26-12-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీకు అనంతమైన జాగీరును ఇచ్చేందుకు తండ్రి వచ్చారు, ఇటువంటి మధురమైన బాబాను మీరు ప్రేమగా స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు”

ప్రశ్న:-

వినాశన సమయము దగ్గరకు వస్తున్న కొలది దాని గుర్తులు ఎలా ఉంటాయి?

జవాబు:-

వినాశన సమయము దగ్గరకు వస్తున్నప్పుడు - 1. మా బాబా వచ్చేశారు అని అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. 2. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము జరుగనున్నది అని చాలా మందికి సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. 3. సన్యాసులు, రాజులు మొదలైనవారికి జ్ఞానము లభిస్తుంది. 4. అనంతమైన తండ్రి వచ్చారు, వారే సద్గతినిచ్చేవారు అని విన్నప్పుడు చాలామంది వస్తారు. 5. వార్తాపత్రికల ద్వారా అనేకమందికి సందేశము లభిస్తుంది. 6. పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారు. ఒక్క తండ్రి స్మృతిలోనే అతీంద్రియ సుఖములో ఉంటారు.

గీతము:-

ఈ పాప ప్రపంచము నుండి దూరంగా తీసుకువెళ్ళు..... (ఇస్ పాప్ కీ దునియా సే.....)

ఓంశాంతి. ఈ మాట ఎవరు అంటారు మరియు ఎవరితో అంటారు - ఆత్మిక పిల్లలు బాబాతో అంటారు. బాబా పదే-పదే ఆత్మిక అని ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆత్మలు తిరిగి వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైతే ఈ ప్రపంచములోకి వస్తారో, అప్పుడు ఇక్కడ సుఖముంటుంది. ఆత్మలు ఈ శాంతి మరియు సుఖ వారసత్వాన్ని కల్ప క్రితము కూడా పొందారు. ఇప్పుడు మళ్ళీ ఈ వారసత్వము రిపీట్ అవుతుంది. రిపీట్ అయినప్పుడు సృష్టి చక్రము కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది. అన్నీ రిపీట్ అవుతాయి కదా. ఏదైతే గతించిందో, అది మళ్ళీ రిపీట్ అవుతుంది. నాటకాలు కూడా ఇలా రిపీట్ అవుతాయి కానీ వాటిలో మార్పులు కూడా చేసుకోవచ్చు. ఏవైనా పదాలు మర్చిపోతే, వాటిని తయారుచేసి కలుపుతారు. దీనిని మళ్ళీ సినిమా అని అంటారు, ఇందులో మార్పులు చేయలేరు. ఇది అనాదిగా తయారై-తయారవుతున్న డ్రామా. ఆ నాటకాన్ని తయారై-తయారవుతున్న నాటకమని అనరు. ఈ డ్రామాను అర్థము చేసుకోవడం ద్వారా దాని గురించి కూడా అర్థము చేసుకోగలరు. ఇప్పుడు చూసే నాటకాలు మొదలైనవన్నీ అసత్యమైనవని పిల్లలు అర్థము చేసుకున్నారు. కలియుగంలో ఏ వస్తువులనైతే చూస్తారో, అవి సత్యయుగములో ఉండవు. సత్యయుగంలో ఏదైతే జరిగిందో, అది మళ్ళీ సత్యయుగంలోనే జరుగుతుంది. ఈ హద్దు నాటకాలు మొదలైనవన్నీ మళ్ళీ భక్తి మార్గములోనే ఉంటాయి. ఏవైతే భక్తి మార్గములో ఉంటాయో, అవన్నీ జ్ఞాన మార్గములో అనగా సత్యయుగంలో ఉండవు. కావున ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి నుండి వారసత్వము పొందుతున్నారు. ఒకటేమో లౌకిక తండ్రి నుండి, ఇంకొకటి పారలౌకిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది అని తండ్రి అర్థం చేయించారు. ఈ అలౌకిక తండ్రి నుండైతే వారసత్వం లభించదు. ఇతను కూడా వారి నుండే వారసత్వము పొందుతారు. ఈ కొత్త ప్రపంచ ఆస్తి ఏదైతే ఉందో, దానిని ఆ అనంతమైన తండ్రి కేవలం ఇతని ద్వారా మాత్రమే ఇస్తారు. ఇతని ద్వారా మనల్ని దత్తత తీసుకుంటారు, అందుకే వీరిని తండ్రి అని అంటారు. భక్తి మార్గంలో కూడా లౌకిక మరియు పారలౌకిక తండ్రులిరువురూ గుర్తుకొస్తారు. వీరు (అలౌకిక తండ్రి) గుర్తుకు రారు ఎందుకంటే వీరి నుండి ఏ వారసత్వము లభించదు. తండ్రి అనే పదమైతే సరిగ్గానే ఉంది కానీ ఈ బ్రహ్మా కూడా రచనయే కదా! రచనకు రచయిత నుండి వారసత్వము లభిస్తుంది. మిమ్మల్ని కూడా శివబాబాయే రచించారు. బ్రహ్మాను కూడా వారే రచించారు. వారసత్వము రచయిత నుండి లభిస్తుంది. వారు అనంతమైన తండ్రి. బ్రహ్మా వద్ద అనంతమైన వారసత్వము ఏమైనా ఉందా? తండ్రి ఇతని ద్వారా అర్థం చేయిస్తున్నారు. ఇతనికి కూడా వారసత్వము లభిస్తుంది, అంతేకానీ ఇతను తీసుకొని మీకు ఇస్తారని కాదు. మీరు ఇతడిని కూడా స్మృతి చేయకండి, ఈ అనంతమైన తండ్రి నుండి మీకు ఆస్తి లభిస్తుంది అని తండ్రి అంటున్నారు. లౌకిక తండ్రి నుండి హద్దు వారసత్వము, పారలౌకిక తండ్రి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది. రెండూ రిజర్వు అయిపోయాయి. శివబాబా నుండి వారసత్వము లభిస్తుందని బుద్ధిలోకి వస్తుంది, అంతేకానీ బ్రహ్మాబాబా నుండి వారసత్వము వస్తుందని అనరు. బుద్ధిలో జాగీరు గుర్తుకు వస్తుంది కదా. ఈ అనంతమైన రాజ్యము కూడా మీకు వారి నుండి లభిస్తుంది. వారు పెద్ద బాబా. ఇతను కూడా - నన్ను స్మృతి చేయకండి, మీకు లభించేందుకు నా వద్ద ఆస్తి ఏమీ లేదు, ఎవరి నుండైతే ఆస్తి లభించనున్నదో, వారిని స్మృతి చేయండి అని అంటారు. నన్నొక్కరినే స్మృతి చేయండని వారే అంటున్నారు. లౌకిక తండ్రి ఆస్తి విషయంలో ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే గొడవల విషయమేమీ లేదు. తండ్రిని స్మృతి చేయకపోతే అనంతమైన వారసత్వము కూడా ఆటోమేటిక్ గా లభించదు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి అంటున్నారు. నీవు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే విశ్వరాజ్యాధికారం లభిస్తుందని ఈ రథానికి కూడా చెప్తున్నారు. దీనినే స్మృతియాత్ర అని అంటారు. దేహ సంబంధాలన్నీ వదిలి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి. ఇందులోనే శ్రమ ఉంది. చదువు కోసం ఎంతోకొంత శ్రమించవలసి ఉంటుంది కదా. ఈ స్మృతియాత్ర ద్వారా మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు. వారు శరీరంతో యాత్రలు చేస్తారు. కానీ ఇది ఆత్మ చేసే యాత్ర. మీ ఈ యాత్ర పరంధామానికి వెళ్ళేందుకు చేసే యాత్ర. పరంధామానికి లేక ముక్తిధామానికి ఈ పురుషార్థము చేయకుండా ఎవ్వరూ వెళ్ళలేరు. ఎవరైతే బాగా స్మృతి చేస్తారో, వారే వెళ్ళగలరు. అంతేకాక, ఉన్నతమైన పదవిని కూడా వారే పొందగలరు. వెళ్ళడమైతే అందరూ వెళ్తారు. కానీ వారు పతితులు కనుక పిలుస్తూ ఉంటారు. ఆత్మ స్మృతి చేస్తుంది, తినడము, తాగడము, అన్నీ ఆత్మయే చేస్తుంది కదా. ఈ సమయంలో మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి, ఇందులోనే శ్రమ ఉంది. శ్రమ చేయకుండా ఏదీ లభించదు. వాస్తవానికి ఇది చాలా సులభము, కానీ మాయ నుండి అపోజిషన్ ఉంటుంది కదా. ఎవరి భాగ్యమైతే బాగుంటుందో, వారు వెంటనే ఇందులో నిమగ్నమైపోతారు. కొంతమంది ఆలస్యంగా కూడా వస్తారు. ఒకవేళ బుద్ధిలో సరిగ్గా కూర్చున్నట్లయితే, ఇక మేము ఈ ఆత్మిక యాత్రలో నిమగ్నమవుతామని అంటారు. ఇలా తీవ్ర వేగముతో నిమగ్నమైపోతే బాగా పరుగు తీయవచ్చు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తున్నాను, ఇది చాలా మంచి విషయము, సరైన విషయము అని ఇంట్లో ఉంటూ కూడా బుద్ధిలోకి వచ్చేస్తుంది. తండ్రి ఆజ్ఞను అనుసరిస్తే పావనంగా అవ్వగలుగుతారు. అలా తప్పకుండా తయారవుతారు. ఇది పురుషార్థం యొక్క విషయము. ఇది చాలా సహజమైనది. భక్తి మార్గములోనైతే చాలా కష్టముంటుంది. ఇప్పుడు మనము బాబా వద్దకు తిరిగి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడకు వచ్చి విష్ణుమాలలో కూర్చబడాలి అని మీ బుద్ధిలో ఉంది. మాలల లెక్క చూడాలి. బ్రహ్మా మాల, విష్ణు మాల, రుద్ర మాల కూడా ఉన్నాయి. మొట్టమొదట కొత్త సృష్టిలోనివారు వీరే కదా. మిగిలినవారంతా వెనుక వస్తారు అనగా చివరిలో కూర్చబడతారు. మీ ఉన్నతమైన కులమేమిటి అని ఎవరైనా అడిగితే, మీరు విష్ణు కులమని చెప్తారు. మనము వాస్తవానికి విష్ణు కులానికి చెందినవారము, తర్వాత క్షత్రియ కులానికి చెందినవారిగా అయ్యాము, తర్వాత వారి నుండి వారి-వారి వంశాలు వెలువడతాయి. ఈ జ్ఞానము ద్వారా వంశాలెలా తయారవుతాయి అనేది మీరు అర్థము చేసుకున్నారు. మొట్టమొదట రుద్ర మాల తయారవుతుంది. అది అత్యంత ఉన్నతమైన వంశము. ఇది చాలా ఉన్నతమైన మీ కులము అని బాబా అర్థం చేయిస్తారు. మొత్తం ప్రపంచమంతటికీ తప్పకుండా సందేశము లభిస్తుందని కూడా అర్థము చేసుకుంటారు. భగవంతుడు తప్పకుండా ఎక్కడో వచ్చి ఉన్నారు, కానీ ఎక్కడ అనేది తెలియదు అని అంటారు. చివరికి అందరికీ తెలుస్తుంది. వార్తాపత్రికల్లో వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే కొంచెమే వేస్తున్నారు. అలాగని అందరూ ఒకే వార్తాపత్రికను చదువుతారని కాదు. లైబ్రరీలో చదవవచ్చు. కొంతమంది 2-4 వార్తాపత్రికలు కూడా చదువుతారు. కొంతమంది ఏమీ చదవరు. ఇప్పుడు బాబా వచ్చారని అందరికీ తెలియనున్నది. వినాశన సమయము చాలా దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచము వినాశనము జరుగుతుంది. చాలా మందికి సాక్షాత్కారాలు కూడా జరగవచ్చు. మీరు సన్యాసులు, రాజులు మొదలైనవారికి కూడా జ్ఞానమునివ్వాలి. చాలా మందికి సందేశము లభించాలి. అనంతమైన తండ్రి వచ్చారు, వారే సద్గతినిచ్చేవారు అని విన్నప్పుడు చాలా మంది వస్తారు. ఇప్పుడు వార్తాపత్రికల్లో అంతగా నియమబద్ధంగా మనకు నచ్చే విధంగా వెలువడడం లేదు. ఎవరో ఒకరు వెలువడతారు, అన్నీ అడిగి తెలుసుకుంటారు. మనము శ్రీమతం అనుసారముగా సత్యయుగాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇది మీ కొత్త మిషన్. మీరు ఈశ్వరీయ మిషన్ లోని ఈశ్వరీయ సభ్యులు. క్రైస్తవ మిషన్ లో క్రైస్తవ సభ్యులుగా అవుతారు కదా. మీరు ఈశ్వరీయ మిషన్ లోనివారు, అందుకే అతీంద్రియ సుఖం గురించి తెలుసుకోవాలనుకుంటే ఆత్మాభిమానులుగా అయిన గోప-గోపికలను అడగండి అనే గాయనముంది. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి, ఇతరులెవ్వరినీ కాదు. ఈ రాజయోగాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. వారే గీతా భగవానుడు. అందరికీ తండ్రి ఇచ్చే ఈ ఆహ్వానము లేక సందేశాన్ని ఇవ్వాలి. మిగిలిన విషయాలన్నీ జ్ఞాన అలంకరణనే. ఈ చిత్రాలన్నీ జ్ఞాన అలంకరణలు, అంతేకానీ భక్తికి సంబంధించినవి కాదు. మనుష్యులకు అర్థము చేయించేందుకు తండ్రి కూర్చుని వీటిని తయారుచేయించారు. ఈ చిత్రాలు మొదలైనవన్నీ ప్రాయః లోపమైపోతాయి. ఇకపోతే, ఈ జ్ఞానము ఆత్మలో నిలిచిపోతుంది. తండ్రికి కూడా ఈ జ్ఞానముంది. ఇది డ్రామాలో రచింపబడి ఉంది.

ఇప్పుడు మీరు భక్తి మార్గాన్ని దాటి జ్ఞాన మార్గములోకి వచ్చారు. మన ఆత్మలో ఈ పాత్ర ఉంది, ఇప్పుడది నడుస్తూ ఉందని మీకు తెలుసు. రచింపబడి ఉన్నట్లుగానే మనమిప్పుడు తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. తండ్రియే వచ్చి ఈ జ్ఞానాన్ని ఇవ్వవలసి ఉంది. ఇది ఆత్మలో రచింపబడి ఉంది. అక్కడికి చేరుకుంటాము, మళ్ళీ కొత్త ప్రపంచంలో పాత్ర రిపీట్ అవుతుంది. ప్రారంభము నుండి మొదలుకుని ఆత్మలోని రికార్డు అంతటినీ ఈ సమయంలో మీరు తెలుసుకున్నారు. మళ్ళీ ఇవన్నీ ఆగిపోతాయి. భక్తి మార్గపు పాత్ర కూడా ఆగిపోతుంది. మళ్ళీ సత్యయుగంలో మీ పాత్ర ఏదైతే జరిగి ఉంటుందో, అదే జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది అనేది తండ్రి చెప్పరు. ఏదైతే ఇంతకుముందు జరిగిందో, అదే జరుగుతుంది. సత్యయుగము కొత్త ప్రపంచమని అర్థం చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా అక్కడ అన్నీ కొత్తవిగా, సతోప్రధానంగా, చౌకగా ఉంటాయి. కల్పక్రితము ఏదైతే జరిగిందో, అదే జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణులకు ఎంత సుఖముంటుంది అనేది కూడా చూస్తారు. వజ్రవైఢూర్యాలు, ధనము అపారంగా ఉంటాయి. ధనముంటే సుఖము కూడా ఉంటుంది. ఇక్కడ మీరు పోల్చవచ్చు. అక్కడ పోల్చలేరు. ఇక్కడి విషయాలన్నింటినీ అక్కడ మర్చిపోతారు. ఇవన్నీ కొత్త విషయాలు. వీటిని తండ్రియే పిల్లలకు అర్థం చేయిస్తారు. కార్యవ్యవహారాలన్నీ సమాప్తమైపోయే ఆ స్థానానికి ఆత్మలు వెళ్ళవలసి ఉంటుంది. లెక్కాచారాలన్నీ సమాప్తము అయిపోతాయి. రికార్డు పూర్తయిపోతుంది. ఒకే రికార్డు చాలా పెద్దదిగా ఉంటుంది. అయితే ఆత్మ కూడా అంతే పెద్దగా ఉండాలి కదా అని అంటారు. కానీ అలా ఉండదు. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఆత్మ కూడా అవినాశియే. దీనిని కేవలం అద్భుతమని అంటారు. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయము ఇంకేదీ ఉండదు. సత్య-త్రేతా యుగాల సమయంలో బాబా విశ్రాంతిలో ఉంటారు అని బాబా కోసం చెప్తారు. మనము ఆల్ రౌండ్ పాత్రను అభినయిస్తాము. మన పాత్ర అందరికంటే ఎక్కువగా ఉంటుంది కావున తండ్రి వారసత్వము కూడా ఉన్నతమైనది ఇస్తారు. 84 జన్మలు కూడా మీరే తీసుకుంటారని బాబా అంటారు. మన పాత్ర ఇతరులెవ్వరూ అభినయించలేని విధంగా ఉంటుంది. ఇవి అద్భుతమైన విషయాలు కదా. తండ్రి కూర్చొని ఇదంతా ఆత్మలకు అర్థము చేయించడమనేది కూడా అద్భుతమైన విషయము. ఆత్మ పురుషుడూ కాదు, స్త్రీ కూడా కాదు. శరీరాన్ని ధరించినప్పుడు స్త్రీ, పురుషులు అని పిలువబడతారు. ఆత్మలందరూ పుత్రులే కావున పరస్పరంలో అందరూ సోదరులే. వారసత్వాన్ని పొందేందుకు అందరూ సోదరులే. ఆత్మ తండ్రికి పుత్రుడు కదా! తండ్రి నుండి వారసత్వము తీసుకుంటుంది కావున పురుషుడని అంటారు. తండ్రి నుండి వారసత్వం తీసుకునే హక్కు ఆత్మలందరికీ ఉంది. అందుకే తండ్రిని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. మనమందరమూ సోదరులము. ఆత్మ ఆత్మనే. అది ఎప్పుడూ మారదు. ఇకపోతే, శరీరాన్ని ఒక్కోసారి పురుష శరీరాన్ని, ఒక్కోసారి స్త్రీ శరీరాన్ని తీసుకుంటుంది. ఇవి అర్థము చేసుకోవలసిన చాలా ఆసక్తికరమైన విషయాలు. వీటిని ఇతరులెవ్వరూ వినిపించలేరు. తండ్రి నుండి లేక పిల్లలైన మీ నుండి మాత్రమే వినగలరు. తండ్రి అయితే పిల్లలైన మీతో మాత్రమే మాట్లాడతారు. ఇంతకుముందు అందరినీ కలిసేవారు, అందరితోనూ మాట్లాడేవారు. ఇక ముందు-ముందు మెల్లమెల్లగా చివరికి ఎవరితోనూ మాట్లాడరు. కుమారుడు తండ్రిని ప్రత్యక్షము చేస్తాడు కదా. పిల్లలే చదివించాలి. పిల్లలైన మీరే అనేకుల సేవను చేసి తీసుకువస్తారు. వీరు చాలా మందిని తమ సమానంగా తయారుచేసి తీసుకువస్తున్నారని బాబా భావిస్తారు. ఇతడు పెద్ద రాజుగా, ఇతడు చిన్న రాజుగా అవుతాడని అర్థము చేసుకుంటారు. అందరినీ రావణుని సంకెళ్ళ నుండి విడిపించి మీ మిషన్ లోకి తీసుకువచ్చే ఆత్మిక సైన్యము కూడా మీరే. ఎవరు ఎంత సేవ చేస్తారో, వారికంత ఫలము లభిస్తుంది. ఎవరైతే ఎక్కువ భక్తి చేశారో, వారే ఎక్కువ చురుకైనవారిగా అయ్యి వారసత్వము తీసుకుంటారు. ఇది చదువు. బాగా చదువుకోకపోతే ఫెయిల్ అవుతారు. చదువు చాలా సహజమైనది. అర్థము చేసుకోవడం మరియు అర్థము చేయించడం కూడా సహజమే. కష్టమైన విషయమేమీ లేదు. కాని రాజధాని స్థాపనవ్వనున్నది, అందులోనైతే అందరూ కావాలి కదా. పురుషార్థము చేయాలి. తద్వారా మనము ఉన్నత పదవిని పొందాలి. మృత్యులోకము నుండి ట్రాన్స్ఫర్ అయ్యి అమరలోకంలోకి వెళ్ళాలి. ఎంతగా చదువుకుంటారో, అంతగా అమరపురిలో ఉన్నతమైన పదివిని పొందుతారు.

తండ్రిని ప్రేమించాలి కూడా ఎందుకంటే వీరు అత్యంత ప్రియమైనవారు. వారు ప్రేమసాగరుడు కూడా. ప్రేమ ఏకరసంగా ఉండదు. కొంతమంది స్మృతి చేస్తారు, కొంతమంది చేయరు. కొంతమందికి ఇతరులకు అర్థం చేయించాలనే నషా కూడా ఉంటుంది కదా. ఇది చాలా పెద్ద ఆకర్షణ. ఇది విశ్వవిద్యాలయమని అందరికీ అర్థం చేయించాలి. ఇది ఆధ్యాత్మిక చదువు. ఇటువంటి చిత్రాలు ఇంకే స్కూళ్ళలోనూ చూపించబడవు. దినప్రతిదినము ఇంకా ఎన్నో చిత్రాలు వెలువడుతూ ఉంటాయి. వాటిని చూడగానే మనుష్యులు అర్థము చేసుకుంటారు. మెట్ల చిత్రము చాలా బాగుంది, కానీ దేవతా ధర్మానికి చెందినవారు కాకపోతే ఇది అర్థము కాదు. ఎవరైతే ఈ కులానికి చెందినవారిగా ఉంటారో, వారికి బాణము తగులుతుంది. మన దేవతా ధర్మానికి చెందిన ఆకులు ఎవరైతే ఉంటారో, వారే వస్తారు. వీరు చాలా అభిరుచితో వింటున్నారని మీకు ఫీల్ అవుతుంది. కొంతమంది ఊరికినే వెళ్ళిపోతారు. దినప్రతిదినము పిల్లలకు కొత్త-కొత్త విషయాలను కూడా అర్థము చేయిస్తూ ఉంటారు. సేవ చేయాలనే అభిరుచి చాలా ఉండాలి. ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో, వారే హృదయాన్ని అధిరోహిస్తారు మరియు సింహాసనాన్ని అధిరోహిస్తారు. మున్ముందు మీకు అన్ని విషయాలు సాక్షాత్కారమవుతూ ఉంటాయి. మీరు ఆ సంతోషములోనే ఉంటారు. ప్రపంచములో ఎన్నో హాహాకారాలు జరుగనున్నాయి. రక్తపు నదులు కూడా ప్రవహించనున్నాయి. సేవ చేసే సాహసవంతులు ఎప్పుడూ ఆకలితో మరణించరు. కానీ ఇక్కడ మీరు వనవాసంలో ఉండాలి. సుఖము కూడా అక్కడ లభిస్తుంది. కన్యను వనవాహంలో కూర్చోబెడతారు కదా. అత్తవారింటికి వెళ్ళి బాగా ధరించు అని అంటారు. మీరు కూడా అత్తవారింటికి వెళ్తారు కనుక ఆ నషా ఉంటుంది. అది సుఖధామము. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మాలలో కూర్చబడేందుకు దేహీ-అభిమానులుగా అయి తీవ్ర వేగంతో స్మృతియాత్రను చేయాలి. తండ్రి ఆజ్ఞపై నడుస్తూ పావనంగా అవ్వాలి.

2. తండ్రి పరిచయమునిచ్చి అనేకులను మీ సమానంగా తయారుచేసే సేవ చేయాలి. ఇక్కడ వనవాహంలో ఉండాలి. అంతిమ హాహాకారాల దృశ్యాలను చూసేందుకు మహావీరులుగా అవ్వాలి.

వరదానము:-

ప్రతి కర్మలో తండ్రిని ఫాలో చేసి స్నేహానికి బదులిచ్చే తీవ్రపురుషార్థీ భవ

ఎవరి పట్ల స్నేహముంటుందో, వారిని ఆటోమేటిక్ గానే ఫాలో చేయడం జరుగుతుంది. నేను ఏ కర్మనైతే చేస్తున్నానో, అది తండ్రిని ఫాలో చేస్తున్నట్లుగా ఉందా అని సదా గుర్తుండాలి. ఒకవేళ అలా లేకపోతే, దానిని ఆపేయండి. తండ్రిని కాపీ చేస్తూ తండ్రి సమానంగా అవ్వండి. ఏ విధంగా కాపీ చేసేందుకు కార్బన్ పేపరు పెడతారో, అలా అటెన్షన్ అనే పేపరును పెట్టినట్లయితే కాపీ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడే తీవ్రపురుషార్థులుగా అయ్యి స్వయాన్ని ప్రతి శక్తితో సంపన్నంగా చేసుకునే సమయము. ఒకవేళ స్వయమే స్వయాన్ని సంపన్నంగా చేసుకోలేకపోతే, సహయోగం తీసుకోండి. లేదంటే మున్ముందు టూ లేట్ అయిపోతారు.

స్లోగన్:-

సంతుష్టత యొక్క ఫలము ప్రసన్నత, ప్రసన్నచిత్తులుగా అవ్వడంతో ప్రశ్నలు సమాప్తమైపోతాయి.