ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. కల్ప-కల్పము తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలను చదివించే పురుషోత్తమ సంగమయుగము ఇదొక్కటేనని ఆత్మిక తండ్రి కూర్చొని అర్థము చేయిస్తారు. వారు రాజయోగాన్ని నేర్పిస్తారు. మానవా అనగా ఆత్మ, ఓ ఆత్మ, ఓర్పు వహించు అని తండ్రి ఆత్మిక పిల్లలకు చెప్తారు. ఆత్మలతోనే మాట్లాడుతారు. ఈ శరీరానికి యజమాని ఆత్మ. నేను అవినాశీ ఆత్మను, నా ఈ శరీరము వినాశీ అయినది అని ఆత్మ అంటుంది. నేను కల్పము యొక్క సంగమయుగములో ఒక్కసారి మాత్రమే వచ్చి, ఇప్పుడు సుఖమయమైన రోజులు రాబోతున్నాయని పిల్లలైన మీకు ఓర్పును అందిస్తానని ఆత్మిక తండ్రి అంటారు. ఇప్పుడు మీరు దుఃఖధామములో, రౌరవ నరకంలో ఉన్నారు. కేవలం మీరు మాత్రమే కాదు, పూర్తి ప్రపంచమంతా రౌరవ నరకములోనే ఉంది, నా పిల్లలుగా అయిన మీరు, రౌరవ నరకము నుండి బయట పడి స్వర్గంలోకి వెళ్తున్నారు. సత్య, త్రేతా, ద్వాపర యుగాలు గడిచిపోయాయి. మీ కొరకు కలియుగము కూడా గడిచిపోయింది. మీ కోసం ఈ పురుషోత్తమ సంగమయుగము ఉన్నది, ఇప్పుడు మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. ఆత్మ సతోప్రధానంగా అయినప్పుడు ఈ శరీరాన్ని కూడా వదిలేస్తుంది. సతోప్రధాన ఆత్మకు సత్యయుగములో కొత్త శరీరము కావాలి. అక్కడ అన్నీ కొత్తవిగా ఉంటాయి. పిల్లలూ, ఇప్పుడు దుఃఖధామము నుండి సుఖధామములోకి వెళ్ళాలి, దీని కోసం పురుషార్థము చేయాలి అని తండ్రి అంటారు. సుఖధామంలో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. మీరు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు సత్యమైన జ్ఞానము. భక్తిమార్గములో ప్రతి పౌర్ణమి నాడు కథ వింటూ వచ్చారు, కానీ అది ఉన్నదే భక్తి మార్గము. దానిని సత్యమైన మార్గమని అనరు, జ్ఞానమార్గము సత్యమైన మార్గము. మీరు మెట్లు దిగుతూ-దిగుతూ అసత్య ఖండములోకి వస్తారు. మేము సత్యమైన తండ్రి నుండి ఈ జ్ఞానము పొంది 21 జన్మలు దేవీ దేవతలుగా అవుతామని మీకిప్పుడు తెలుసు. ఒకప్పుడు అలా ఉండేవారము, తర్వాత మెట్లు దిగుతూ వచ్చాము. దిగే కళ మరియు ఎక్కే కళ యొక్క రహస్యము మీ బుద్ధిలో ఉంది. ఓ బాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని కూడా పిలుస్తారు. ఒక్క తండ్రి మాత్రమే పావనంగా తయారుచేసేవారు. పిల్లలూ, మీరు సత్యయుగంలో విశ్వానికి యజమానులుగా ఉండేవారు అని తండ్రి అంటారు. చాలా ధనవంతులుగా, చాలా సుఖంగా ఉండేవారు. ఇప్పుడు ఇంకా కొంచెం సమయమే మిగిలి ఉంది. పాత ప్రపంచ వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. కొత్త ప్రపంచములో ఒకే రాజ్యము, ఒకే భాష ఉండేది. దానిని అద్వైత రాజ్యమని అంటారు. ఇప్పుడు ఎన్నో ద్వైతములు, అనేక భాషలున్నాయి. ఎలాగైతే మనుష్యుల వృక్షము పెరుగుతూ ఉంటుందో, అలా భాషల వృక్షము కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక తర్వాత ఒకే భాష ఉంటుంది. ప్రపంచ చరిత్ర-భూగోళము పునరావృతమవుతుంది అని గాయనముంది కదా. ఇది మనుష్యుల బుద్ధిలో కూర్చోదు. తండ్రియే దుఃఖం యొక్క పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి సుఖం యొక్క కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. ప్రజాపిత బ్రహ్మా ద్వారా దైవీ ధర్మ స్థాపన అని వ్రాయబడి ఉంది. ఇది రాజయోగం యొక్క చదువు. గీతలో ఏ జ్ఞానమైతే రాయబడి ఉందో, తండ్రి దాన్ని సమ్ముఖములో వినిపించారు, మళ్ళీ మనుష్యులు భక్తి మార్గము కోసం కూర్చుని వ్రాశారు, దీని ద్వారా మీరు దిగిపోతూనే వచ్చారు. ఇప్పుడు మీరు పైకి ఎక్కేందుకు భగవంతుడు మిమ్మల్ని చదివిస్తారు. భక్తిని దిగేకళ యొక్క మార్గమని అంటారు. జ్ఞానము ఎక్కే కళ యొక్క మార్గము. ఇది అర్థము చేయించేందుకు మీరు భయపడకండి. ఈ విషయాలను అర్థము చేసుకోని కారణంగా విరోధించేవారు కూడా ఉంటారు, శాస్త్ర వాదన చేస్తారు. కానీ మీరు ఎవరితోనూ కూడా శాస్త్ర వాదన చేయకూడదు. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు చదవడం లేక గంగా స్నానము చేయడం, తీర్థ స్థానాలకు వెళ్ళడం మొదలైనవన్నీ భక్తి కాండమని వారికి చెప్పండి. భారతదేశంలో రావణుడు కూడా ఉన్నాడు, అతని దిష్టిబొమ్మను తప్పకుండా కాలుస్తారు. శత్రువుల దిష్టిబొమ్మను అల్పకాలికంగా కాలుస్తారు. ఈ ఒక్క రావణుని దిష్టిబొమ్మను మాత్రం ప్రతి సంవత్సరము కాలుస్తూనే వస్తారు. మీరు బంగారుయుగపు బుద్ధి నుండి ఇనుపయుగపు బుద్ధి కలవారిగా అయిపోయారని తండ్రి అంటారు. మీరు ఎంత సుఖంగా ఉండేవారు. తండ్రి సుఖధామాన్ని స్థాపన చేసేందుకే వస్తారు. తర్వాత భక్తి మార్గము మొదలైనప్పుడు దుఃఖితులుగా అవుతారు. అప్పుడు సుఖదాతను స్మృతి చేస్తారు, అది కూడా నామమాత్రముగా చేస్తారు ఎందుకంటే వారి గురించి తెలియదు. గీతలో పేరును మార్చేశారు. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు ఒక్కరే, స్మృతి కూడా వారినే చేయాలని మొట్టమొదట దీన్ని మీరు అర్థము చేయించండి. ఒక్కరినే స్మృతి చేయాలి, దీన్నే అవ్యభిచారి స్మృతి, అవ్యభిచారి జ్ఞానమని అంటారు. మీరిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు కనుక భక్తి చేయరు. మీకు జ్ఞానముంది. తండ్రి చదివిస్తారు, దీని ద్వారా మనము ఇలా దేవతలుగా అవుతాము. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి, అందుకే మీరు చార్టు పెట్టండి అని బాబా అంటారు, అప్పుడు నాలో ఎటువంటి ఆసురీ గుణాలు లేవు కదా అన్నది తెలుస్తుంది. మొదటి అవగుణము దేహాభిమానము, తర్వాత శత్రువు కామము. కామముపై విజయం పొందితేనే మీరు జగత్ జీతులుగా అవుతారు. ఇదే మీ ఉద్దేశ్యము, ఈ లక్ష్మీనారాయణుల రాజ్యములో అనేక ధర్మాలేవీ ఉండేవి కావు. సత్యయుగములో దేవతల రాజ్యమే ఉంటుంది. మనుష్యులు కలియుగములో ఉంటారు. వారు కూడా మనుష్యులే కానీ వారు దైవీగుణాలు కలవారు. ఈ సమయంలో మనుష్యులంతా ఆసురీ గుణాలు కలవారు. సత్యయుగంలో కామము మహాశత్రువు ఉండదు. ఈ కామము మహాశత్రువుపై విజయము పొందడం ద్వారా మీరు జగత్ జీతులుగా అవుతారని తండ్రి అంటారు. అక్కడ రావణుడు ఉండడు. ఇది కూడా మనుష్యులు అర్థము చేసుకోలేరు. బంగారు యుగము నుండి దిగిపోతూ-దిగిపోతూ తమోప్రధాన బుద్ధి కలవారిగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. దీనికోసం ఒకే మందు లభిస్తుంది - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయని తండ్రి చెప్తున్నారు. మీరు పాపాలను భస్మము చేసుకునేందుకు కూర్చొన్నారు కావున ఇకపై పాపం చేయకూడదు. లేదంటే అది వందరెట్లుగా అయిపోతుంది. వికారాలలోకి వెళ్తే 100 రెట్లు శిక్ష లభిస్తుంది, అప్పుడు వారు మళ్ళీ కష్టంగా ఎక్కగలరు. మొదటి నంబరు శత్రువు ఈ కామము. 5 అంతస్థుల నుండి పడిపోతే ఎముకలు పూర్తిగా విరిగిపోతాయి. మరణించవచ్చు కూడా. పై నుండి పడిపోవడంతో ఒక్కసారిగా ముక్కలు-ముక్కలుగా అయిపోతారు. తండ్రికి చేసిన ప్రతిజ్ఞను ఉల్లంఘించి నల్ల ముఖం చేసుకున్నారంటే ఆసురీ ప్రపంచములోకి వెళ్ళిపోయినట్లే. ఇక్కడ నుండి మరణించినట్లు అవుతుంది. వారిని బ్రాహ్మణులని కూడా కాదు, శూద్రులని అంటారు.
తండ్రి ఎంత సహజంగా అర్థము చేయిస్తారు. ముందు ఈ నషా ఉండాలి. ఒకవేళ కృష్ణ భగవానువాచ అన్నట్లయితే, వారు కూడా చదివించి తప్పకుండా తన సమానంగా చేస్తారు కదా. కానీ కృష్ణుడు అయితే భగవంతుడు కాదు. వారు పునర్జన్మలలోకి వస్తారు. నేను మాత్రమే పునర్జన్మ రహితుడను అని తండ్రి అంటారు. రాధా-కృష్ణులన్నా, లక్ష్మీ-నారాయణులన్నా లేక విష్ణువన్నా ఒక్కటే. విష్ణువు యొక్క రెండు రూపాలు లక్ష్మీ-నారాయణులు మరియు లక్ష్మీ-నారాయణుల బాల్యమే రాధా-కృష్ణులు. బ్రహ్మా గురించిన రహస్యాన్ని కూడా అర్థము చేయించారు - బ్రహ్మా-సరస్వతులే లక్ష్మీ-నారాయణులు. ఇప్పుడు బదిలీ అవుతారు. వీరికి చివరి పేరు బ్రహ్మా అని పెట్టారు. ఈ బ్రహ్మాను చూడండి, పూర్తిగా ఇనుప యుగములో నిలబడి ఉన్నారు. వీరే మళ్ళీ తపస్సు చేసి కృష్ణునిగా లేక శ్రీనారాయణునిగా అవుతారు. విష్ణువు అని అనడంతో అందులో ఇద్దరూ వస్తారు. సరస్వతి బ్రహ్మా పుత్రిక. ఈ విషయాలు ఎవరూ అర్థము చేసుకోలేరు. బ్రహ్మాకు కూడా నాలుగు భుజాలు చూపిస్తారు ఎందుకంటే ప్రవృత్తి మార్గం కదా. నివృత్తి మార్గము వారు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. మేము ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తాము పదండి అని విదేశాల నుండి చాలామందిని నమ్మించి తీసుకొస్తారు. సన్యాసులైతే రాజయోగాన్ని నేర్పించలేరు. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చారు, మీరిప్పుడు వారి పిల్లలుగా, ఈశ్వరీయ సంప్రదాయస్థులుగా అయ్యారు. ఈశ్వరుడు మిమ్మల్ని చదివించేందుకు వచ్చారు. మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వారు అయితే నిరాకారుడు. బ్రహ్మా ద్వారా మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు. వారిని మీరు బాబా-బాబా అని అంటారు, బ్రహ్మా అయితే మధ్యలో అనువాద కర్త. వీరు భాగ్యశాలి రథము. వీరి ద్వారా బాబా మిమ్మల్ని చదివిస్తారు. మీరు కూడా పతితుల నుండి పావనంగా అవుతారు. మనుష్యుల నుండి దేవతలుగా చేసేందుకు తండ్రి చదివిస్తారు. ఇప్పుడిది రావణ రాజ్యము, ఆసురీ సంప్రదాయము కదా. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారిగా అయ్యారు, మళ్ళీ దైవీ సంప్రదాయానికి చెందినవారిగా అవుతారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు, పావనంగా అవుతున్నారు. సన్యాసులు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడైతే స్త్రీ-పురుషులు ఇంటిలో కలిసే ఉండండి, స్త్రీ నాగిని కనుక మేము వేరైపోతే విముక్తులైపోతాము అని భావించకూడదు అని తండ్రి అంటారు. మీరు పారిపోకూడదు. అలా పారిపోవడం హద్దు యొక్క సన్యాసం, మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు కానీ మీకు ఈ వికారీ ప్రపంచము పట్ల వైరాగ్యముంది. ఈ విషయాలన్నీ మీరు మంచి రీతిగా ధారణ చేయాలి, నోట్ చేసుకోవాలి మరియు పథ్యము కూడా పాటించాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. శ్రీకృష్ణుని గుణాలు గాయనము చేయబడతాయి కదా. ఇది మీ లక్ష్యము-ఉద్దేశ్యము. బాబా అలా అవ్వరు, మిమ్మల్ని తయారుచేస్తారు. మళ్ళీ అర్థకల్పము తర్వాత మీరు క్రిందకు దిగిపోతారు, తమోప్రధానంగా అవుతారు. నేను అలా అవ్వను, ఇతను అవుతారు. 84 జన్మలు కూడా వీరే తీసుకున్నారు. వీరు కూడా ఇప్పుడు సతోప్రధానంగా అవ్వాలి, వీరు పురుషార్థీ. కొత్త ప్రపంచాన్ని సతోప్రధానమని అంటారు. ప్రతి ఒక్క వస్తువు మొదట సతోప్రధానంగా ఉంటుంది, తర్వాత సతో-రజో-తమోలోకి వస్తుంది. చిన్న పిల్లలను కూడా మహాత్ములని అంటారు ఎందుకంటే వారిలో వికారాలుండవు, అందుకే వారిని పుష్పాలని అంటారు. సన్యాసుల కన్నా చిన్న పిల్లలను ఉత్తములని అంటారు ఎందుకంటే సన్యాసులైతే ఎంతో కొంత జీవితాన్ని గడిపి వచ్చారు కదా. వారికి పంచ వికారాల అనుభవం ఉంది. పిల్లలకైతే అవి తెలియనే తెలియవు, అందుకే పిల్లలను చూస్తే సంతోషము కలుగుతుంది, వారు చైతన్య పుష్పాలు. మనది ప్రవృత్తి మార్గము.
ఇప్పుడు పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. అమర లోకములోకి వెళ్ళేందుకు మీరందరూ పురుషార్థము చేస్తారు, మృత్యులోకము నుండి ట్రాన్స్ఫర్ అవుతారు. దేవతలుగా అవ్వాలంటే దానికోసం ఇప్పుడు శ్రమ చేయాల్సి ఉంటుంది, ప్రజాపిత బ్రహ్మా పిల్లలు పరస్పరంలో సోదరీ-సోదరులవుతారు. సోదరీ-సోదరులుగానే ఉండేవారు కదా. ప్రజాపిత బ్రహ్మా పిల్లలు పరస్పరములో ఏమవుతారు? ప్రజాపిత బ్రహ్మా గాయనం చేయబడతారు. ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలుగా అవ్వనంతవరకు, సృష్టి రచన ఎలా జరుగుతుంది? ప్రజాపిత బ్రహ్మాకు అందరూ ఆత్మిక పిల్లలే. ఆ బ్రాహ్మణులు దైహిక యాత్రలు చేసేవారు. మీరు ఆత్మిక యాత్రను చేసేవారు. వారు పతితులు, మీరు పావనమైనవారు. వారేమీ ప్రజాపితకు సంతానము కారు, ఇది మీరు అర్థం చేసుకుంటారు. సోదరీ-సోదరులుగా భావించినప్పుడే వికారాలలోకి వెళ్ళరు. అప్రమత్తంగా ఉండండి, నా పిల్లలుగా అయి వికారీ పనులేవీ చేయకండి, లేదంటే రాతి బుద్ధి కలవారిగా అయిపోతారని తండ్రి కూడా అంటారు. ఇంద్రసభ గురించి కథ కూడా ఉంది. శూద్రుడిని తీసుకుని రాగానే ఇంద్రసభలో అతని దుర్వాసన రావడం మొదలైంది. పతితుడిని ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చావని అడిగారు. తర్వాత ఆమెకు శాపమిచ్చారు. వాస్తవానికి ఈ సభలో కూడా పతితులెవ్వరూ రాకూడదు. తండ్రికి తెలిసినా, తెలియకపోయినా సరే, తమను తామే నష్టపర్చుకుంటారు, ఇంకా 100 రెట్ల శిక్ష పడుతుంది. పతితులకు అనుమతి లేదు. వారికి విజిటింగ్ రూమ్ సరిపోతుంది. పావనంగా అవుతామని గ్యారెంటీ ఇచ్చినప్పుడు, దైవీగుణాలను ధారణ చేసినప్పుడు అనుమతించబడతారు. దైవీగుణాలను ధారణ చేయడానికి సమయం పడుతుంది. పావనంగా అయ్యే ప్రతిజ్ఞ ఒకటే ఉంది.
దేవతల మహిమ మరియు పరమాత్మ మహిమ వేర్వేరుగా ఉంటాయని కూడా అర్థము చేయించారు. పతితపావనుడు, ముక్తిదాత, మార్గదర్శకుడు తండ్రి మాత్రమే. అన్ని దుఃఖాల నుండి ముక్తులను చేసి తమ శాంతిధామానికి తీసుకువెళ్తారు. శాంతిధామము, సుఖధామము మరియు దుఃఖధామము, ఇది కూడా చక్రమే. ఇప్పుడు దుఃఖధామాన్ని మర్చిపోవాలి. నంబరువారుగా పాస్ అయినవారే శాంతిధామము నుండి సుఖధామంలోకి వస్తారు, వారే అలా వస్తూ ఉంటారు. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. లెక్కలేనన్ని ఆత్మలున్నాయి, అందరి పాత్ర నంబరువారుగా ఉంది. వెళ్ళడం కూడా నంబరువారుగానే వెళ్తారు. దానిని శివబాబా వంశవృక్షము లేక రుద్రమాల అని అంటారు. నంబరువారుగా వెళ్తారు, మళ్ళీ నంబరువారుగానే వస్తారు. ఇతర ధర్మాలవారి విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. పిల్లలకు రోజూ అర్థం చేయించడం జరుగుతుంది, స్కూలులో రోజూ చదువుకోకపోతే, మురళి వినకపోతే, ఆబ్సెంటు అయిపోతారు. చదువు యొక్క లిఫ్టు అయితే తప్పకుండా కావాలి. గాడ్లీ యూనివర్సిటీలో ఆబ్సెంటు అవ్వకూడదు. చదువు ఎంత ఉన్నతమైనది, దీనితో మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు. అక్కడైతే ధాన్యమంతా ఉచితంగా లభిస్తుంది, ఖర్చు అవ్వదు. ఇప్పుడైతే ఎంత ఖరీదు ఉంది. 100 సంవత్సరాలలో ఖరీదు ఎంతగా పెరిగిపోయింది. కష్టాలు వచ్చేందుకు అక్కడ అప్రాప్తి అనే వస్తువేదీ ఉండదు. అది ఉన్నదే సుఖధామము. మీరిప్పుడు అక్కడి కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు. మీరు బికారుల నుండి రాకుమారులుగా అవుతారు. షావుకార్లు తమను తాము బికారులుగా భావించరు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సంపూర్ణ పావనంగా అవుతామని తండ్రితో చేసిన ప్రతిజ్ఞను తెంచకూడదు. చాలా-చాలా పథ్యమునుంచాలి. నాలో ఎలాంటి అవగుణాలు లేవు కదా అని తమ చార్టును చూసుకోవాలి.
2. గాడ్లీ యూనివర్సిటీలో ఎప్పుడూ కూడా ఆబ్సెంట్ అవ్వకూడదు. సుఖధామానికి యజమానులుగా అయ్యే ఉన్నతమైన చదువును ఒక్క రోజు కూడా మిస్ చేయకూడదు. మురళీని ప్రతిరోజూ తప్పనిసరిగా వినాలి.