ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు! ఇప్పుడు కొంతమందే ఉన్నారు, ఇంకా అనేక మంది పిల్లలు అవుతారు. ఈ సమయంలో కొద్దిమందే ప్రాక్టికల్ గా అయ్యారు, కానీ ప్రజాపిత బ్రహ్మా అయితే అందరికీ తెలుసు కదా. వీరి పేరే ప్రజాపిత బ్రహ్మా. ఎంత మంది ప్రజలున్నారు. అన్ని ధర్మాల వారు వీరిని తప్పకుండా అంగీకరిస్తారు. వీరి ద్వారానే మనుష్యమాత్రుల రచన జరిగింది కదా. లౌకిక తండ్రి కూడా హద్దు బ్రహ్మా ఎందుకంటే వారి వంశము కూడా తయారౌతుంది కదా అని బాబా అర్థం చేయించారు. ఇంటి పేరుతో వంశము కొనసాగుతుంది. వారు హద్దుకు చెందినవారు, వీరు అనంతమైన తండ్రి. వీరి పేరే ప్రజాపిత. ఆ లౌకిక తండ్రి అయితే పరిమిత ప్రజలను రచిస్తారు. కొంతమంది రచించరు కూడా. వీరైతే తప్పకుండా రచిస్తారు. ప్రజాపిత బ్రహ్మాకు సంతానము లేదని ఎవరైనా అంటారా? మొత్తం ప్రపంచమంతా వీరి సంతానమే. మొట్టమొదటి వారు ప్రజాపిత బ్రహ్మాయే. ముస్లింలు కూడా ఆదమ్ - బీబీ అని ఏదైతే అంటారో, అది తప్పకుండా ఎవరో ఒకరికి వర్తిస్తుంది కదా. ఏడమ్ - ఈవ్, ఆది దేవ్ - ఆది దేవి, ఇవి ఈ ప్రజాపిత బ్రహ్మా కోసమే అంటారు. అన్ని ధర్మాల వారు వీరిని అంగీకరిస్తారు. తప్పకుండా ఒకరు హద్దు తండ్రి, రెండవవారు అనంతమైనవారు. ఈ అనంతమైన తండ్రి అనంతమైన సుఖమునిచ్చేవారు. మీరు కూడా అనంతమైన స్వర్గ సుఖము కోసమే పురుషార్థము చేస్తారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని పొందేందుకు ఇక్కడకు వచ్చారు. స్వర్గంలో అనంతమైన సుఖము, నరకంలో అనంతమైన దుఃఖము అని కూడా అనవచ్చు. దుఃఖాలు కూడా ఎన్నో రానున్నాయి. అయ్యో-అయ్యో అని అంటూ ఉంటారు. తండ్రి మీకు మొత్తం విశ్వం యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థము చేయించారు. పిల్లలైన మీరు సమ్ముఖములో కూర్చున్నారు మరియు పురుషార్థము కూడా చేస్తారు. వీరు మాత-పిత, ఇరువురిగానూ అవుతారు కదా. ఎంత మంది పిల్లలు ఉన్నారు. అనంతమైన మాత-పితలతో ఎప్పుడూ ఎవ్వరూ శతృత్వాన్ని పెట్టుకోరు. మాతపితల నుండి ఎంత సుఖము లభిస్తుంది. నీవే తల్లివి, తండ్రివి,..... అని కూడా పాడుతారు. ఇది పిల్లలు మాత్రమే అర్థము చేసుకుంటారు. ఇతర ధర్మాల వారంతా తండ్రిని మాత్రమే పిలుస్తారు. మాత-పిత అని అనరు. కేవలం ఇక్కడ మాత్రమే నీవే తల్లివి, తండ్రివి, మేము పిల్లలము..... అని పాడుతారు. మేము చదువుకుని మనుష్యుల నుండి దేవతలుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి నావికుడు కూడా, తోటయజమాని కూడా. ఇకపోతే బ్రాహ్మణులైన మీరంతా అనేక రకాల తోటమాలులు. మొఘల్ గార్డెన్ కు కూడా తోటమాలి ఉంటారు కదా. అతని జీతము కూడా ఎంత బాగుంటుంది. మాలీలు కూడా నంబరువారుగా ఉన్నారు కదా. కొంతమంది తోటమాలులు ఎంత మంచి-మంచి పుష్పాలు తయారుచేస్తారు. పుష్పాలలో ఒకటి, రాజా పుష్పము కూడా ఉంటుంది. సత్యయుగంలో రాజు-రాణి పుష్పాలు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ మహారాజులు-మహారాణులు ఉంటారు కానీ పుష్పాల్లా లేరు. పతితులుగా అవ్వడంతో ముళ్ళగా అయిపోతారు. మార్గంలో నడుస్తూ-నడుస్తూ ముల్లు గుచ్చుకుని పారిపోతారు. వారిని అజామిల్ అని కూడా అంటారు. మీరే అందరికన్నా ఎక్కువ భక్తి చేస్తారు. వామమార్గములో పడిపోయినవారి చిత్రాలు ఎంత అసహ్యంగా తయారుచేయబడి ఉన్నాయో చూడండి. దేవతల చిత్రాలనే అలా చూపించారు. ఇప్పుడు అవి వామమార్గం యొక్క చిత్రాలు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలను అర్థము చేసుకున్నారు. మీరిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. మనము వికారాల నుండి చాలా దూరంగా వెళ్ళిపోతాము. బ్రాహ్మణులలో సోదరీ-సోదరులు వికారాలలోకి వెళ్ళడం అనేది చాలా పెద్ద అశుద్ధమైన కర్మ అవుతుంది. మీ పేరే పాడైపోతుంది, అందుకే బాల్యము నుండి ఏవైనా తప్పుడు పనులు చేసి ఉంటే, అవి కూడా బాబాకు వినిపిస్తే సగం క్షమించబడతాయి. అవి గుర్తుంటాయి కదా. ఫలానా సమయంలో నేను ఈ అశుద్ధమైన పని చేశానని తండ్రికి వ్రాసి ఇస్తారు. ఎవరైతే చాలా విశ్వాసపాత్రులుగా, నిజాయితీపరులుగా ఉంటారో, వారు బాబా, మేము ఈ తప్పుడు పనులు చేశాము, క్షమించండి అని బాబాకు రాస్తారు. క్షమాపణ అయితే ఉండదు కానీ సత్యము చెప్పినందుకు వారు తేలికైపోతారు అని తండ్రి అంటారు. అంతేకానీ మర్చిపోతారని కాదు. అలా మర్చిపోలేరు. మున్ముందు అటువంటి పనులేవీ జరగకుండా ఉండేందుకు అప్రమత్తం చేస్తాను. కానీ మనస్సు అయితే తప్పకుండా తింటుంది. బాబా, మేము అజామిల్ గా ఉండేవారిమి అని అంటారు. అది ఈ జన్మ యొక్క విషయమే. ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఎప్పటి నుండి వామమార్గములోకి వచ్చి పాపాత్ములుగా అయ్యారు? ఇప్పుడు తండ్రి మనల్ని మళ్ళీ పుణ్యాత్ములుగా చేస్తారు. పుణ్యాత్మల ప్రపంచమే వేరుగా ఉంటుంది. ప్రపంచము ఒక్కటే కానీ రెండు భాగాలుగా ఉందని అర్థము చేసుకున్నారు. ఒకటేమో పుణ్యాత్ముల ప్రపంచము, దానిని స్వర్గమని అంటారు. రెండవది పాపాత్ముల ప్రపంచము, దానిని నరకము, దుఃఖధామమని అంటారు. సుఖమయమైన ప్రపంచము మరియు దుఃఖపు ప్రపంచము. దుఃఖపు ప్రపంచములో, మాకు ముక్తిని కలిగించండి, ఇంటికి తీసుకువెళ్ళండి అని అందరూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. అలాగని ఇంటికి వెళ్ళి కూర్చోవడం కాదు, మళ్ళీ పాత్రను అభినయించేందుకు రావాలి అని కూడా పిల్లలకు తెలుసు. ఈ సమయంలో మొత్తం ప్రపంచం పతితంగా ఉంది. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు పావనంగా అవుతున్నారు. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. మేము ఇలా తయారవుతున్నాము అన్న లక్ష్యము-ఉద్దేశ్యాన్ని ఇంకెవ్వరూ చూపించరు. పిల్లలూ, ఒకప్పుడు మీరిలా ఉండేవారు, ఇప్పుడు లేరు అని తండ్రి అంటారు. పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయిపోయారు, మళ్ళీ పూజ్యులుగా అయ్యేందుకు పురుషార్థము కావాలి. తండ్రి ఎంత మంచి పురుషార్థము చేయిస్తారు. నేను రాకుమారునిగా అవుతాను అని ఈ బాబా భావిస్తారు కదా. వీరు నంబరువన్ లో ఉన్నారు, అయినా ప్రతి క్షణము స్మృతి నిలిచి ఉండదు. మర్చిపోతారు. ఎవరు ఎంత శ్రమ చేసినా కానీ ఇప్పుడే ఆ స్థితి ఏర్పడదు. యుద్ధ సమయం వచ్చినప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. పురుషార్థమైతే అందరూ చేయాలి కదా. వీరు కూడా చేయాలి. బాబా చిత్రము ఎక్కడుందో చూడండి అని మీరు చిత్రంలో కూడా అర్థం చేయిస్తారు. పూర్తిగా వృక్షం చివర్లో పతిత ప్రపంచంలో నిలబడి ఉన్నారు మరియు వృక్షము క్రింద మళ్ళీ తపస్సు చేస్తున్నారు. ఎంత సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ తండ్రియే అర్థం చేయించారు. ఇంతకుముందు వీరికి కూడా తెలియదు. తండ్రియే నాలెడ్జ్ ఫుల్, అందరూ వారినే - ఓ పరమపిత పరమాత్మ, మీరు వచ్చి మా దుఃఖాన్ని హరించండి అని స్మృతి చేస్తారు. బ్రహ్మా, విష్ణు, శంకరులైతే దేవతలు. మూలవతనంలో ఉండే ఆత్మలను దేవతలని అనరు. బ్రహ్మా, విష్ణు, శంకరుల రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. బ్రహ్మా, లక్ష్మీనారాయణులు, వీరందరూ ఇక్కడే ఉన్నారు కదా. పిల్లలైన మీకు ఇప్పుడు కేవలం సూక్ష్మవతనము యొక్క సాక్షాత్కారమవుతుంది. ఈ బాబా కూడా ఫరిస్తాగా అవుతారు. మెట్ల చిత్రములో ఎవరైతే పైన నిలబడి ఉన్నారే, వారే మళ్ళీ క్రింద తపస్సు చేస్తున్నారని పిల్లలకు తెలుసు. చిత్రములో చాలా స్పష్టంగా చూపించారు. వారు నేను భగవంతుడిని అని ఎక్కడ చెప్పుకుంటున్నారు. నేను పైసకు విలువచేయనివాడిగా ఉండేవాడిని, తతత్వమ్, ఇప్పుడు ఎంతో విలువైనవాడిగా అవుతున్నాను అని అంటారు. ఇవి ఎంత సహజంగా అర్థము చేసుకునే విషయాలు. ఎవరైనా ఎప్పుడైనా అడిగితే, చూడండి, వీరు కలియుగాంతములో నిలబడి ఉన్నారు కదా అని చెప్పండి. ఎప్పుడైతే శిథిలావస్థ, వానప్రస్థ స్థితి ఏర్పడుతుందో, అప్పుడు నేను వీరిలో ప్రవేశిస్తాను అని తండ్రి చెప్తారు. ఇప్పుడు రాజయోగ తపస్సు చేస్తున్నారు. తపస్సు చేసేవారిని దేవతలని ఎలా అంటారు? రాజయోగము నేర్చుకొని ఇలా తయారవుతారు. పిల్లలైన మిమ్మల్ని కూడా ఇటువంటి కిరీటధారులుగా తయారుచేస్తారు కదా. వీరే దేవతగా అవుతారు. ఈ విధంగా 10 - 20 మంది పిల్లల చిత్రాలను కూడా పెట్టవచ్చు. వీరు అలా తయారవుతారని చూపించేందుకు పెట్టవచ్చు. ఇంతకుముందు అందరి ఫోటోలు అలా తయారుచేయబడి ఉండేవి. ఇది అర్థము చేయించే విషయము కదా. ఒకవైపు సాధారణమైనవారు, రెండవవైపు డబల్ కిరీటధారి. మేము ఇలా తయారవుతున్నామని మీకు తెలుసు. ఎవరి లైను అయితే క్లియర్ గా ఉంటుందో, వారే తయారవుతారు మరియు చాలా మధురంగా కూడా అవ్వాలి. ఈ సమయంలో మనుష్యులలో కామము, క్రోధము మొదలైన బీజాలు ఎంత ఎక్కువ అయిపోయాయి. అందరిలోనూ పంచ వికారాల రూపీ బీజాల యొక్క వృక్షాలు వెలువడ్డాయి. ఇటువంటి బీజాలు నాటకండి అని ఇప్పుడు తండ్రి అంటారు. సంగమయుగములో మీరు దేహాభిమానమనే బీజము నాటకూడదు. కామము యొక్క బీజాన్ని నాటకూడదు. అర్థకల్పము వరకు మళ్ళీ రావణుడే ఉండడు. ప్రతి ఒక్క విషయాన్ని తండ్రి కూర్చొని పిల్లలకు అర్థము చేయిస్తారు. ముఖ్యమైన విషయము ఒక్కటే - మన్మనాభవ. నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. అందరికన్నా చివరిలోనూ వీరు ఉన్నారు, మళ్ళీ అందరికన్నా ముందు కూడా వీరే ఉన్నారు. యోగబలముతో ఎంత పావనంగా అవుతారు. ప్రారంభంలో పిల్లలకు చాలా సాక్షాత్కారాలయ్యేవి. భక్తి మార్గములో నవవిధ భక్తి చేసినప్పుడు సాక్షాత్కారాలు అవుతాయి. ఇక్కడైతే వీరు కూర్చుని-కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు, దీనిని ఇంద్రజాలమని భావించేవారు. ఇదైతే ఫస్ట్ క్లాస్ ఇంద్రజాలము. మీరా చాలా తపస్సు చేసారు, సాధు సన్యాసులు మొదలైనవారి సాంగత్యం చేసారు. ఇక్కడ సాధువులు మొదలైనవారు ఎక్కడున్నారు. వీరు తండ్రి కదా. అందరి తండ్రి శివబాబా. గురువుగారిని కలుసుకోవాలని అంటారు. ఇక్కడైతే గురువు ఎవరూ లేరు. శివబాబా అయితే నిరాకారుడు, మరి ఎవరిని కలవాలనుకుంటున్నారు? ఆ గురువుల వద్దకు వెళ్ళి కానుకలు సమర్పిస్తారు. ఈ తండ్రి అనంతమైన యజమాని. ఇక్కడ కానుకలు మొదలైనవి సమర్పించే విషయం లేదు. ఈ ధనాన్ని ఏమి చేసుకుంటారు? నేను విశ్వానికి అనంతమైన యజమానిగా అవుతానని ఈ బ్రహ్మా కూడా భావిస్తారు. పిల్లలిచ్చే ధనము మొదలైన వాటితో, వారి కోసమే ఇళ్ళు మొదలైనవి నిర్మిస్తారు. ధనము అయితే శివబాబాకు పనికి రాదు, బ్రహ్మాబాబాకు పనికి రాదు. ఈ ఇళ్ళు మొదలైనవి పిల్లల కోసమే తయారుచేసారు, పిల్లలే వచ్చి అందులో ఉంటారు. కొంతమంది పేదవారు ఉంటే కొంతమంది షావుకారులుగా ఉన్నారు, కొంతమంది బాబా, మా ఇటుకను కూడా పెట్టండి అని రెండు రూపాయలను కూడా పంపిస్తారు. కొంతమంది వెయ్యి రూపాయలను పంపిస్తారు. భావన అయితే ఇద్దరికీ ఒక్కటే కదా. కనుక ఇరువురిదీ సమానమైపోతుంది. పిల్లలు వచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ ఉండవచ్చు. ఒకవేళ ఇల్లు కట్టించినవారు వస్తే, వారిని తప్పకుండా సుఖంగా ఉంచుతారు. బాబా వద్ద కూడా కొందిరికి విశేషంగా మర్యాదలు జరుగుతాయని కొందరు అంటారు. అరే, అదైతే తప్పకుండా చేయవలసి ఉంటుంది కదా. ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారు, కొంతమందైతే ఎక్కడైనా కూర్చుండిపోతారు. కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు. విదేశాలలో ఉండేవారు, పెద్ద-పెద్ద మహళ్ళలో ఉండేవారు కూడా ఉంటారు. ప్రతి ఒక్క దేశంలో పెద్ద-పెద్ద షావుకార్లు వెలువడుతారు కనుక ఇళ్ళు మొదలైనవి అలాంటివే తయారుచేస్తారు. ఇక్కడికి ఎంత మంది పిల్లలు వస్తారో చూడండి. ఇంకే తండ్రికీ ఇలాంటి ఆలోచనలు ఉండవు. ఉంటే, 10-12-20 మంది మనవలు-మనవరాళ్ళు ఉండవచ్చు. అచ్ఛా, ఎవరికైనా 200-500 మంది కూడా ఉండవచ్చు, అంతకన్నా ఎక్కువ అయితే ఉండరు కదా. ఈ బాబా కుటుంబము అయితే ఎంత పెద్దది, ఇంకా వృద్ధి చెందనున్నది. ఇక్కడైతే రాజధాని స్థాపనౌతుంది. తండ్రి కుటుంబం ఎంత పెద్దదవుతుంది. ప్రజాపిత బ్రహ్మా కుటుంబము ఎంత పెద్దదిగా అయిపోయింది. వారు కల్ప-కల్పము వచ్చినప్పుడు ఈ అద్భుతమైన విషయాలు మీ చెవులలో పడతాయి. ఓ ప్రభూ, మీ గతి-మతి అన్నింటికన్నా అతీతంగా ప్రారంభమవుతుందని తండ్రి కోసమే అంటారు కదా. భక్తి మరియు జ్ఞానంలో ఎంత తేడా ఉందో చూడండి.
స్వర్గములోకి వెళ్ళాలంటే దైవీ గుణాలను కూడా ధారణ చేయాలని తండ్రి మీకు అర్థం చేయిస్తారు. ఇప్పుడైతే ముళ్ళలా ఉన్నారు కదా. నిర్గుణుడినైన నాలో ఏ గుణాలు లేవు అని పాడుతూ ఉంటారు. పంచ వికారాల అవగుణాలున్నాయి, ఇది రావణ రాజ్యము. ఇప్పుడు మీకెంత మంచి జ్ఞానము లభిస్తుంది. ఈ జ్ఞానము ఎంతటి సంతోషాన్ని అయితే ఇస్తుందో, ఆ జ్ఞానము అంతటి సంతోషాన్ని ఇవ్వదు. ఆత్మలైన మనము పైన మూలవతనములో ఉండేవారమని మీకు తెలుసు. సూక్ష్మవతనములో బ్రహ్మా, విష్ణు, శంకరులు ఉంటారు, అది కూడా కేవలం సాక్షాత్కారం జరుగుతుంది. బ్రహ్మా కూడా ఇక్కడి వారే, లక్ష్మీ-నారాయణులు కూడా ఇక్కడి వారే. కేవలం వారి సాక్షాత్కారాలు జరుగుతాయి. వ్యక్త బ్రహ్మా మళ్ళీ సూక్ష్మవతన వాసి ఫరిస్తా బ్రహ్మాగా ఎలా అవుతారు అన్న గుర్తులున్నాయి. అంతేకానీ, ఇంకేమీ లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని విషయాలను అర్థము చేసుకుంటూ ఉంటారు, ధారణ చేస్తూ ఉంటారు. ఇది కొత్త విషయమేమీ కాదు. మీరు అనేక సార్లు దేవతలుగా అయ్యారు, దైవీ రాజ్యముండేది కదా. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. అది వినాశీ డ్రామా, ఇది అనాది, అవినాశీ డ్రామా. ఇది మీ బుద్ధిలో తప్ప ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఈ విషయాలన్నింటినీ తండ్రియే కూర్చొని అర్థము చేయిస్తారు. అంతేకానీ ఇది పరంపరగా కొనసాగుతూ వచ్చిందని కాదు. ఈ జ్ఞానాన్ని మీకిప్పుడు వినిపిస్తాను అని తండ్రి చెప్తారు. తర్వాత ఇది ప్రాయః లోపమైపోతుంది. మీరు రాజ్య పదవిని ప్రాప్తించుకుంటారు, తర్వాత సత్యయుగంలో ఈ జ్ఞానం ఉండదు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇప్పుడు మేము బ్రాహ్మణులము అన్న స్మృతి సదా ఉండాలి కావున వికారాలకు చాలా-చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడూ వికారీ కర్మలేవీ జరగకూడదు. తండ్రితో చాలా-చాలా నిజాయితీగా, విశ్వాసపాత్రులుగా ఉండాలి.
2. డబల్ కిరీటధారులైన దేవతలుగా అయ్యేందుకు చాలా మధురంగా తయారవ్వాలి, లైను క్లియర్ గా ఉంచుకోవాలి. రాజయోగ తపస్సు చేయాలి.