05-12-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కనుక దేహీ-అభిమానులుగా అవ్వండి, ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే అంత్ మతి సో గతి జరుగుతుంది (అంతిమ సమయంలో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అలాంటి జన్మ లభిస్తుంది)”

ప్రశ్న:-

అద్భుతమైన తండ్రి మీకు ఏ ఒక్క అద్భుతమైన రహస్యాన్ని వినిపించారు?

జవాబు:-

తండ్రి అంటారు - పిల్లలూ, ఈ అనాది అవినాశీ డ్రామా తయారుచేయబడినది, ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర నిశ్చితమై ఉంది. ఏం జరిగినా కొత్తేమీ కాదు. తండ్రి అంటారు, పిల్లలూ, ఇందులో నా గొప్పతనము కూడా ఏమీ లేదు, నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను. ఈ అద్భుతమైన రహస్యాన్ని వినిపించి తండ్రి తమ పాత్రకున్న మహత్వాన్ని తగ్గించుకున్నట్లు అయ్యింది.

గీతము:-

చివరికి నేడు ఆ రోజు వచ్చింది..... (ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్.....)

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట పాడుతున్నారు. కల్పము తర్వాత మళ్ళీ మమ్మల్ని ధనవంతులుగా, హెల్తీ మరియు వెల్తీగా (ఆరోగ్యవంతులుగా మరియు ఐశ్వర్యవంతులుగా) చేసేందుకు, పవిత్రత, సుఖ-శాంతుల వారసత్వమునిచ్చేందుకు తండ్రి వస్తారని పిల్లలు అర్థం చేసుకుంటారు. బ్రాహ్మణులు కూడా ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ, పుత్రవాన్ భవ అని ఆశీర్వాదాలు ఇస్తారు కదా. పిల్లలైన మీకైతే వారసత్వము లభిస్తుంది కావున ఆశీర్వాదాల విషయమేమీ లేదు. పిల్లలు చదువుకుంటున్నారు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా తండ్రి వచ్చి మనకు మనుష్యుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా అయ్యే శిక్షణ ఇచ్చారని మీకు తెలుసు. చదువుకునే పిల్లలకు, మేము ఏం చదువుతున్నాము, చదివించేవారెవరు అనేది తెలుసు. వారికి కూడా నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. ఈ రాజధాని స్థాపన అవుతుంది అనగా దైవీరాజ్యము స్థాపనవుతుంది అని పిల్లలైన మాకు తెలుసు అని మీరంటారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. ముందు శూద్రులుగా ఉండేవారు, తర్వాత బ్రాహ్మణులుగా అయ్యారు, మళ్ళీ దేవతలుగా అవ్వాలి. ఇప్పుడు మేము శూద్ర వర్ణానికి చెందినవారమని ప్రపంచములో ఎవ్వరికీ ఇది తెలియదు. ఇది సత్యమైన విషయమని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి సత్యము వినిపించి, సత్య ఖండాన్ని స్థాపన చేస్తున్నారు. సత్యయుగంలో అసత్యము, పాపము మొదలైనవేవీ ఉండవు. కలియుగములోనే అజామిల్, పాపాత్ములు ఉంటారు. ఈ సమయం పూర్తిగా రౌరవ నరకంగానే ఉంది. రోజు-రోజుకూ రౌరవ నరకము కనిపిస్తుంది. మనుష్యులు ఎటువంటి పనులు చేస్తూ ఉంటారంటే, వాటి ద్వారా ఇది పూర్తిగా తమోప్రధాన ప్రపంచంగా తయారవుతూ ఉందని అర్థమవుతుంది. అందులో కూడా కామము మహాశత్రువు. కొంతమంది కష్టంమీద పవిత్రంగా, శుద్ధంగా ఉండగలరు. ఇదివరకు ఫకీర్లు - 12-13 సంవత్సరాల కుమారీలు పిల్లలకు జన్మనిచ్చేటటువంటి కలియుగము వస్తుందని చెప్పేవారు. ఇప్పుడిది ఆ సమయము. కుమార-కుమారీలు మొదలైనవారందరూ అశుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు. పూర్తిగా తమోప్రధానమైనప్పుడు నేను వస్తాను, నాకు కూడా డ్రామాలో పాత్ర ఉంది, నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నానని తండ్రి చెప్తారు. పిల్లలైన మీ కోసం ఇదేమీ కొత్త విషయము కాదు. తండ్రి ఇలాగే అర్థము చేయిస్తారు. చక్రము తిరిగాము, నాటకం పూర్తవుతుంది. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానంగా అయి, సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఎంత సాధారణ రీతిలో అర్థం చేయిస్తారు. తండ్రి తన పాత్రకు అంత మహత్వాన్ని ఏమీ ఇవ్వరు. ఇది నా పాత్ర, కొత్త విషయము కాదు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత నేను రావలసి ఉంటుంది. నేను డ్రామాలో బంధింపబడి ఉన్నాను. నేను వచ్చి పిల్లలైన మీకు చాలా సహజమైన స్మృతియాత్రను తెలియజేస్తాను. అంత్ మతి సో గతి (అంతిమ సమయంలో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అలాంటి జన్మ లభిస్తుంది)..... ఇది ఈ సమయం కోసమే చెప్పడం జరిగింది. ఇది అంతిమ కాలం కదా. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా అవుతారు అని తండ్రి యుక్తిని తెలియజేస్తారు. మేము కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతామని పిల్లలు కూడా అర్థము చేసుకుంటారు. నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు) అని తండ్రి పదే-పదే చెప్తారు. ఒక జిన్ను కథను వినిపిస్తారు కదా - అది పని ఇవ్వమని అడుగుతుంది, అప్పుడు మెట్లు దిగు మరియు ఎక్కు అని చెప్పారు. ఈ ఆట కూడా దిగడం మరియు ఎక్కడానికి సంబంధించినది అని తండ్రి కూడా చెప్తారు. పతితం నుండి పావనంగా, పావనం నుండి పతితంగా అవ్వాలి. ఇది కష్టమైన విషయమేమీ కాదు. ఇది చాలా సహజమైనది, కానీ ఇది ఎటువంటి యుద్ధమో అర్థము చేసుకోని కారణంగా శాస్త్రాలలో యుద్ధం అనే మాటను వ్రాసేశారు. వాస్తవానికి మాయా రావణునిపై విజయము పొందడం అయితే చాలా పెద్ద యుద్ధము. మేము పదే-పదే తండ్రిని స్మృతి చేస్తాము, మళ్ళీ స్మృతి తెగిపోతుంది అని పిల్లలు చూస్తారు. మాయ దీపాన్ని ఆర్పేస్తుంది. గులేబకావళి కథ కూడా దీని గురించే ఉంది. పిల్లలు విజయం పొందుతారు. చాలా బాగా నడుస్తారు, మళ్ళీ మాయ వచ్చి దీపాన్ని ఆర్పేస్తుంది. బాబా, మాయా తుఫానులైతే చాలా వస్తున్నాయని పిల్లలు కూడా అంటారు. అనేక రకాల తుఫానులు పిల్లల వద్దకు వస్తాయి. అప్పుడప్పుడు జోరుగా ఎటువంటి తుఫాన్లు వస్తాయంటే 8-10 సంవత్సరాల పాతవి అయిన మంచి-మంచి వృక్షాల కూడా పడిపోతాయి. పిల్లలకు తెలుసు, వర్ణన కూడా చేస్తారు. మాలలో మంచి-మంచి మణులుగా ఉండేవారు, ఈ రోజు లేనే లేరు. గజమును మొసలి తినేసింది అనే ఉదాహరణ కూడా ఉంది. ఇది మాయా తుఫాను.

ఈ 5 వికారాల నుండి సంభాళించుకుంటూ ఉండండి అని తండ్రి అంటారు. స్మృతిలో ఉన్నట్లయితే దృఢంగా అయిపోతారు. దేహీ అభిమానులుగా అవ్వండి. తండ్రి యొక్క ఈ శిక్షణ ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. మీరు ఆత్మాభిమానులుగా అవ్వండి అని ఈ విధంగా ఎప్పుడూ ఎవ్వరూ చెప్పరు. సత్యయుగంలో కూడా ఇలా చెప్పరు. నామం, రూపం, దేశం, కాలం అన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని ఈ సమయంలో మీకు అర్థము చేయిస్తాను. ముందు మీరు సతోప్రధానంగా ఉండేవారు. సతో-రజో-తమోలలో మీరు పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. అందులో కూడా నంబరువన్ వీరు (బ్రహ్మా). వేరేవారికి 83 జన్మలు ఉండవచ్చు కానీ వీరికి పూర్తి 84 జన్మలు ఉన్నాయి. వీరు మొట్టమొదట శ్రీనారాయణునిగా ఉండేవారు. వీరి కోసం చెప్తే అందరి కోసం అని అనుకుంటారు, అనేక జన్మల అంతిమంలో జ్ఞానము తీసుకొని మళ్ళీ వారు నారాయణునిగా అవుతారు. వృక్షములో కూడా చూపించారు కదా - ఇక్కడ శ్రీ నారాయణుడు మరియు చివర్లో బ్రహ్మా నిలబడి ఉన్నారు. క్రింద రాజయోగము నేర్చుకుంటున్నారు. ప్రజాపితను ఎప్పుడూ పరమపిత అని అనరు. పరమపిత అని ఒక్కరినే అంటారు. వీరిని మళ్ళీ ప్రజాపిత అని అంటారు. వీరు దేహధారి, వారు విదేహీ, విచిత్రుడు. లౌకిక తండ్రిని పిత అని అంటారు, వీరిని ప్రజాపిత అని అంటారు. ఆ పరమపిత అయితే పరంధామంలో ఉంటారు. ప్రజాపిత బ్రహ్మా పరంధామంలో ఉంటారని అనరు. వారు ఇక్కడ సాకారీ ప్రపంచములో ఉంటారు. సూక్ష్మవతనంలో కూడా ఉండరు. ప్రజలైతే స్థూల వతనములో ఉంటారు. ప్రజాపితను భగవంతుడని అనరు. భగవంతునికి శారీరిక పేరు ఉండదు. మనుష్య శరీరాలకు పేరు ఉంటుంది, వారు దానికి అతీతమైనవారు. ఆత్మలు అక్కడ ఉన్నప్పుడు స్థూల నామ-రూపాలకు అతీతంగా ఉంటాయి. కానీ ఆత్మ అయితే ఉంది కదా. సాధు సన్యాసులు మొదలైనవారికి ఏమీ తెలియదు. వారు కేవలం ఇళ్ళు-వాకిళ్ళను వదిలేస్తారు కానీ ప్రపంచములోని వికారాల యొక్క అనుభవీలే కదా. చిన్న పిల్లలకు ఏమీ తెలియదు, అందుకే వారిని మహాత్మ అని అంటారు. 5 వికారాల గురించి వారికి తెలియనే తెలియదు. చిన్న పిల్లలను పవిత్రమైనవారని అంటారు. ఈ సమయంలో పవిత్ర ఆత్మలెవ్వరూ ఉండరు. చిన్నవారి నుండి పెద్దవారిగా అవుతారు కానీ పతితులనే అంటారు కదా. ఈ డ్రామాలో అందరికి వేర్వేరు పాత్రలు నిశ్చితమై ఉన్నాయని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ చక్రములో ఎన్ని శరీరాలు తీసుకుంటారో, ఎన్ని కర్మలు చేస్తారో, అవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి. మొట్టమొదట ఆత్మను గుర్తించాలి. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల అవినాశీ పాత్ర నిండి ఉంది. ఇదే అన్నింటికన్నా అద్భుతమైన విషయము. ఆత్మ కూడా అవినాశీ. డ్రామా కూడా అవినాశీ, ఇది తయారై-తయారవుతున్నది. ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది అని చెప్పలేము. ప్రాకృతికము అని అంటారు కదా. ఆత్మ ఎలా ఉంటుంది, ఈ డ్రామా ఎలా తయారుచేయబడింది, ఇందులో ఎవ్వరూ ఏమీ చేయలేరు. సముద్రము మరియు ఆకాశం యొక్క అంతాన్ని తెలుసుకోలేరు. ఇది అవినాశీ డ్రామా. ఎంత అద్భుతమనిపిస్తుంది. ఎలాగైతే బాబా అద్భుతమైనవారో, అదే విధంగా జ్ఞానము కూడా చాలా అద్భుతమైనది. ఇది ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేరు. ఈ పాత్రధారులంతా తమ-తమ పాత్రలను అభినయిస్తూనే వస్తారు. నాటకము ఎప్పుడు తయారయ్యింది అనే ప్రశ్న తలెత్తలేదు. సుఖ-దుఃఖాల ప్రపంచాన్ని కూర్చుని తయారుచేసేందుకు భగవంతునికి ఏం అవసరమొచ్చిందని చాలామంది అంటారు. అరే, ఇదైతే అనాది అయినది. ప్రళయము మొదలైనవి జరగవు. ఇది తయారై-తయారుచేయబడినది, ఇది ఎందుకు తయారుచేయబడింది అని ఈ విధంగా అనలేము. మీరు తెలివైనవారిగా అయినప్పుడు తండ్రి మీకు ఆత్మ జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు. కావున మీరు రోజురోజుకూ ఉన్నతి చెందుతూ ఉంటారు. మొదట్లో అయితే బాబా చాలా కొద్ది కొద్దిగా వినిపించేవారు. అద్భుతమైన విషయాలుండేవి, అయినా ఆకర్షణ అయితే ఉండేది కదా. వారు ఆకర్షించారు. భట్టి ఆకర్షణ కూడా ఉండేది. కృష్ణుడిని కంసపురి నుండి బయటకు తీసుకువెళ్ళారని శాస్త్రాలలో చూపించారు. కంసుడు మొదలైనవారైతే అక్కడ అసలు ఉండరని మీకిప్పుడు తెలుసు. గీత, భాగవతము, మహాభారతము వీటన్నిటికీ కనెక్షన్ జోడిస్తారు, కానీ ఏమీ ఉండదు. ఈ దసరా మొదలైనవైతే పరంపర నుండి నడుస్తూ వస్తున్నాయని భావిస్తారు. రావణుడంటే ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. ఎవరైతే దేవీదేవతలుగా ఉండేవారో, వారు క్రిందకు దిగుతూ-దిగుతూ పతితులుగా అయ్యారు. ఎవరైతే ఎక్కువగా పతితంగా అయ్యారో, వారే మొరపెట్టుకుంటారు, అందుకే ఓ పతితపావనా అని కూడా పిలుస్తారు. ఈ విషయాలన్నీ తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు. సృష్టిచక్రము యొక్క ఆదిమధ్యాంతముల గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. మీరు తెలుసుకోవడం ద్వారా చక్రవర్తీ రాజులుగా అవుతారు. త్రిమూర్తి చిత్రములో - ఇది మీ ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారము అని వ్రాయబడి ఉంది. బ్రహ్మా ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము, విష్ణువు ద్వారా పాలన..... వినాశనము కూడా తప్పకుండా జరగాలి. కొత్త ప్రపంచంలో చాలా తక్కువమంది ఉంటారు. ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. ఒక్క ఆదిసనాతన దేవీ దేవతా ధర్మమే లేదని భావిస్తారు. మళ్ళీ తప్పకుండా ఆ ధర్మమొక్కటే ఉండాలి, మహాభారతమునకు కూడా గీతతో సంబంధముంటుంది. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఒక్క సెకెండు కూడా ఆగదు. ఇవి కొత్త విషయాలేమీ కావు, చాలాసార్లు రాజ్యము తీసుకున్నారు, కడుపు నిండుగా ఉన్నవారు గంభీరంగా ఉంటారు. మేము ఎన్నిసార్లు రాజ్యము తీసుకున్నాము, ఇది నిన్నటి విషయమే అని లోపల భావిస్తారు. నిన్నే దేవీదేవతలుగా ఉండేవారము, మళ్ళీ చక్రము తిరిగి ఈరోజు మనం పతితంగా అయ్యాము, మళ్ళీ మనం యోగబలముతో విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటాము. కల్ప-కల్పము మీరే రాజ్యాధికారాన్ని తీసుకుంటారు అని తండ్రి అంటారు. కొంచెము కూడా తేడా ఉండదు. రాజ్యములో కొంతమంది తక్కువగా, కొంతమంది ఉన్నతంగా అవుతారు. ఇది పురుషార్థము ద్వారానే జరుగుతుంది.

ఇదివరకు మనము కోతులకన్నా కూడా హీనంగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి మందిరయోగ్యంగా చేస్తున్నారు. మంచి-మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు తప్పకుండా, మేము దేనికీ పనికి రాకుండా ఉండేవారము, ఇప్పుడు మేము విలువైనవారిగా తయారౌతున్నాము అని వారి ఆత్మ రియలైజ్ అవుతుంది. కల్ప-కల్పము తండ్రి మనల్ని పెన్నీ నుండి పౌండుగా తయారుచేస్తారు. కల్పక్రితము వారే ఈ విషయాలను మంచి రీతిగా అర్థము చేసుకుంటారు. మీరు కూడా ప్రదర్శనీ మొదలైనవి చేస్తారు, కొత్తేమీ కాదు. వీటి ద్వారానే మీరు అమరపురిని స్థాపన చేస్తున్నారు. భక్తి మార్గములో దేవీలు మొదలైనవారికి ఎన్ని మందిరాలున్నాయి. ఇదంతా పూజారుల సామాగ్రి. పూజ్యత్వపు సామాగ్రి ఏదీ లేదు. రోజు రోజుకూ మీకు గుహ్యమైన పాయింట్లను అర్థము చేయిస్తూ ఉంటాను అని తండ్రి అంటారు. ఇంతకుముందు తెలిపిన అనేక పాయింట్లు మీ వద్ద ఉన్నాయి. వాటిని ఇప్పుడేం చేస్తారు. అవి అలాగే పడి ఉంటాయి. వర్తమానంలో బాప్ దాదా కొత్త-కొత్త పాయింట్లను అర్థం చేయిస్తూ ఉంటారు. ఆత్మ ఇంత చిన్న బిందువు, అందులో మొత్తం పాత్ర నిండి ఉంది. ఈ పాయింటు ఇంతకుముందు కాపీలలో ఏమీ ఉండదు. మరి పాత పాయింట్లను మీరేమి చేస్తారు. చివరి ఫలితమే పనికొస్తుంది. కల్పక్రితము కూడా మీకు ఇలాగే వినిపించాను అని తండ్రి అంటారు. నంబరువారుగా చదువుతూ ఉంటారు. ఏదో ఒక సబ్జెక్టులో కిందా-మీదా అవుతూ ఉంటుంది. వ్యాపారంలో కూడా గ్రహచారము కూర్చుంటుంది, ఇందులో హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు (నిరాశ చెందకూడదు). మళ్ళీ లేచి పురుషార్థము చేయాలి. మనుష్యులు దివాలా తీస్తారు, మళ్ళీ వ్యాపారము మొదలైనవి చేసి చాలా ధనవంతులుగా అయిపోతారు. ఇక్కడ కూడా ఎవరైనా వికారాలలో పడిపోతారు, అయినా మంచి రీతిగా పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందండి, మళ్ళీ ఎక్కడం మొదలుపెట్టాలి అని తండ్రి చెప్తారు. పడిపోయారు, మళ్ళీ ఎక్కండి అని బాబా అంటారు. పడిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కే ప్రయత్నం చేసేవారు చాలామంది ఉంటారు. బాబా వద్దు అని అనరు. ఇటువంటివారు కూడా చాలామంది వస్తారని తండ్రికి తెలుసు. పురుషార్థము చేయమని తండ్రి అంటారు. ఏదో ఒక రకంగా సహాయకులుగా అవుతారు కదా. డ్రామా ప్లాన్ అనుసారముగానే అంటారు. అచ్చా, పిల్లలూ, ఇప్పుడు తృప్తి చెందారా, చాలా మునకలు వేశారు, ఇప్పుడు మళ్ళీ పురుషార్థము చేయండి అని తండ్రి అంటారు. అనంతమైన తండ్రి అలాగే చెప్తారు కదా. బాబాను కలుసుకునేందుకు ఎంతమంది వస్తారు. అనంతమైన తండ్రి చెప్పేది వినరా, పవిత్రంగా అవ్వరా అని అంటాను. తండ్రి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మకు చెప్తారు కనుక బాణము తప్పకుండా తగులుతుంది. స్త్రీకి బాణము తగిలింది అనుకోండి, నేను ప్రతిజ్ఞ చేస్తానని అంటారు. పురుషునికి తగలదు. అప్పుడు మున్ముందు అతడిని కూడా ఉన్నతంగా చేసేందుకు ప్రయత్నము చేస్తుంది. భార్య జ్ఞానములోకి తీసుకొచ్చినవారు కూడా చాలామంది ఉంటారు. అప్పుడు భార్య నాకు గురువు అని అంటారు. ఆ బ్రాహ్మణులు కంకణము కట్టే సమయంలో పతి నీకు గురువు, ఈశ్వరుడు అని అంటారు. ఒక్క తండ్రి మాత్రమే మీకు అన్నీ అని ఇక్కడ తండ్రి అంటారు. నాకైతే ఒక్కరు తప్ప ఇతరులెవ్వరూ లేరు. అందరూ వారినే స్మృతి చేస్తారు. ఆ ఒక్కరితోనే యోగము జోడించాలి. ఈ దేహము కూడా నాది కాదు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏదైనా గ్రహచారము వస్తే నిరుత్సాహపడి కూర్చుండిపోకూడదు. మళ్ళీ పురుషార్థము చేసి, తండ్రి స్మృతిలో ఉంటూ ఉన్నత పదవిని పొందాలి.

2. స్మృతి ద్వారా స్వయం యొక్క స్థితిని ఎంత దృఢంగా చేసుకోవాలంటే, ఏ మాయా తుఫాను కూడా దాడి చేయకూడదు. వికారాల నుండి స్వయాన్ని సంభాళించుకుంటూ ఉండాలి.

వరదానము:-

త్రికాలదర్శి మరియు సాక్షీద్రష్టగా అయి ప్రతి కర్మ చేస్తూ బంధనముక్త స్థితి యొక్క అనుభవం ద్వారా దృష్టాంత (ఉదాహరణ) రూప భవ

ఒకవేళ త్రికాలదర్శి స్థితిలో స్థితులై, కర్మ యొక్క ఆది మధ్య అంతాలను తెలుసుకొని కర్మలు చేసినట్లయితే, ఏ కర్మ కూడా వికర్మగా అవ్వదు, సదా సుకర్మగా అవుతుంది. అలాగే సాక్షీద్రష్టగా అయి కర్మలు చేస్తే ఎటువంటి కర్మబంధనంలోనూ కర్మబంధన ఆత్మగా అవ్వరు. కర్మ ఫలము శ్రేష్ఠంగా ఉన్న కారణంగా కర్మ సంబంధములోకి వస్తారు, బంధనములోకి రారు. కర్మలు చేస్తూ అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు కనుక అనేక ఆత్మల ఎదురుగా దృష్టాంత రూపంగా అనగా ఉదాహరణగా అవుతారు.

స్లోగన్:-

ఎవరైతే మనసు ద్వారా సదా సంతుష్టంగా ఉంటారో వారే డబల్ లైట్ గా ఉంటారు.