02-12-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీరు చదువు చదువుకోవాలి మరియు చదివించాలి, ఇందులో ఆశీర్వాదాల విషయమేమీ లేదు. తండ్రిని స్మృతి చేసినట్లయితే దుఃఖాలన్నీ దూరమైపోతాయని మీరు అందరికీ చెప్పండి”

ప్రశ్న:-

మనుష్యులకు ఏయే చింతలున్నాయి? పిల్లలైన మీకు ఏ చింత లేదు - ఎందుకు?

జవాబు:-

మనుష్యులకు ఈ సమయంలో చింతలే చింతలు ఉన్నాయి - కొడుకు అనారోగ్యం పాలైతే చింత, కొడుకు మరణిస్తే చింత, ఎవరికైనా కొడుకు పుట్టకపోతే చింత, ఎవరైనా ధాన్యము ఎక్కువగా పెట్టుకున్నప్పుడు పోలీసులు లేక ఇన్ కమ్ టాక్స్ వారు వస్తే చింత...... ఇది ఉన్నదే అశుద్ధ ప్రపంచము, దుఃఖమిచ్చేటటువంటిది. పిల్లలైన మీకు ఏ చింత లేదు, ఎందుకంటే మీకు సద్గురువైన బాబా లభించారు. చింతల నుండి అతీతంగా చేసే స్వామి సద్గురువు...... అని కూడా అంటారు. ఇప్పుడు మీరు ఎటువంటి చింత లేనటువంటి ప్రపంచములోకి వెళ్తారు.

గీతము:-

నీవు ప్రేమసాగరుడవు...... (తూ ప్యార్ కా సాగర్ హై......)

ఓంశాంతి. మధురాతి-మధురమైన పిల్లలు పాట విన్నారు. మనము కూడా మాస్టర్ ప్రేమసాగరులుగా అవ్వాలని అర్థం కూడా తెలుసుకున్నారు. ఆత్మలందరూ సోదరులు. కనుక తండ్రి సోదరులైన మీకు చెప్తారు - నేను ఏ విధంగా ప్రేమసాగరుడనో, మీరు కూడా చాలా ప్రేమగా నడుచుకోవాలి. దేవతలలో చాలా ప్రేమ ఉంటుంది, వారిని ఎంతగా ప్రేమిస్తారు, భోగ్ సమర్పిస్తారు. ఇప్పుడు మీరు పవిత్రంగా అవ్వాలి, ఇది పెద్ద విషయమేమీ కాదు. ఇది చాలా ఛీ-ఛీ ప్రపంచము. ప్రతి విషయము గురించి చింత ఉంటుంది. దుఃఖము తర్వాత దుఃఖము ఉంటుంది. దీనిని దుఃఖధామమని అంటారు. పోలీసులు లేక ఇన్ కమ్ టాక్స్ వారు వస్తారు, మనుష్యులకు ఎంతగా ఆందోళన కలుగుతుందో, ఇక అడగకండి! ఎవరైనా ధాన్యము ఎక్కువ పెట్టుకున్నప్పుడు, పోలీసులు వస్తే, పాలిపోయినట్లుగా అయిపోతారు. ఇది ఎంత అశుద్ధమైన ప్రపంచము. నరకము కదా. స్వర్గాన్ని కూడా గుర్తు చేసుకుంటారు. నరకము తర్వాత స్వర్గము, స్వర్గము తర్వాత నరకము - ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. స్వర్గవాసులుగా చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారని పిల్లలకు తెలుసు. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా చేస్తారు. అక్కడ వికారాలే ఉండవు ఎందుకంటే రావణుడే ఉండడు. అది సంపూర్ణ నిర్వికారి శివాలయము. ఇది వేశ్యాలయము. ఇప్పుడు కొంచెం ఆగండి, ఈ ప్రపంచములో దుఃఖముందా లేక సుఖముందా అన్నది అందరికీ తెలిసిపోతుంది. కొద్దిగా భూకంపము మొదలైనవి వచ్చాయంటే మనుష్యుల పరిస్థితి ఎలా అయిపోతుంది. సత్యయుగంలో కొద్దిగా కూడా చింత అనే మాట ఉండదు. ఇక్కడైతే చాలా చింతలున్నాయి - కొడుకు అనారోగ్యం పాలైతే చింత, కొడుకు మరణించినా చింత. చింతే చింత ఉంది. చింతలను దూరము చేసే స్వామి సద్గురువు...... అందరి స్వామి ఒక్కరే కదా. మీరు శివబాబా ఎదురుగా కూర్చున్నారు. ఈ బ్రహ్మా గురువేమీ కారు. వీరు భాగ్యశాలి రథము. తండ్రి ఈ భాగ్యశాలి రథము ద్వారా మిమ్మల్ని చదివిస్తారు. వారు జ్ఞానసాగరుడు. మీకు కూడా మొత్తం జ్ఞానము లభించింది. మీకు తెలియని దేవతలు లేరు. సత్యము మరియు అసత్యమును మీరు గుర్తించగలరు. ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. ఇదివరకు సత్య ఖండముండేది, ఇప్పుడు అసత్య ఖండము ఉంది. సత్య ఖండమును ఎప్పుడు మరియు ఎవరు స్థాపన చేసారు అనేది ఎవ్వరికీ తెలియదు. ఇది అజ్ఞానపు అంధకారమయమైన రాత్రి. తండ్రి వచ్చి ప్రకాశమునిస్తారు. మీ గతి, మతి మీకే తెలుసు అని కూడా పాడుతారు. ఉన్నతాతి ఉన్నతమైనవారు వారొక్కరే, మిగిలినదంతా రచన. వారు రచయిత, అనంతమైన తండ్రి. వారు హద్దు తండ్రి, 2-4 పిల్లలను రచిస్తారు. కొడుకు పుట్టకపోతే చింత కలుగుతుంది. అక్కడ ఇటువంటి విషయం ఉండదు. ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ...... మీరు ఇలా ఉంటారు. మీరేమీ ఆశీర్వాదాలివ్వరు. ఇది చదువు కదా. మీరు టీచర్లు. కేవలం శివబాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమౌతాయని మీరు చెప్తారు. ఇది కూడా శిక్షణే కదా. దీనిని సహజ యోగము లేక స్మృతి అని అంటారు. ఆత్మ అవినాశీ, శరీరము వినాశీ. నేను కూడా అవినాశీ అని తండ్రి అంటారు. మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని నన్ను పిలుస్తారు. ఆత్మయే అంటుంది కదా. పతితాత్మ, మహాన్ ఆత్మ అని అంటారు. పవిత్రత ఉంటే సుఖ-శాంతులు కూడా ఉంటాయి.

ఇది హోలియస్ట్ ఆఫ్ హోలీ (పవిత్రాతి పవిత్రమైన) చర్చి. క్రిస్టియన్లకు హోలి చర్చి ఏదీ ఉండదు. అక్కడకు వికారులు వెళ్తారు. ఇక్కడికి వికారులకు వచ్చేందుకు అనుమతి లేదు. ఒక కథ కూడా ఉంది కదా - ఇంద్రసభలోకి ఒక దేవకన్య రహస్యంగా ఎవరినో తీసుకువెళ్ళింది, వారికి తెలిసిపోయింది, అప్పుడు రాయిగా అవ్వమని ఆమెకి శాపము లభించింది. ఇక్కడ శాపము మొదలైన విషయాలేవీ లేవు. ఇక్కడ జ్ఞాన వర్షము ఉంటుంది. పతితులెవ్వరూ ఈ హోలీ-ప్యాలెస్ (పవిత్రమైన మహలు) లోకి రాలేరు. ఒక రోజున ఈ హాలు కూడా చాలా పెద్దదిగా తయారైపోతుంది. ఇది హోలియస్ట్ ఆఫ్ హోలీ ప్యాలెస్ (పవిత్రాతి పవిత్రమైన మహలు). మీరు కూడా హోలీగా అవుతారు. వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది? ఇది ఎలా జరుగుతుంది? అని మనుష్యులు భావిస్తారు. వారికి వారి జ్ఞానం ఉంటుంది. దేవతల ఎదురుగా కూడా మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము అని అంటారు. కనుక స్వర్గము హోలియస్ట్ ఆఫ్ హోలీ (పవిత్రాతి పవిత్రమైనది). వారే మళ్ళీ 84 జన్మలు తీసుకొని హోలియెస్ట్ ఆఫ్ హోలీగా అవుతారు. అది పావన ప్రపంచము, ఇది పతిత ప్రపంచము. కొడుకు పుడితే సంతోషిస్తారు, అతడికి అనారోగ్యం చేస్తే ముఖం పాలిపోతుంది, అతడు మరణిస్తే ఇక ఒక్కసారిగా పిచ్చివారిగా అయిపోతారు. ఇటువంటివారు కూడా కొందరు ఉంటారు. బాబా, వీరి కొడుకు మరణించడంతో బుర్ర పాడైపోయింది అని చెప్తారు, ఇటువంటివారిని కూడా తీసుకొస్తారు, ఇది దుఃఖపు ప్రపంచము కదా. ఇప్పుడు తండ్రి సుఖపు ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. కనుక శ్రీమతంపై నడవాలి కదా. గుణాలు కూడా చాలా బాగా ఉండాలి. ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. దైవీ క్యారెక్టర్లు కూడా కావాలి. స్కూలులో రిజిస్టరులో క్యారెక్టరు గురించి కూడా వ్రాస్తారు. కొంతమందైతే బయట ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది కలిగిస్తారు. ఇప్పుడు తండ్రి శాంతిధామము-సుఖధామములోకి తీసుకువెళ్తారు. దానిని టవర్ ఆఫ్ సైలెన్స్ అనగా సైలెన్స్ యొక్క శిఖరము అని అంటారు, ఆత్మలు నివసించే స్థానము టవర్ ఆఫ్ సైలెన్స్. సూక్ష్మవతనము మూవీ, దానిని కేవలం మీరు సాక్షాత్కారం చేసుకుంటారు, అంతేకానీ అందులో ఇంకేమీ లేదు. ఇది కూడా పిల్లలకు సాక్షాత్కారం జరిగింది. సత్యయుగంలో వృద్ధులైనప్పుడు సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. ఇది 84 జన్మల పాత శరీరము. మీరు పావనంగా ఉండేవారు, ఇప్పుడు పతితంగా అయ్యారని తండ్రి అంటారు. ఇప్పుడు మిమ్మల్ని పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. మీరు నన్ను పిలిచారు కదా. జీవాత్మయే పతితంగా అయ్యింది, మళ్ళీ అదే పావనంగా అవుతుంది. మీరు ఈ దేవీ దేవతల వంశానికి చెందినవారిగా ఉండేవారు కదా. ఇప్పుడు ఆసురీ వంశానికి చెందినవారిగా అయ్యారు. ఆసురీ వంశానికి మరియు ఈశ్వరీయ లేక దైవీ వంశానికి ఎంత తేడా ఉంది. ఇది మీ బ్రాహ్మణ కులము. వంశము అని రాజ్యాన్ని అంటారు, అక్కడ రాజ్యముంటుంది. ఇక్కడ రాజ్యము లేదు. గీతలో పాండవులు మరియు కౌరవుల రాజ్యం గురించి వ్రాశారు కానీ అవి లేవు.

మీరైతే ఆత్మిక పిల్లలు. మధురమైన పిల్లలూ, చాలా-చాలా మధురంగా అవ్వండి, ప్రేమసాగరులుగా అవ్వండి అని తండ్రి అంటారు. దేహాభిమానము కారణంగానే ప్రేమసాగరులుగా అవ్వరు, అందుకే తర్వాత చాలా శిక్షలను అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు, శిక్షలు లభించిన తర్వాత ఒక చిన్న రొట్టె ముక్క లభించినట్లు ఉంటుంది. స్వర్గంలోకైతే వెళ్తారు కానీ చాలా శిక్షలను అనుభవిస్తారు. శిక్షలెలా లభిస్తాయి అనేది కూడా పిల్లలైన మీరు సాక్షాత్కారం పొందారు. చాలా ప్రేమగా నడుచుకోండి లేకపోతే క్రోధము యొక్క అంశం వస్తుందని బాబా అర్థం చేయిస్తారు. మనల్ని నరకము నుండి బయటకు తీసి స్వర్గంలోకి తీసుకువెళ్ళే తండ్రి లభించారు అని కృతజ్ఞతలు తెలపండి. శిక్షలు అనుభవించడం అంటే మంచిది కాదు. సత్యయుగంలో ప్రేమ యొక్క రాజధాని ఉంటుందని మీకు తెలుసు. ప్రేమ తప్ప ఏదీ ఉండదు. ఇక్కడైతే చిన్న విషయాలకే ముఖము మారిపోతుంది. నేను పతిత ప్రపంచములోకి వచ్చాను, నన్ను పతిత ప్రపంచములోకే ఆహ్వానిస్తారు అని తండ్రి అంటారు. తండ్రి మళ్ళీ అందరికీ అమృతము తాగమని ఆహ్వానం ఇస్తారు. విషము మరియు అమృతము గురించి ఒక పుస్తకము వెలువడింది. పుస్తకం వ్రాసినవారికి బహుమతి లభించింది, వారు ప్రసిద్ధి చెందారు. ఏమి వ్రాశారో చూడాలి. మీకు జ్ఞానామృతము తాగిస్తాను, మీరు మళ్ళీ విషము ఎందుకు తింటారు అని తండ్రి అంటారు. రక్షాబంధనము కూడా ఈ సమయం యొక్క స్మృతిచిహ్నమే కదా. పవిత్రంగా అవుతామని ప్రతిజ్ఞ చేయండి అని తండ్రి అందరికీ చెప్తారు, ఇది పవిత్రంగా తయారయ్యే అంతిమ జన్మ. పవిత్రంగా అయినట్లయితే, యోగములో ఉన్నట్లయితే పాపాలు నశిస్తాయి. నేను స్మృతిలో ఉంటున్నానా లేదా అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. ఇంట్లో పిల్లలను గుర్తు చేసుకుని సంతోషపడతారు కదా. భార్య, తన పతిని గుర్తు చేసుకుని సంతోషిస్తుంది కదా. వీరెవరు? భగవానువాచ, నిరాకారుడిని. నేను వీరి (శ్రీ కృష్ణుని) 84వ జన్మ తర్వాత మళ్ళీ స్వర్గానికి యజమానిగా చేస్తాను అని తండ్రి అంటారు. ఇప్పుడు వృక్షము చిన్నది. మాయా తుఫానులు చాలా వస్తాయి. ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు. పిల్లలూ, స్మృతియాత్రలో ఉండండి మరియు పవిత్రంగా ఉండండి అని తండ్రి అంటారు. రాజధాని పూర్తిగా ఇక్కడే స్థాపనవ్వాలి. గీతలో యుద్ధాన్ని చూపిస్తారు. పాండవులు పర్వతాలలో కరిగి మరణించారు. అంతే, ఫలితమేమీ లేదు.

ఇప్పుడు పిల్లలైన మీకు సృష్టి ఆదిమధ్యాంతాలు తెలుసు. తండ్రి జ్ఞాన సాగరుడు కదా. వారు సుప్రీమ్ సోల్. ఆత్మ రూపమేమిటి అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. మీ బుద్ధిలో ఆ బిందువు ఉంది. మీలో కూడా యథార్థ రీతిగా ఎవ్వరూ అర్థము చేసుకోరు. బిందువును ఎలా స్మృతి చేయాలని మళ్ళీ అంటారు. కొంచెము కూడా అర్థము చేసుకోరు. అయినా తండ్రి అంటారు, కొద్దిగా విన్నా కూడా జ్ఞానము వినాశనమవ్వదు. జ్ఞానములోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు, కానీ కొద్దిగా విన్నా కూడా తప్పకుండా స్వర్గములోకి వస్తారు. ఎవరైతే ఎక్కువగా వింటారో, ధారణ చేస్తారో, వారు రాజ్యములోకి వచ్చేస్తారు. కొద్దిగా విన్నవారు ప్రజలలో వస్తారు. రాజధానిలోనైతే రాజా-రాణి మొదలైనవారందరూ ఉంటారు కదా. అక్కడ మంత్రులు ఉండరు, ఇక్కడ వికారీ రాజులకు మంత్రులను పెట్టుకోవలసి ఉంటుంది. తండ్రి మీ బుద్ధిని చాలా విశాలంగా చేస్తారు. అక్కడ మంత్రుల అవసరమే ఉండదు. పులి-మేక కలిసి నీరు తాగుతాయి. కనుక మీరు కూడా ఉప్పునీరుగా అవ్వకండి, క్షీరఖండంగా అవ్వండి అని తండ్రి అర్థం చేయిస్తారు. పాలు మరియు చక్కెర, రెండూ మంచి వస్తువులే కదా. అభిప్రాయ భేదాలు మొదలైనవేవి పెట్టుకోకండి. ఇక్కడైతే మనుష్యులు ఎంతగా కొట్లాడుకుంటారు-గొడవపడతారు. ఇది రౌరవ నరకము. నరకములో మునకలు వేస్తూ ఉంటారు. తండ్రి వచ్చి బయటకు తీస్తారు. బయటకు వస్తూ-వస్తూ మళ్ళీ చిక్కుకుపోతారు. కొంతమంది ఇతరులను బయటకు తీసేందుకు వెళ్తారు, కానీ స్వయం కూడా వెళ్ళిపోతారు. ప్రారంభములో చాలామందిని మాయ రూపీ మొసలి పట్టేసుకుంది. ఒక్కసారిగా పూర్తిగా మింగేసింది. కొద్దిగా కూడా గుర్తులు లేవు. కొంతమందివి గుర్తులున్నాయి, వారు మళ్ళీ తిరిగి వస్తారు. కొంతమంది పూర్తిగా సమాప్తమైపోయారు. ఇక్కడ అంతా ప్రాక్టికల్ గా జరుగుతుంది. మీరు చరిత్ర వింటే ఆశ్చర్యపోతారు. మీరు ప్రేమించండి లేక తిరస్కరించండి, మేము మీ గడప నుండి బయటకు వెళ్ళము..... అని గాయనముంది. బాబా అయితే ఎప్పుడూ నోటితో కూడా అలా ఏమీ అనరు. ఎంత ప్రేమగా చదివిస్తారు. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ఇలా (విష్ణు) తయారుచేస్తారు. ఆ విష్ణువే మళ్ళీ బ్రహ్మాగా అవుతారు. సెకండులో జీవన్ముక్తి లభించింది, మళ్ళీ 84 జన్మలు తీసుకుని ఇలా అయ్యారు. తతత్వమ్. మీ ఫోటోలు కూడా తీసేవారు కదా. మీరు బ్రహ్మా సంతానమైన బ్రాహ్మణులు. ఇప్పుడు మీకు కిరీటము లేదు, భవిష్యత్తులో లభిస్తుంది, అందుకే మీ ఈ ఫోటో కూడా ఉంచారు. తండ్రి వచ్చి పిల్లలను డబుల్ కిరీటధారులుగా చేస్తారు. తప్పకుండా ఇదివరకు మాలో పంచ వికారాలుండేవని మీకు అనిపిస్తుంది (నారదుని ఉదాహరణ). భక్తులుగా కూడా మొట్టమొదట మీరే అయ్యారు. ఇప్పుడు తండ్రి ఎంత ఉన్నతంగా చేస్తారు. ఒక్కసారిగా పతితుల నుండి పావనంగా చేస్తారు. తండ్రి ఏమీ తీసుకోరు. శివబాబా ఏం తీసుకుంటారు! మీరు శివబాబా భండారిలో వేస్తారు. నేను ట్రస్టీను. ఇచ్చి పుచ్చుకునే లెక్క అంతా శివబాబాతోనే ఉంటుంది. నేను చదువుకుంటాను, చదివిస్తాను. ఎవరైతే తమదంతా ఇచ్చేసారో, వారు మళ్ళీ ఏమి తీసుకుంటారు. ఏ వస్తువు పట్ల మమకారం ఉండదు. ఫలానావారు స్వర్గస్థులయ్యారని కూడా పాడుతారు. మరి వారికి నరకము యొక్క అన్నపానాదులు మొదలైనవి ఎందుకు తినిపిస్తారు. అది అజ్ఞానము కదా. నరకంలో ఉంటే పునర్జన్మ కూడా నరకములోనే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అమరలోకంలోకి వెళ్తారు. ఇది పిల్లిమొగ్గల ఆట. బ్రాహ్మణులైన మీరు పిలక వంటి వారు, తర్వాత దేవతలుగా, క్షత్రియులుగా అవుతారు, అందుకే చాలా మధురంగా అవ్వండి అని తండ్రి అర్థం చేయిస్తారు. అయినా బాగుపడకపోతే, ఇక వారి భాగ్యము అని అంటారు. తమను తామే నష్టపర్చుకుంటారు. బాగుపడకపోతే, ఈశ్వరుడైనా కూడా ఏమి పురుషార్థము చేస్తారు.

నేను ఆత్మలతో మాట్లాడుతున్నాను అని తండ్రి అంటారు. అవినాశీ ఆత్మలకు అవినాశీ తండ్రి అయిన పరమాత్మ జ్ఞానమునిస్తున్నారు. ఆత్మ చెవుల ద్వారా వింటుంది. అనంతమైన తండ్రి ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా చేస్తారు. మార్గం చూపించే సుప్రీమ్ పండా కూర్చొని ఉన్నారు. శ్రీమతము చెప్తుంది - పవిత్రంగా అవ్వండి, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. మీరే సతోప్రధానంగా ఉండేవారు. 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు. మీరే సతోప్రధానం నుండి ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు, ఇప్పుడు మళ్ళీ నన్ను స్మృతి చేయండి అని తండ్రి వీరికే అర్థం చేయిస్తారు. దీనిని యోగాగ్ని అని అంటారు. ఈ జ్ఞానము కూడా ఇప్పుడు మీకు ఉంది. సత్యయుగంలో నన్ను ఎవ్వరూ స్మృతి చేయరు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి, ఇంకే మార్గమూ లేదు అని నేను ఈ సమయంలోనే చెప్తాను. ఇది స్కూలు కదా. దీనిని విశ్వ విద్యాలయము, వరల్డ్ యూనివర్శిటీ అని అంటారు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఇంకెవ్వరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణులలో కూడా ఈ జ్ఞానము లేదని శివబాబా అంటారు. ఇది ప్రారబ్ధము కదా. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ప్రేమ యొక్క రాజధానిలోకి వెళ్ళాలి, దానికోసం పరస్పరములో క్షీరఖండంగా అయి ఉండాలి. ఎప్పుడూ ఉప్పు నీరుగా అయి అభిప్రాయ బేధాలలోకి రాకూడదు. తమను తామే సరిదిద్దుకోవాలి.

2. దేహాభిమానమును వదిలి మాస్టర్ ప్రేమసాగరులుగా అవ్వాలి. మీ దైవీ క్యారెక్టర్ ను తయారుచేసుకోవాలి. చాలా చాలా మధురంగా అయి నడుచుకోవాలి.

వరదానము:-

మగ్న అవస్థ యొక్క అనుభవం ద్వారా మాయను మీ భక్తురాలిగా చేసుకునే మాయాజీత్ భవ

మగ్నావస్థను అనుభవం చేసేందుకు మీ అనేక టైటిల్స్ లేదా స్వరూపాలను, అనేక గుణాల అలంకరణను, అనేక రకాల సంతోషమును, ఆత్మిక నషాను, రచయిత మరియు రచనల విస్తారం యొక్క పాయింట్లను, ప్రాప్తుల పాయింట్లను స్మృతిలో ఉంచుకోండి. మీకు ఇష్టమైన దానిపై మననం చేసినట్లయితే మగ్నావస్థ సహజంగా అనుభవమవుతుంది. ఇక తర్వాత ఎప్పుడూ పరవశులవ్వరు, మాయ సదా కోసం నమస్కరిస్తుంది. మాయ సంగమయుగం యొక్క మొదటి భక్తురాలిగా అయిపోతుంది. మీరు మాయాజీత్, మాస్టర్ భగవాన్ గా అయినప్పుడు మాయ భక్తురాలిగా అవుతుంది.

స్లోగన్:-

మీ ఉచ్చరణ మరియు ఆచరణ, బ్రహ్మా తండ్రి సమానంగా ఉన్నప్పుడు సత్యమైన బ్రాహ్మణులని అంటారు.