04-12-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - పిల్లలైన మిమ్మల్ని జ్ఞానముతో అలంకరించేందుకు అనంతమైన తండ్రి వచ్చారు, ఉన్నత పదవిని పొందాలంటే సదా అలంకరింపబడి ఉండండి”

ప్రశ్న:-

ఏ పిల్లలను చూసి అనంతమైన తండ్రి చాలా సంతోషిస్తారు?

జవాబు:-

ఏ పిల్లలైతే సేవ కోసం ఎవర్రెడీగా ఉంటారో, అలౌకిక మరియు పారలౌకిక తండ్రులిద్దరినీ పూర్తిగా ఫాలో చేస్తారో, జ్ఞాన-యోగాలతో ఆత్మను అలంకరించుకుంటారో, పతితులను పావనంగా తయారుచేసే సేవ చేస్తారో, ఇటువంటి పిల్లలను చూసి అనంతమైన తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది. నా పిల్లలు శ్రమ చేసి ఉన్నత పదవిని పొందాలి అన్నది తండ్రి కోరిక.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు చెప్తారు - మధురాతి-మధురమైన పిల్లలూ, ఎలాగైతే లౌకిక తండ్రికి పిల్లలు ప్రియమనిపిస్తారో, అదే విధంగా అనంతమైన తండ్రికి కూడా అనంతమైన పిల్లలు ప్రియమనిపిస్తారు. తండ్రి పిల్లలకు శిక్షణనిస్తారు మరియు పిల్లలు ఉన్నత పదవిని పొందాలని సావధానపరుస్తారు. తండ్రికి ఇదే కోరిక ఉంటుంది. మరి అనంతమైన తండ్రికి కూడా ఈ కోరిక ఉంటుంది. పిల్లలను జ్ఞానము మరియు యోగము అనే నగలతో అలంకరిస్తారు. పిల్లలు ఉన్నత పదవిని పొందాలని ఇద్దరు తండ్రులు మిమ్మల్ని చాలా మంచి రీతిగా అలంకరిస్తారు. అలౌకిక తండ్రి కూడా సంతోషిస్తారు మరియు పారలౌకిక తండ్రి కూడా సంతోషిస్తారు. ఎవరైతే మంచి రీతిగా పురుషార్థము చేస్తారో, వారిని చూసి వీరు ఫాలో ఫాదర్ చేసేటటువంటివారు అని గాయనం కూడా చేయబడుతుంది. కావున ఇద్దరినీ ఫాలో చేయాలి. ఒకరు ఆత్మిక తండ్రి, రెండవవారు ఈ అలౌకిక తండ్రి. కనుక పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందాలి.

మీరు భట్టీలో ఉన్నప్పుడు కిరీటాల సహితంగా అందరి ఫోటోలు తీయడం జరిగింది. ప్రకాశ కిరీటమేదీ ఉండదని తండ్రి అర్థం చేయించారు. ఇది పవిత్రతకు ఒక గుర్తు, దీన్ని అందరికీ ఇస్తారు. అంతేకానీ తెల్లటి ప్రకాశ కిరీటమేదో ఉంటుందని కాదు. దీనిని పవిత్రతకు గుర్తుగా అర్థము చేయించడం జరుగుతుంది. మొట్టమొదట మీరు సత్యయుగంలో ఉంటారు. మీరే ఉండేవారు కదా. తండ్రి కూడా - ఆత్మ మరియు పరమాత్మ చాలాకాలం వేరుగా ఉన్నారు అని అంటారు. పిల్లలైన మీరే మొట్టమొదట వస్తారు, మళ్ళీ మీరే మొదట వెళ్ళాలి. ముక్తిధామ గేట్లును కూడా మీరే తెరవాలి. పిల్లలైన మిమ్మల్ని తండ్రి అలంకరిస్తారు. పుట్టినింట్లో వనవాహములో ఉంటారు. ఈ సమయంలో మీరు కూడా సాధారణంగా ఉండాలి. గొప్పగానూ ఉండకూడదు, తక్కువగానూ ఉండకూడదు. నేను సాధారణ తనువులో ప్రవేశిస్తానని తండ్రి కూడా అంటారు. ఏ దేహధారినీ భగవంతుడని అనలేము. మనుష్యులు, మనుష్యులకు సద్గతి చెయ్యలేరు. సద్గతి అయితే గురువే చేస్తారు. మనుష్యులు 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థం తీసుకుంటారు, అప్పుడు గురువును ఆశ్రయిస్తారు. ఈ ఆచారము కూడా ఇప్పటిదే, ఇదే మళ్ళీ భక్తి మార్గములో నడుస్తుంది. ఈ రోజుల్లో చిన్నపిల్లల చేత కూడా గురువులను ఆశ్రయించేలా చేస్తారు. వారిది వానప్రస్థ అవస్థ కాకపోయినా కానీ మృత్యువు అకస్మాత్తుగా వచ్చేస్తుంది కదా, అందుకే పిల్లలను కూడా గురువులను ఆశ్రయించేలా చేస్తారు. మీరందరూ ఆత్మలు, మీకు వారసత్వము పొందే హక్కు ఉంది అని తండ్రి అంటారు. గురువు లేకపోతే పదవిని పొందలేరు అంటే బ్రహ్మములో లీనము కాలేరని వారంటారు. మీరైతే లీనమవ్వకూడదు. ఇవి భక్తి మార్గములోని పదాలు. ఆత్మ అయితే నక్షత్రము వంటిది, ఒక బిందువు. తండ్రి కూడా ఒక బిందువే. ఈ బిందువునే జ్ఞానసాగరుడని అంటారు. మీరు కూడా చిన్న ఆత్మలు. అందులో జ్ఞానమంతా నిండి ఉంటుంది. మీరు పూర్తి జ్ఞానాన్ని తీసుకుంటారు. పాస్ విత్ ఆనర్ అవుతారు కదా. శివలింగము ఏమీ పెద్దదిగా ఉంటుందని కాదు. ఆత్మ ఎంత పెద్దదిగా ఉంటుందో, పరమ ఆత్మ అంతే పెద్దగా ఉంటారు. ఆత్మ పాత్రను అభినయించేందుకు పరంధామము నుండి వస్తుంది. నేను కూడా అక్కడి నుండే వస్తాను అని తండ్రి అంటారు. కానీ నాకు నా శరీరము లేదు. నేను రూప్ కూడా, బసంత్ కూడా. పరమ ఆత్మ రూప్, వారిలో జ్ఞానమంతా నిండి ఉంది. వారు జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు, అప్పుడు మనుష్యులందరూ పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతారు. తండ్రి గతి, సద్గతి రెండిటినీ ఇస్తారు. మీరు సద్గతిలోకి వెళ్తారు, మిగిలినవారంతా గతిలోకి అనగా తమ ఇంటికి వెళ్తారు. అది స్వీట్ హోమ్. ఆత్మయే ఈ చెవుల ద్వారా వింటుంది. ఇప్పుడు తండ్రి అంటారు, మధురాతి-మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలూ, తిరిగి వెళ్ళాలి, దాని కోసం తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అవ్వకుండా ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. నేను అందరినీ తీసుకువెళ్ళేందుకు వచ్చాను. ఆత్మలను శివుని ఊరేగింపు అని అంటారు. ఇప్పుడు శివబాబా శివాలయాన్ని స్థాపన చేస్తున్నారు. మళ్ళీ రావణుడు వచ్చి వేశ్యాలయాన్ని స్థాపన చేస్తారు. వామమార్గాన్ని వేశ్యాలయమని అంటారు. వివాహము చేసుకొని కూడా పవిత్రంగా ఉండే పిల్లలు బాబా వద్ద చాలా మంది ఉన్నారు. ఇద్దరూ ఈ విధంగా కలిసి ఉండడం అనేది జరగదు అని సన్యాసులంటారు. ఇందులో చాలా సంపాదన ఉందని ఇక్కడ అర్థము చేయించడం జరుగుతుంది. పవిత్రంగా ఉండడంతో 21 జన్మల రాజధాని లభిస్తుంది కనుక ఒక్క జన్మ పవిత్రంగా ఉండడమనేది పెద్ద విషయమేమీ కాదు. మీరు కామచితిపై కూర్చొని పూర్తిగా నల్లగా అయిపోయారని తండ్రి అంటారు. కృష్ణుని కోసం కూడా సుందరమైనవారు మరియు నల్లనివారు, శ్యామసుందరుడని అంటారు. ఈ వివరణ ఈ సమయానికి చెందినది. కామచితిపై కూర్చోవడంతో నల్లగా అయిపోయారు, అప్పుడు వారిని పల్లెటూరి పిల్లవాడు అని కూడా అంటారు. నిజంగా అలాగే ఉండేవారు కదా. కృష్ణుడు అయితే అలా ఉండరు. వీరి అనేక జన్మల అంతిమంలో తండ్రి ప్రవేశించి సుందరంగా తయారుచేస్తారు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. బాబా, మీరు ఎంత మధురమైనవారు, ఎంత మధురమైన వారసత్వాన్ని ఇస్తారు. మమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా, మందిర యోగ్యంగా తయారుచేస్తారు. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. నోటితో ఏమీ అనకూడదు. భక్తిమార్గములో మీరు ప్రియుడిని ఎంతగా స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు వచ్చి కలుసుకున్నారు, బాబా, మీరైతే అందరికన్నా మధురమైనవారు. మిమ్మల్ని మేము ఎందుకు స్మృతి చేయము. మిమ్మల్ని ప్రేమసాగరుడు, శాంతిసాగరుడు అని అంటారు, మీరే వారసత్వాన్నిస్తారు, అంతేకానీ ప్రేరణ ద్వారా ఏమీ లభించదు. తండ్రి సమ్ముఖంలోకి వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. ఇది పాఠశాల కదా. నేను మిమ్మల్ని రాజులకే రాజుగా తయారుచేస్తాను అని తండ్రి అంటారు. ఇది రాజయోగము. ఇప్పుడు మీరు మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనముల గురించి తెలుసుకున్నారు. ఇంత చిన్న ఆత్మ పాత్రనెలా అభినయిస్తుంది. ఈ ఆట తయారై-తయారవుతున్నది. దీనిని అనాది-అవినాశీ వరల్డ్ డ్రామా అని అంటారు. డ్రామా తిరుగుతూనే ఉంటుంది, ఇందులో సంశయం యొక్క విషయమేమీ లేదు. తండ్రి సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాలను అర్థం చేయిస్తారు, మీరు స్వదర్శన చక్రధారులు. మీ బుద్ధిలో చక్రమంతా తిరుగుతూ ఉంటుంది. దీనితో మీ పాపాలు నశిస్తాయి. అంతేకానీ కృష్ణుడు స్వదర్శన చక్రమును ఉపయోగించి ఏ హింస చేయలేదు. అక్కడైతే యుద్ధము యొక్క హింస గానీ, కామ ఖడ్గాన్ని నడిపించడం గానీ ఉండదు. డబల్ అహింసకులుగా ఉంటారు. ఈ సమయంలో మీకు పంచ వికారాలతో యుద్ధము నడుస్తుంది. అంతేకానీ ఇంకే యుద్ధము విషయమూ లేదు. ఇప్పుడు తండ్రి ఉన్నతాతి ఉన్నతమైనవారు, తర్వాత ఉన్నతాతి ఉన్నతమైన వారసత్వం ఈ లక్ష్మీనారాయణులది, వీరి వలె ఉన్నతంగా తయారవ్వాలి. మీరు ఎంతగా పురుషార్థము చేస్తారో, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. కల్ప-కల్పము మీకు ఈ చదువే ఉంటుంది. ఇప్పుడు మంచి పురుషార్థము చేస్తే, అది కల్ప-కల్పమూ చేస్తూ ఉంటారు. ఆత్మిక చదువు ద్వారా లభించినంత ఉన్నతమైన పదవి దైహిక చదువు ద్వారా లభించదు. ఈ లక్ష్మీనారాయణులు ఉన్నతాతి ఉన్నతంగా అవుతారు. వీరు కూడా మనుష్యులే కానీ దైవీ గుణాలు ధారణ చేస్తారు కావున దేవతలు అని అంటారు. అంతేకానీ 8-10 భుజాల వారు ఎవ్వరూ ఉండరు. భక్తిలో సాక్షాత్కారం జరిగితే చాలా ఏడుస్తారు, దుఃఖంలోకి వచ్చి చాలా కన్నీరు కారుస్తారు. ఇక్కడైతే కన్నీరు వస్తే ఫెయిల్ అని తండ్రి అంటారు. అమ్మ మరణించినా హల్వా తినండి..... ఈ రోజుల్లోనైతే బొంబాయిలో కూడా ఎవరికైనా అనారోగ్యం చేస్తే లేక ఎవరైనా మరణిస్తే, వచ్చి శాంతినివ్వమని బి.కె.లను పిలుస్తారు. అప్పుడు మీరు అర్థము చేయిస్తారు - ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంది, ఇందులో మీదేమి పోయింది, ఏడ్వడం వలన లాభమేమిటి. వీరిని మృత్యువు కబళించిందని అంటారు..... అటువంటిదేమీ ఉండదు. ఆత్మ తనంతట తానే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. తన సమయానికి శరీరాన్ని వదిలి పారిపోతుంది. అంతేకానీ మృత్యువు అనే వస్తువేదీ ఉండదు. సత్యయుగంలో గర్భ మహలు ఉంటుంది, శిక్ష అనే విషయమేమీ ఉండదు. అక్కడ మీ కర్మలు అకర్మలుగా అవుతాయి. వికర్మలు జరిగేందుకు మాయ ఉండనే ఉండదు. మీరు వికర్మాజీతులుగా అవుతారు. మొట్టమొదట వికర్మాజీత్ శకము నడుస్తుంది, తర్వాత భక్తి మార్గము ప్రారంభమైనప్పుడు రాజా విక్రమ శకము మొదలవుతుంది. ఈ సమయంలో ఏ వికర్మలనైతే చేసారో, వాటిపై విజయం పొందుతారు, వికర్మాజీత్ అని పేరు పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ద్వాపరయుగంలో విక్రమ రాజుగా అవుతారు, వికర్మలు చేస్తూ ఉంటారు. సూదిపై ఒకవేళ తుప్పు పట్టి ఉంటే అయస్కాంతము ఆకర్షించదు. పాపాల తుప్పు ఎంతగా తొలగిపోతూ ఉంటుందో, అంతగా అయస్కాంతము ఆకర్షిస్తుంది. తండ్రి అయితే పూర్తిగా పవిత్రమైనవారు. మిమ్మల్ని కూడా యోగబలము ద్వారా పవిత్రంగా చేస్తారు. లౌకిక తండ్రి కూడా పిల్లలను చూసి సంతోషిస్తారు కదా. అనంతమైన తండ్రి కూడా పిల్లల సేవ చూసి సంతోషిస్తారు. పిల్లలు కూడా చాలా శ్రమ చేస్తున్నారు. సేవ కోసమైతే సదా ఎవర్రెడీగా ఉండాలి. పిల్లలైన మీరు పతితులను పావనంగా చేసే ఈశ్వరీయ మిషన్. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము, అనంతమైన తండ్రి ఉన్నారు మరియు మీరంతా సోదరీ-సోదరులు. అంతే, ఇంకే సంబంధమూ లేదు. తండ్రి మరియు ఆత్మ సోదరులైన మీరు ముక్తిధామంలో ఉంటారు, మళ్ళీ సత్యయుగంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొడుకు, ఒక కూతురు ఉంటారు, అంతే. ఇక్కడైతే చాలా సంబంధాలుంటాయి - చిన్నాన్న, మామయ్య మొదలైనవి.

మూలవతనం అంటేనే స్వీట్ హెూమ్, ముక్తిధామము. దాని కోసం మనుష్యులు ఎన్ని యజ్ఞాలు, తపాలు మొదలైనవి చేస్తారు కానీ తిరిగి ఎవ్వరూ వెళ్ళలేరు. వ్యర్థ ప్రలాపాలు చాలా చేస్తూ ఉంటారు. సర్వుల సద్గతిదాత అయితే ఒక్కరే. ఇతరులెవ్వరూ లేరు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. ఇక్కడ చాలామంది మనుష్యులున్నారు. సత్యయుగంలోనైతే చాలా తక్కువమంది ఉంటారు. స్థాపన, తర్వాత వినాశనము జరుగుతుంది. ఇప్పుడు అనేక ధర్మాలున్న కారణంగా ఎన్ని గొడవలున్నాయి. మీరు 100 శాతము సంపన్నంగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మల తర్వాత 100 శాతము నిరుపేదగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి వచ్చి అందరినీ మేల్కొల్పుతారు. ఇప్పుడు మేలుకోండి, సత్యయుగం వస్తుంది. సత్యమైన తండ్రే మీకు 21 జన్మల వారసత్వమునిస్తారు. భారతదేశమే సత్య ఖండంగా అవుతుంది. తండ్రి సత్య ఖండాన్ని తయారుచేస్తారు, మళ్ళీ అసత్య ఖండంగా ఎవరు తయారుచేస్తారు? పంచ వికారాల రూపీ రావణుడు. రావణుడిది ఎంత పెద్ద దిష్టి బొమ్మను తయారుచేస్తారు, మళ్ళీ దాన్ని కాల్చేస్తారు ఎందుకంటే అతడు నంబరువన్ శత్రువు. మనుష్యులకు ఎప్పటి నుండి రావణ రాజ్యము ప్రారంభమయ్యింది అనేది తెలియదు. అర్థకల్పము రామ రాజ్యము, అర్థకల్పము రావణ రాజ్యమని తండ్రి అర్థము చేయిస్తారు. అంతేకానీ హతమార్చేందుకు రావణుడు ఏమీ మనిషి కాడు. ఈ సమయంలో మొత్తం ప్రపంచంపై రావణ రాజ్యముంది, తండ్రి వచ్చి రామ రాజ్యాన్ని స్థాపన చేస్తారు, తర్వాత జయజయ కారాలు జరుగుతాయి. అక్కడ సదా సంతోషముంటుంది. అది ఉన్నదే సుఖధామము. దీనిని పురుషోత్తమ సంగమయుగమని అంటారు. ఈ పురుషార్థముతో మీరు ఈ విధంగా తయారవుతారు అని తండ్రి అంటారు. మీ చిత్రాలు కూడా తయారుచేశారు, చాలామంది వచ్చారు, తర్వాత విని, వర్ణించి, పారిపోయారు. తండ్రి వచ్చి పిల్లలైన మీకు చాలా ప్రేమగా అర్థము చేయిస్తారు. తండ్రి, టీచరు ప్రేమిస్తారు, గురువు కూడా ప్రేమిస్తారు. సద్గురువును నిందింపజేసేవారు ఉన్నతమైన పదవిని పొందలేరు. మీ లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. ఆ గురువుల వద్ద లక్ష్యము-ఉద్దేశ్యము ఏమీ ఉండదు. అదేమీ చదువు కాదు, ఇది చదువు. దీనిని యూనివర్శిటీ మరియు హాస్పిటల్ అని అంటారు, దీని ద్వారా మీరు ఎవర్ హెల్తీ, వెల్తీగా (సదా ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా) అవుతారు. ఇక్కడ ఉన్నదే అసత్యము, అసత్య శరీరము..... అని కూడా పాడుతారు. సత్యయుగము సత్యఖండము. అక్కడ వజ్రవైఢూర్యాల మహళ్ళు ఉంటాయి. సోమనాథ మందిరాన్ని కూడా భక్తి మార్గములో తయారుచేశారు. ఎంత ధనముండేది, దాన్ని ముసల్మానులు వచ్చి దోచుకున్నారు. పెద్ద పెద్ద మసీదులను నిర్మించారు. తండ్రి మీకు అపారమైన ఖజానాలను ఇస్తారు. ప్రారంభము నుండే మీకు అన్ని సాక్షత్కారాలు చేయిస్తూ వచ్చారు. అల్లాహ్ అవల్దీన్ బాబాయే కదా. వారు మొట్టమొదటి ధర్మాన్ని స్థాపన చేస్తారు. అది దైవీ ధర్మము. ఏ ధర్మమైతే లేదో, అది మళ్ళీ స్థాపనౌతుంది. ప్రాచీన సత్యయుగంలో వీరి రాజ్యమే ఉండేదని, వారిపై ఇంకెవ్వరూ లేరని అందరికీ తెలుసు. దైవీ రాజ్యాన్నే ప్యారడైజ్ అని అంటారు. ఇప్పుడు మీకు తెలుసు, తర్వాత ఇతరులకు తెలియజేయాలి. మాకు తెలియదు అని తర్వాత ఎవ్వరూ ఈ విధంగా ఫిర్యాదు చేయకుండా ఉండేలా అందరికీ ఎలా తెలుస్తుంది. మీరు అందరికీ తెలియజేస్తారు, అయినా తండ్రిని వదిలి వెళ్ళిపోతారు. ఈ చరిత్ర తప్పకుండా రిపీట్ అవ్వాలి. బాబా వద్దకు వచ్చినప్పుడు బాబా - ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా అని అడుగుతారు. అవును బాబా, మేము 5 వేల సంవత్సరాల క్రితము కలవడానికి వచ్చామని అంటారు. అనంతమైన వారసత్వము తీసుకునేందుకు వచ్చాము. కొంతమంది వచ్చి వింటారు, కొంతమందికి బ్రహ్మా యొక్క సాక్షాత్కారమవుతుంది, అప్పుడు ఇదంతా గుర్తుకొస్తుంది. ఈ రూపమునే మేము చూశామని అంటారు. తండ్రి కూడా పిల్లలను చూసి సంతోషిస్తారు. మీ జోలె అవినాశీ జ్ఞానరత్నాలతో నిండుతుంది కదా. ఇది చదువు. 7 రోజుల కోర్సు తీసుకుని తర్వాత ఎక్కడ ఉన్నా కూడా మురళీ ఆధారంతో నడవవచ్చు, 7 రోజులలో మురళీని అర్థము చేసుకునేంతగా అర్థం చేయిస్తారు. తండ్రి తన పిల్లలకు అన్ని రహస్యాలను మంచిరీతిగా అర్థం చేయిస్తూ ఉంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వదర్శన చక్రమును తిప్పుతూ పాపాలను భస్మము చేసుకోవాలి, ఆత్మిక చదువు ద్వారా మీ పదవిని శ్రేష్ఠంగా తయారుచేసుకోవాలి. ఎటువంటి పరిస్థితిలోనూ కన్నీరు కార్చకూడదు.

2. ఇది వానప్రస్థ స్థితిలో ఉండే సమయము, కనుక వనవాహములో చాలా సాధారణంగా ఉండాలి. చాలా గొప్పగానూ ఉండకూడదు, చాలా తక్కువగానూ ఉండకూడదు. తిరిగి వెళ్ళేందుకు ఆత్మను సంపూర్ణ పావనంగా తయారుచేసుకోవాలి.

వరదానము:-

మనన శక్తి ద్వారా బుద్ధిని శక్తిశాలిగా చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ

మనన శక్తియే దివ్య బుద్ధికి ఔషధము. ఎలాగైతే భక్తిలో స్మరణ చేసే అభ్యాసం ఉండేదో, అదే విధంగా జ్ఞానంలో స్మృతి యొక్క శక్తి ఉంది. ఈ శక్తి ద్వారా మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వండి. రోజూ అమృతవేళ మీ ఒక్క టైటిల్ ను స్మృతిలోకి తెచ్చుకోండి మరియు మననం చేస్తూ ఉండండి, అప్పుడు మనన శక్తి ద్వారా బుద్ధి శక్తిశాలిగా ఉంటుంది. శక్తిశాలి బుద్ధిపై మాయ దాడి చెయ్యలేదు, అది పరవశమవ్వదు ఎందుకంటే మాయ అన్నిటికన్నా ముందు వ్యర్థ సంకల్పాల రూపీ బాణం ద్వారా దివ్య బుద్ధిని బలహీనంగా చేస్తుంది, ఈ బలహీనత నుండి రక్షించుకునే సాధనమే మననశక్తి.

స్లోగన్:-

ఆజ్ఞాకారీ పిల్లలే ఆశీర్వాదాలకు పాత్రులు, ఆశీర్వాదాల ప్రభావము మనసును సదా సంతుష్టంగా ఉంచుతుంది.