజ్యమేదీ లేదు. దానిని సుఖధామమని అంటారు. ఇప్పుడిది దుఃఖధామము మరియు ఎక్కడినుండైతే ఆత్మలమైన మనము వచ్చామో, అది శాంతిధామము. ప్రపంచములోని మనుష్యులు ఏమేమి చేస్తూ ఉంటారు, శివబాబాకు ఆశ్చర్యమనిపిస్తుంది. పిల్లలు తక్కువగా పుట్టడానికి కూడా ఎంతగా తల కొట్టుకుంటూ ఉంటారు. ఈ పని ఒక్క తండ్రిదేనని వారు అర్థం చేసుకోరు. తండ్రి వెంటనే ఏక ధర్మ స్థాపన మరియు అనేక ధర్మాలను వినాశనాన్ని ఒక్క వేటుతో చేసేస్తారు. జనాభాను తగ్గించేందుకు వారు ఎన్ని మందులు మొదలైనవి కనుగొంటారు. తండ్రి వద్ద అయితే ఒకే మందు ఉంది. ఏక ధర్మ స్థాపన జరగనున్నది. వీరు పవిత్రంగా అవుతున్నారని అందరూ అనే సమయము వస్తుంది. అప్పుడు మందులు మొదలైనవాటి అవసరం ఏముంది. బాబా మీకు మన్మనాభవ అనే ఎటువంటి మందును ఇచ్చారంటే, దాని ద్వారా మీరు 21 జన్మల కోసం పవిత్రంగా అయిపోతారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పవిత్రంగా అయి పక్కా వైష్ణవులుగా తయారవ్వాలి. అన్నపానాదుల విషయంలో కూడా పూర్తి పథ్యముండాలి. శ్రేష్ఠంగా అయ్యేందుకు శ్రీమతముపై తప్పకుండా నడవాలి.

2. మురళి ద్వారా స్వయాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి, ఎక్కడ ఉన్నా సతోప్రధానంగా అయ్యే పురుషార్థము చేయాలి. ఒక్క రోజు కూడా మురళీని మిస్ చేయకూడదు.

వరదానము:-

వియోగానికి సదా కాలం కొరకు వీడ్కోలు ఇచ్చే స్నేహీ స్వరూప భవ

స్నేహీకి ఏది ఇష్టమో, అదే స్నేహం చేసేవారికి కూడా ఇష్టమనిపిస్తుంది - ఇదే స్నేహమునకు స్వరూపం. నడవడం, తినడం, తాగడం, ఉండడం అన్నీ స్నేహీ మనస్సుకు నచ్చినట్లుగా ఉండాలి, కావున ఏ సంకల్పం చేసినా లేక ఏ కర్మ చేసినా, ముందు స్నేహీ అయిన తండ్రికి ఇది ఇష్టమా అని ఆలోచించండి. ఇటువంటి సత్యమైన స్నేహులుగా అయినట్లయితే నిరంతర యోగులుగా, సహజయోగులుగా అయిపోతారు. ఒకవేళ స్నేహీ స్వరూపాన్ని సమాన స్వరూపంలోకి పరివర్తన చేసినట్లయితే, ‘అమర భవ’ అన్న వరదానం లభిస్తుంది మరియు వియోగానికి సదాకొరకు వీడ్కోలు లభిస్తుంది.

స్లోగన్:-

స్వభావం ఈజీగా మరియు పురుషార్థాన్ని అటెన్షన్ కలదిగా తయారుచేసుకోండి.